-
ఎన్డీయేలోకి ఎల్జేపీ (రామ్విలాస్)!
పట్నా: బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)లో బిహార్కు చెందిన లోక్ జనశక్తి పారీ్ట(రామ్ విలాస్) భాగస్వామిగా చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేత, ఎంపీ చిరాగ్ పాశ్వాన్తో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నిత్యానంద రాయ్ తాజాగా చర్చలు జరిపారు. బీజేపీ, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ ఒకే విలువలను పంచుకొనేవారని గుర్తుచేశారు. ప్రజా సాధికారతతోపాటు అభివృద్ది కోసం పాశ్వాన్ ఎంతగానో తపించేవారని కొనియాడారు. అయితే, ఎన్డీయేలో లోక్ జనశక్తి పారీ్ట(రామ్ విలాస్) చేరికపై నిత్యానంద రాయ్ నేరుగా స్పందించలేదు. చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. బీజేపీతో మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్డీయేలో చేరికపై ఇప్పుడే స్పందించడం సరైంది కాదన్నారు. బీజేపీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని ఆయన గతంలో పలుమార్లు చాటుకున్నారు. -
ECI: చిరాగ్, పారస్లకు వేర్వేరు ఎన్నికల గుర్తులు
న్యూఢిల్లీ: చీలికతో వివాదంగా మారిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) సమస్యకు కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలిక పరిష్కారం చూపింది. ఇంతకాలం వినియోగంలో ఉన్న పార్టీ పేరు, పార్టీ ఎన్నికల గుర్తు(ఇల్లు గుర్తు)ను చీలిక వర్గాలైన చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పారస్లు వాడొద్దని గతంలోనే ఈసీ ఆదేశాలివ్వడం తెల్సిందే. తాజాగా ఇరు వర్గాలకు వేర్వేరు పేర్లు, ఎన్నికల గుర్తులు కేటాయించింది. చిరాగ్ పాశ్వాన్ వర్గానికి ‘లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్)’ పేరును, హెలికాప్టర్ గుర్తును కేటాయిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. పారస్ వర్గానికి ‘రాష్ట్రీయ లోక్ జన శక్తి’ పేరును, ఎన్నికల గుర్తుగా ‘కుట్టుమిషన్’ను ఇస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. ఉప ఎన్నికల్లో ఈ పేర్లు, గుర్తులను వాడుకోవచ్చని ఈసీ ఇరు వర్గాలకు వేర్వేరుగా లేఖలు రాసింది. ‘‘ బిహార్లో ఉప ఎన్నికల కోసం ఏ ఇతర పార్టీకి కేటాయించని ‘గుర్తుల జాబితా’లో ఉన్నవేవైనాకావాలంటే మీరు వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. కానీ, మీ రెండు వర్గాల గుర్తులు ఒకేలా మాత్రం ఉండకూడదు’’ అని ఈసీ స్పష్టంచేసింది. -
ఎల్జేపీ గుర్తును ఫ్రీజ్ చేసిన ఈసీ
పట్నా: లోక్ జనశక్తి పార్టీ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పార్టీ గుర్తు ‘బంగ్లా’ను చిరాగ్ పాశ్వాన్ వర్గం, కేంద్ర మంత్రి పశుపతి పారస్ వర్గాలు ఎవరూ ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎల్జేపీ గుర్తు కోసం చిరాగ్ పాశ్వాన్, పశుపతి పారస్ వర్గాల మధ్య వివాదం చేలరేగిన విషయం తెలిసిందే. బీహార్లోని కుశేశ్వర్ ఆస్థాన్, తారాపూర్లో అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈసీ ‘బంగ్లా’ గుర్తును ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది. జరగబోయే ఉప ఎన్నికల్లో ఉపయోగించే గుర్తు విషయంలో ఈసీ మూడు ఆప్షన్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మూడు ఆప్షన్లను సోమవారం మధ్యాహ్నం ఈసీ ప్రకటించనున్నట్లు సమాచారం. -
మహిళ చేతిలో కేంద్ర మంత్రికి ఘోర అవమానం
పాట్నా: కేంద్ర మంత్రిగా అయిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు ఓ మహిళ చేతిలో ఘోర అవమానం జరిగింది. అంతకుముందు ఆయన పర్యటనను నిరసిస్తూ పలుచోట్ల నల్లజెండాలు ఎదురుపడ్డాయి. పలువురు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఇంకు కేంద్ర మంత్రిపై చల్లింది. మంత్రి కుర్తాపై ఇంకు మరకలు పడ్డాయి. ఇది జరిగిన కాసేపటికి మంత్రి దుస్తులు మార్చుకుని యథావిధిగా కార్యక్రమం కొనసాగించారు. ఓ పార్టీలో చిచ్చు రేపడంతోనే ఈ తీవ్ర నిరసనకు కారణమని తెలుస్తోంది. చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్ వీడియో బిహార్లోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)కి చెందిన పశుపతి కుమార్ పారాస్ హాజీపూర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల బిహార్లో రాజకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా పశుపతి మారారు. ఆ ఫలితమే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడానికి కారణం. ఇటీవల జరిగిన మంత్రివర్గ కూర్పులో స్థానం దక్కించుకున్న పశుపతి తొలిసారి సొంత నియోజకవర్గం హాజీపూర్లో సోమవారం పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు పరాభవం ఎదురైంది. ఈ క్రమంలోనే అడుగడుగునా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ పార్టీ అధినేత రామ్విలాస్ పాశ్వాన్ మరణంతో ఎల్జేపీలో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ను విబేధించాడు. ప్రస్తుతం పార్టీపై వివాదం కొనసాగుతోంది. రాజకీయ అవసరాల కోసం పార్టీ చీల్చాడని పార్టీ వర్గాల్లో పశుపతిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన కేంద్రమంత్రిగా నియమితుడై తొలిసారిగా వస్తున్నప్పుడే ఈ పరాభవం ఎదురవడం గమనార్హం. చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు -
ప్రధాని నా వైపు ఉంటారని ఆశించా.. కానీ: చిరాగ్ భావోద్వేగం
న్యూఢిల్లీ: కష్టకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు అండగా నిలబడతారని ఆశించానని లోక్ జనశక్తి పార్టీ ఎంపీ, దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. తన రాముడి కోసం ఈ హనుమంతుడు చేయాల్సిందంతా మనస్ఫూర్తిగా చేశాడని, కానీ తాను ఆశించింది జరగలేదని పేర్కొన్నారు. తండ్రి మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చిరాగ్కు.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన బాబాయ్ పశుపతి పరాస్తో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పశుపతి నలుగురు ఎంపీలతో కలిసి పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవి నుంచి చిరాగ్ను తొలగించడం సహా ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా ఆయనే ఉంటారని రెబల్ ఎంపీలు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాశ్వాన్ అసలైన వారుసుడెవరో ప్రజలే తేలుస్తారంటూ జూలై 5 నుంచి ఆశీర్వాద యాత్ర చేసేందుకు చిరాగ్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి మేం మద్దతునిచ్చాం. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం), ఎన్ఆర్సీ వంటి అంశాలను స్వాగతించాం. బిహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ మాత్రం వీటికి అనుకూలంగా లేదు. అయినప్పటికీ ఈ హనుమంతుడు రాముడి కోసం అన్నింటికీ సిద్ధమయ్యాడు. అయితే, నేను కష్టకాలంలో ఉన్నపుడు నా ప్రధాని నావైపు ఉంటారని ఆశించాను. కానీ, అలా జరగలేదు. ఈ సమస్యను నాకు నేనుగా పరిష్కరించుకోవాలని, ఎవరూ నాకు సహకారం అందించరని త్వరలోనే నాకు బోధపడింది. అంతేకాదు.. నేను వారి మద్దతు ఆశించేందుకు అర్హుడిని కూడా కాదని అర్థమైంది’’అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అదే విధంగా.. ‘‘నా సొంత కుటుంబ సభ్యులే నాకు వెన్నుపోటు పొడిచారు. నా తండ్రి లాంటి మా బాబాయ్.. నా కొడుకు వంటి నా సోదరుడు(ప్రిన్స్ రాజ్) నాకు ద్రోహం చేశారు. మా బాబాయ్... మా నాన్నకు చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ ఆయనను కూడా మోసం చేశారు. బాబాయ్.. నాకంటే పెద్దవారు కదా.. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడాల్సింది. ఇద్దరం కలిసి పరిష్కారం కనుగొనేవాళ్లం. కానీ ఆయన ఇలా చేయడం సరికాదు. నాకు మాత్రమే కాదు.. నాన్నకు కూడా ఆయన ద్రోహం చేశారు. ఇదంతా చూస్తూ నాన్న అస్సలు సంతోషంగా ఉండరు’’ అని చిరాగ్ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. చదవండి: పాశ్వాన్ వారసుడెవరో ప్రజలే తేలుస్తారు ఎల్జేపీ: అసలు విషయం ఇదేనా.. అందుకే పశుపతి రాజీనామా?!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement