-
రష్యా రిలే జట్టు ఒలింపిక్ రజతం వెనక్కి
మాస్కో: ఇప్పటికే డోపింగ్ ఉచ్చులో పీకల్లోతు మునిగిన రష్యాకు మరో చేదు ఫలితం ఎదురైంది. లండన్ ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు నెగ్గిన మహిళల 4X400 మీటర్ల రిలే రజతాన్ని నిర్వాహకులు వెనక్కి తీసుకోనున్నారు. ఈ రిలే ఈవెంట్లో మిగతా ముగ్గురితో కలిసి పోటీపడిన రష్యా అథ్లెట్ అంటోనినా క్రివోషప్క నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో రజతం వెనక్కి తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది. దీంతో కాంస్యం నెగ్గిన జమైకాకు రజతం, నాలుగో స్థానంలో ఉన్న ఉక్రెయిన్కు కాంస్యం ప్రకటించింది. ఇందులో అమెరికా స్వర్ణం గెలిచింది. లండన్ ఈవెంట్లో పోటీపడిన అథ్లెట్ల రక్త, మూత్ర నమూనాలను తిరిగి పరీక్షించగా కొందరి క్రీడాకారులవి పాజిటివ్ రిపోర్ట్లు వస్తున్నాయి. -
యోగేశ్వర్ కు కాంస్యమా.. రజతమా?
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్ పతకంపై స్పష్టత కరువైంది. 2012 లండన్ ఒలింపిక్స్ లో యోగేశ్వర్ కాంస్య పతకం నెగ్గగా.. తాజాగా ఆ పతకంపై కొన్ని పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రష్యాకు చెందిన రెజ్లర్ బేసిక్ కుదుకోవ్ శాంపిల్స్ పాజిటీవ్ గా తేలడంతో యోగేశ్వర్ పతకం కాంస్యం నుంచి రజతానికి అప్ గ్రేడ్ అవుతుందని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) మంగళవారం నాడు బాంబు పేల్చింది. ఓ వైపు దేశమంతా యోగేశ్వర్ కు రజత పతకం వస్తుందని ఆనందంలో మునిగి తేలుతుండగా, సంబంధిత క్రీడా సమాఖ్య మాత్రం విచిత్రంగా వ్యవహరిస్తోంది. అసలు తమకు లండన్ ఒలింపిక్స్ లో యోగేశ్వర్ పతకానికి సంబంధించి జరుగుతున్న తాజా పరిణామాలపై తమ వద్ద ఎలాంటి సమాచార లేదని డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. లండన్ ఒలింపిక్స్ లో కుదుకోవ్ చేతిలోనే యోగేశ్వర్ ఓటమిపాలు కాగా, ఆ తర్వాత అతడు ఫైనల్ కు వెళ్లడంతో యోగేశ్వర్ దశ తిరిగి కాంస్యం సాధించాడు. ఒలింపిక్స్ పతకాలపై దర్యాప్తు చేయడం, విచారణ చేసి ఆటగాళ్ల పతకాలపై నిర్ణయం తీసుకునే అధికారం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ)కి ఉంది. అయితే ఐఓసీ మాత్రం కుదుకోవ్ విషయాన్ని తేలికగా తీసుకుని దర్యాప్తును ఆపివేయాలని యోచిస్తుండటం గమనార్హం. డోపీగా తేలిన రష్యా రెజ్లర్ కుదుకోవ్ 2013లో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. -
అస్గరోవ్ డోపీ కాదు యోగేశ్వర్కు రజతమే
న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ సాధించిన కాంస్య పతకం ఏకంగా స్వర్ణం కాబోతుందని ఇటీవల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ గేమ్స్ 60కేజీ ఫ్రీస్టరుుల్ విభాగంలో విజేతగా నిలిచిన టొగ్రుల్ అస్గరోవ్ (అజెర్బైజాన్) డోపీగా తేలినందుకు యోగికి ఈ అదృష్టం దక్కుతుందనేది కొందరి వాదన. అరుుతే తాజాగా ఈ పుకార్లకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యుడబ్ల్యు) తెర దించింది. అసలు అస్గరోవ్ ఎప్పుడు కూడా డోపింగ్లో పాజిటివ్గా తేలలేదని స్పష్టం చేసింది. ‘అస్గరోవ్ యూడబ్ల్యుడబ్ల్యు డోపింగ్ నిరోధక పాలసీని ఎప్పుడూ అతిక్రమించలేదు. అతడిపై కథనాల్లో నిజం లేదు’ అని ట్వీట్ చేసింది. మరోవైపు కుడుఖోవ్ డోపీగా తేలడంతో యోగేశ్వర్ కాంస్య పతకం రజతంగా మారే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. -
స్వర్ణ యోగం కాదు..!
‘లండన్ ఒలింపిక్స్లో సాధించిన కాంస్యం రజతంగా మారి మూడు రోజులు కూడా కాలేదు... అప్పుడే ఆ రజతం స్వర్ణంగా మారిపోతోంది... పసిడి సాధించిన రెజ్లర్ కూడా డోపింగ్లో పట్టుబడటంతో మన యోగేశ్వర్ దత్ బంగారు పతకాన్ని అందుకోబోతున్నాడు...’ శుక్రవారం భారత క్రీడాభిమానులను ఆనందంలో ముంచెత్తిన వార్త ఇది. అరుుతే వాస్తవం వేరుగా ఉంది. మరో ఆటలో అయితే స్వర్ణ విజేత పట్టుబడితే రజతం ఆటోమెటిక్గా స్వర్ణంగా మారిపోయేదేమో కానీ... ఇక్కడ అది సాధ్యం కాదు. యోగేశ్వర్తో పాటు మరో పార్శ్వంనుంచి కాంస్యం సాధించిన అమెరికా రెజ్లర్ కొలెమాన్ స్కాట్ను ఆ అదృష్టం వరించనుంది. 2012లో స్వర్ణం గెలిచిన అస్గరోవ్ డోపీగా తేలడంతో ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. * యోగేశ్వర్కు రజత పతకమే * కొలెమాన్ స్కాట్కు పసిడి! * ఒలింపిక్స్ పతకంలో మరో మార్పు * డోపింగ్లో పట్టుబడ్డ అస్గరోవ్ న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం జరిగిన లండన్ ఒలింపిక్స్ 60 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో భారత ఆటగాడు యోగేశ్వర్దత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. అయితే ఈ పోటీల్లో రజతం సాధించిన కుదుఖోవ్ (రష్యా) డోపింగ్కు పాల్పడినట్లు తేలడంతో అతని పతకాలు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రద్దు చేసింది. దాంతో యోగేశ్వర్ పతకం కంచునుంచి వెండిగా మారింది. అయితే తాజా డోపింగ్ పరీక్షల్లో నాడు స్వర్ణం సాధించిన ఆటగాడు కూడా పట్టుబడ్డాడు. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) నిర్వహించిన పరీక్షల్లో అజర్బైజాన్కు చెందిన తోగ్రుల్ అస్గరోవ్ పాజిటివ్గా తేలాడు. ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) ఇంకా దీనిని అధికారికంగా ఖరారు చేయలేదు. అస్గరోవ్ పతకాన్ని వెనక్కి తీసుకుంటే యోగేశ్వర్కు స్వర్ణ యోగం పట్టవచ్చని వినిపించింది. ఎందుకు కాదు? కాంస్యాలు సాధించిన యోగేశ్వర్, కొలెమాన్ స్కాట్ రెండు వేర్వేరు పార్శ్వాలలో ఆడారు. పై పార్శ్వంనుంచి సెమీస్కు చేరిన స్కాట్... అక్కడ అస్గరోవ్ (స్వర్ణవిజేత) చేతిలో ఓడాడు. అనంతరం కాంస్య పతక పోరులో యుమొటో (జపాన్)ను ఓడించి పతకం సాధించాడు. దిగువ భాగంలో ప్రిక్వార్టర్లో ఓడిన యోగి...ఆ తర్వాత రెండు రెపిచేజ్ మ్యాచ్లతో పాటు జాంగ్ మ్యోంగ్ (ఉత్తర కొరియా)పై గెలిచి కంచు పతకం అందుకున్నాడు. రజతం సాధించిన కుడుఖోవ్... యోగేశ్వర్ ఉన్న పార్శ్వంలోనే న్నాడు. అందుకే అతని పతకం రద్దు కాగానే అదే వైపునుంచి కాంస్యం సాధించిన యోగి పతకం అప్గ్రేడ్ అయింది. ఇదే నిబంధనను వర్తింపజేస్తే అస్గరోవ్, స్కాట్ ఒకే పార్శ్వంలో ఉన్నారు. కాబట్టి అస్గరోవ్ స్వర్ణం స్కాట్కు అందేందుకే అవకాశం ఉంది. నేరుగా రజతంనుంచి స్వర్ణంగా మారేందుకు స్కాట్తో పోలిస్తే యోగేశ్వర్కు అదనపు అర్హత ఏమీ లేదు. ఇద్దరూ కాంస్య విజేతలుగా సమాన స్థాయిలోనే ఉన్నారు. అవకాశాలు ఏమిటి? ఈ అంశంపై ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే నిబంధనల ప్రకారం ఎలా చూసినా యోగేశ్వర్కు స్వర్ణం లభించడం సాధ్యం కాకపోవచ్చు. వరుసగా రెండు బౌట్లు నెగ్గి నేరుగా సెమీ ఫైనల్కు చేరిన స్కాట్ ప్రదర్శనే ఒలింపిక్స్లో యోగికంటే మెరుగ్గా ఉంది. ఈ విషయంలో భారత రెజ్లర్కంటే అతని వైపు మొగ్గు ఉంది. పతకం కోసం యోగేశ్వర్ రెండు రెపిచేజ్ రౌండ్లు కూడా ఆడగా... స్కాట్ వాటి అవసరం లేకుండా నేరుగా కాంస్య పోరులో తలపడ్డాడు. ఇప్పటికే యోగేశ్వర్ పతకం అప్గ్రేడ్ అయింది కాబట్టి మరో కాంస్య విజేతగా కొలెమాన్కు కూడా ఇదే అవకాశం ఉంది. పూర్తిగా అతడిని పక్కన పెట్టేసి యోగేశ్వర్నే మరో మెట్టు ఎక్కించేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదు. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే... అస్గరోవ్ చేతిలో ఓడిన కొలెమాన్కే స్వర్ణం దక్కవచ్చు. లేదంటే అతడికి కూడా రజతం ఇవ్వవచ్చు. ఇద్దరు రెజ్లర్లకు రజతాలు ఇచ్చి ఈ ఈవెంట్కు సంబంధించి స్వర్ణాన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా ఉంది. భారతీయుడిగా స్వర్ణం కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కానీ అది అంత ఏకపక్షంగా మాత్రం సాధ్యం కాదు! నాకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే నాకున్న అవగాహన ప్రకారం నాకు రజతం మాత్రమే లభిస్తుంది. మేమిద్దరం కాంస్యాలు గెలుచుకున్నాం. నేను రెపిచేజ్ ద్వారా అర్హత పొంది సిల్వర్ మెడలిస్ట్ చేతిలో ఓడాను. అయితే స్కాట్ మాత్రం చాంపియన్ చేతిలో ఓడాడు. కాబట్టి స్వర్ణం అతనికే దక్కాలి. నాకు తెలిసి నా పతకం స్వర్ణంగా మారదు. - యోగేశ్వర్దత్ -
ఆ రజతం వాళ్ల దగ్గరే ఉంచండి
► రెజ్లర్ కుదుఖోవ్ మరణంతో అతని కుటుంబం బాధలో ఉంది ► భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ అభ్యర్థన న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్లో తాను గెలిచిన కాంస్య పతకంతో సంతృప్తిగా ఉన్నానని... రష్యా దివంగత రెజ్లర్ బెసిక్ కుదుఖోవ్ డోప్ పరీక్షలో విఫలమైనప్పటికీ... అతని రజత పతకం వెనక్కి తీసుకొని తనకు ఇవ్వాల్సిన అవసరం లేదని భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధికారులకు విజ్ఞప్తి చేశాడు. మానవతా దృక్పథంతో వ్యవహరించి కుదుఖోవ్ కుటుంబ సభ్యుల వద్దే ఈ రజత పతకం ఉండేలా చూడాలని 2012 లండన్ ఒలింపిక్స్లో 60 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన యోగేశ్వర్ దత్ అన్నాడు. ‘రజత పతకం వెనక్కి తీసుకుంటే కుదుఖోవ్ కుటుంబానికి బాధ కలుగుతుంది. పతకం రూపంలోనైనా కుదుఖోవ్ తల్లిదండ్రులకు తమ కుమారుడి జ్ఞాపకాలు మిగిలి ఉంటారుు. 2013 డిసెంబరులో కుదుఖోవ్ కారు ప్రమాదంలో చనిపోయాడని తెలిసింది. ఒకవేళ అతను బతికిఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ అతను ఈ లోకంలో లేడు. నిన్ననే అతని కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల గురించి ఆలోచించాను. కేవలం తమ కుమారుడి జ్ఞాపకాలతోనే వారు జీవిస్తున్నారు. కుదుఖోవ్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడనేది అనవసరం. కొడుకు సాధించిన పతకం జ్ఞాపకంతో జీవిస్తున్న ఆ కుటుంబం నుంచి నేను దానిని తీసుకోదల్చుకోలేదు. రజత పతకం వారి వద్దే ఉండటం సబబుగా ఉంటుంది’ అని యోగేశ్వర్ దత్ అభిప్రాయపడ్డాడు. ‘డోప్ పరీక్షలో కుదుఖోవ్ విఫలమయ్యాక నేను సాధించిన కాంస్యం రజతం అవుతున్న వార్త విని అంతగా సంతోషపడలేదు. కుదుఖోవ్ నాకు మంచి మిత్రుడు. లండన్ ఒలింపిక్స్కంటే ముందు రష్యాలో నేను రెండు నెలలు ప్రాక్టీస్ చేశాను. నా కాంస్యం నా వద్దే ఉంది. ఇప్పుడు ఏ పతకమున్నా పెద్దగా తేడా ఉండదు’ అని హరియాణా పోలీసు విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న యోగేశ్వర్ అన్నాడు. యోగేశ్వర్ శాంపిల్నూ పరీక్షిస్తారు... లండన్ ఒలింపిక్స్ సందర్భంగా యోగేశ్వర్ దత్ వద్ద సేకరించిన డోప్ పరీక్షల ఫలితాలు క్లీన్గా వస్తేనే అధికారికంగా అతనికి రజత పతకం ఖరారు చేస్తారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) కొత్త నిబంధనల ప్రకారం అంతర్జాతీయ టోర్నీలలో క్రీడాకారుల నుంచి సేకరించిన శాంపిల్స్ను 10 ఏళ్లపాటు డీప్ఫ్రీజ్లో పెడుతున్నారు. తాజా టెక్నాలజీని ఉపయోగించి బీజింగ్, లండన్ ఒలింపిక్స్లలో క్రీడాకారుల నుంచి సేకరించిన నమూనాలను మళ్లీ పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారానే కుదుఖోవ్ లండన్ ఒలింపిక్స్లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడని తేలింది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement