-
ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కు తెలుగు రాష్ట్రాల్లో విశేష స్పందన
-
స్కీములు.. స్కాములు!
సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి అనుమతులు లేకుండా స్కీమ్లు నిర్వహిస్తూ నిషేధిత లాటరీ దందాకు పాల్పడటంతో పాటు అనేక మందిని మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిద్దరూ ఒకే ప్రాంతంలో, ఒకే భవనంలో దందా చేస్తున్నారని డీసీపీ రాధాకిషన్రావు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.91 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్వాన్కు చెందిన మహ్మద్ అబేద్, మహ్మద్ షకీర్ టప్పాచబుత్రలోని ఎస్ఏ ప్లాజాలో ఆరిమ్ ఎంటర్ప్రైజెస్, న్యూ యువÆ్టŠ‡ నీడ్స్ ఎంటర్ప్రైజెస్ పేర్లతో దుకాణాలు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల స్కీములు నిర్వహిస్తున్న వీరిద్దరూ నిషేధిత లాటరీ దందా నడుపుతున్నారు. ఒక్కో స్కీమ్లో సభ్యులుగా ఉండే 3 వేల మంది 16 నెలల పాటు నెలకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల 5, 18 తేదీల్లో డ్రాలు తీస్తుంటారు. అబేద్ మొదటి బహుమతి కింద బుల్లెట్, రెండో బహుమతిగా మూడు తులాల బంగారం, మూడో బహుమతి కింద బైక్... షకీర్ కారు, బైక్ తదితరాలను ప్రకటించారు. ఇలా ప్రతి నెలా సభ్యుల నుంచి దాదాపు రూ.30 లక్షల వరకు వసూలు చేస్తున్న వీరు గరిష్టంగా రూ.15 లక్షల విలువైన బహుమతులే ఇస్తున్నారు. ఇలా మొదటి నెల మినహా మిగిలిన 15 నెలల్లో నెలకు 10 మంది చొప్పున మొత్తం 150 మందికే ఈ బహుమతులు ఇస్తున్నారు. మిగిలిన 2850 మందికీ లాటరీ రాని కారణంగా వారు చెల్లించిన రూ.16 వేలకు బదులుగా గరిష్టంగా రూ.10 వేల విలువైన టీవీలు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వీరి అక్రమ దందాపై సమాచారం అందుకున్న పశ్చిమ మండ ల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎం.ప్రభాకర్రెడ్డి, ఎల్.భాస్కర్రెడ్డి ఏకకాలంలో దాడి చేసి మంగళవారం ఇరువురినీ అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కేసులను టప్పాచబుత్ర పోలీసులకు అప్పగించారు. -
లక్కు.. ట్రిక్కు!
కర్నూలులో జోరుగా లక్కీ డిప్ అనంతపురం నుంచి జిల్లాలోకి దుకాణం పైసా పెట్టుబడి లేకుండా కోటిన్నర సంపాదన పోలీసులు, స్థానిక నాయకుల అండదండలు నిలువునా మోసపోతున్న పేదలు ఖరీదైన వస్తువులతో కూడిన బ్రోచర్.. అరచేతిలో వైకుంఠం చూపించే ప్రచారం.. పేదలు, కూలీలు లక్ష్యంగా పైసా పెట్టుబడి లేని వ్యాపారం.. స్థానిక నేతలు, పోలీసుల అండదండలు.. జిల్లాలో లక్కీ డిప్ వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. అనుమతి లేకపోయినా.. అడ్డంగా దోచుకుంటున్నా.. అడిగే నాథుడే కరువు. ఒకరికో.. ఇద్దరికో తప్పిస్తే.. అధిక శాతం సభ్యులకు మిగిలేది డిన్నర్ సెట్లు, మంచాలు, బీరువాలే. ఈ మొత్తం వ్యవహారంలో నిర్వాహకులు వెనకేసుకుంటున్న మొత్తం ఏకంగా రూ.కోటిన్నర. లక్కంటే వీరిదే మరి. సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో నిషేధిత లక్కీడీప్ మొదలయింది. అధికార పార్టీ నేతలు, స్థానిక పోలీసుల అండదండలతో ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రజల అత్యాశను ఆసరా చేసుకుని రూ.6 వేలకే కారు, బైకు అని ఊరిస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి అనంతపురం జిల్లాలో దుకాణం బంద్ కాగా.. జిల్లాలో ఈ లక్కీడీప్ దుకాణం తెరిచినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో రూ.3 కోట్ల మేరకు వసూలు చేస్తున్న నిర్వాహకులు లక్కీ డీప్ బహుమతుల కోసం కేవలం కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. మిగిలిన రూ.2 కోట్లలో రూ.50 లక్షల వరకు మాముళ్ల కోసం ఖర్చు చేస్తుండగా.. మిగిలిన కోటిన్నర సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. లక్కీడీప్ను పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తుండటంతో వీరి వ్యాపారానికి అడ్డేలేకుండా పోయింది. లక్కీ డిప్ ఎలా నిర్వహిస్తారంటే.. ఒక్కో లక్కీడిప్లో సుమారుగా 5 వేల మంది సభ్యులు ఉంటారు. ఒక్కో సభ్యుడు నెలకు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.50 లక్షలు అవుతుందన్నమాట. ఈ విధంగాా ఆరు నెలల పాటు సభ్యుల నుంచి ఏకంగా రూ.3 కోట్లు వసూలవుతుంది. ప్రతి నెలా సభ్యులందరినీ సమావేశపరిచి.. లక్కీడీప్ తీస్తారు. ఇందులో మొదటి 50 మందికి బహుమతులను అందజేస్తారు. ఈ విధంగా 5 నెలల పాటు మొత్తం 250 మందికి బహుమతులను అందజేస్తారు. ఇందులోనూ సుమారు 10 మందికి ఖరీదైన కార్లు, బైకులు, టీవీలు వంటి బహుమతులను అందజేస్తారు. ఇక మిగిలిన సభ్యులకు కన్సొలేషన్ బహుమతుల కింద డిన్నర్ సెట్లు, మంచాలు, బీరువాలు కట్టబెడతారు. మొత్తంగా వీటన్నింటికీ కలిపి అయ్యే ఖర్చు కేవలం కోటిన్నర మాత్రమే. అంటే ఈ వ్యాపారంలో ఏకంగా పైసా పెట్టుబడి లేకుండా కోటిన్నర సంపాదిస్తున్నారన్నమాట. పోలీసులు, అధికారపార్టీ నేతల అండతోనే.. లక్కీడిప్ కేంద్రాలు పోలీసులు, అధికారపార్టీనేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా ఎమ్మిగనూరు, బనగానపల్లె, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఈ లక్కీడీప్ నిర్వాహకులకు అటు అధికార పార్టీ నేతలతో పాటు ఇటు పోలీసుల అండదండలు ఉంటున్నాయి. ఫలితంగా వీరు తమ వ్యాపారాన్ని దర్జాగా నిర్వ హిస్తున్నారు. ఈ నేపథ్యంలో కష్టపడి కూలీనాలీ చేసుకున్న డబ్బులు కాస్తా పేదలు ఆశకు లోనై లక్కీడీప్ వ్యాపారంలో కోల్పోతున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో ఒక లక్కీడీప్ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. ఇక మిగిలిన ప్రాంతాల్లో పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement