-
ఎంటెక్ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 9 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్లో పాల్గొనని అభ్యర్థులు 11వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది. ఈనెల 15న సీట్ల కేటాయింపు ఉంటుందని, 19లోగా సీట్లు వచ్చిన అభ్యర్థులు కాలేజీలో రిపోర్టింగ్ చేయాలని సూచించింది. కాగా, డిగ్రీలో ప్రవేశానికి (సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు) 9, 10 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఎంటెక్ చేశావా.. టీచింగ్ చేస్తావా?
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యలో మాస్టర్ డిగ్రీ (ఎంటెక్) పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ సహా దాని అనుబంధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఉజ్వల భవిష్యత్ ఉండబోతోంది. రాష్ట్రంలో కొత్త వర్సిటీలు, సాంకేతిక కోర్సుల్లో సీట్లు పెరుగుతుండటం.. మరోవైపు కొన్నేళ్లుగా ఎంటెక్లో ప్రవేశాలు తగ్గుతుండటంతో ఇప్పటికే ఎంటెక్ చేసిన వారికి బోధన రంగంలో మున్ముందు డిమాండ్ పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో మరో రెండేళ్లలో వేతనాలు రెట్టింపయ్యే అవకాశముందని అంటున్నారు. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కొరత రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లు గత మూడేళ్లుగా పెరుగుతున్నాయి. అదనపు సెక్షన్లు వస్తున్నాయి. దీనికి తోడు కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. ఇవి కూడా ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ ఉండే కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇవన్నీ ఎంటెక్ అభ్యర్థులకు కలిసి వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగినా అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వర్సిటీల్లోనే దాదాపు 3 వేలకుపైగా ఖాళీలున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. చాలా కాలేజీలు ఇతర రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీని ఆహ్వానిస్తున్నా వేతనాలు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోందని భావిస్తున్నాయి. స్థానికంగా ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 50 వేల లోపే వేతనాలు ఇవ్వడానికి ప్రైవేటు కాలేజీలు సిద్ధపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు రూ. లక్షకు పైగా డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లలో భారీగా అవసరం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీసీ) మార్గదర్శకాల ప్రకారం బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులు బోధించేందుకు ప్రతి 20 మంది విద్యార్థులకు ఓ అధ్యాపకుడు ఉండాలి. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కిందే దాదాపు 80 వేలకు పైగా బీటెక్ సీట్లున్నాయి. ఇందులో 75 శాతం కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి కోర్సులున్నాయి. మిగతా కోర్సుల్లో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) సీట్లు చాలా వరకు మిగులుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సులకు బోధించడానికి 3 వేల మంది సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్లు అవసరం. ప్రస్తుతం 2 వేల మందే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో 60 మందితో సెక్షన్లు నిర్వహిస్తున్నారు. 2024–25 నాటికి పెరిగే సీట్లను బట్టి కనీసం 10 వేల మంది కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు బోధించే వాళ్లు కావాలి. కొత్త వర్సిటీలు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. కొరత ఎందుకు? సాధారణంగా విద్యార్థులు బీటెక్ కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉపాధి వైపే వెళ్తున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో కొంతమంది ఎంపికవుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రారంభంలోనే రూ. 40 వేల నెలసరి వేతనం పొందే వీలుంది. దీంతో ఎంటెక్ చేయాలని విద్యార్థులు ఆలోచించట్లేదు. మరికొంత మంది విదేశాల్లో ఎంఎస్ కోసం వెళ్తున్నారు. ఫలితంగా ఏటా ఎంసెట్లో సీట్లు భారీగా మిగులుతున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎలా ఉందో.. గుర్తింపునిచ్చే వర్సిటీలూ పట్టించుకోవట్లేదు. నాణ్యమైన అధ్యాపకులు లేరని గుర్తించినా విధిలేక అఫిలియేషన్ ఇస్తున్నారు. దీంతో ప్రైవేటు కాలేజీలు అధ్యాపకులకు వేతనాలు అరకొరగా ఇస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సాఫ్ట్వేర్తో సమానంగా వేతనం ఉంటే తప్ప బోధన వైపు మళ్లే అవకాశం కనిపించట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు కొరతను ఎలా అడ్డుకుంటారనేది ప్రశ్నార్థకమే. జీతాలు పెంచితే కొంత మార్పు రావొచ్చు ఓవైపు కంప్యూటర్ కోర్సులు పెరుగుతున్నాయి. మరోవైపు సంబంధిత విభాగాల్లో ఎంటెక్ చేసేవారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ తేడాను పూడ్చాలి. బీటెక్తోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి. ఎంఎస్కు విదేశాలకు వెళ్తున్నారు. బోధించేందుకు వారు ఎందుకు ఇష్టపడట్లేదో తెలుసుకోవాలి. ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తే కొంత మార్పు రావొచ్చు. – ప్రొఫెసర్ వి వెంకటరమణ (ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్) -
ఎంటెక్ సీట్లలో భారీగా కోత
సాక్షి, హైదరాబాద్ : పీజీ ఇంజనీరింగ్లో (ఎంటెక్) ఈసారి భారీగా సీట్లు తగ్గిపోనున్నా యి. ఇందుకోసం పలు కాలేజీల యాజమాన్యా లు వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నాయి. ఎంటెక్ కోర్సుల నిర్వహణ సమస్యగా మారడం తో ఈ నిర్ణయానికి వచ్చాయి. వర్సిటీల నిబంధనల ప్రకారం ప్రతి ఎంటెక్ కోర్సులో 12 మంది విద్యార్థులకు ఒక పీహెడ్డీ అధ్యాపకుడు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది. విద్యార్థులు పెద్ద గా కాలేజీలకు రాకపోవడం, చేరే వారి సంఖ్య కూడా తగ్గిపోతుండటంతో వేతన భారం తప్పించుకునేందుకు కాలేజీలు ఎంటెక్ కోర్సులను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా యి. ఈ నేపథ్యంలో ఈసారి 2 వేల సీట్ల రద్దుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అలాగే అధ్యాపకులను తొలగిస్తున్నట్లు సమాచా రం పంపించడంతో వారు ఆందోళనలో పడ్డారు. ఇటీవల నగర పరిసరాల్లోని ఓ కాలేజీ యాజమాన్యం ఓ అధ్యాపకున్ని తొలగిస్తున్నట్లు ఫోన్ ద్వారా మెసేజ్ పంపించి అదే తొలగింపు ఆర్డర్ గా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఆయన ఆందోళనలో పడ్డారు. ఇది ఆయ న ఒక్కరి పరిస్థితే కాదు..రాష్ట్రంలోని అనేక మంది పరిస్థితి ఇదే కావడంతో ఆందోళన నెలకొంది. -
ఎంటెక్ చదివినా ఉద్యోగం రాలేదని..
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య హైదరాబాద్: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదన్న బెంగ ఓ వైపు.. అనారోగ్యంతో బాధపడు తున్న తల్లి మరోవైపు... ఇంటి పెద్ద కొడుకుగా తానేమీ చేయలేకపోతు న్నానని మనస్తాపానికి లోనైన ఓ యువకుడు తాను ఉంటున్న అపార్టు మెంటుపై నుంచి నాలాలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైతన్యపురి సీఐ గురురాఘవేంద్ర శుక్రవారం వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్లు గ్రామానికి చెందిన ఉప్పలయ్య, కోటమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్(23) ఎంటెక్ చదివి ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. చైతన్యపురి గంగోత్రి అపార్టుమెంటులో స్నేహితుల తో కలసి ఉంటున్నాడు. కొంతకాలంగా ఉద్యోగం రాలేదని వేదన పడుతు న్నాడు. అతని తల్లి కోటమ్మ కేన్సర్తో బాధపడుతోంది. కాగా, శుక్రవారం తెల్లవారు జామున భవనం పైనుంచి ఎవరో దూకిన శబ్దం రావటంతో ఉప్పలయ్య బయటకు వచ్చి చూశాడు. అపార్టుమెంటు పక్కనున్న నాలాలో ఎవరో పడినట్టు గమనించిన ఆయన కిందికి వెళ్లి చూడగా శ్రీనివాస్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -
ఎంటెక్, ఎం.ఫార్మసీలపై దృష్టి
నాణ్యతా ప్రమాణాల పెంపునకు సర్కారు చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంటెక్, ఎం ఫార్మసీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రమాణాలు, అర్హులైన అధ్యాపకులు లేకుండా కాలేజీలను నడుపుతున్న తీరును నియంత్రించేందుకు చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగా విద్యార్థులు, ఫ్యాకల్టీకి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచి స్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 137 ఇంజనీరింగ్ కాలేజీలు ఎంటెక్ కోర్సును అందిస్తున్నాయి. వాటికోసం ప్రత్యేకంగా కాలేజీలు లేకపోయినా బీటెక్ కోర్సులను నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఎంటెక్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అయితే ఆయా కాలేజీల్లో ఎంటెక్ విద్యార్థులకు బోధించే అర్హులైన అధ్యాపకులు లేరని, బోధనే సరిగా జరగడం లేదని జేఎన్టీయూహెచ్, ఉన్నత విద్యాశాఖ గుర్తించాయి. నిబంధనల ప్రకారం.. ఎంటెక్ కోర్సు కొనసాగించాలంటే ప్రతి ఆరుగురు విద్యార్థులకు ఒక పీహెచ్డీ ప్రొఫెసర్, ఒక ఎంటెక్ చేసి సీనియారిటీ కలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి. కానీ చాలా కాలేజీల్లో పీహెచ్డీ చేసిన ప్రొఫెసర్లు లేరన్న విషయం విద్యాశాఖ దృష్టికి వచ్చింది. సరైన మౌలిక వసతులు, ల్యాబ్లు, లైబ్రరీలు, ఇతర పరికరాలు కూడా అవసరమైన మేరకు లేవని గుర్తించింది. ఎంఫార్మసీ కాలేజీల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని నిర్ధారించింది. బయోమెట్రిక్ తో అక్రమాలకు చెక్ ఆధార్ నంబర్, బయోమెట్రిక్ ఆధారంగా ప్రవేశాలు చేపట్టడం.. విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలని యోచిస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement