-
వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మాదిగల అభ్యున్నతి
సాక్షి, అమరావతి: మాదిక సామాజిక వర్గానికి ఎలాంటి మేలు జరగడం లేదని, వారికి ద్రోహం చేశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మాదిగల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతగానో తోడ్పాటునిస్తోందని తెలిపింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు రూ. 2.11 లక్షల కోట్లను వివిధ డీబీటీ పథకాల ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసిందని పేర్కొంది. ఈ పథకాల ద్వారా ఎస్సీలైన మాలలు, మాదిగలు, రెల్లి కులస్తులు గణనీయంగా లబ్ధి పొందారన్నది వాస్తవమని స్పష్టంచేసింది. వారి అభ్యున్నతి వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమైందని తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలు పిసరంత కూడా లేదు. పైగా, ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఎస్సీల్లో కులాల మధ్య చీలికలతో పబ్బం గడుపుకొన్నారు. ముఖ్యంగా ఎస్సీల మధ్య చంద్రబాబు రాజేసిన కుంపట్లు ఆ వర్గాలను అతలాకుతలం చేశాయి. నిత్యం దళితులను కించపరిచే వ్యాఖ్యలతో చంద్రబాబు, టీడీపీ నేతలు వారిని ఆత్మన్యూనతలోకి నెట్టే ప్రయత్నం చేశారు. గత ఎన్నికలకు ముందు ఓట్ల కోసం డప్పు కళాకారులు, చర్మకారులకు మొక్కుబడిగా చేసిన లబ్ధి కూడా వారికి సరిగా చేరలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తోంది. మొక్కుబడిగా కాకుండా అత్యంత పారదర్శకంగా ఎక్కడా అవినీతి, పక్షపాతం, వివక్షకు తావు లేకుండా, పార్టీల భేదాలు చూడకుండా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ఈ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే. ఎవరికి జరగాల్సిన మేలును వారికి చేస్తోంది. వలంటీర్ల ద్వారా లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడే పింఛన్లు అందజేస్తోంది. ఇలా ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన లక్షలాది మంది పేదలు ఉన్నారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీబీటీ పథకాల ద్వారా 46,76,828 మంది మాదిగలకు నేరుగా ప్రయోజనం చేకూరిందని ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా రూ. 16,650 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసినట్లు పేర్కొంది. ఏపీ చరిత్రలో మాదిగ సామాజిక వర్గానికి ఇంత పెద్ద స్థాయిలో లబ్ధి చేకూర్చడం సువర్ణ అధ్యాయమే. వైఎస్సార్ ఆసరా, జగనన్న అమ్మ ఒడి, జగనన్న చేదోడు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, గృహ నిర్మాణంలో డీబీటీ, వైఎస్సార్, ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న తోడు, జగనన్న వసతి దీవెన, జగనన్న కళ్యాణమస్తు, వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, పంట రుణాలు, వాహన మిత్ర, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య శ్రీ చేయూత, పెన్షన్ కానుక, తదితర పథకాల ద్వారా మాదిగలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయోజనం కలుగుతోంది. ఇవికాక నాన్డీబీటీ పథకాల ద్వారా మాదిగలు మరింత మేలు పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వమే కాదు.. ఏ ప్రభుత్వంతో పోల్చినా వైఎస్ జగన్ నేతృత్వంలోనే అధిక మేలు జరిగిందన్నది ముమ్మాటికీ నిర్వివాదాంశం. -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
మాదిగ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఘట్కేసర్ టౌన్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగ, మాదిగ ఉప కులాల జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేయాలని మాదిగ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధారి లక్ష్మీనారాయణ, మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీసాల మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని మాదిగ జేఏసీ కార్యాలయంలో బుధవారం చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు తెలుగు ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ మండల కన్వీనర్ శ్రీనివాస్, నల్లగొండ జిల్లా నాయకులు అంజయ్య, మైసయ్య, గూర్జకుంట నర్సింహ, కడుపోళ్ల మల్లేష్, నాగులపల్లి శ్రీనివాస్, నల్లగారి నర్సింహ, యాదగిరి, సుంకం గణపతి, ములుగురం పాండు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement