-
దండి తర్వాత అంతటి యాత్ర!
రైతు రక్షణ యాత్ర 1937 జూలై 3న ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం నుండి ఆరంభమైంది. అక్కడి నుంచి రైతు గీతాలు ఆలాపిస్తూ , గౌతు లచ్చన్న తదితరులు వెంట రాగా ముందుకు సాగింది. గాంధీజీ నిర్వహించిన దండియాత్రను మినహాయిస్తే, ఇంతటి భారీ ఎత్తున జరిగిన ఘటన మరొకటి లేదని అంటారు! జాతీయోద్యమం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకొంది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన రెండు మూడు ఉద్యమాల్లో.. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం, చీరాల–పేరాల ప్రతిఘటనోద్యమం, పెదనందిపాడు రైతు ఉద్యమం చెప్పుకోదగ్గవి. వీటితో పాటు 1930 దశకంలో జరిగిన చరిత్రాత్మక రైతు రక్షణ యాత్ర గణనీయమైనది. తొమ్మిది నెలల పాటు కోస్తాంధ్ర ఉత్తర దిక్కు నుండి మద్రాసు వరకు సాగిన ఈ యాత్ర (జూలై 1937–మార్చి 1938) చరిత్రాత్మకమైనది. ఈ యాత్ర పూర్వ రంగంగా 1936లో అఖిల భారత కిసాన్ సభ ఏర్పడింది. ఆంధ్రదేశంలో నీటి తీరువా పన్ను హెచ్చింపు, శిస్తు రెమిషన్, రీ సెటిల్మెంట్ తదితర రైతు సమస్యలపై జిల్లాల వారీ సభలు, సమావేశాలు, జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం 1937లో ఏర్పడి, ఆచార్య ఎన్.జి.రంగాను అధ్యక్షుడిగా ఎన్నుకొంది. ఆ తర్వాత కొమ్మారెడ్డి సత్యనారాయణ మూర్తి అధ్యక్షుడు. చలసాని వాసుదేవరావు కార్యదర్శి. అప్పటి నుంచి విస్పష్టమైన రైతాంగ పోరాటాలు మొదలయ్యాయి. గ్రామల్లో రైతు సంఘాలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, జిల్లాలవారీ రైతు యాత్రలు జరిగాయి. ఆచార్య రంగా అభిప్రాయంలో ఈ యాత్రలు మద్రాసు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వార్షిక యాత్రలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రముఖ జాతీయ నాయకులు న్యాపతి సుబ్బారావు పంతులు, దండు నారాయణరాజు, మాగంటి బాపినీడు, ఓరుగంటి వెంకట సుబ్బయ్య, పుల్లెల శ్యామసుందరరావు, కల్లూరి సుబ్బారావు ప్రభృతులు ఈ యాత్రలో పాల్గొన్న ముఖ్యుల్లో కొందరు. రైతు రక్షణ యాత్ర ఆంధ్రదేశంలో పెల్లుబికిన రైతాంగ చైతన్యాన్ని ఒక నిర్దుష్ట మార్గంలో పెట్టేందుకు, కోస్తా ప్రాంతంలోని రైతుల్ని ఉద్యమబాట పట్టించేందుకు ఆంధ్ర రైతు రక్షణ యాత్ర తోడ్పడింది. జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం లాంటి రైతాంగ సమస్యలపై దృష్టి మరలింది. కొమ్మారెడ్డి సత్యనారాయణ మూర్తి (కాంగ్రెస్) నాయకుడిగా, చలసాని వాసుదేవరావు (కమ్యూనిస్టు పార్టీ) ఉప నాయకుడిగా వ్యవహరించారు. రైతు రక్షణ యాత్ర 1937 జూలై 3న ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం నుండి ఆరంభమైంది. అక్కడి నుంచి రైతు గీతాలు ఆలాపిస్తూ , గౌతు లచ్చన్న తదితరులు వెంట రాగా ముందుకు సాగింది. రైతుల ‘మాగ్నా కార్టా’ ఆంధ్రప్రదేశ్లో రైతుయాత్ర 7 జిల్లాలు, 130 రోజులు పర్యటించింది. అప్పట్లోనే 25 వేల మంది సంతకాలు సేకరించింది. ఎనిమిది వందల దరఖాస్తులు, మూడు వందల విజ్ఞాపన పత్రాలు, అరవై ఫిర్కా స్థాయి సభలు, 800ల గ్రామస్థాయి సభలు నిర్వహించి మద్రాసుకు చేరింది. గాంధీజీ నిర్వహించిన దండియాత్రను మినహాయిస్తే, ఇంతటి భారీ ఎత్తున జరిగిన ఘటన మరొకటి లేదని పరిశీలకుల అభిప్రాయం. 1937 జూలైలో మొదలైన యాత్ర 1938 మార్చి అంతానికి మద్రాసు చేరింది. ప్రభుత్వానికి రైతు నేతలు సుదీర్ఘ సమగ్ర విజ్ఞాపన అందజేశారు. దీన్ని ఆంధ్ర దేశపు రైతుల సుదీర్ఘ, సమగ్ర దర్పణంగా భావించవచ్చు. రైతుల డిమాండ్లతో కూడిన ‘మాగ్నాకార్టా’ ఇది. ‘‘భూమిశిస్తు విధానం, ప్రకృతి వైపరీత్యాలు రైతులకు కృంగదీస్తున్నాయి. ఉద్యోగుల అవినీతి, లంచగొండితనం, పోలీసుల దౌర్జన్యం, జమీందారీ, ఇనాందారీ, మొఖాసా గ్రామాల్లో రైతుల స్థితిగతులు నరకప్రాయం. జమీందారుల పెత్తనం హద్దులు మీరింది. ప్రజలు అనారోగ్యం, అవిద్య, అజ్ఞానాలతో తల్లడిల్లిపోతున్నారు. ప్రజల భాషలో పాలన జరగాలి. వీటి నివారణకు చర్యలు చేపట్టాలి’’.. అంటూ సాగింది. 1937 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ప్రజల కడగండ్లు గట్టెక్కుతాయని ఆశించారు. రుణ విమోచన చట్టం, మద్యపాన నిషేధం జరిగి ప్రజల్లో ఆశలు మొలకెత్తాయి. రైతుల్లో అపూర్వ సంచలనం, ఆశాభావం తొణికిసలాడింది. జిల్లా రైతు సభలు విజయవంతమయ్యాయి. టంగుటూరి ప్రకాశం పంతులు (రెవిన్యూ మంత్రి) ఆధ్వర్యంలో జమీందారీ విచారణ కమిటీ ఏర్పడి, అంతిమంగా జమీందారీ విధానం రద్దుకు ఈ యాత్ర నాంది పలికింది. 1948లో జమీందారి విధానం రద్దయింది. నేడు దేశంలో రైతాంగం అనేకానేక సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా.. దిగుబడులు పెరిగినా, కనీస ధర లేకపోవడం, ప్రభుత్వాలు కొనడానికి ముందుకు రాకపోవడం, వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, ఇలాంటివి మరెన్నో. ఇటీవలి కాలంలో సాగిన రైతు వ్యతిరేక చట్టాల నిరసన మహోద్యమం (హర్యానా, పంజాబ్లలో) నేటి రైతాంగ స్థితి గతులకు అద్దం పడుతున్నది. – వకుళాభరణం రామకృష్ణ (చదవండి: ప్రథమ సంగ్రామ గ్రంథాలు! సిపాయిల తిరుగుబాటు పై వచ్చిన గ్రంథాలు) -
మానవాళి తొలి హక్కుల పత్రం మాగ్నా కార్టా
ఆధునిక ప్రజాస్వామ్యానికి తొలి బీజం వేసిన ఆ మహా చారిత్రక క్షణానికి నేటికి 800 ఏళ్లు. భూమ్మీద దైవాంశ సంభూతులుగా చక్రవర్తు లు పొందిన తిరుగులేని అధికారానికి తొలిసారిగా అడ్డుకట్ట వేసిన ఘటనకు మరోపేరు మాగ్నా కార్టా. ఇది వ్యక్తి స్వేచ్ఛ-హక్కుల పత్రం. రాజు చట్టానికి అతీతుడు కాదని, చట్టపాలనకు లోబడాల్సిందేనంటూ రూపొందిన తొలి హక్కుల పత్రంపై ఒక నిరంకుశ చక్రవర్తి తప్పనిసరై సంతకం పెట్టిన క్షణాన్నే.. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ అనే మహత్తర భావాలు పురుడు పోసుకున్నాయి. రాజు సర్వాధికారి అనే వేల ఏళ్ల అభిప్రాయాన్ని ఆ ఒక్క సంతకం తల్లకిందులు చేసింది. మాగ్నా కార్టా నుంచి అమెరికా రాజ్యాంగ సభ, ఫ్రెంచ్ విప్లవం, వలస పాలనకు వ్యతిరేకంగా సకల దేశాల్లో కొనసాగిన స్వాతంత్య్ర పో రాటాల వరకు తిరుగులేకుండా ప్రకటించిందీ, నిలబెట్టిందీ ఈ ప్రజా సార్వ భౌమాధికారాన్నే. రాజు అధికారానికి కోత పడి ప్రజాధికారానికి బీజాక్షరాలు పలికిన చరిత్రకు నిలువెత్తు దర్పణం. మాగ్నా కార్టా.. అధి కారం చేతులు మారి ప్రజల పరమవుతున్న పరిణామం నెమ్మదిగా వివి ధ రూపాల్లో చరిత్రలో నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే.. ఇంత సుదీర్ఘకాలం తర్వాత కూడా ప్రజలకు నిజమైన అధికారం ప్రపంచంలో ఏ దేశంలోనూ వాస్తవార్థంలో సిద్ధించకపోవడమే అసలైన విషాదం. అంతమాత్రాన 1215 జూన్ 15న బ్రిటన్ రాజు జాన్ తన విధేయులకు తలొగ్గి చేసిన ఆ తొలి అధికారమార్పిడి సంతకం విలువ ఏమాత్రం తగ్గ దు. స్వాతంత్య్రం కోసం మనిషి అనంతరీతుల్లో సాగిస్తున్న ప్రతి ప్రయ త్నంలోనూ నేనున్నానంటూ ఆ స్వేచ్ఛాపత్రం గుబాళిస్తూనే ఉంది. వివిధ నాగరికతల్లో రాజులు ప్రజల కోసం రూపొందించిన చట్టా ల గురించి మనం చదువుకున్నాం. యూదులకు మోసెస్, భారతదేశం లో మనువు, మెసొపొటేమియాలో హమురాబీ, చైనాలో కన్ఫ్యూసియ స్, రోమ్లో జస్టీనియన్ వంటి వారు ఈ కోవకు చెందుతారు. వీరంతా ప్రజలకు న్యాయ స్మృతులను రాజు తరఫున అందించినవారు. కానీ ఈ న్యాయం తిరగబడిన చరిత్రకు తొలి సంకేతం మాగ్నా కార్టా. అంత వరకు అలవిమాలిన పన్నులను విధిస్తున్న రాజునుంచి అతడి సామం తులు తమ హక్కులను డిమాండ్ చేసి లాక్కున్న స్వేచ్ఛా పత్రమే మాగ్నా కార్టా. తన ఇచ్ఛే చట్టం కానవసరం లేదని, చట్టం కంటే తాను ఉన్నతుడిని కానని చరిత్రలో ఒక చక్రవర్తి తప్పనిసరి పరిస్థితుల్లో అంగీ కరించి చేసిన అద్వితీయ సంతకం అది. నీవెంత ఉన్నత స్థానంలో ఉన్నా నీకంటే పైనే న్యాయం, శాసనం ఉంటుందని చాటిందది. చట్టపాలన అనే భావన దాంతోనే చరిత్రలో ప్రారంభమైంది. పాలితుల సమ్మతి లేకుండా పన్నులు విధించనంటూ ఒక రాజు తొలి సారిగా అంగీకరించిన క్షణం అది. న్యాయాన్ని ఎవరూ కొనుక్కోలేరని, నిర్బంధంలోని వ్యక్తి బహిరంగ విచారణ హక్కును కలిగి ఉంటాడని కూడా రాజు ప్రకటించాడు. ఈ కోణంలో చూస్తే భూమ్మీద ఆవిర్భవిం చిన రాజ్యాంగ పత్రాల్లో శిఖరస్థాయి మాగ్నా కార్టాదే. అధర్మానికి, అన్యాయానికి, నిరంకుశాధికారానికి వ్యతిరేకంగా వ్యక్తి స్వాతంత్య్రానికి పునాదులు వేసిన తొలి చారిత్రక పత్రం మాగ్నాకార్టా. కానీ 800 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మాగ్నా కార్టా ప్రజలకు అందించిన హక్కులు సారంలో అమలు కాలేదన్నది వేరే విషయం. రాజుకు దఖలుపడిన పవిత్ర హక్కును తృణీకరించి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి నాందిప లికిన మాగ్నా కార్టా కులీనుల ప్రయోజనాలకే పట్టం కట్టి ఉండవచ్చు కానీ మానవాళికంతటికీ స్ఫూర్తిదాయకంగా అది తన పాత్రను పోషిస్తూ వెళ్లింది. భారత రాజ్యాంగంతో సహా ప్రజాస్వామ్య దేశాల్లోని పాలనా వ్యవస్థలన్నీ మాగ్నా కార్టాను స్ఫూర్తిగా తీసుకున్నవే. న్యాయం నేటికీ అమ్ముడుపోతూ, హక్కులకు నిత్యం భంగం కలుగుతున్న నేప థ్యంలో అది ప్రవచించిన స్వేచ్ఛ, హక్కుల నిజమైన సారాంశాన్ని సాధించుకోవలసిన అవసరం ప్రజలపైనే ఉంది. ఇదే మాగ్నా కార్టా ఎనిమిది శతాబ్దాల చరిత్ర మనకందిస్తున్న సందేశం. (మాగ్నాకార్టాకు నేటికి 800 ఏళ్లు) - కె. రాజశేఖరరాజు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో ఎటు పోయింది: మీసా భారతి
ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక
గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
సోనియా గాంధీ ప్రయత్నం ఫలించడం లేదు: అమిత్ షా కీలక వ్యాఖ్యలు
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు.. 22,500 దిగువకు నిఫ్టీ
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"
పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "
కూటమి అంటేనే ఎలపరమబ్బా....
తప్పక చదవండి
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
Advertisement