-
నారాయణపురం ఠాణా.. ది బెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పోలీసుస్టేషన్లకు అరుదైన గుర్తింపు లభించింది. 2018కి సంబంధించి పనితీరు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న వాటిలో 86 ఠాణాలను బెస్ట్ అంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) గుర్తించింది. వీటిలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం 14వ స్థానంలో, నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీసుస్టేషన్ 24వ స్థానంలో నిలిచాయి. 2015లో ఎంహెచ్ఏ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక డీజీపీల సదస్సులో చేసిన అనేక తీర్మానాల్లో ‘ఉత్తమ పోలీసుస్టేషన్ల’గుర్తింపు ఒకటి. మౌలిక వసతులు, పనితీరు, ప్రజల మన్నన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని దేశంలోని ఉత్తమ ఠాణాలకు అవార్డులు ఇవ్వాలని ఆ సదస్సులో నిర్ణయించారు. దీంతో 2017 నుంచి బెస్ట్ ఠాణాల ఎంపిక మొదలైంది. ఆ ఏడాది హైదరాబాద్ కమిషనరేట్లో ఉన్న పంజగుట్ట రెండోస్థానంలో నిలిచింది. సమగ్ర అధ్యయనం తర్వాత ఎంపిక... దేశ వ్యాప్తంగా ఉత్తమ పోలీసుస్టేషన్లను ఎంపిక చేయాల్సిన బాధ్యతల్ని ఎంహెచ్ఏ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు అప్పగిస్తుంది. కేంద్రం అధీనంలోని ఈ విభాగం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తుంది. 750 కంటే ఎక్కువ ఠాణాలు కలిగిన రాష్ట్రాల నుంచి మూడు, మిగిలిన రాష్ట్రాల నుంచి రెండు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఒకటి చొప్పున ఎంట్రీలను స్వీకరిస్తుంది. తెలంగాణ నుంచి వెళ్లిన ఎంట్రీల్లో నారాయణపురం, చింతపల్లి పోలీసుస్టేషన్లు ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్కు చెందిన ఓ ప్రత్యేక బృందం ఈ ప్రాంతాలకు చేరుకుని దాదాపు 2 నెలల పాటు రహస్యంగా వాటి పనితీరు, మౌలిక సదుపాయాలు, నేరాల నిరోధం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడం తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఒక్కో పోలీసుస్టేషన్ పరిధి నుంచి 100 మందిని ఎంపిక చేసుకుని వారి అభిప్రాయాలు తీసుకుంది. వీరిలో ఠాణాకు వచ్చిన బాధితులు, దాని చుట్టుపక్కల నివసించే వారు, పోలీసుస్టేషన్ పరిధిలోని విద్య, వ్యాపార సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి వివరాలు సేకరించింది. అత్యంత క్లిష్టమైన ఎంపిక విధానం... క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఎంపిక విధానం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. తొలుత అభిప్రాయాలు సేకరించినప్పుడు కనీసం 80 శాతం మంది పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయాలి. కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, నేరగాళ్లకు శిక్షలు పడుతున్న శాతం, రికవరీలతో పాటు ఠాణా పరిశుభ్రత, పచ్చదనం, అక్కడి పోలీసుల ప్రవర్తన, విధి నిర్వహణ తీరును పరిగణలోకి తీసుకుంటారు. ఈ బృందం పరిశీలించే అంశాల్లో టాయిలెట్స్లోని ఫ్లష్లు సరిగ్గా పని చేస్తున్నాయా? వంటి చిన్న చిన్నవీ ఉంటాయి. ఇలా చేపట్టిన సమగ్ర అధ్యయనం తర్వాత దేశంలో ఉత్తమంగా నిలిచిన పోలీసుస్టేషన్ల జాబితాను ఎంహెచ్ఏకు అందిస్తుంది. డ్యూటీ మీట్లో అందించే అవకాశం... ఈ పోలీసుస్టేషన్ల జాబితాను వివిధ కోణాల్లో పరిశీలించే ఎంహెచ్ఏ అధికారులు వాటినీ మదిస్తారు. ఈ జాబితాను ఓ నిపుణుల కమిటీకి అందిస్తారు. వీరు చేసే మదింపు తర్వాత తుది ఉత్తమ పోలీసుస్టేషన్ల జాబితా విడుదల అవుతుంది. ఈసారి మొత్తం 86 ఠాణాలు బెస్ట్గా గుర్తించగా, వీటిలో రెండు తెలంగాణకు చెందినవి ఉన్నాయి. ఈ మేరకు ఎంహెచ్ఏ నుంచి రాష్ట్ర పోలీసు విభాగానికి వర్తమానం అందింది. ఈ ఠాణాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రోల్మోడల్గా ప్రకటిస్తారు. 2017కు సంబంధించి పంజగుట్ట పోలీసుస్టేషన్ రెండో స్థానం సంపాదించింది. గత ఏడాది గ్వాలియర్లో జరిగిన వార్షిక డీజీపీల సదస్సులో అవార్డును అందించారు. ఈసారి అదే సంప్రదాయం కొనసాగుతుందా లేక జాతీయ స్థాయిలో జరిగే ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్లో ఈ అవార్డుల్ని అందిస్తారా అనేది స్పష్టం కావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ఇదో అరుదైన గుర్తింపు... రాచకొండ పోలీసు కమిషనరేట్లోని సం స్థాన్ నారాయణపురం ఠాణా జాతీయ స్థాయిలో ఉత్తమ ఠాణాగా ఎంపిక కావడం అరుదైన గుర్తింపు గా భావిస్తున్నాం. కమిషనరేట్కే తలమానికమైన రాచకొండ గ్రామం ఇదే పోలీసుస్టేషన్ పరిధిలో ఉండటం గమనార్హం. ఈ గ్రామాభివృద్ధికి పోలీసు విభాగం అనేక రకాలైన సహాయసహకారాలు అందించింది. ఈ పోలీసుస్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు సీసీటీఎన్ఎస్ వ్యవస్థ అమలు కూడా పక్కాగా సాగుతోం ది. ఈ గుర్తింపు సాధించడంలో సహకరించిన డీజీపీ మహేందర్రెడ్డికి కృతజ్ఞతలు. ఈ ఠాణా ఇన్స్పెక్టర్తో పాటు ఏసీపీ, డీసీపీని అభినందిస్తున్నా. – మహేష్ మురళీధర్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ -
బెటర్ ఇండియా జాబితాలో సీపీ మహేశ్ భగవత్
సాక్షి, హైదరాబాద్: బెటర్ ఇండియా ఏటా ప్రకటించే టాప్–10 ఐపీఎస్ అధికారుల జాబితాలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ చోటు దక్కించుకున్నారు. విధుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు బెటర్ ఇండియా ఏటా టాప్–10 ఐపీఎస్ అధికారుల జాబితాను విడుదల చేస్తుంది. తాజా జాబితాలో తొలి, రెండు స్థానాల్లో మనీశ్శంకర్ శర్మ, ఆర్.శ్రీలేఖ ఉండగా.. మూడో స్థానంలో మహేశ్ భగవత్ ఉన్నారు. అక్రమ రవాణా బారి నుంచి చాలామంది మహిళలు, పిల్లలను రక్షించినందుకు ఆయనకు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ రిపోర్ట్ హీరోస్ అవార్డు–2017ను ప్రకటించడం తెలిసిందే. ‘ప్రభుత్వ ప్రాధాన్యమైన మహిళల అక్రమ రవాణాపై భగవత్ ఉక్కుపాదం మోపారు. రాచకొండ పోలీసు కమిషనర్గా 25 వేశ్యా గృహాలను మూయించేశారు. దేశంలోనే అతిపెద్ద సమస్య అయిన బాల కార్మికుల అక్రమ రవాణాను నిలువరించేందుకు కృషి చేశారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న దాదాపు 350 మందికిపైగా పిల్లలను కాపాడి బడి బాట పట్టించారు. 13 ఏళ్లుగా 1,000 మందికిపైగా మహిళలు, పిల్లలకు సెక్స్ ట్రాఫికింగ్, 800 మంది బాల కార్మికులకు పనుల నుంచి ఆయన విముక్తి కల్పించారు’అని బెటర్ ఇండియా ప్రశంసలు కురిపించింది. -
అవిశ్రాంతంగా పనిచేస్తున్న పోలీసులు
హైదరాబాద్: వాన కష్టాల ‘కడలి’లో ఉన్న సిటీని గట్టెక్కించడానికి పోలీసులు నిర్విరామంగా పని చేస్తున్నారు. సమయంతో పని లేకుండా విధుల్లో నిమగ్నమవుతున్న అధికారులు, సిబ్బంది వరద సహాయకచర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులు సైతం ‘రోడ్డెక్కి’ వాహనాలను నియంత్రిస్తున్నారు. రహదారులపై పడిన చెట్లను తొలగించడంలో జీహెచ్ఎంసీకి, పునరావాలస కేంద్రాల ఏర్పాటులో రెవెన్యూ యంత్రాంగానికి, నాలాల పర్యవేక్షణలో ఆ విభాగం అధికారులకు, కూలిన గోడల శిథిలాల తొలగింపులో అగ్నిమాపక శాఖకు, రోడ్ల మరమ్మతులో ఆర్ అండ్ డీ అధికారులకు పోటీగా పోలీసులు పని చేస్తున్నారు. ఇప్పటి వరకు అక్రమ పార్కింగ్లో ఉన్న వాహనాలను తొలగించడానికి (టోవింగ్ చేయడానికి) వినియోగించిన ట్రాఫిక్ క్రేన్లను ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం కాంక్రీట్, ఇసుక, కంకరు రవాణాకు వాడుతున్నారు. వీటిని వినియోగించి రోడ్లపై ఉన్న అనేక గుంతల్ని పూడుస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా నిర్విరామంగా విధుల్లో ఉంటూ, వానకి తడుస్తున్న తమ సిబ్బంది ఆరోగ్యంపై పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు అనారోగ్యానికి గురికాకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో రెండు మూడురోజుల పాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందనే సమాచారం నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ శుక్రవారం అల్వాల్లో పర్యటించారు. శ్రీనివాసనగర్కాలనీ, రెడ్డి కాలనీల్లోని నీట మునిగిన ప్రాంతాలకు వెళ్ళిన ఆయన అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. మోకాలు లోతు నీళ్ళల్లోనూ స్థానిక అధికారులతో కలిసి నడిచిన వెళ్ళిన భగవత్ స్థానికులతో మాట్లాడుతూ వారి ఇబ్బందులు, సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వరదల నేపథ్యంలో ఎలాంటి సహాయసహకారాలు అవసరమైనా పోలీసుల్నీ సంప్రదించవచ్చని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement