-
కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించే చాన్స్!
బడ్జెట్లో చర్యలపై డెలాయిట్ సర్వేలో అంచనా... న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)తో సతమతమవుతున్న పారిశ్రామిక రంగాన్ని మోదీ సర్కారు ఈసారి బడ్జెట్లో కాస్త కనికరించనుందా? ట్యాక్స్ కన్సెల్టెన్సీ దిగ్గజం డెలాయిట్ ఇండియా సర్వేలో మెజారిటీ కార్పొరేట్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేట్ పన్నును తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో రెండు వారాల్లో(ఫిబ్రవరి1న) 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. 2015 ఫిబ్రవరి బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ కార్పొరేట్లకు ఇస్తున్న పన్ను ప్రోత్సాహకాలను దశలవారీగా తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, 2017, ఏప్రిల్ 1 నుంచి కార్పొరేట్ పన్నును క్రమంగా 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని అప్పుడే వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న కార్పొరేట్లలో 53 శాతం మంది ఈసారి కార్పొరేట్ పన్ను రేటులో తగ్గింపు ఉండొచ్చని పేర్కొన్నారు. ‘నల్లధనాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో పన్ను రేటు తగ్గించేందుకు ఇదే సరైన సమయం. డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత ఆర్థిక వృద్ధి దిగజారుతుండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనికి ప్రధానంగా డిమాండ్ పడిపోవడమే కారణం. సర్వేలో ఎక్కువమంది ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డిమాండ్పై ప్రతికూల ప్రభావాన్ని తొలగించేందుకు బడ్జెట్లో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని 80 శాతం మంది సర్వేలో స్పందించారు’ అని డెలాయిట్ పేర్కొంది. గతేడాది ప్రభుత్వ పన్ను ఆదాయాల్లో కార్పొరేట్ పన్ను వాటా దాదాపు 19 శాతం కాగా, ఆదాయపు పన్ను వాటా 14 శాతంగా నమోదైంది. ఇతర ముఖ్యాంశాలివీ... పన్ను ప్రోత్సాహకాలు పూర్తిగా తొలగించడం మంచిదని.. దీనివల్ల లిటిగేషన్లకు ఆస్కారం తగ్గుతుందని సర్వేలో 40% అభిప్రాయపడ్డారు. ఇన్ఫ్రా వంటి రంగాల్లో వృద్ధి కొనసాగాలంటే లాభాలతో ముడిపడిన పన్ను ప్రోత్సాహకాలు తప్పనిసరి అని మరో 40% మంది పేర్కొన్నారు. ఇన్ఫ్రా రంగానికి ప్రోత్సాహకాలు పూర్తిగా తొలగించకుండా పెట్టుబడులతో ముడిపడిన పన్ను రాయితీలు కల్పించాలని 15శాతం మంది కోరారు. నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సంబంధించి డిమాండ్ తీవ్రంగా దెబ్బతింది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్ నిధులు పోటెత్తడంతో రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. మరోపక్క, ప్రభుత్వం కూడా వడ్డీరేట్ల రాయితీలను అందిస్తోంది. ఇవన్నీ చైక గృహాలకు డిమాండ్ను మళ్లీ భారీగా పెంచనున్నాయి. మొత్తంమీద నిర్మాణాత్మక సంస్కరణల జోరు పెంచేందుకు ప్రభుత్వం విధానపరమైన చర్యలను కొనసాగించే అవకాశం ఉందని డెలాయిట్ అభిప్రాయపడింది. -
జీడీపీ అంచనాలు.. వాస్తవానికి దూరం!
అసోచామ్ సర్వేలో కార్పొరేట్ల అభిప్రాయం న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7 శాతం పైనే ఉండొచ్చన్న ప్రభుత్వ అంచనాలు అతిశయోక్తిగా ఉన్నాయని.. వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టడం లేదని మెజారిటీ కార్పొరేట్లు అభిప్రాయపడుతున్నారు. పారిశ్రామిక మండలి అసోచామ్ నిర్వహించిన సర్వేలో 76 శాతం మంది ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ‘కొత్త డేటా ప్రకారం 7 శాతంపైగా వృద్ధి రేటు మరీ ఆశాజనకంగా ఉంది. వాస్తవానికి ఆర్థిక వ్యవస్థలో ఇంత సానుకూల పరిస్థితులేమీ కనబడటం లేదు’ అని కార్పొరేట్ సారథులు వ్యాఖ్యానించారు. బడ్జెట్ తర్వాత జరిపిన ఈ సర్వేలో వివిధ కంపెనీలకు చెందిన 189 మంది సీఈఓలు, సీఎఫ్ఓలు పాల్గొన్నారు. బేస్ సంవత్సరాన్ని మార్చడం(2004-05 నుంచి 2001-12కు)తో ఈ ఏడాది(2014-15) జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదుకానుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. 2013-14 వృద్ధి గణాంకాలను సవరించారు. 4.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంచారు. కాగా, పాత బేస్ ఇయర్ ప్రకారం ఈ ఏడాది వృద్ధి రేటు 5.5 శాతంగా గతంలో కేంద్రం అంచనా వేసింది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో వృద్ధి రేటు 8.1-8.5% స్థాయిలో ఉండొచ్చని బడ్జెట్లో జైట్లీ ప్రకటించడం విదితమే. సర్వేలో ఇతర ముఖ్యాంశాలివీ.. ⇒ కొత్త డేటా ప్రకారం ప్రభుత్వ ఆశావహ అంచనాలు సరైనవేనన్న అభిప్రాయానికి రావాలంటే మరికొన్నాళ్లు వేచిచూడాల్సి ఉంటుందని సర్వేలో పాల్గొన్న 71 శాతం సీఈఓలు పేర్కొన్నారు. ⇒ అమ్మకాలు భారీగా పుంజుకోవడం, ఉత్పాదకత మరింత మెరుగుపడాల్సి ఉందని 68 శాతం సీఎఫ్ఓలు అభిప్రాయపడ్డారు. ⇒ బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన పలు కీలక ప్రతిపాదనలు, చర్యలు కార్యరూపందాల్చి ఫలితాలు వచ్చేందుకు కొన్ని అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. ⇒ చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ)ల కోసం ముద్రా బ్యాంక్ ఏర్పాటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల పెంపు, ఇన్ఫ్రా రంగానికి బూస్ట్ ఇచ్చేలా తీసుకున్న చర్యలు, కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించే ప్రతిపాదనలను ఆయన ఉదహరించారు. ⇒ ఈ ఏడాదికి 7 శాతంపైనే వృద్ధి అంచనాలను చూస్తే.. భారత్ ఎన్నడూ మందగమనాన్ని చవిచూడనట్లు లెక్క అని కూడా అసోచామ్ వ్యాఖ్యానించింది. ⇒ గతేడాది ఆర్థిక వ్యవస్థ ఎంత గడ్డుకాలాన్ని ఎదుర్కొందో పరిశ్రమవర్గాలు అందరికీ తెలిసిందే. అయినా, వృద్ధి రేటును 4.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంచడాన్ని(కొత్త బేస్ ఇయర్ ప్రకారం) కార్పొరేట్లు గుర్తు చేస్తున్నారు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
సూర్యప్రభ వాహనంపై గోవిందుడు
బడి బస్.. ఫిట్నెస్
పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు
కౌంటింగ్కు పటిష్టంగా భద్రత
No Headline
ఇంటర్ మ్యాథ్స్–బి, హిస్టరీ పరీక్షలు ప్రశాంతం
అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దు
తత్కాల్ ఫార్మ్స్పై నంబర్లు వేసి ఇవ్వాలి
రోడ్డు ప్రమాదంలో సిరికల్చర్ ఉద్యోగి మృతి
ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
తప్పక చదవండి
- ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
- జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?
- Kartikeya Gummakonda: ప్రేక్షకులు అప్పుడే హీరోలా చూస్తారు
- ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు
- ప్రాణాలు తీస్తున్న గజరాజులు
- లయ తప్పుతున్న గుండె
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
- Lok Sabha Election 2024: ఒడిశాలో రసవత్తర పోటీ
Advertisement