-
గణిత సూత్రాలతో మలేషియన్ విమాన వేట!
కాన్ బెర్రి: గత కొన్ని నెలల క్రితం ప్రమాదానికి గురై ఇప్పటి వరకూ ఆచూకీ తెలియని మలేషన్ విమానం కోసం ఆ దేశం చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే పలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విఫలమైన మలేషియా.. ఆ విమాన ఆచూకీ కోసం సరికొత్త మార్గంలో పయనించనుంది. 2011 లో ఫ్రాన్స్ కు చెందిన 447 విమాన ఆచూకీకి ఉపయోగించిన గణిత సూత్రాలనే మలేషియన్ విమాన మిస్టరీని ఛేదించేందుకు ఉపయోగించనుంది. అప్పట్లో అట్లాంటా మహా సముద్రంలో కూలిపోయిన విమాన శకలాలను గుర్తించిన ఇదే ఫార్ములా తప్పకుండా మరోసారి ఉపయోగపడుతుందని మెల్ బోర్న్ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ మైఖేల్ మెక్ కార్తీ అభిప్రాయపడుతున్నాడు. ఇదే ఫార్మాలతో ముందుకెళితే ఫలితం ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్న మలేషియా ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించింది. చివరకు శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి విమాన ఆచూకీ కనుగొనడంలో విఫలమైన మలేషియా..తాజా మ్యాథ్స్ ఫార్ములాతో ఖచ్చితంగా ఆచూకీ దొరుకుతుందని భావిస్తోంది. మార్చి 8వ తేదీ అదృశ్యమైన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 370 ఆచూకీ కోసం 25 దేశాలు తీవ్రంగా శ్రమించినా ఆచూకీ మాత్రం లభించలేదు. దాదాపు మూడు నెలల క్రితం కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో బీజింగ్ బయల్దేరిన మలేషియన్ విమానం అకస్మికంగా తప్పిపోయిన సంగతి తెలిసిందే. -
మలేషియా విమానం కోసం 25 దేశాల గాలింపు
న్యూఢిల్లీ/కౌలాలంపూర్(పిటిఐ/ఐఎన్ఎస్): ఈ నెల 8వ తేదీ శనివారం అదృశ్యమైన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్370 ఆచూకీ కోసం 25 దేశాలు వెతుకుతున్నాయి. ఈ దేశాలతోపాటు మన దేశానికి చెందిన నావికా దళం, ఎయిర్ ఫోర్స్ కూడా గాలిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. విమానం తప్పిపోయిన ఘటనకు సంబంధించి మలేషియన్ ప్రభుత్వం పైలట్, కోపైలట్లపై దృష్టిపెట్టింది. ఈ ఘటన వెనుక వారి పాత్ర ఏమైనా ఉందా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పైలెట్, కో పైలెట్ ఇద్దరి ఇళ్లలో సోదాలు చేశారు. గ్రౌండ్ సిబ్బందిపైన కూడా విచారణ చేస్తున్నారు. ప్రయాణికుల పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. కౌలాలంపూర్ నుంచి శుక్రవారం అర్థరాత్రి ఈ విమానం 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. మార్గ మధ్యంలో శనివారం ఈ విమానం ఆకస్మాత్తుగా అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు దేశాలకు చెందిన వైమానిక, నావికా దళాలు ఎన్నో రకాలుగా ఈ విమానం కోసం గాలిస్తూనే ఉన్నారు. తప్పిపోయిన విమానం కోసం మన దేశానికి చెంది అయిదు యుద్ధ విమానాలు, ఆరు నిఘా విమానాలు గాలించాయి. అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో దాదాపు 2.5 లక్షల కిలోమీటర్ల ప్రాంతంలో గాలించారు. ప్రస్తుతం గాలింపు చర్యలు ఆపామని, మలేషియా నుంచి వచ్చే తాజా సూచనల కోసం వేచిఉన్నట్లు అండమాన్ నికోబార్ కమాండ్ ప్రతినిధి కల్నల్ హర్మిత్ సింగ్ చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement