-
రష్యా క్షిపణే ఆ విమానాన్ని కూల్చేసింది!
పుతిన్ బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందే మలేషియా విమానం ఎంహెచ్-17 కూల్చివేత వ్యవహారంలో రష్యా ప్రభుత్వం, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఓ ఆస్ట్రేలియా న్యాయసేవల సంస్థ కోర్టుకు ఈడ్చింది. ఈ ప్రమాదంలో బాధితుల కుటుంబాలకు రష్యా, పుతిన్ పరిహారం చెల్లించాలంటూ మానవహక్కుల యూరోపియన్ కోర్టులో దావా వేసింది. 2014, జూలై 17న దక్షిణాఫ్రికాలోని అమ్స్టర్డాం నుంచి కౌలాలంపుర్ వెళుతున్న విమానాన్ని ఉక్రెయిన్లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 298 మంది చనిపోయారు. ఇందులో 28మంది ఆస్ట్రేలియన్లు. ఈ విమానాన్ని కూల్చేసిన భూ-గగనతల క్షిపణి రష్యాలో తయారయినదని డచ్ సెఫ్టీ బోర్డు తన దర్యాప్తు నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాకు చెందిన బాధిత కుటుంబాల తరఫున సిడ్నీకి చెందిన ఎల్హెచ్డీ లాయర్స్ సంస్థ యూరోపియన్ కోర్టులో దావా వేసింది. చనిపోయిన ప్రతి బాధితుడి కుటుంబానికి రూ. 67.42 కోట్ల పరిహారం చొప్పున రష్యా చెల్లించాలని డిమాండ్ చేసింది. -
క్షిపణితో విమానాన్ని కూల్చేశారు..
కౌలాలంపూర్: గతేడాది ఉక్రెయిన్లో కూలిన మలేసియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 17 ప్రమాదం వెనుక నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగు చూశాయి. రష్యాలో తయారైన క్షిపణితో దాడి చేయడం వల్ల ఈ విమానం కూలిపోయిందని నెదర్లాండ్స్ సేఫ్టీ బోర్డు తన నివేదికలో వెల్లడించింది. 9ఎమ్38 క్షిపణి.. మలేసియా విమానం ముందు భాగాన్ని కొట్టడంతో విమానం పేలిపోయిందని తుది నివేదికలో పేర్కొంది. రష్యా ప్రభుత్వం మద్దతిస్తున్న తిరుగుబాటు దారులు ఈ విమానాన్ని కూల్చివేశారని ఉక్రెయిన్ ఆరోపిస్తుండగా.. ఉక్రెయిన్ నియంత్రణలో ప్రాంతంలో నుంచి క్షిపణిని ప్రయోగించారని రష్యా చెబుతోంది. కాగా క్షిపణితో విమానంపైకి దాడి చేసింది ఎవరన్న విషయాన్ని డచ్ సేఫ్టీ బోర్డు నివేదికలో పేర్కొనలేదు. ఉక్రెయిన్లో ప్రభుత్వ దళాలకు, రష్యా అనుకూల తిరుగుబాటు దారులకు మధ్య పోరు జరుగుతోంది. గతేడాది జూలైలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో 298 మంది మరణించారు. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్కు వెళ్తుండగా తూర్పు ఉక్రెయిన్లో కూలిపోయింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement