-
వెయ్యి మందికి 881 మంది ఆడ శిశువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మగ, ఆడ శిశువుల నిష్పత్తి జాతీయ సగటు కంటే కాస్తంత మెరుగ్గా ఉంది. పుట్టుక సందర్భంగా జరిగే రిజిస్ట్రేషన్ల ఆధారంగా లింగ నిష్పత్తిని 2016లో లెక్కగట్టిన కేంద్రం ఆ లెక్కలను తాజాగా విడుదల చేసింది. పుడుతున్న వారిలో జాతీ య సగటులో 1,000 మంది మగ శిశువులు ఉంటే, 877 మంది ఆడ శిశువులు ఉన్నారు. తెలంగాణలో మాత్రం ఆడ శిశువులు 881 మంది పుట్టారని కేంద్రం తన నివేదికలో తెలిపింది. ఈ విషయంలో ఏపీ చివరన ఉంది. ఏపీలో 1,000 మంది మగ శిశువులకు 806 మంది, రాజస్తాన్లోనూ 806 మంది ఆడ శిశువులే ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీ, రాజస్తాన్లు లింగ నిష్పత్తిలో భారీ తేడాతో చివరిస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో హెచ్చుతగ్గులు కనిపించాయి. 2015లో జాతీయ సగటు 1,000 మంది మగ శిశువులకు 881 మంది ఆడ శిశువులు పుట్టగా, తెలంగాణలో 834 మంది మాత్రమే. 2016లో తెలంగాణలో 881కు చేరింది. ఏపీలో ఈ సగటు దారుణంగా పడిపోయింది. 2015లో 1,000 మంది మగ శిశువులకు 971 మంది ఆడ శిశువులు పుడితే ఇప్పుడు 806కు పడిపోయింది. తమిళనాడు జాతీయ సగటు కంటే దారుణంగా ఉంది. కరీంనగర్ జిల్లాలో 713 మందే.. కరీంనగర్ జిల్లాలో 2014లో 1,000 మంది మగ శిశువులకు ఏకంగా 1080 ఆడ శిశువులు ఉన్నారు. 2015లో 959 మంది ఆడ శిశువులు పుడితే, 2016లో అదికాస్తా దారుణంగా 713 మందికి పడిపోయింది. నల్లగొండ జిల్లాలో 2014లో 1,000 మంది మగ శిశువులకు 1060 మంది ఆడ శిశువులు పుడితే, 2015లో 959 మంది ఉండగా, 2016లో దారుణంగా 773కు పడిపోయింది. హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మాత్రం ఇతర జిల్లాల కంటే మెరుగైన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కడుపులో ఆడ పిల్ల ఉన్నట్లు గుర్తించి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా ప్రైవేటు ఆస్పత్రులు అనైతిక చర్యలకు పాల్పడుతుండటంతో అబార్షన్లు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు లింగ నిష్పత్తిలో భారీ తేడా లేకుండా చేశాయంటున్నారు. గతంలో ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు అధికంగా జరిగేవి. తర్వాత ప్రభుత్వం సర్కారు దవాఖానాల్లో ప్రత్యేక వసతులు కల్పించింది. దీంతో 2015–16లోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం 30 నుంచి 41 శాతానికి చేరుకున్నాయని చెబుతున్నారు. దీనివల్ల 2016 తర్వాత పరిస్థితి మెరుగుపడిందని చెబుతున్నారు. పథకాలతో మార్పు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాల వల్ల ఆడ శిశువును కోల్పోవడానికి ఎవరూ సిద్ధపడటం లేదు. కల్యాణలక్ష్మి ద్వారా ఆడ బిడ్డ పుడితే పెళ్లి ఖర్చు కోసం రూ.లక్ష నూటా పదహార్లు ఇస్తున్నారు. ఇది ఆడ పిల్లల తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యం నింపింది. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకం కింద మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడ పిల్ల పుడితే రూ.13 వేలు ప్రోత్సాహకం ఇస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. జనన ధ్రువీకరణ సులభతరం మున్సిపాలిటీలు, గ్రామాల్లో జనన ధ్రువీకరణ ఇప్పటికీ ఒక ప్రహసనంగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాన్ని నమోదు చేసుకోవడం, పొందడం గగనంగా మారింది. ఇప్పు డు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పొందే వీలు కల్పించినా అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్న చర్చ జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో పుట్టిన పిల్లల నమోదు పూర్తిస్థాయిలో ఉండటం లేదన్న విమర్శలున్నాయి. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులే సంబంధిత వెబ్సైట్ లో వివరాలను నమోదు చేయడం ద్వారా జనన ధ్రువీకరణ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ‘వెబ్సైట్లోకి వెళ్లి శిశువు వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత దాన్ని ప్రింట్గా తీసుకుని ధ్రువీకరణ పత్రంగా వాడుకోవచ్చు. అయితే ఒక శిశువు పేరుతో మరొకటి తీసుకోవడానికి వెబ్సైట్ అంగీకరించదు’అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. -
అప్పుడే పుట్టిన శిశువు నడిరోడ్డుపై...
విశాఖపట్నం క్రైమ్: మానవత్వం కొంచమైనా లేని కొందరు అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలి వెళ్లగా... నిర్జీవ స్థితిలో, వాహనాలు తొక్కేసిన స్థితిలో ఆ పసికందును స్థానికులు గుర్తించారు. విశాఖ నగరంలోని ముడసర్లోవ రిజర్వాయర్ సమీపంలో బీఆర్టీఎస్ రోడ్డుపై మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో మృత శిశువు ఉన్నట్టు అరిలోవ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెళ్లి చూడగా ఆ శిశువు చనిపోయి ఉంది. వాహనాలు మీద నుంచి వెళ్లిపోవడంతో చిధ్రమై ఉంది. శిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అక్కడే పూడ్చిపెట్టారు. కాగా, ఈ పసికందును కారులో నుంచి బయటకు విసిరేసి వెళ్లినట్టు స్థానికంగా ప్రచారం జరిగింది.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement