-
హామీలు నెరవేరలేదు..
♦ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్ ♦ లెక్టరేట్ ఎదుట సీపీఐ జైల్భరో ♦ నాయకుల అరెస్టు.. విడుదల ఆదిలాబాద్అర్బన్: అధికారంలోకి రాకముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ నెరవేరలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్ల దేశంలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతోందని విమర్శించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో జైల్భరో నిర్వహించారు. ముందుగా పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి పలు చౌక్ల గుండా ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గుండా మల్లేష్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో వ్యవసాయ సంక్షోభం నివారణకు రూ.లక్ష కోట్ల నిధితో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో 70 నుంచి 80 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని, అందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని రైతులు మొరపెట్టుకుంటే లాఠీచార్జీలు, బేడీలు వేయిస్తున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వం గోరక్షణ పేరుతో దౌర్జాన్యాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి భూములు లాక్కోవద్దని, వారికి పట్టాలు ఇచ్చి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్, జయతీఘోష్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, వ్యవసాయ సంబంధ వస్తువులు, విత్తనాలు, ఎరువులను జీఎస్టీ నుంచి మినహాయించాలని అన్నారు. 2013 భూసేకరణ, నిర్వాసితుల చట్టాన్ని అమలు చేసి నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని పేర్కొన్నారు . రైతులను రుణవిముక్తులను చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసరాలను పంపిణీ చేయాలని, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లోని సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పశువధ నిషేధ చట్టాన్ని రద్దు చేయాలని అన్నారు. కాగా, కలెక్టరేట్ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.విలాస్, నాయకులు ముడుపు నళినిరెడ్డి, ప్రభాకర్రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
సర్వేతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు..
తాండూర్ : ఒక రోజు సర్వే నిర్వహించడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ విమర్శించారు. ఈ సర్వే వల్ల నిర్దిష్టమైన ప్రణాళిక తయారు కాబోదని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మాదారం ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విధివిధానాలు ప్రకటించకుండా హామీలు ఎలా అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని అన్నారు. ప్రభుత్వ భూమిని అమ్మి రుణ మాఫీలు చేస్తే పేదలకు భూమి ఎలా పంచుతారని అన్నారు. అవినీతిని నిర్మూలిస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర సాగుతోందని, అటవీ హక్కుల చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని అన్నారు. బహిరంగ సభకు భారీగా తరలిరండి ఈ నెల 11న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే చండ్ర రాజేశ్వర్రావు శతజయంతి బహిరంగ సభకు ప్రజలు పెద్దయెత్తున తరలి రావాలని గుండా మల్లేశ్ కోరారు. పది వేల మంది జన సేవాదళ్ కార్యకర్తలతో కవాతు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కళవేణి శంకర్, మండల కార్యదర్శి మామిడాల రాజేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పులుగం వెంకటేశ్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్షణాలిలా..
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement