తాండూర్ : ఒక రోజు సర్వే నిర్వహించడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ విమర్శించారు. ఈ సర్వే వల్ల నిర్దిష్టమైన ప్రణాళిక తయారు కాబోదని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మాదారం ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విధివిధానాలు ప్రకటించకుండా హామీలు ఎలా అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని అన్నారు. ప్రభుత్వ భూమిని అమ్మి రుణ మాఫీలు చేస్తే పేదలకు భూమి ఎలా పంచుతారని అన్నారు. అవినీతిని నిర్మూలిస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర సాగుతోందని, అటవీ హక్కుల చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని అన్నారు.
బహిరంగ సభకు భారీగా తరలిరండి
ఈ నెల 11న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే చండ్ర రాజేశ్వర్రావు శతజయంతి బహిరంగ సభకు ప్రజలు పెద్దయెత్తున తరలి రావాలని గుండా మల్లేశ్ కోరారు. పది వేల మంది జన సేవాదళ్ కార్యకర్తలతో కవాతు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కళవేణి శంకర్, మండల కార్యదర్శి మామిడాల రాజేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పులుగం వెంకటేశ్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి తదితరులు పాల్గొన్నారు.
సర్వేతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు..
Published Wed, Aug 6 2014 12:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement