-
అన్నార్తుల ఆకలి తీర్చడమే ‘మావన సేవా’ సంకల్పం...
సనత్నగర్(హైదరాబాద్): మానవ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతియేటా వేసవికాలం వచ్చిందంటే ఈ సంస్థ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు బాటసారుల ఆకలి తీరుస్తుంటారు. అయితే గత రెండు పర్యాయాలుగా కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా లాక్డౌన్ వేళ.. ప్రతిరోజూ అభాగ్యులకు, నిరుపేదలకు ఆహారం అందించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రతియేటా ఈ సేవా యజ్ఞానికి వేదికగా నిలిచే మోడల్కాలనీ కమాన్ వద్దనే ఆహారాన్ని తీసుకువచ్చి వడ్డించే వారు. అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ పరిస్థితుల్లో ఆహారాన్ని ప్యాకింగ్ చేయించి భౌతిక దూరం పాటింపజేస్తూ వాటిని అందజేస్తున్నారు. కాలనీ కమాన్ వద్ద మిత ఆహార సేవా వితరణ కేంద్రం వద్ద పంపిణీతో పాటు యూసుఫ్గూడ, కృష్ణానగర్, సనత్నగర్ స్వామి టాకీస్ ప్రాంతాల్లోని రోజువారీ కూలీలకు సైతం ఆహారాన్ని అందిస్తూ లాక్డౌన్లో వారి ఆకలిని తీరుస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి దాతలు తమ సహకారం అందిస్తూ మానవత్వానికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు. ఈ సేవల ద్వారా లాక్డౌన్ సమయంలో వందలాది మంది అన్నార్తుల ఆకలి దప్పికలను తీరుస్తున్నారు. రోజువారీ మెనూగా ఒకరోజు వెజ్ బిర్యానీ, మరో రోజు పులిహోరా, ఇంకోరోజు టమాట రైస్.. ఇలా ఏదో ఒక రైస్కు తోడుగా మజ్జిగ ప్యాకెట్, అరటి పండు, మంచినీళ్ల ప్యాకెట్ అందిస్తున్నారు. రోజుకు 500 మందికి ఆకలి, దప్పికలను తీర్చే లక్ష్యంగా వంటకాలను తయారుచేస్తున్నారు. ఇది కాకుండా ప్రత్యేక సందర్భాల్లో దాతలు ఇచ్చే డొనేషన్ ఆధారంగా మరింత మంది ఆకలి తీరుస్తున్నారు. మానవత్వంతో దాతలు ముందుకు.. మానవ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన సేవా సంకల్పానికి దాతలు తాము సైతం ముందుకువచ్చారు. మోడల్ కాలనీ అధ్యక్షుడు సారిపల్లి కొండల్రావుతో పాటు చాలామంది దాతలు ముందుకువచ్చి తమ సేవానిరతిని చాటుతున్నారు. దాతలు తమ పేర్లపై అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు అయ్యే ఖర్చును ట్రస్ట్ నిర్వాహకులకు అందిస్తారు. కేంద్రం ప్రతినిధులు ప్రత్యేకంగా ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయించి దాతల పేర్లను నోటీసు బోర్డుపై రాస్తారు. కేవలం ఒక్క వేసవి, లాక్డౌన్ వేళలకే ట్రస్ట్ సేవలను పరిమితం చేయకుండా సందర్భాన్ని బట్టి ఏడాది పొడవునా కొనసాగిస్తున్నారు. ఎక్కువగా ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులతో పాటు వారి సంబం«దీకులు, సహాయకులకు కూడా అన్నదానం చేస్తుంటారు. దాతలు కేవలం వంటకాలకు అయ్యే ఖర్చును మాత్రం ఇస్తే... ట్రస్ట్ సభ్యులు ఆయా వంటకాలను తయారు చేయడమే కాకుండా వాటిని ప్యాకింగ్ చేయించి పంపిణీ చేస్తున్నారు. ట్రస్ట్ సభ్యులు డి.బాబుబుచ్చిబాబు, జేఎస్టీ శాయి, మాచారావు, రవీంద్రబాబు, శశికాంత్ పాటు మరికొంతమంది ఈ సేవలను కొనసాగిస్తున్నారు. దాతల స్పందన అపూర్వం ట్రస్ట్ తరుఫున చేపట్టే సేవా కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. తాము చేట్టిన యజ్ఞంలో తలోచేయి వేసి నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న’ అన్న సూక్తిని ప్రతిఒక్కరిలో రగిల్చి సేవా దృక్పథాన్ని అలవర్చడం శుభపరిణామం. ఇదే రీతిలో సేవలను విస్తృతం చేస్తాం. తమ సంకల్పానికి మద్దతుగా నిలుస్తోన్న దాతలకు కృతజ్ఞతలు. – జేఎస్టీ శాయి, ట్రస్ట్ సభ్యుడు నిరంతరాయంగా కొనసాగిస్తాం మానవ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ సేవలను దాతల సహకారంతో ఏడాది పొడవునా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే వారంలో 3 నుంచి 4 రోజులు మానసిక చికిత్సాలయంలోని రోగుల సహాయకులు, వారి సంబందీకులకు అన్నదానం చేస్తున్నాం. ప్రస్తుతం లాక్డౌన్ ఉన్న దృష్ట్యా వలస కూలీలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో యూసుఫ్గూడ, కృష్ణానగర్ ప్రాంతంలో ప్రతిరోజూ ఆహార ప్యాకెట్లను అందిస్తున్నాం. దీంతో పాటు మోడల్కాలనీ కమాన్ వద్ద ఆహార పంపిణీ కేంద్రం వద్ద కూడా ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. – బుబ్చిబాబు, ట్రస్ట్ సభ్యుడు -
తేజ్రాజ్ సోలంకి మానవ సేవా అవార్డు
విజయవాడ(మధురానగర్) : రాజస్థాన్లో పుట్టి విజయవాడలో విశేష సేవలందిస్తున్న తేజ్రాజ్ సోలంకీ అభినందనీయులని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన 113 నెలలుగా వయోవృద్ధులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయటం గొప్ప విషయమన్నారు. అల్లూరి సీతారామరాజు వంతెన సమీపంలోని విజయ నర్సింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తేజ్రాజ్ సోలంకీకి ‘మానవ సేవ–2016’ అవార్డును ప్రదానం చేసి సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎక్కడ సేవా కార్యక్రమం జరిగినా తేజ్రాజ్ సోలంకీ పాత్ర తప్పక ఉంటుందన్నారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ చల్లా హరికుమార్తో కలిసి తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ వక్కలగడ్డ భాస్కరరావు, ఎన్బీఎల్ జైన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ఎం.సురేష్ తాతీయ, శ్రీనీలిమా నర్సింగ్ హోం వైద్యుడు డాక్టర్ బి.హనుమయ్య, లయన్స్ జిల్లా గవర్నర్ ముల్పూరి ఉపేంద్ర ప్రసంగించారు. అనంతరం పుష్కరాల్లో వీల్ చైర్లు అందజేసిన దాతలను సన్మానించారు. వృద్ధులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వయోవృద్ధ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, మేనేజింగ్ ట్రస్టీ తట్టి అర్జునరావు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి
సమయం లేదు మిత్రమా...
పారిశ్రామిక కారిడార్ నెలకొల్పాలి
భద్రగిరికి న్యాయం చేయాలి
అకాల వర్షానికి అరటి తోటలు నేలమట్టం
కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవం
పాఠశాలలు తెరిచే నాటికి పనుల పూర్తి
అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
కేటీపీఎస్ గేమ్స్ సెక్రటరీగా టి.మహేశ్
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement