-
ఘోరం: కారులోనే ముగ్గురు సజీవదహనం
మండ్య: రోడ్డు పక్కనున్న రాయిని ఢీకొని ఓ కారు బోల్తా పడి మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం కాగా, ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలోని మళవళ్లి తాలూకా హలగూరులో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన కేజీ హళ్లి నివాసి షేక్ కైజల్ (45) కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. భార్య మెహక్(33), కుమార్తెలు షేక్ ఐహిల్ (6) మెహైరా (11), సుహాన (12)తో కలిసి ఓ పని నిమిత్తం జిల్లాలోని కొళ్లెగాల హనూరు వచ్చారు. శుక్రవారం ఉదయం బెంగళూరు బయల్దేరారు. హలగూరు భారతీయ పెట్రోల్ బంక్ వద్ద కారు నియంత్రణ తప్పి రోడ్డు పక్కన సేఫ్టీ స్టోన్ను ఢీ కొట్టి పక్కనే ఉన్న గుంటలో బోల్తా పడింది. కారు నుంచి మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. షేక్ కైజల్, సుహాన, షేక్ ఐహిల్ మృత్యువాత పడ్డారు. తీవ్ర గాయాలైన మిగతా ఇద్దరిని బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై హలగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్హోల్ -
అమర జవాన్ భార్యకు వేధింపులు
బెంగళూరు: దేశం కోసం అమరుడైన సీఆర్పీఎఫ్ జవాన్ భార్యకు రక్షణ లేకుండా పోయింది. భర్త చనిపోయి రెండు వారాలు కూడా గడవకముందే.. అత్తింటివారి నుంచి ఆ మహిళకు వేధింపులు మొదలయ్యాయి. ఈ వేధింపులు తాళలేక ఆమె పోలీసులను కూడా ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా ఉగ్రదాడిలో కర్ణాటక మండ్యాకు చెందిన జవాన్ హెచ్ గురు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ విషాదంతో ఆయన భార్య కళావతి(25) తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అమరుడైన భర్తకు కన్నీటి నివాళులర్పించారు. (సైన్యంలో చేరతా అమర జవాన్ భార్య) గురు అంత్యక్రియలు ముగిసిన కొద్ది రోజులకు అతని కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. అమర జవాన్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి. అంతేకాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందజేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈ మొత్తాన్ని కళావతికి చెందకుండా తామే దక్కించుకోవాలని భావించిన గురు కుటుంబ సభ్యులు.. అందుకోసం పథకం రచించారు. గురు చిన్న సోదరుడుకి, కళావతికి పెళ్లి చేస్తే వచ్చిన పరిహారం అంత తమకే చెందుతుందని భావించారు. ఈ మేరకు మరిదిని పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తీసుకోచ్చారు. ఈ వేధింపులు శ్రుతి మించడంతో.. ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె బుధవారం మండ్యా పోలీసులను ఆశ్రయించారు. (అమర జవాన్ కుటుంబానికి సుమలత సాయం) దీనిపై ఓపికతో ఉండాలని ఆమెకు సూచించిన పోలీసులు.... ఈ ఘటనపై ఎటువంటి విచారణ చేపట్టలేదని, కేసు కూడా నమోదు చేయలేదని తెలిపారు. అయితే కళావతి అత్తింటివారిని పోలీసులు హెచ్చరించారు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుందని హితవు పలికారు. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఇది కుటుంబ సమస్య అని, సున్నితమైన అంశమని పేర్కొన్నారు. మరోవైపు బుధవారం మండ్యాలో పర్యటించిన సీఎం కుమారస్వామి కళావతికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
మిత్రుడిని చంపి.. తలతో పోలీస్ స్టేషన్కు
మండ్య: కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలో ఇటీవల ప్రియురాలిని నరికివేసి ఆమె తలతో పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఉన్మాద ప్రియుడి దురంతం మరువక ముందే అలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. తన తల్లిని అసభ్యంగా తిట్టాడనే కసితో ఓ వ్యక్తి తన మిత్రుడిని నరికి.. మృతుని తల తీసుకుని పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఘటన మండ్య జిల్లాలోని చిక్కబాగిలులో జరిగింది. నిందితుడు పశుపతి (28), హతుడు గిరీశ్ (38) చిన్ననాటి నుంచి స్నేహితులు. కొద్దిరోజుల కిందట గిరీశ్.. ఒక విషయంలో పశుపతి తల్లిని తిట్టాడు. అప్పటినుంచి మనసులో పగ పెంచుకున్న పశుపతి శనివారం ఉదయం మాట్లాడాలని గిరీశ్ను ఊరిబయటకు తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి చంపాడు. గిరిశ్ తలతో నిబ్బరంగా 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మళవళ్లి పీఎస్కు బైక్పై వచ్చి పశుపతి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
'ఆ సమస్య ఇంకొకరితో చెప్పుకునేది కాదు'
జూబ్లీహిల్స్: 'అత్యవసరమైన' నిత్యావసరాలు తీర్చుకునేందుకు ఇంటిలో 'మరుగు' సదుపాయం లేకుంటే మహిళలు పడే బాధ అంతా ఇంతా కాదు. ఇది ఇంకొకరితో చెప్పుకునేది కాదు. ఇక పల్లెల్లోనైతే మరీ దుర్భరం. కేంద్ర ప్రభుత్వమే స్పందించి మరుగుదొడ్లు ఏర్పాటుకు నడుం బిగించిందంటే దేశంలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసుకోవచ్చు. గ్రామాల్లో మహిళలు పడే 'మరుగు' కష్టాలను సాటి మహిళగా గుర్తించారు మన తెలుగు తేజం రోహిణి సింధూరి. ప్రభుత్వ ఉన్నతాధికారిగా కర్తవ్య దీక్షకు పూనుకున్నారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ భారత్ అభియాన్' పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలో మూడో స్థానం సాధించారు. ఐఏఎస్ అధికారిగా భ్రూణ హత్యలపై ప్రజలను చైతన్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న భర్త సుధీర్రెడ్డితో కలిసి ఇటీవల హైదరాబాద్ వచ్చిన సింధూరి 'సాక్షి'తో ముచ్చటించారు. ఆ వివరాలు సింధూరి మాటల్లోనే.. ఇదీ నేపథ్యం.. మా తల్లిదండ్రులు జైపాల్రెడ్డి, శ్రీలక్ష్మి. మాది ఖమ్మం జిల్లాలోని రుద్రాక్షపల్లి గ్రామం. నేను, చెల్లి, తమ్ముడు అక్కడే పుట్టాం. ప్రాథమిక విద్యాభ్యాసం కూడా అక్కడే సాగింది. నాన్నకు న్యాయవాదిగా ప్రాక్టీస్ పెరగడంతో హైదరాబాద్ వచ్చేశాము. నగరంలోనే ఇంటర్, ఇంజినీరింగ్ పూర్తి చేశా. స్నేహితులను చూసి సివిల్స్ రాశా. మెదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాను. కర్ణాటక క్యాడర్కు ఎంపికై ఐదేళ్లుగా అక్కడే పనిచేస్తున్నా. ప్రస్తుతం మాండ్య జిల్లా పరిషత్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నా. మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి.. జిల్లా పరిషత్ సీఈవోగా మాండ్య జిల్లా సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేశాను. కావేరి నదీ తీరంలోని ఈ జిల్లాలో దాదాపు 4 లక్షల ఇళ్లున్నాయి. అభివృద్ధి చెందిన జిల్లా అయినప్పటికీ పల్లెల్లో మహిళల భద్రత దారుణంగా ఉంది. బహిర్భూమికి వెళ్లిన ఆరవ తరగతి విద్యార్థిని అత్యాచారానికి గురికావడం నన్ను కలచివేసింది. దీనికి ఇంటి ఆవరణలో మరుగుదొడ్లు లేకపోవడమే కారణంగా గుర్తించాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పెద్దసంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నా. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 90 వేల మరుగుదొడ్ల నిర్మించాం. భవిష్యత్తులో 1.4 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పనిచేస్తున్నా. దేశంలోనే రికార్డ్... మరుగుదొడ్ల నిర్మాణంలో పశ్చిమ బెంగాల్లోని నాడియా, రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండగా, కర్ణాటకలోని మాండ్య జిల్లాను మూడవ స్థానంలో నిలిపా. నా కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో ఢిల్లీలో 'ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ' పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి నన్ను రిసోర్స్ పర్సన్గా ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా వచ్చిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సీఈవోలకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వడం మరిచిపోలేను. మాండ్య జిల్లాలో భ్రూణ హత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా. ఇందులో భాగంగా లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్లపై ఉక్కుపాదం మోపాము. ఇప్పటివరకు దాదాపు 40 క్లినిక్లు, డయాగ్నస్టిక్స్ సెంటర్లను మూసివేసి, నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా అంటూ ముగించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పుతిన్ ఐదోసారి ప్రమాణం
బంగ్లాదేశ్దే టి20 సిరీస్
శిక్షణలోనే సందేహాలు నివృత్తి చేసుకోవాలి
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
ఎస్సీ వర్గీకరణ మోదీకే సాధ్యం
మీ బిడ్డను ఎంపీగా ఆదరించండి
అభివృద్ధిని అడ్డుకునే బీజేపీని ఓడించండి
ఇంటర్ ఫెయిల్ అయ్యామని..
‘దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ’
వాహన తనిఖీలు ముమ్మరం
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement