-
వివాహేతర సంబంధం కారణంగా మహిళపై యాసిడ్ దాడి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో వితంతు మహిళపై ఓ ఆటోడ్రైవర్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలుడు, యువతి సహా ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకోగా.. కొద్దిగంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపిన వివరాల ప్రకారం.. ఐతవరం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఆమెకు ఓ కుమారుడున్నాడు. భర్త మరణించడంతో ఆ మహిళ ఐతవరం వచ్చేసి తల్లిదండ్రుల వద్ద ఆశ్రయం పొందుతోంది. సుమారు 8 నెలల క్రితం నెల్లూరుకు చెందిన రాణింగారం మణిసింగ్ (32)తో ఆ మహిళకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. నెల్లూరులోనే ఆటో నడుపుతూ జీవనం సాగించే మణిసింగ్కు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఆ మహిళ ఐతవరంలోనే వేరే ఇంటికి మారింది. ఆమె వద్దకు మణిసింగ్ తరుచూ వస్తుండేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోగా.. మణిసింగ్కు క్షయ వ్యాధి సోకినట్టు తెలుసుకున్న సదరు మహిళ అతన్ని దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న మణిసింగ్ ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. నెల్లూరు నుంచే యాసిడ్ తెచ్చుకుని.. ఈ నెల 8వ తేదీ శనివారం నెల్లూరులో 100 మిల్లీలీటర్ల యాసిడ్ బాటిల్ కొనుగోలు చేసిన మణిసింగ్ మహిళ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఆ ఇంట్లో ఆమె కుమారుడితో పాటు ఆమె సోదరి కుమార్తె ఉన్నారు. వారితో కలిసి మణిసింగ్ భోజనం చేసి అక్కడే నిద్రించాడు. ఆదివారం వేకువజామున 4 గంటలకు అందరూ నిద్రమత్తులో ఉండగా మణిసింగ్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్ను మహిళ ముఖంపై పోసి పరారయ్యాడు. ఈ ఘటనతో మహిళ శరీరం 20 శాతం గాయపడగా, ఆమె కుమారుడుకి, ఆమె సోదరి కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో చుట్టుపక్కల వారు లేచి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నందిగామ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నందిగామ శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న మణిసింగ్ను ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేశారు. అతడిపై నాన్బెయిలబుల్ కేసులు కట్టారు. బాధితులకు అండగా ప్రభుత్వం యాసిడ్ దాడిలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జగన్మోహనరావు బాధితుల్ని పరామర్శించారు. -
డైరెక్టరుగా సైన్ చేసి హీరోగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే...
-
30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం.. మిన్ను మణి విజయగాథ ఇదే!
‘మా అమ్మా నాన్నలు ఇకపై నన్ను టీవీలో చూస్తారు’అని సంతోష పడింది మిన్ను మణి. దేశీయంగా ఆమె ఆడిన క్రికెట్ మేచ్లుటీవీలో టెలికాస్ట్ కాలేదు. ‘విమెన్స్ ప్రీమియర్ లీగ్’ కోసం 30 లక్షలకు మిన్ను మణిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతంచేసుకున్నాక ఆమె ఆట తప్పక టెలికాస్ట్ కానుంది. రోజుకు నాలుగు బస్సులు మారి 52 కిలోమీటర్ల దూరంలోని క్రికెట్ స్టేడియంకు వెళ్లిప్రాక్టీస్ చేసిన మణి కేరళలో ఈస్థాయికి ఎదిగిన తొలి గిరిజన మహిళా క్రికెటర్. మహిళా క్రికెట్ ఇప్పుడు విజయ పరంపరలో ఉంది. నిర్లక్ష్య వర్గాల నుంచి కూడా ఈ ఆటకు చేరొచ్చు అని చెబుతున్న మిన్ను మణిది కూడా ఒక విజయగాధ. ‘ముప్పై లక్షల రూపాయలు. నా జీవితంలో చూస్తానని అనుకోలేదు. మొదట నేనొక స్కూటీ కొనుక్కోవాలి. బస్సుల్లో తిరుగుతూప్రాక్టీసుకు ఇకపై వెళ్లను. ఆ తర్వాతే ఆ డబ్బుతో ఏం చేయాలో ఆలోచిస్తాను’ అంది మిన్ను మణి. ఫిబ్రవరి 13న ముంబైలో ‘విమెన్స్ ప్రీమియర్ లీగ్’ కోసం మహిళా క్రికెటర్ల వేలం జరుగుతున్నప్పుడు మిన్ను మణి హైదరాబాద్లో సౌత్ జోన్ తరపున ఇంటర్ జోన్ టోర్నమెంట్ ఆడుతోంది. ఆ రోజున 91 బాల్స్కు 74 కొట్టి నాటౌట్గా నిలిచింది. ఆట ఒకవైపు సాగుతూ ఉన్నా మనసంతా ముంబై ఆక్షన్ మీదే ఉంది. ‘పెద్ద పెద్ద మహిళా క్రికెటర్లకు కూడా వేలంలో ధర పలకకపోతుండే సరికి నిరాశ కలిగింది. నా బేస్ ప్రైస్ 10 లక్షలు పెట్టారు. ఎవరూ తీసుకోరేమో అనుకున్నాను. కానీ ఢిల్లీ, బెంగళూరు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 30 లక్షలకు ఢిల్లీ కేపిటల్స్ నన్ను సొంతం చేసుకుంది. అప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేను’ అంది మిన్ను మణి. ‘ఆ విషయం ఫోన్లో చెప్తే మా అమ్మా నాన్నలు డబ్బు గురించి కాక నా ఆట గురించి అడిగారు. టీవీలో వస్తుందా అన్నారు. వస్తుంది అని చె΄్పాను’ అంది సంతోషంగా. కరూచియ 23 ఏళ్ల మిన్ను మణిది కేరళలోని వయనాడ్ జిల్లాలోని గిరిజన గూడెం. ఇది బ్రహ్మగిరి కొండల అంచున ఉంటుంది. మణిది ‘కరూచియ’ గిరిజన తెగ. వీళ్లు తమను తాము కొండ బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు. తమ ఆచారాలు స్ట్రిక్ట్గా పాటిస్తారు. గురి చూసి బాణం వేయడంలో మేటిగా పేరు గడించారు. కాని ఇప్పుడు వారంతా చిన్న చిన్న పనులు చేసుకు బతుకుతున్నారు. మిన్ను మణి తండ్రి మణి రోజు కూలి. తల్లి వసంత గృహిణి. చిన్నప్పటి నుంచి మిన్ను మగపిల్లలతో కలిసి పొలాల్లో టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడేది. ఎలిమెంటరీ స్కూల్లో రన్నర్గా ప్రతిభ చూపేది. 8 వ తరగతిలో హైస్కూల్లో చేరాక ఆమె ప్రతిభను ఆ స్కూల్లో ఎల్సమ్మ బేబీ అనే పీయీటీ టీచరు గుర్తించింది. ‘మిన్ను రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. రైట్ హ్యాండ్ బ్యాట్స్ఉమన్. బౌలింగ్లో బ్యాటింగ్లో ఆ అమ్మాయి టాలెంట్ చూసి చాలా దూరం వెళుతుందని అనుకున్నాను’ అంటుంది ఆ పీయీటీ టీచర్. ఆ పీయీటీ టీచరే పూనుకుని తిరువనంతపురంలోని కేరళ క్రికెట్ అసొసియేషన్ దగ్గరకు తీసుకువెళితే వారు పరీక్షించి ట్రయినింగ్ ఇచ్చారు. దాంతో మిన్ను మణి ముందు వయనాడ్ జిల్లా జట్టుతో అటు పిమ్మట అండర్ 16 జట్టుతో ఆ తర్వాత కేరళ రాష్ట్ర మహిళా జట్టుతో ఆడటం మొదలుపెట్టింది. కష్టే ఫలి అయితే మిన్ను మణి క్రికెట్ ఆడటానికి మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ‘కేరళలో అమ్మాయిలు అథ్లెట్లుగా రాణిస్తారు. నన్ను కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా చూడాలని మా అమ్మానాన్నలు అనుకున్నారు. క్రికెట్ మగవాళ్ల ఆట అని వారి అభి్రపాయం. కాని మా పీయీటీ టీచరు వారిని ఒప్పించి నన్ను క్రికెట్లోకి తీసుకెళ్లింది. నేను క్రికెట్ బాగా ఆడుతున్నానని తెలిశాక వారు మనస్ఫూర్తిగా ్రపోత్సహించసాగారు’ అంది మిన్ను. కానీ క్రికెట్లాంటి ఖరీదైన ఆటకు కావలసిన మంచి కిట్ కూడా మిన్ను దగ్గర లేదు. వాళ్ల నాన్న అప్పులు చేసి మిన్ను ఆట కొనసాగేలా చూశాడు. మిన్నుప్రాక్టీసు చేయాలంటే వారి గూడేనికి 52 కిలోమీటర్ల దూరంలోని కృష్ణగిరి క్రికెట్ స్టేడియమే గతి. అంత దూరం వెళ్లడానికి మిన్ను తెల్లవారు జామునే లేచి ఇంటి పనుల్లో తల్లికి సాయం చేసి నాలుగు బస్సులు మారి స్టేడియంకు చేరుకునేది. తిరిగి ఇల్లు చేరే సరికి సాయంత్రం 7 అయ్యేది. ‘అలిసిపోయేదాన్ని. కాని పట్టుదలగా ఆట కొనసాగించాను’ అంటుంది మిన్ను. ఆటలో విజయాలు మిన్ను మణి కేరళ అండర్ 23లో ఆ తర్వాత భారత్ అండర్ 23 జట్టులో ప్రతిభ చూపింది. ఇండియా ఏ జట్టుకు ఎంపికై ఆడింది. విమెన్స్ ఆల్ ఇండియా ఒన్ డే టోర్నమెంట్లో 8 మేచ్లు ఆడి 246 పరుగులు చేసి 12 వికెట్లు తీసింది. దాంతో అందరి దృష్టి మిన్ను మీద పడింది. క్రికెట్ ఆడటం మొదలెట్టాక వచ్చిన కొద్ది పాటి డబ్బులో ప్రతి పైసా తన కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి ఉపయోగించింది. మిగిలిన డబ్బుతో చిన్న ఇల్లు కడితే 2018 వరదల్లో ఆ ఇల్లు దెబ్బతింది. క్రికెట్ అభిమానులు ఆదుకుని రిపేర్లు చేయించారు. ఇప్పుడు 30 లక్షల సంపాదన స్థాయికి మిన్ను చేరింది. ‘దీని కంటే జాతీయ జట్టులో స్థానంపొందడమే నాకు ఎక్కువ ఆనందం. అదే నా లక్ష్యం’ అంటోంది మిన్ను మణి. -
రిలయన్స్ చేతికి జస్ట్ డయల్!
ముంబై: దేశీయ ఆన్లైన్ కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్ఆర్వీఎల్) అడుగులు వేస్తుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ పై నియంత్రణ తీసుకున్నట్లు తెలిపింది. లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. ఇంతకు ముందు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్ట్డయల్ వ్యవస్థాపకుడు వీఎస్ఎస్ మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని ఆర్ఆర్వీఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపిన ఒక ప్రకటనలో.. ఆర్ఆర్వీఎల్, జస్ట్డయల్, వీఎస్ఎస్ మణి, ఇతరుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.1,022.25 రేటు చొప్పున ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఆర్ఆర్వీఎల్కు కేటాయించినట్లు తెలిపింది. అలాగే వీఎస్ఎస్ మణి నుంచి షేరు ఒక్కింటికి రూ.1,020 రేటు చొప్పున ఆర్ఆర్వీఎల్ 1.31 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. జస్ట్ డయల్ అనేది భారతదేశంలోని ప్రముఖ లోకల్ సెర్చి ఇంజిన్ ఫ్లాట్ ఫారం. ఇది టెలిఫోన్ మరియు టెక్ట్స్ ద్వారా వెబ్ సైట్లు, యాప్ లు వంటి బహుళ ఫ్లాట్ ఫారాల ద్వారా దేశవ్యాప్తంగా యూజర్లకు సెర్చ్ సంబంధిత సేవలను అందిస్తుంది.(చదవండి: వాట్సాప్కు ఐర్లాండ్ భారీ షాక్...!) -
గురి
సర్కస్ జనాలతో కిక్కిరిసిపోయింది. ఆ ఊళ్ళో అదే మొదటి ఆట.నింగిలో వేలాడే ఉయ్యాలల మీద నాజూకైన అమ్మాయిలు చేస్తున్న విన్యాసాలు, వారిని అనుకరించబోయి విఫలమై అంత ఎత్తునుంచీ కిందకి వలలో పడిపోతున్న మరగుజ్జు హాస్యగాళ్ళు, వారిని చూస్తూ కేరింతలు కొడుతున్న జనం. ఏమీ మారలేదు. జనాల కేరింతలు తనకి ఇప్పటికీ అదే ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఆ కేరింతలు విని ఎంతకాలం అయ్యిందో! జైల్లో, ఆ నాలుగు గోడల మధ్యన, కేవలం తన ఉఛ్వాసనిశ్వాసలే తప్ప ఈ సందడేది?పరదా పక్కకి జరిపి ఆ జనాలకేసి చూశాడు మణి, అలియాస్ తల్వార్ మణి. అప్పట్లో తన ప్రదర్శన చూడటానికి జనాలు ఎగబడేవాళ్ళు. కేవలం తనవల్లే ఆ సర్కస్ నడిచిందన్నా అతిశయోక్తి కాదేమో! కానీ మునుపటి ఓపిక ఇప్పుడు లేదు. చూపు కూడా మందగించింది. కేవలం చినబాబు అడిగాడనే కాదు, తనMీ ఈ సర్కస్తో విడదీయలేని అనుంబంధం ఉంది. తను రూబీని కలిసింది కూడా ఇక్కడే. ఒకటా రెండా పద్నాలుగు సంవత్సరాల అనుబంధం, మరో పద్నాలుగు సంవత్సరాల ఎడబాటు! తన బలమైన కోరికో, లేక దైవేచ్చో మళ్ళీ ఇన్నేళ్ళకి ఇక్కడ అడుగుపెట్టాడు. తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం అయిన పెద్దయ్య ఇప్పుడు పక్షవాతం వచ్చి కేవలం కుర్చీకే పరిమితం అయ్యాడని తెలిసినా, చినబాబుని బ్రతిమిలాడి ఆయనముందే మళ్ళీ తన పునరాగమనం జరగాలని, మొదటివరుసలోనే కూర్చొని దగ్గరగా పెద్దయ్య తనని చూడాలని పట్టుబట్టాడు మణి. సరే అనక తప్పలేదు చినబాబుకి. దూరంగా అచేతన స్థితిలో ఉన్న పెద్దయ్య మణిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. తరువాతి ప్రదర్శన తనదే. సిద్ధమవుతున్నాడు మణి. విసరవలసిన కత్తులు, కంటికి కట్టుకొనే ఆ నల్లగుడ్డ, అన్నింటినీ ఒకసారి తడిమి చూసుకున్నాడు. ఆ కత్తులంటే అతనికి ఎంతో ప్రేమ. వెలుపల నుంచి తన పేరు పిలుస్తున్నారు. ఆ క్షణం రానే వచ్చింది. నోటితో గట్టిగా గాలి తీసి వదిలాడు. పరదా తొలగించుకుంటూ జనాల మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు తల్వార్ మణి. చెయ్యెత్తి అందరికీ అభివాదం చేశాడు. జనాలు లేచి మరీ చప్పట్లు కొట్టారు. అదీ అతని స్థాయి. దేశంలోనే అతనిలా కళ్ళకు గంతలు కట్టుకొని మనిషికి తగలకుండా కత్తులు విసరగలిగేవాడు మరొకడు లేడని అప్పట్లో అన్ని వార్తా పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చాయి. జనాలు స్థిమితపడ్డారు. ఎదురుగా సుమారు ఒక యిరవై అడుగుల దూరంలో గుండ్రపు చెక్కకి ఒక అమ్మాయిని తెచ్చి కట్టేశారు. ఎదురుగా అమ్మాయి. ఆమెకి కొంచెం పక్కగా పెద్దయ్య. అదీ మణికి కనిపిస్తున్న దృశ్యం. ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయాడు మణి. రూబీ గుర్తొచ్చింది. ఇంతలో పక్కన ఉన్న వ్యక్తి, మణి దగ్గరున్న నల్లటి గుడ్డని తీసి అతని కళ్ళకు గట్టిగా బిగించాడు. నిశ్శబ్దం. అందరూ ఊపిరి బిగపట్టి మరీ చూస్తున్నారు, ఏం జరబోతోందో! ఆ ఆసక్తి వారి ముఖాల్లో స్పష్టంగా కనపడుతోంది. ఆ ఆమ్మాయిని కట్టేసిన గుండ్రపు చెక్కని తిప్పాడు పక్కనున్న వ్యక్తి. మణి కత్తి తీశాడు. తిరుగుతున్న ఆ చట్రంతో పాటు అతని బుర్రలో పాత జ్ఞాపకాలు కూడా గిర్రున తిరుగుతున్నాయి. ఎన్నడూ లేనిది తల్వార్ మణì æచెయ్యి మొదటిసారిగా వణికింది. రూబీ. పేరుకి తగ్గ రూపం. మొదటిసారి తనని చూసినప్పుడే తాను విసిరే కత్తిలా అనిపించింది మణికి. ప్రేమలో పడిపోయాడు. అది ప్రేమో, ఆరాధనో లేక మైకమో తేల్చుకోలేని స్థితి అతనిది. ఆమె కళ్ళను చూస్తూ జీవితాంతం గడిపేయగలననుకున్నాడు. అంతటి కట్టిపడేసే సౌందర్యం ఆమెది. ఇంతలోనే నిరాశ! తాను ప్రేమిస్తే సరిపోతుందా? ఆమె కూడా తిరిగి తనని ప్రేమించద్దూ! ఆశ పడటానికైనా హద్దుండాలని సరిపెట్టుకున్నాడు. తనని ఆమెకి తగ్గ అందగాడిగా ఎందుకు పుట్టించలేదని దేవుణ్ణి నిందించేశాడు కూడా! ‘‘ఇదిగో మణీ! ఈ అమ్మాయి నీతో పనిచేస్తుంది. పేరు రూబీ. నువ్వు రేపటి నుంచి ఈమెతోనే నీ ప్రదర్శనలు చేయాలి’’. ఒక్కసారి సర్కస్ ఫోకస్ లైట్లలాగా వెలిగిపోయింది మణి ముఖం. ఇంకా తాను వరమే కోరలేదు, అప్పుడే దేవత వరమిచ్చేసింది కాబోలు అనుకున్నాడు. చెంపలు వేసుకున్నాడు. తొందరపడి దేవుణ్ణి నిందించేశానే అని బాధపడ్డాడు. ‘‘ఆ అమ్మాయికి ఇదంతా కొత్త. నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి’’ అంటున్న సర్కస్ ఇంచార్జ్, మణి కంటికి అప్పగింతలు చేస్తున్న మామగారిలాగా కనబడ్డాడు. బయటపడలేని సంబరంతో లోపల ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు మణి. కాలం గడుస్తోంది. రూబీపైన విపరీతమైన ప్రేమని పెంచేసుకున్నాడు మణి. ఎంతగా అంటే, తాను రోజూ విసిరేవి కత్తులు కాదు, తన ప్రేమ రాయబారాన్ని మోసుకు వెళ్ళే బాణాలు అనుకునే వరకూ చేరింది అతని వైఖరి. కానీ అతను విసిరే కత్తుల్లాగే ఆ బాణాలు కూడా ఆమెకి అస్సలు తగల్లేదు. చాలాసార్లు రూబీ మణికి నచ్చజెప్పింది. ఒకరోజు కుండ బద్దలు కొట్టేసింది, తనకి అలాంటి ఉద్దేశం ఏమీ లేదని, లేనిపోని ఆశలు పెట్టుకోవద్దని. మణి ముఖం మీదే చెప్పేసింది. తన ప్రపంచం ఒక్కసారి తల్లకిందులైపోయినట్టు అనిపించింది మణికి. తట్టుకోలేకపోయాడు. అర్ధరాత్రి గడిచింది. రూబీ ఉండే గదివైపు తడబడుతూ అడుగులు వేస్తున్నాడు మణి. చేతిలో కల్లుసీసా. తనని తాను నిగ్రహించుకునే స్థితిలో లేడు. పెద్దగా అరుస్తూ రూబీని నిద్రలేపాడు. ఆ గొడవకి మిగతావాళ్ళు కూడా నిద్రలేచారు. పెద్ద రభసే అయ్యింది. తనని పెళ్ళి చేసుకోకుంటే æచంపేస్తా అంటూ ఊగిపోతూ చేతిలో సీసాని పగలగొట్టి రూబీ మీదకి వెళ్ళబోయాడు మణి. చుట్టూ ఉన్నవాళ్ళు వచ్చి ఆపారు. రూబీ, మణికి దగ్గరగా వెళ్ళి గట్టిగా అతని చెంప పగలగొట్టింది. ఆ ఊపుకి వెళ్ళి పక్కన పడిపోయాడు. అందరూ అక్కడనుంచి వెళ్ళిపోయారు. రూబీ మాత్రం మళ్ళీ మణికి దగ్గరగా వెళ్ళింది. అతడి తల నిమిరింది. ఏదో గిలిగింత కలిగినట్టు ఆ మత్తులోనే నవ్వేసాడు మణి. ఆ స్పర్శ బహుశా అతని మనసుని తాకింది కాబోలు! రూబీ... రూబీ... అంటూ కలవరిస్తున్నాడు. రూబీకి కూడా మణి అంటే ఇష్టమే. కాకపోతే ఈ జీవితం రూబీకి నచ్చలేదు. ఏవో కుటుంబ పరిస్థితుల వల్ల ఇక్కడకి రావల్సి వచ్చిందేకానీ మనస్ఫూర్తిగా ఇష్టపడి మాత్రం కాదు. కానీ మణి పరిస్థితి అది కాదు. ఈ సర్కస్ అతని జీవితం. అతనికి ఇక్కడ మంచి భవిషత్తు కూడా ఉంది. తనవల్ల మణి జీవితం మారిపోవటం, అతను ఇష్టపడ్డ ప్రపంచాన్ని తనకోసం మార్చుకోవటం రెండూ రూబీకి ఇష్టంలేదు. అందుకే అతని ప్రేమకి దూరం అవ్వాలని అనుకుంది. అర్ధరాత్రి దాటింతర్వాత. ఏదో పెనుగులాట. ఏదోఅలజడి. బలవంతంగా మత్తునుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు మణి. తన వల్ల కావటం లేదు. ఐనా ప్రయత్నిస్తున్నాడు. మసకమసగ్గా కళ్ళముందు ఆడుతున్న ఆ దృశ్యాల్లో ఎవరో ఒక అమ్మాయి. ఒక మగమనిషి. ఆ అమ్మాయి అరవటానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆ మగ మృగం కిరాతకంగా ఆమెని లోబరచుకోవాలని ప్రయత్నం చేస్తోంది.బలం మొత్తం కూడగట్టుకొని లేచి నిలబడ్డాడు.‘‘ఎవరదీ! ఏయ్ వదులు’’ అంటూ ఆ మనిషి చొక్కా పట్టుకున్నాడు. అంత దగ్గరగా ఆ ముఖాన్ని చూసి ఖంగుతిన్నాడు. ఎదురుగా ఉన్న ఆ మనిషి టపీమని తలపై గట్టిగా రాయితో మోదడంతో అక్కడే స్పృహ కోల్పోయాడు మణి.పొద్దున్నే ఎవరో బూటుకాలితో గట్టిగా తంతుంటే మెలకువ వచ్చింది మణికి. ఎదురుగా ఉన్న రక్తపు మడుగులోంచి సూర్యోదయమయ్యింది అతనికి. ఒక్కసారి మబ్బులు విడిపోయాయి. అది రూబీ శవం. పొత్తికడుపులో పగలగొట్టిన గాజు సీసా గుచ్చుకొని ఉంది.‘‘ఏరా, అమ్మాయి ప్రేమించకపోతే పాడుచేసి ప్రాణాలు తీసేస్తార్రా మీరు...’’ అంటూ తంతున్నాడు కానిస్టేబుల్. మణికి ఏమీ అర్థంకాలేదు. ‘‘వీడిని ఇక్కడనుంచి తీసుకుపోండి సార్! వీడిలాంటి వాళ్ళుంటే మా సర్కస్కే చెడ్డపేరు’’ అంటున్న పెద్దయ్య వైపు కోపంగా చూశాడు మణి. కానీ పెద్దయ్య మాత్రం మణి కళ్ళలోకి చూడలేకపోయాడు. అది ఎందుకో మణికి మాత్రమే తెలుసు. ‘‘నడవరా స్టేషన్కి’’ అంటూ మెడ పట్టుకొని తీసుకెళ్ళారు పోలీసులు. అలా వెళుతూ కూడా వెనక్కి తిరిగి మరీ పెద్దయ్యవైపే చూశాడు మణి. ‘‘వెళ్ళొస్తా పెద్దయ్యా’’ అన్నాడు. పెద్దయ్యకి మణి కళ్ళలోకి చూసే ధైర్యం రాలేదు. బహుశా ఇంకెప్పటికీ రాదేమో!జైల్లో ఎవ్వరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు మణి. ఎక్కువగా ఒంటరితనాన్నే ఇష్టపడేవాడు. మధ్యమధ్యలో వెక్కివెక్కి ఏడుస్తూ ఉండేవాడు. ఆ జైల్లో కూడా మణికి అభిమానులు లేకపోలేదు. వారి సహాయంతో ఒక చిన్న గడ్డి బొమ్మని, కొన్ని డమ్మీ చాకులని సమకూర్చుకొని గంటలు తరబడి సాధన చేసేవాడు. ఇదీ క్లుప్తంగా మణి జైలు జీవితం. మణి జైలునుంచి విడుదలయ్యాక ఆ గడ్డిబొమ్మని బయటపారేస్తూ కానిస్టేబుల్ గమనించిన ఒక వింత విషయం ఏంటంటే ఇన్నాళ్ళూ మనిషికి తగలకుండా కత్తులు వేయటంలో నేర్పరి అయిన మణి, ఇప్పుడు మాత్రం ఒకేచోట గురి తప్పకుండా ఆ గడ్డిబొమ్మ గుండెల్లోకే చాకుని విసరగలగటం. చిద్రమైపోయిన హృదయంతో ఉన్న ఆ బొమ్మ, బహుశా రూబీని మరిచిపోలేని మణికి ప్రతిరూపమేమో అనుకున్నాడు.‘మణి... మణి...మణి...’ అంటూ ప్రేక్షకులు కొడుతున్న కేరింతలతో మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చాడు. వణుకుతున్న చేతినుంచి బాణంలాగా దూసుకువెళ్ళింది కత్తి. ఎప్పటిలాగే ఈసారి కూడా అది గురి తప్పలేదు. జైల్లో రూబీనే తలచుకుంటూ, ఆ గడ్డిబొమ్మలో పెద్దయ్యనే చూస్తూ మణి చేసిన సాధన మొత్తానికి ఫలించింది. ప్రేక్షకుల దృష్టిలో అతని గురి తప్పినప్పటికీ, మణì æలక్ష్యం మాత్రం నెరవేరింది. - యేటూరి రోహణ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement