-
పల్లెటూరి వాడివంటూ భార్య వేధింపులు
కర్ణాటక: కుటుంబ కలహాలతో ఓ మెట్రో ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా కిబ్బనహళ్లి పరిధిలో చోటు చేసుకుంది. మంజునాథ్ (38) జిల్లాలోని కుందూరుపాళ్య గ్రామానికి చెందిన వాడు. బెంగూళూరు నగరంలో మెట్రోలో ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న ఇతడు పదేళ్ల క్రితం తురువెకెరెకు చెందిన ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పల్లెటూరి వాడివంటూ మంజునాథ్ను ప్రియాంక వేధించేదని సమాచారం. ఆమె వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంజునాథ్ తన సోదరుడికి ఆడియో మెసేజ్ పంపాడు. కిబ్బనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
దేవుడా ఎంత ఘోరం! మిన్నంటిన ఆర్తనాదాలు
అర్ధరాత్రి, డ్రైవర్ తప్ప అందరూ గాఢనిద్రలో ఉన్నారు. మరో రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంట్లో ఉంటారు. కానీ విధి మరోలా తలచింది. పాల ట్యాంకర్ రాంగ్ రూట్లో మృత్యు శకటంలా వచ్చింది. యాత్రికుల టెంపో ట్రావెలర్ గమనించేలోపే ఢీ కొట్టారు. ఈ ఘోర ప్రమాదంలో పిల్లలు, మహిళలతో సహా 9 మంది దుర్మరణం చెందారు. దేవుని దర్శనానికి వెళ్లి వస్తుంటే ఎంత దారుణం జరిగింది దేవుడా అని మృతుల బంధువులు విలపించారు. బనశంకరి: టెంపో ట్రావెలర్కు ముందు పాల ట్యాంకర్, వెనుక నుంచి కేఎస్ఆర్టీసీ బస్ తాకిడితో భీకర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపోలోని నలుగురు పిల్లలతో పాటు 9 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా అరసికెరె తాలూకా బాణావర పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ధర్మస్థల, హాసనాంబ దర్శనం చేసుకుని వివరాలు.. అరసికెరె తాలూకా బాణవార హొబళి హళ్లికెరె గ్రామానికి ఒకే కుటుంబానికి చెందిన 14 మంది టెంపో ట్రావెలర్ వాహనంలో శనివారం ధర్మస్థల క్షేత్రానికి వెళ్లారు. మంజునాథ స్వామికి దర్శించుకుని తరువాత సాయంత్రం హాసన్కు బయలుదేరారు. హాసనాంబ మాతను దర్శించుకుని చేసుకుని హళ్లికెరె గ్రామానికి తిరుగుముఖం పట్టారు. మరో 10 నిమిషాల్లో క్షేమంగా సొంతూరికి చేరుకునేవారు. రాంగ్ రూట్లో పాల ట్యాంకర్ అరసికెరె–శివమొగ్గ హైవే – 69 బాణావర వద్ద వెళుతుండగా శివమొగ్గ నుంచి చెన్నరాయపట్టణ వైపునకు వస్తున్న పాల ట్యాంకర్ డ్రైవరుకు మలుపు తెలియకపోవడంతో టెంపోకి ఎదురుగా వెళ్లాడు. ఈ సమయంలో వేగంగా వస్తున్న టెంపో ట్రావెలర్ వాహనం, పాల ట్యాంకర్ను ఢీకొని పల్టీ కొట్టింది. ఆ సమయంలో వెనుక వస్తున్న బెంగళూరు–శివమొగ్గ కేఎస్ ఆర్టీసీ బస్సు టెంపోను ఢీకొట్టింది. రెండు వైపులా ప్రమాదంతో టెంపోలోని యాత్రికులు విలవిలలాడారు. మృతులు వీరే..: తీవ్ర గాయాలతో లీలావతి (50), చైత్ర (33), సమర్థ (10), డింపి (12), తన్మయ్ (10), ధృవ (2), వందన (20), దొడ్డయ్య (60), భారతి (50) అనే 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టెంపో, బస్సులోని మరో 12 మందికి తీవ్రగాయాలు కావడంతో 10 మందిని హాసన్ జిల్లాసుపత్రికి, ఇద్దరిని అరసికెరె తాలూకా ఆసుపత్రికి తరలించారు. టెంపో నుజ్జునుజ్జుకావడంతో క్రేన్ సాయంతో వాహనాన్ని తొలగించారు. గాయపడిన వారిలో కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవరుతో పాటు ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్యాంకర్ డ్రైవర్ అరెస్టు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే బాణవార పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాసన జిల్లాఆసుపత్రికి, అరసికెరె తాలూకా ఆసుపత్రికి తరలించారు. మతదేహాలకు శవపరీక్షల నిమిత్తం హాసన్ జిల్లాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. పాలట్యాంకర్ డ్రైవరును అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. హైవే అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదం విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాతీయ రహదారి అధికారులు మరమ్మతులు జరుగుతుండగా సక్రమంగా సూచిక బోర్డులు అమర్చకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని మండిపడ్డారు. రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి చేరుకునే వారు విగతజీవులయ్యారని తెలిపారు. రూ.2 లక్షల చొప్పున పరిహారం మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు పరిహారం అందిస్తామని సీఎం బొమ్మై ప్రకటించారు. ఈ సంఘటన దురదష్టకరమని సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విపక్ష నేతలు సిద్దరామయ్య, కుమారస్వామిలు కూడా సంతాపం తెలిపారు. మిన్నంటిన ఆర్తనాదాలు దేవునికి కళ్లు లేవు. దేవుని శాపమో, గ్రహచారమో అని మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు విలపించారు. ఈ ప్రమాదంలో హళ్లికెరెలో పెద్ద కుటుంబానికి చెందిన 9 మంది మృత్యవాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర దుఃఖం నెలకొంది. ప్రమాద స్థలంలో విలేకరులతో మాట్లాడిన మృతుల బంధువు రవికుమార్.. అందరూ శుక్రవారం ఇంటి వద్ద పెద్దల పూజ చేసుకుని శనివారం ఉదయం ధర్మస్థలకు వెళ్లారు. తరువాత హాసనాంబను దర్శించుకుని తిరుగుప్రయాణంలో వస్తూ మరణించారని విలపించాడు. ఏ దేవునికి కళ్లు లేవు సార్. మేమంతా ఒకే కుటుంబానికి చెందిన రక్త సంబం«దీకులు. నా తమ్ముడు రెండేళ్ల కిందట కోవిడ్తో చనిపోయాడు. ఈ రోజు ప్రమాదంలో అతని ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని రోదిస్తూ చెప్పాడు. (చదవండి: విజయపురలో పరువు హత్య?) -
కులాల వారీగా అభిప్రాయాలు తెలపాలి
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ ∙ పలు గ్రామాల్లో పర్యటన రంగంపేట : స్థానిక సమస్యలు, కులాల వారీగా అభిప్రాయాలు తెలపాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ కోరారు. చైర్మన్ మంజునాథ, సభ్యులు ఆచార్య వెంకటేశ్వర సుబ్రమణ్యం, ఆచార్య మల్లెల పూర్ణచంద్రరావు, ఆచార్య శ్రీమంతుల సత్యనారాయణలు గురువారం జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించి ఆయా పంచాయతీ కార్యాలయాల వద్ద సమావేశాలు నిర్వహించారు. స్థానిక సమస్యలు, భౌగోళిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగంపేట మండలం పాత కోటపాడులో ఆయా కులాల నుంచి వినతులు స్వీకరించారు. అన్ని తరగతులలోను ప్రథమ శ్రేణి మార్కులు వచ్చినా ఉద్యోగావకాశాలు లేవని ఎంబీఏ పట్టభద్రుడు గవరసాని వీరబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెల్లమేకల దుర్గాప్రసాద్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ –1 రాధాకృష్ణ, ఆర్డీవో విశ్వేశ్వరరావు, సర్పంచ్ బత్తిన వీరయమ్మ, ఎంపీటీసీ సభ్యుడు ఐతి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసమే రావులపాలెం : మంజునాథ కమిషన్ కేవలం కాపులను బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిషన్ కాదని రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన కులాల స్థితిగతులను అధ్యయం చేయడం కోసమేనని జస్టిస్ మంజునాథ స్పష్టం చేశారు. గురువా రం క్షేత్ర పర్యటనలో భాగంగా రావులపాలెం మండలం ఈతకోట గ్రామా నికి వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన మంజునాథ బృందం ప్రజలతో ముఖాముఖి చర్చ నిర్వహించింది. కులాల మధ్య ఉన్న సఖ్యత, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన సరోజిని అనే కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ మాట్లాడుతూ తన తండ్రి మద్యానికి బానిస కావడంతో తమ కుటుంబ ఆర్థికంగా చితికిపోయిందని తాను ఉన్నత విద్యను అభ్యసించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మంజునాథ మాట్లాడుతూ తండ్రి ఎన్నో ఏళ్ళుగా మద్యానికి బానిసైతే ఎందుకు వ్యతిరేకించి మానిపించలేకపోయావని ప్రశ్నించారు. ప్రయత్నించి విఫలం అయ్యానని ఆమె చెప్పడంతో ఏ సమస్య అయినా వ్యక్తిగా పరిష్కరించుకోలేనప్పుడు సంఘటితంగా పోరాడాలని సూచించారు. సోషల్ వెల్ఫేర్ డీడీ చినబాబు, సర్పంచ్ మాసాబత్తుల సుమతి, తహసీల్దార్ ఉదయభాస్కర్, సీఐ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ లంక అంకయ్య ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. గురజనాపల్లిలో క్షేత్రస్థాయి పరిశీలన కరప : గురజనాపల్లి గ్రామంలో జస్టిస్ మంజునాథ, సభ్యులు పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. మంజునాథ మాట్లాడుతూ గ్రామ జనాభా ఎంత, సాగు విస్తీర్ణం ఎంత, ఎన్నికులాలు ఉన్నాయి. కులాలవారీగా వారి సామాజిక స్థితిగతులు, అక్షరాస్యత, నిరక్షరాస్యత, చదుకున్నవారు ఏఏ డిగ్రీలు చదివారు, వారి పరిస్థితుల అంశాలను వివరించాలని కోరారు. కరప సర్పంచ్ పంపన కన్నారావు, కార్యదర్శి సీహెచ్ ఇందిరలు గ్రామం వివరాలు తెలిపారు. మాజీ సర్పంచ్ పెంటపాటి సత్తిబాబు, పబ్బినీడి కృష్ణలు మాట్లాడుతూ గ్రామంలో ఎక్కువగా ఉప్పు కార్మికులుంటారని, వీరికి ఆరు నెలలు పనులుంటే, ఆరు నెలలు ఖాళీగా ఉంటారన్నారని, వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఉపాధి పథకం ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతున్నదీ అడిగి తెలుసుకున్నారు. వివిధ కులాలవారు తమ సమస్యలను, బాధలను కమిషన్కు వివరించారు. ఉప్పు కార్మికులను దగ్గరకు పిలిపించి వారి ఆరోగ్య సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఆర్డీవో ఎల్.రఘుబాబు, తహసీల్దార్ బూసి శ్రీదేవి, ఇన్చార్జి ఎంపీడీవో, భీమశంకరరావు, కులాలవారీగా సమీక్ష పెద్దాపురం : సామాజిక వెనుకబాటుపై స్పందించి అన్ని కులాలకు న్యాయం చేయాలని బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథకు పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కట్టమూరులో కులాల వారీగా జస్టిస్ మంజునాథ సమీక్ష జరిపారు. గ్రామానికి చెందిన రంగనాథం శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు సుందరపల్లి శివనాగరాజు, మాదిరెడ్డి సత్తిబాబు, పెంటా విజయ్కుమార్, ఎంపీటీసీ సభ్యుడు గంగాధరం, సర్పంచ్ దిమ్మల పుష్పరత్నంలు తమ తమ కులాలు వెనుకబడి ఉన్నాయని, అన్ని కులాల్లో కూడా సామాన్య కుటుంబాలు ఉన్నాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని సామాజిక వెనుకబాటును గుర్తుంచుకుని రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు, తహసీల్దార్ వరహాలయ్య, ఎంపీడీవో వసంతమాధవి, ఈవోపీఆర్డీ హిమమహేశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముద్రగడ దూత స్వామి వినతిపత్రం అందజేత గ్రామానికి వచ్చిన బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథకు కాపు జేఏసీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనుచరుడు, కాపు నాయకులు గౌతు స్వామి ఆధ్వర్యంలో జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ మలకల చంటిబాబు, పట్టణ కన్వీనర్ జిగిని రాజుబాబుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కాపులను బీసీల్లో చేర్చాలని, కాపు కులస్తులు చాలా కుటుంబాలు ఇప్పటికీ వెనుకబాటుతనంలో ఉన్నాయన్నారు. కమిషన్ వాటిని గుర్తించాలని వారు కోరారు. -
ఇదేమి విచారణ?
ఇరుపక్షాల పెదవి విరుపు కాపు ఉద్యమాన్ని అణిచివేసినట్టే విచారణ కూడా అర్ధాంతరంగా ముగించేశారు కాపు నేతల వాదనలకు ప్రతిగా మా వాదనలు వినరేం : బీసీల ఆగ్రహం జాబితాలో పేరేలేని కాపు కార్పొరేషన్ చైర్మన్కు అవకాశంపై విమర్శలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటైన మంజునాథ కమిషన్ విచారణ అర్థాంతరంగా ముగియడం వెనుక సర్కార్ కుట్ర దాగి ఉందని కాపులు అనుమానాన్ని వ్యక్తం చేయగా...తమ వాదనకు అడ్డుకట్ట వేశారని బీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను, తమ వాదనలను పూర్తిగా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లలేకపోయామనే ఆవేదన ఇరువర్గాల్లో కనిపించింది. కాపు నేతల వాదనలపై ప్రతి వాదనలను వినిపించకుండా కట్టడి చేయడాన్ని బీసీలు తప్పుపడుతున్నారు. రాష్ట్రం లోని 13 జిల్లాల్లో బీసీ, కాపుల మధ్య వాగ్వాదా లు, పరస్పర దూషణల మధ్య కమిషన్ విచారణ జరగ్గా ఈ జిల్లాకు వచ్చేసరికి అందుకు భిన్నంగా అర్ధాంతరంగా ముగించడంపై ఇరుపక్షాలూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మొదటి నుంచీ కాపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నట్టే కమిషన్ విచారణ కూడా అర్ధాంతరంగా ముగించి కాపుల గొంతును నొక్కేశారని ధ్వజమెత్తారు. సుదీర్ఘ జాబితాపై కమిషన్ అభ్యంతరం... మంజునాథ కమిషన్ విచారణలో వాదనలు వినిపించే వారి జాబితా పరిమితంగా ఉండాలనుకున్నారు. అందుకు అనుగుణంగానే విచారణకు ఇరుపక్షాల నుంచి 175 మంది వంతున విచారణ జరుగుతున్న కాకినాడ రంగరాయ వైద్యకలాశాల ఆడిటోరియానికి అనుమతించాలని నిర్ణయించారు. విచారణ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే తొలుత వాదనలు వినిపించే అవకాశాన్ని బీసీలకు కల్పించారు. బీసీలలో ప్రధానమైన శెట్టిబలిజ సామాజిక వర్గంతోపాటు ఉపకులాల నుంచి ఒకరిద్దరు వంతున సుమారు 15 మంది నేతలు వాదనలు వినిపించారు. కాపు జేఏసీ నేతలు కాపుల నుంచి ఒక జాబితాను జస్టిస్ మంజునాథకు అందజేశారు. ఇంత మంది వాదనలు వినిపించడం అసాధ్యమన్న కమిషన్కు ఎంత మందిని అనుమతిస్తే అంత మందే మాట్లాడతారని కాపు జేఏసీ నేతలు విన్నవించారు. ప్రతివాదనలకు నో... ఉదయం నుంచి భోజన విరామ సమయం వరకు బీసీల్లో ఉపకులాల వారీగా వాదనలు వినిపించే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత కాపు జేఏసీ నేతలు తమ వాదనలు వినిపిస్తుండగా ప్రతి వాదనకు అవకాశం కల్పించాలని బీసీ నేతలు మంజునాథను కోరగా అందుకు ఆయన తిరస్కరించారు. కమిషన్ ఆదేశాలతో ఎస్పీ రవిప్రకాష్, అదనపు ఎస్పీ దామోదర్ జోక్యం చేసుకున్నా తమకు అన్యాయం జరుగుతోందని బీసీలు విచారణను బహిష్కరించాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ప్రతి వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తే రాద్ధాంతం జరుగుతుందనే ముందుచూపుతోనే కమిషన్ ససేమిరా అని ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జాబితాలో పేరే లేని చలమశెట్టిని ఎందుకు అవకాశం ఇచ్చినట్టో...? అటు బీసీలు, ఇటు కాపుల నుంచి వాదనలు వినిపించేందుకు చాలా మంది ప్రయత్నించినా పరిమిత సంఖ్యలో ఓ వైపు అనుమతిసూ్త...జిల్లాతో సంబంధం లేని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయకు మరోవైపు మాట్లాడే అవకాశం ఏ ప్రాతిపదికన ఇవ్వాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని పలువురు తప్పుపడుతున్నారు. ఎక్కడో గుంటూరు జిల్లాకు చెందిన రామానుజయ ఇంత దూరం జిల్లాకు రావడమే కాకుండా నేరుగా విచారణలో కమిషన్ ఎదుట సీఎం చంద్రబాబు బాకా ఊదే ప్రయత్నం చేసి భంగపడ్డారు. కాపుల ఇబ్బందులను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కాపు జేఏసీ నేతలు ఇచ్చిన జాబితాలో కనీసం నలుగురైదుగురు కూడా మాట్లాడకుండానే జాబితాలో అసలు పేరే లేని రామానుజయకు అవకాశం ఇవ్వడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న∙కాపు నేతల నుంచి వినిపిస్తోంది. ఏ జిల్లాకు ఆ జిల్లాకు వెళ్లి కమిషన్ విచారణ చేపట్టినప్పుడు సొంత జిల్లాలో రామానుజయ ఏమి చేశారని, ఇంత దూరం రావడం వెనుక సర్కార్ ప్రమేయం లేకపోలేదనే అనుమానాన్ని కాపు జేఏసీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పేద కాపులకు మంచి జరిగే రీతిలో రామానుజయ మాట్లాడి ఉంటే ఆయన రాకలో చిత్తశుద్ధి ఉందని నమ్మే వారమంటున్నారు. ఆ దిశగా ఆయన ఒక ముక్కైనా మాట్లాడకుండా సర్కారు డప్పు వాగించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంతో నియమితమైన కార్పొరేషన్కు చైర్మన్ హోదాలో ఉండి కమిషన్ విచారణను అర్ధాంతరంగా ముగిసేలా కుట్రపూరితంగా వ్యవహరించారని కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని కమిషన్ విచారణ ముగిసిన అనంతరం ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని కాపు కల్యాణ మండపంలో ముద్రగడ పద్మనాభం తదితర నేతలు సమావేశమై ఇదే అనుమానాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ముద్రగడ సొంతజిల్లా కావడమే అర్ధాంతర ముగింపునకు కారణమా...? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సొంత జిల్లా కావడంతో ఇక్కడ కమిషన్ విచారణ సజావుగా సాగకూడదనే సర్కార్ పెద్దలు పక్కా ప్లా¯ŒS ప్రకారమే ఇదంతా సృష్టించినట్టుగా ఉందని ఆక్షేపిస్తున్నారు. లేదంటే కమిషన్ వాదనలు ఆలకించే సందర్భంలో బీసీలు, కాపుల మధ్య ఎటువంటి వివాదం తలెత్తకపోవడాన్ని వారు ఈ సందర్బంగా ఉదహరిస్తున్నారు. విచారణ సందర్భంగా మిగిలిన జిల్లాల్లో కాపు, బీసీ వర్గాల మధ్య రచ్చరచ్చయిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో రెండు సామాజిక వర్గాల మధ్య సున్నితమైన అంశం కావడంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తీరా ఆ రెండు సామాజిక వర్గాల మధ్య విచారణ సందర్భంగా స్వల్ప పొరపొచ్చాలు తలెత్తినా, రామానుజయ సీఎంకు భజన చేయడంతో తలెత్తిన వివాదం చివరకు కమిషన్ విచారణను సగంలోనే ముగిసేందుకు దారితీయడం విస్మయాన్ని కలిగించింది. బీసీలున్నంతలో తమ వాదనలు వినిపించే అవకాశం లభించగా భోజన విరామం అనంతరం తమకు పూర్తిస్థాయిలో అవకాశం దక్కలేదని కాపులు ఆవేదన చెందుతున్నారు. మొత్తంమీద కమిషన్ విచారణ సగంలోనే ముగిసిపోవడంపై ఇరుపక్షాలు పెదవి విరుస్తున్నాయి. -
సంయమనం పాటించాలి
- ప్రశాంతంగా విజ్ఞాపనలు అందజేయాలి - రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ - రెవెన్యూ, పోలీసు అధికారులతో సమీక్ష కాకినాడ సిటీ : వెనుకబడిన తరగతుల్లో కొన్ని కులాలను చేర్చడానికి, అలాగే బీసీ కులాల గ్రూపుల మార్పు అంశాలపై ఆయా కులాల నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ తెలిపారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి, ప్రశాంతంగా తమ విజ్ఞాపనలు అందజేయాలని కోరారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన, కమిషన్ సభ్యులు మంగళవారం రాత్రి కాకినాడ చేరుకున్నారు. ప్రజల నుంచి విజ్ఞాపనల స్వీకరణకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి, ఇతర అధికారులతో ఆర్అండ్బీ అతిథి గృహంలో సమీక్షించారు. జిల్లాలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయం, పశుగణాభివృద్ధి, ఆక్వా రంగాల్లో అభివృద్ధిని జస్టిస్ మంజునాథ తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ కులాలు, వారి ఆర్థిక స్థితిగతులపై కూడా సమీక్షించారు. జిల్లాలో సాధికారత సర్వేలో వివిధ కులాల వివరాలను సేకరించామని, ఈ సర్వే 88 శాతం పూర్తయిందని చైర్మన్కు కలెక్టర్ వివరించారు. విజ్ఞాపనల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను ఎస్పీ రవిప్రకాష్ వివరించారు. జస్టిస్ మంజునాథ మాట్లాడుతూ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో వివిధ కులాల ప్రజలు, ఆయా కులాల నాయకుల నుంచి బుధవారం విజ్ఞాపనలు స్వీకరిస్తామని తెలిపారు. 23వ తేదీన జిల్లాలోని పలు గ్రామాల్లో వివిధ కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తామన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ మల్లెల పూర్ణచంద్రరావు, ప్రొఫెసర్ శ్రీమంతుల సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జేసీ-2 జె.రాధాకృష్ణమూర్తి, డీఆర్ఓ బీఎల్ చెన్నకేశవరావు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement