-
గెలుపెవరిదో?
ఆర్కేనగర్ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతోంది ఎవరో అని ఉత్కంఠ నెలకొంది. గెలుపు ధీమా ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల్లో ఉన్నా, ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందో అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు ఆర్కేనగర్ ఉప ఎన్నిక రెఫరెండంగా మారింది. ఈ గెలుపుతో తాము బలహీనపడలేదని చాటుకునేందుకు అన్నాడీఎంకే తీవ్ర వ్యూహాల్నే అమలు చేసింది. అదే గెలుపు తన వశం చేసుకుని సత్తా చాటు కోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం కుస్తీలు పట్టింది. పాలకుల మీద ప్రజలు తీవ్ర ఆక్రోశంతో ఉన్నారని చాటే రీతిలో, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అధికారం తమదేనని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికల్ని డీఎంకే తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంది. ఎన్నికల రేసులో చాంతాడంత క్యూ ఉన్నా, గెలుపు ఓటములు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే, అన్నాడీఎంకే అమ్మ శిబిరాల మధ్య ఉందని చెప్పవచ్చు. 21వ తేదీ జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుతో తీర్పును ఈవీఎంలలో భద్రతపరిచారు. ఓటింగ్ శాతం మేరకు డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్ మధ్య గెలుపు ధీమా ఉన్నా, ఓటరు నాడి ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ తప్పడం లేదు. మరి కొన్ని గంటల్లో ఈవీఎంలలోని ఫలితాలు బయటకు రానుండడంతో ఆర్కేనగర్ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతున్నదెవరోనన్న ఎదురుచూపులు పెరిగాయి. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ఓటింగ్కు ఉపయోగించిన ఈవీఎంలు అన్నీ థౌజండ్ లైట్స్లోని క్వీన్ మేరిస్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్ర పరిచారు. ఈ పరిసరాల్లో ఐదు అంచెల భద్రతను కల్పించారు. ఆదివారం ఉదయాన్నే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఉదయం ఏడు గంటల్లోపు అక్కడికి చేరుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. పాస్లన్నీ ఇప్పటికే అందించారు. కౌంటింగ్ కేంద్రం, పరిసరాల్లో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి, భద్రత కల్పించారు. ఎప్పటికప్పుడు ఫలితాల్ని అందించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. వెబ్ టెలికాస్టింగ్ పద్ధతి ద్వారా ఢిల్లీ, చెన్నై కార్పొరేషన్లోని కంట్రోల్ రూమ్ల నుంచి లెక్కింపు, ఫలితాల సరళిని ఎన్నికల అధికారులు పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. 19 రౌండ్లుగా లెక్కింపు ఓట్ల లెక్కింపు 19 రౌండ్లుగా సాగనుంది. ఒక్కో రౌండ్కు 14 పోలింగ్ బూత్ల ఓట్ల లెక్కింపు సాగుతుంది. చివరి రౌండ్లో మాత్రం ఆరు పోలింగ్ బూత్లలో లెక్కింపు జరగనున్నట్టు చెన్నై జిల్లా ఎన్నికల అధికారి, కార్పొరేషన్ కమిషన్ కార్తికేయన్ తెలిపారు. కౌంటింగ్ విధులకు హాజరు కానున్న 200 మంది సిబ్బందికి శనివారం కార్తీకేయన్, ఎన్నికల అధికారి ప్రవీణ్ నాయర్ శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ సరళి, ఏజెంట్లకు సమాచారాలు, అధికారులకు సమాచారాలు, రిటర్నింగ్ అధికారికి వివరాలు, ఇలా అన్ని రకాల అంశాలతో ఈ శిక్షణ సాగింది. -
మరుదుకు డీఎంకే చాన్స్
ఆర్కేనగర్ డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్కు అవకాశం కల్పించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ధ్రువీకరించారు. సాక్షి, చెన్నై: 2016 ఆర్కేనగర్ ఎన్నికల్లో అమ్మ జయలలితను డీఎంకే అభ్యర్థిగా సిమ్లా ముత్తు చోళన్ ఢీకొట్టారు. ఆ ఎన్నికల్లో 57 వేల మేరకు ఓట్లు సిమ్లా ఖాతాలో పడ్డాయి. అయితే, గెలుపు మాత్రం అమ్మ జయలలితను వరించింది. నలభై వేల మెజారిటీతో జయలలిత గెలిచారు. ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సిమ్లా ముత్తు చోళన్కు ఉపఎన్నికల్లో అవకాశం దక్కవచ్చన్న చర్చ డీఎంకేలో సాగింది. ఇందుకు తగ్గట్టుగా ఆమె సీటు కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. సిమ్లాకు అవకాశం ఇచ్చి ఉంటే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉండొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, సిమ్లాను పక్కన పెట్టి మరుదుగణేషన్కు అవకాశం కల్పించడం గమనార్హం. మరుదుకు చాన్స్: డీఎంకే సీని యర్ నాయకురాలు, మా జీ మంత్రి సర్గుణ పాండియన్ కుటుంబానికి చెందిన సిమ్లాకు ఈ సారి అవకాశం దక్కలేదు. ఇటీవలే సర్గుణ పాండియన్ అనంత లోకాలకు చేరారు. అందుకే కాబోలు ఆమెను పక్కన పెట్టి మరుదు గణేషన్కు డీఎంకే అధిష్టానం చాన్స్ ఇచ్చినట్టుంది. మొత్తంగా సీటును ఆశిస్తూ 17 మంది దరఖాస్తులు చేసుకోగా, వీరి వద్ద డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఇంటర్వూ్యలు చేశారు. ఆ సీటుకు అర్హుడిగా మరుదు గణేష్ను తేల్చారు. ఆర్కేనగర్ తూర్పు విభాగం డీఎంకే కార్యదర్శిగా ఈ గణేషన్ వ్యవహరిస్తున్నారు. స్థానికుడు కావడం, ఓటర్లకు, స్థానిక పార్టీ వర్గాలకు సన్నిహితుడిగా ఉన్న గణేషన్కు గెలుపు అవకాశాలు ఏమేరకు ఉంటాయో అన్నది వేచి చూడాల్సిందే. బుధవారం పార్టీ కార్యాలయంలో అన్భళగన్, స్టాలిన్ తమ అభ్యర్థి మరుదుగణేషన్ పేరును ఖరారు చేస్తూ ప్రకటించారు. తన గెలుపు తథ్యం అన్న ధీమాలో గణేషన్ ఉన్నారు. తన అభ్యర్థిత్వ ఖరారుతో మిత్ర పక్షం కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ను ఆయన కలిశారు. తమ మద్దతు డీఎంకేకు అని ప్రకటించిన తిరునావుక్కరసర్, గెలుపు లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement