-
మెటర్నిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా ‘గాంధీ ఆస్పత్రి’
సాక్షి, హైదరాబాద్: మెటర్నిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగే హైరిస్క్ ప్రసవాలను భవిష్యత్లో ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేకంగా మెటర్నిటీ కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఐసీయూ సహా అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దుతారు. దీనికోసం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎంసీహెచ్) నుంచి రూ.50 కోట్లు మంజూరయ్యాయి. అందులో ఇప్పటివరకు రూ.30 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రంలోనే అన్ని ఆస్పత్రులకు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ఇది నిలవనుంది. ఏరియా, జిల్లా, ఇతర ఆస్పత్రుల నుంచి కేసులను ఇక్కడకు రిఫర్ చేస్తారు. సాధారణ ప్రసవాలకు ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో 150 పడకలు ఉన్నాయి. వాటితో సంబంధం లేకుండా కొత్తగా వచ్చే 200 పడకలను హైరిస్క్ కేసుల కోసం కేటాయిస్తారు. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోనే డెలివరీలకు మోడల్గా ఉంటుందని వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేశ్రెడ్డి తెలిపారు. అనారోగ్య సమస్యలున్న గర్భిణుల కోసం.. గర్భిణీలకు ఒక్కోసారి అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ప్రసవం సమయంలో హైబీపీ రావడం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తడం, కిడ్నీ పరమైన ఇబ్బందులు ఉండటం వంటి కారణాలతో ఒక్కోసారి పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారుతుంది. సంక్లిష్టమైన కేసులకు ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో సక్రమంగా డెలివరీ చేసే పరిస్థితులు లేవు. ఉదాహరణకు ప్రసవం సమయంలో గర్భిణీకి హైబీపీ వచ్చినప్పుడు సాధారణ జనరల్ ఫిజీషియన్ పరిస్థితిని నియంత్రించలేరు. దీనికి తప్పనిసరిగా సూపర్ స్పెషాలిటీ కోర్సు చేసిన జనరల్ ఫిజీషియనే అవసరం. అలాగే గుండె సంబంధిత సమస్య వస్తే కార్డియాలజిస్ట్ కావాలి. కిడ్నీ సంబంధిత సమస్య ఉంటే నెఫ్రాలజిస్టు కావాలి. కానీ ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో అటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యులు లేనేలేరు. కాబట్టి హైరిస్క్ కారణాలతో మాతృత్వపు మరణాలు సంభవిస్తున్నాయి. బహుళ అనారోగ్య సమస్యలతో బాధపడే గర్భిణీలు హైరిస్క్లో ఉంటే అటువంటి వారిని ఏరియా, జిల్లా ఆస్పత్రుల నుంచి గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేసేలా ఏర్పాట్లు చేస్తారు. గాంధీ బోధనాస్పత్రి కావడంతో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉంటారని, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారని డాక్టర్ రమేశ్రెడ్డి తెలిపారు. -
దేవుడా..! నువ్వే దిక్కు
* హైరిస్క్ కేంద్రాలున్నా ఫలితం సున్నా * ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళల ప్రసవ వేదన సంగారెడ్డి క్రైం: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా, శిశు హైరిస్క్ ప్రసూతి కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రసవం కోసం వస్తున్న మహిళలకు నరకయాతన తప్పడం లేదు. మాతా, శిశు మరణాలను తగ్గించడం, రక్త హీనత, ఇతర సమస్యలతో బాధపడే గర్భిణులకు సుఖ ప్రసవం జరిపించాలన్న ఉద్దేశంతో గత కలెక్టర్ స్మితా సబర్వాల్ ఈ హైరిస్క్ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. జిల్లాలోని మెదక్, సిద్దిపేట, పటాన్చెరు, జహీరాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనే హైరిస్క్ కేంద్రం లేకపోవడం విచారకరం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఎన్ని కల్పించిన ప్పటికీ వైద్యులు, సిబ్బందిలో అంకితభావం లోపించడం వల్ల గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. మెదక్ మండలం హవేళి ఘన్పూర్ గ్రామానికి చెందిన రవి భార్య శేఖమ్మ ఆదివారం మెదక్, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సహకారం లభించకపోవడం వల్ల హైదరాబాద్కు వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంటికి తిరుగుముఖం పట్టింది. ఆర్టీసీ బస్సులో బయలుదేరిన ఆమె మార్గంమధ్యలోనే జోగిపేట సమీపంలో ప్రసవించింది. బస్సు డ్రైవర్, కండక్టర్లు ప్రయాణికులను మరో బస్సు ఎక్కించి శేఖమ్మను జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్, కండక్టర్లు మానవత్వాన్ని ప్రదర్శించడం వల్లే తల్లీబిడ్డలు క్షేమంగా బయట పడ్డారు. ఈ పాటి విజ్ఞతను మెదక్లోగానీ, సంగారెడ్డిలోని ప్రభుత్వ వైద్యులు చూపించి ఉంటే శేఖమ్మ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించి ఉండేది. హెల్ప్డెస్క్లు ఏర్పాటయ్యేనా? ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసూతి కోసం వచ్చిన మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ సుఖ ప్రసవం పొందేందుకు హెల్ప్డెస్క్ల ఏర్పాటుకు గత కలెక్టర్ స్మితా సబర్వాల్ పూనుకున్నారు. ప్రతినెలా 30 వరకు కాన్పులు జరిగే ప్రతి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని త లిచారు. ప్రభుత్వ ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చే మహిళలు సుఖ ప్రసవం పొంది ఇంటికి క్షేమంగా వెళ్లే వరకు ఈ హెల్ప్డెస్క్లో పనిచేసే సిబ్బంది పర్యవేక్షించాలని ఆమె భావించారు. గర్భిణులకు గానీ, బిడ్డకుగానీ పరిస్థితి ఆందోళకరంగా ఉంటే ఆమెను హైదరాబాద్కు తరలించైనా సరే డెలివరీ చేయించాల్సి ఉంటుంది. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు వరం లాంటిది. హెల్ప్డెస్క్ల ఏర్పాటుకు ఒక్కింటికి రూ. 80 వేలు ఎన్ఆర్హెచ్ఎం కింద ఖర్చు చేయాలని భావించారు. కానీ స్మితా సబర్వాల్ ఇక్కడి నుంచి బదిలీ కావడంతో ఈ కార్యాచరణ అంతా కాగితాలకే పరిమితమైంది. తర్వాత ఇన్చార్జ్గా ఉన్న జేసీ శరత్, కొత్తగా వచ్చిన రాహుల్ బొజ్జాలు ఈ విషయంలో దృష్టి సారించక పోయారు. ఇటీవల సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం రాజయ్య సైతం సంగారెడ్డి ఆస్పత్రిలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కానీ హెల్ప్డెస్క్ల నిర్వహణకు సరిపడా సిబ్బంది లేకపోవడం, ఖర్చులు ఎక్కడి నుంచి వినియోగించాలో తేలకపోవడంతో హెల్ప్డెస్క్ల ఏర్పాటు కాలేదు. ఒకవేళ హెల్ప్డెస్క్ సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి ఉంటే మెదక్ మండలం హవేళి ఘన్పూర్కు చెందిన గర్భిణికి ఆర్టీసీ బస్సులో కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు జరిగేది.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
- జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
- జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
Advertisement