-
మట్టి మనిషి
‘మనిషికి సంతోషం ఎక్కడుందంటావా? కష్టపడి పని చెయ్యడంలో ఉంది. చెమటోడ్చి భూమి దున్నటంలో ఉంది. రెక్కల కష్టం అక్కరకు రావటంలో ఉంది. మన కష్టార్జితం మన చేతుల్లోకొచ్చినప్పుడు ఉండే ఆనందం లాంటిది ఈ భూమ్మీదే మరొకటి లేదురా బాబూ’ అంటాడు మనవడు రవితో సాంబయ్య. ఈ నవలలోని అసలైన మట్టి మనిషి ఆయన. అప్పటికి సాంబయ్య జీవితం ఒక పూర్తి చక్రం తిరిగివుంటుంది.సాంబయ్య తండ్రి వెంకయ్య కట్టుబట్టలతో బతుకుతెరువు కోసం వస్తాడు. మోతుబరి వీరభద్రయ్య దగ్గర పాలేరుగా పనిచేస్తాడు. జీతగానిగా జీవితం లేదని తెలుసుకుని రెండెకరాల పొలం కౌలు చేస్తాడు. సాంబయ్య చేతికి అందివచ్చే నాటికి ఐదెకరాల భూమి, ఇల్లు సంపాదించివుంటాడు వెంకయ్య. భూమిదాహం తప్ప మరొకటి ఎరుగని, మట్టి వాసనే తప్ప సంసారంలో సరసం తెలియని సాంబయ్య తనకు కొడుకు వెంకటపతి పుట్టేనాటికి దాన్ని రెట్టింపు చేస్తాడు. పిసినారితనంతో భార్యను పోగొట్టుకుంటాడు. అయినా పెళ్లి చేసుకోడు. వెంకటపతికి నూనూగు మీసాలు వచ్చేనాటికి ఎనబై ఎకరాల మాగాణికీ, కొత్తగా కట్టిన డాబాకీ, గొడ్గూ గోదకూ యజమాని అవుతాడు సాంబయ్య. అదంతా ఆయన రెక్కల కష్టం వల్ల, చెమట చిందించటం వల్ల జరిగిన అద్భుతం.తండ్రి పాలేరుగా ఉన్న ఇంటివాళ్లతోనే కొడుక్కు సంబంధం కలుపుకోవడం ద్వారా తన గౌరవాన్ని పెంచుకోవాలనుకున్న సాంబయ్య నిర్ణయం ఈ నవలను మరో దారి పట్టిస్తుంది. అప్పటికి ఆర్థికంగా దిగజారివున్న వీరభద్రయ్య కొడుకు బలరామయ్యతో వియ్యమందుతాడు. తండ్రి నుంచి అహంకారం, అభిజాత్యం వారసత్వంగా అబ్బిన వరూధిని కొత్త కోడలుగా వచ్చీ రావడంతోనే కాపురాన్ని పట్నానికి మారుస్తుంది. వేలకు వేలను మంచినీళ్లలా ఖర్చు చేయిస్తుంది. కీలుబొమ్మైన వెంకటపతిని తాగుడుకు బానిసను చేస్తుంది. తండ్రికి తెలియకుండా కొడుకు ధాన్యం తోలుకెళ్లేంత దూరం సంబం«ధం విచ్ఛిన్నమయ్యాక, అన్నివిధాలా భ్రష్టురాలై వరూధిని ఆత్మహత్య చేసుకుంటుంది. వెంకటపతి తన కొడుకు రవిని తండ్రి దగ్గరకు చేర్చే ఉద్దేశంతో ఊరి పొలిమేరలో వదిలి పారిపోతాడు. మనవడు తాతను చేరేప్పటికి సాంబయ్య పాకలోని కుక్కిమంచంలో ఉంటాడు. ఆయన దగ్గర మిగిలింది ముప్పాతికెకరం బంజరు భూమి. మనవడి కోసమైనా బతకాలన్న సంకల్పంతో సాంబయ్య మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. కూరగాయల సాగు మొదలెడతాడు. ఆ భూమీ ఊరిలోని కుతంత్రం వల్ల పోవడంతో తుదిశ్వాస విడుస్తాడు. ‘వస్తాన్రా వస్తా, తెస్తా నీ కోసం తుపాకి’ అని రవి అనడం ముగింపు.నాలుగు తరాల జీవితాన్ని చిత్రించిన ఈ నవల వ్యవసాయ కుటుంబాల్లో వచ్చిన మార్పులను ప్రతిఫలిస్తుంది. బస్తీ వ్యామోహం ఎలా ఉండేదో చిత్రిస్తుంది. చుక్క చెమట చిందించకుండా అన్ని విధాలుగా ఎదిగిపోయే దళారీ కనకయ్యలను ఎత్తిచూపుతుంది. రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవికి ఎనలేని పేరు తెచ్చిన ఈ నవల 1972లో ప్రచురితమైంది. -
మళ్లీ మొదలైన మట్టి దోపిడీ
పట్టపగలే జోరుగా అక్రమ రవాణా మండలస్థాయి నాయకుడి అండదండా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం తాళ్లరేవులో మట్టి దోపిడీ మళ్లీ మొదలైంది. స్థానిక ఆత్రేయ గోదావరిలో డ్రెడ్జింగ్ ద్వారా తవ్వి తీసిన మట్టిని అక్రమార్కులు దర్జాగా తరలించుకుపోతున్నారు. పట్ట పగలే పొక్లెయి¯ŒS ద్వారా మట్టిని టిప్పర్లలో వేసి తరలిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకో వడం లేదు. మండల స్థాయి నాయకుని అండదండలతో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. – తాళ్లరేవు మురుగుకాలువల అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.25 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ఆత్రేయ డ్రెయిన్ డ్రెడ్జింగ్ పనులను నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం చేపట్టింది. డ్రెడ్జింగ్ ద్వారా వెలికితీసిన మట్టిని గోదావరి చెంతన గట్లపైన, సమీప పల్లపు ప్రాంతాలలోనూ వేస్తున్నారు. ఈ మట్టిని గట్లపై వేయడం ద్వారా గోదావరి గట్లు పటిష్టమవుతాయని గోదావరి చెంతనగల రైతులు, ప్రజలు ఆనం దం వ్యక్తం చేశారు. అయితే గతంలో కొందరు అక్రమార్కులు, అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై లక్షలాది రూపాయల విలువైన మట్టిని దర్జాగా యంత్రాల సాయంతో తవ్వి లారీలు, టిప్పర్లలో తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ భాగోతంపై పలువురు ఫిర్యాదు చేయడంతో మట్టి తరలింపు నిలిచిపోయింది. అయితే రెండు రోజులుగా అక్రమార్కులు మళ్లీ మట్టి అక్రమ తరలింపునకు తెరతీశారు. నిత్యం అనేక టిప్పర్లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్, డ్రెయినేజీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఏటిగట్టును ఛిద్రం చేస్తున్నారు ఆత్రేయ గోదావరి చెంతనే అనేక గ్రామాలు ఉన్నాయి. వాటితో పాటు వేలాది ఎకరాల వరి ఆయకట్టు ఉంది. వరదల సమయంలో ఆయా గ్రామాలకు, వరి ఆయకట్టుకు ఎటువంటి నష్టం కలుగకుండా ఏటిగట్లు కాపాడుతూ ఉంటాయి. అటువంటి గట్లను ఇష్టానుసారం తవ్వేసి అక్రమార్కులు మట్టిని తరలించుకుపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో భవిష్యత్లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఏటిగట్లను పటిష్టం చేస్తుంటే మరోపక్క ఏటిగట్లపై ఉన్న మట్టిని దర్జాగా తరలించుకు పోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు తక్షణమే స్పందించి మట్టి అక్రమ తరలింపును నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- టీ20 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
Advertisement