-
వరి @ రూ.3,010
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ధాన్యానికి (ఆర్ఎన్ఆర్ పాతరకం) రికార్డుస్థాయిలో ధర రూ. 3,010లు పలికింది. ఈ సీజన్ ప్రారంభమైన నాటినుంచి ధాన్యానికి అత్యధికంగా ధర పలకడం ఇదే తొలిసారి. మద్దతు ధర రూ.2,060 ఉండగా, మద్దతుకు మించే ధర రావడం విశేషం. కాగా, మార్కెట్ కు బుధవారం 1,778 బస్తాల ధాన్యం అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.3,010, కనిష్ట ధర రూ.2,219 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
అన్నదాత.. గుండెకోత
సాక్షి, అమరావతి: జిల్లాలో కౌలు రైతులకు కష్టాలు వెన్నంటే వస్తున్నాయి. చీడ పీడలు, తెగులు, నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, ప్రకృతి వైపరీత్యాలకు తోడు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఫలితంగా కాడిని పక్కకు పడేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తిగా చేయూత కరువు కావడంతో చేసేది ఏమిలేక బలవంతగా ఉసురు తీసుకొంటున్నారు. దీంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. పది మందికి పట్టెడన్నం పెట్టే రైతన్న,అవమానం భరించలేక పురుగుల మందు డబ్బాతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఆత్మభిమానం చంపుకొలేని కొంత మంది రైతులు కిడ్నీలు అమ్ముకొనైనా అప్పు తీరుస్తామనే స్థాయికి వెళుతున్నారు. గుంటూరు జిల్లాలో మూడేళ్లలో వంద మందికిపైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 60 మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. గురువారం సాయంత్రం ఫిరంగిపురం మండలం అల్లంవారిపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు కొండవీటి బ్రహ్మయ్య (45) రెండేళ్లుగా 15 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని ప్రత్తి, మిరప పంట సాగు చేశారు. గులాబీ రంగు పురుగుతో పత్తి పంట దెబ్బతింది. మిరప పంటకు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు. చివరకు రూ.17 లక్షల అప్పులయ్యాయి. తీర్చే దారిలేక గుంటూరు కలెక్టరేట్లోనే పురుగు మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాజా అనే రైతు తాను పడిన ఇబ్బందులను అధికారులకు వీడియో ద్వారా తీసి పంపడమే కాకుండా ఈ నెల 22 వ తేదీన గుంటూరులో కలెక్టర్ ఎదుటనే ఆత్మహత్య చేసుకొంటానని పేర్కొన్నాడు. కౌలు రైతులకు అసరా ఏదీ... జిల్లాలో 3.5 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.60 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో కేవలం సాగు ధ్రువీకరణ పత్రాలు 50,884 మందికి, రుణ అర్హత పత్రాలు 35,921 మందికి మొత్తం 86, 139 మందికి మాత్రమే కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు ఇవ్వటం గమనార్హం. ఈ ఏడాది ఖరీప్లో రూ. 5193 కోట్లు, రబీలో రూ. 3461 కోట్లు మొత్తం రూ. 8654 కోట్ల రూపాయల పంట రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందులో దాదాపు రూ. 7 వేల కోట్ల రూపాయలకుపైగా పంట రుణాలను ఇప్పటికే రైతులకు ఇచ్చారు. ఈ లెక్క ప్రకారం ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పంట రుణాల్లో 10 శాతం రుణాలు కౌలు రైతులకు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు రూ.150 కోట్లు మాత్రమే కౌలు రైతులకు ఇవ్వటం గమనార్హం. రుణ అర్హత పత్రాలు లేకపోవడంతో కనీసం విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ పరికరాలు కౌలు రైతులకు అందటం లేదు. పొలం కలిగిన రైతుల పేరిటనే పాసు పుస్తకాలు ఉండటంతో బ్యాంకర్లు సైతం కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు. మరో వైపు రైతులకు పంట చేతికి వచ్చే సమయంలో ధరలు పతనమవతున్నాయి. నిండా మునుగుతున్న రైతులు... ప్రధానంగా కౌలు రైతులతోపాటు, రైతులు మూడేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో మూడేళ్లుగా వరి పంట పండక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో చేసేదేమి లేక ప్రత్యామ్నాయ పంటలైనా పత్తి , మిరప పంటల వైపు మొగ్గుచూపారు. గత ఏడాది మిర్చి పంట సాగు చేసిన రైతులు ప్రారంభంలో నకిలీ విత్తనాలతో నిండా మునిగారు. పంట చేతికి వచ్చాక మిర్చి ధరలు భారీగా పతనం కావడంతో కౌలు రైతులు కుదేలయ్యారు. దీంతో ఈ ఏడాది రైతులు మిర్చి పంటకు బదులు పత్తి సాగు చేశారు. గులాబీ రంగు పురుగు సోకటంతో పంట దిగుబడులు భారీగా తగ్గాయి. రెండేళ్లుగా పంట దెబ్బతినడం, ధరలు లేకపోవడంతో అప్పులు తీర్చేదారిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పడిపోయినా పప్పు ధాన్యాల ధరలు... వరి పంటకు ప్రత్యామ్నాయంగా మినుము, పెసర, కంది పంట వేసిన రైతులు గుల్లయ్యారు. గత ఏడాది మినుము, పెసర పంటకు తలమాడు తెగులు సోకటంతో పంట నేల మట్టమైంది పండిన అరకొర పంటకు ఎన్నడూ లేని విధంగా మినుము, పెసర, కంది ధరలు పడిపోయాయి. దీంతో పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. మొత్తం మీద మూడేళ్లలో రైతులు, కౌలు రైతుల పరిస్థితి అంతకంతకు తీసికట్టుగా మారింది. -
పత్తి మార్కెట్లో ధర దగా
క్వింటాల్కు రూ.500 కోత - అధికారులను నిలదీసిన రైతులు - ఒక్కరోజే రూ.2.50లక్షల దోపిడీ జమ్మికుంట: పత్తి ధరల్లో వ్యాపారుల దగాకోరుతనం ఆగడంలేదు. గరిష్ట ధర చెల్లిస్తామని చెప్పి కనిష్ట ధర కూడా పెట్టక రైతులను నిలువునా ముంచుతున్నారు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. సోమవారం ఇక్కడి వ్యవసాయ మార్కెట్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా వరంగల్ జిల్లా నుంచి రైతులు దాదాపు రెండు వేల బస్తాల్లో పత్తిని అమ్మకానికి తెచ్చారు. సుమారు వంద వాహనాల్లో లూజ్ పత్తి తెచ్చారు. బస్తాల్లో వచ్చిన పత్తికి వ్యాపారులు పోటీ పడి జెండా పాటలో క్వింటాల్కు రూ.5వేలు గరిష్ట ధర పలికారు. లూజ్ పత్తికి రూ.5180 ధర పెట్టారు. మార్కెటింగ్ శాఖ అధికారులు బస్తాల్లో వచ్చిన పత్తికి క్వింటాల్కు రూ.5వేలు ధర పలికిందని వెల్లడించడంతో రైతులు ఒక్కసారిగా బిత్తరపోయారు. మార్కెట్లో ఎక్కడా రైతులకు రూ.5వేల ధర రాలేదని, కేవలం రూ.4350 నుంచి రూ.4500 వరకే ధరలు చెల్లించారని వందలాది మంది రైతులు అసిస్టెంట్ కార్యదర్శికి చెప్పారు. వ్యాపారులు అధిక ధరలు చెల్లిస్తున్నామని చెబుతూ రైతులను మోసం చేస్తున్నా పట్టించుకోవడంలేదెందుకని ఆయనను నిలదీశారు. చెల్లించే ధరలు ఒకలా ఉంటే అధికారులు ప్రకటించే ధరలు మరోలా ఉన్నాయని మండి పడ్డారు. అందరూ కలిసి రైతులను ముంచుతున్నారన్నారు. రైతుల పక్షాన నిలువాల్సిన అధికారులు వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఒక్క రోజే దాదాపు 500 క్వింటాళ్ల పత్తికి రూ.4500 ధర చెల్లించి రూ.2.50 లక్షల దోపిడీ చేశారన్నారు. మార్కెట్లో జెండా పాట ఒకటి, చెల్లించే ధర మరొకటి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. 17 బస్తాల పత్తి తీసుకువస్తే రూ.5వేలు ధర పెట్టి, రూ.4500 ఇచ్చారని వరంగల్ జిల్లా రాఘవరెడ్డిపేటకు చెందిన జగదీశ్ వాపోయాడు. ఎడ్లబండ్ల కార్మికుల ఆందోళనతో నిలిచిన కొనుగోళ్లు మార్కెట్కు లూజ్ పత్తి వస్తుండడంతో తమకు పని లేకుండా పోతోందని ఎడ్లబండ్ల కార్మికులు విధులు బహిష్కరించడంతో పత్తి కొనుగోళ్లు ఐదు గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ఎండలో అరిగోస పడుతున్నా పట్టించుకోవడం లేదని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ కార్యదర్శి విజయ్కుమార్ను నిలదీశారు. ధరల నిర్ణయం అనంతరం మార్కెట్కు వాహనాల్లో లూజ్ పత్తి వస్తుండడంతో తమ ఉపాధిపై దెబ్బ పడుతుందని పత్తి రవాణా చేసే ఎడ్ల బండ్ల కార్మికులు నిరసనకు దిగారు. దీంతో బస్తాల్లో వచ్చిన పత్తి తూకాలు నిలిచి పోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట కావస్తున్నా తూకం వేయకపోవడంతో రైతులు విసుగెత్తిపోయారు. సహనం కోల్పోయి అసిస్టెంట్ కార్యదర్శి వద్దకు వెళ్లి నిలదీశారు. తాను కార్మికులతో మాట్లాడుతున్నానని, వెంటనే తూకం వేయిస్తానని సముదాయించినా రైతులు వినిపించుకోలేదు. మార్కెట్కు సెలవు ప్రకటించి కార్మికుల సమస్యలపై చర్చించుకోవాలి గానీ రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఐదు గంటలు నిరీక్షించిన అనంతరం అధికారులు సాయంత్రం పత్తిని తూకం వేయించారు.
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
Advertisement