-
నాపై కుట్ర జరుగుతోంది
ఆనం కుటుంబీకులపై మేయర్ అజీజ్ ఆగ్రహం నెల్లూరు సిటీ: కొందరు తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని, వారికి భయపడ్డానికి తానేమీ గాజులు తొడుక్కోలేదని పరోక్షంగా ఆనం కుటుంబీకులపై మేయర్ అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ గతంలో ఆనం కుటుంబం తాళ్ళపాక అనురాధ, పులిమి శైలజను ఇబ్బంది పెట్టిన విషయం గుర్తుచేశారు. తాను మైనార్టీకి చెందిన వ్యక్తిని కావడంతోనే ఇపుడు తనను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సొంత పార్టీలోనే తన పై కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్లో అవినీతికి తావులేకుండా కృషి చేస్తున్నానన్నారు. కార్పొరేషన్కు గత రెండున్నర సంవత్సరాల నుంచి ‘వాచ్డాగ్’గా వ్యవహరిస్తున్నానని అజీజ్ పేర్కొన్నారు. రుణాలకు సంబంధించి కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సబ్ప్లాన్ నిధులతో త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్, కమిషనర్, లేకపోతే తన దృష్టికి తీసుకునిరావాలని సూచించారు. క్రిందిస్థాయి సిబ్బంది, మహిళా ఉద్యోగులపై దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోనని..అవసరమైతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని రంగమయూర్రెడ్డిని హెచ్చరించారు. ఇకనైనా తన పై చేసే విమర్శలు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు మామిడాల మధు, మల్లికార్జున్యాదవ్, కొమ్మరిగిరి శైలజ, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. -
రొట్టెల పండగకు ఏర్పాట్లు
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు, సిటీ: వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండగకు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. నగరంలోని బారాషాహిద్ దర్గా ప్రాంగణాన్ని ఆదివారం నగర మేయర్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్, టూరిజం అధికారులతో కలసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర మేయర్ అజీజ్ మాట్లాడుతూ దర్గా ప్రాంగణంలో నిర్మిస్తున్న 120 శాశ్వత మరుగుదొడ్లను అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తిచేస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం చెరువలో ఘాట్లు నిర్మాణం, లైటింగ్, గార్డెనింగ్కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు టూరిజం వారి సహకారంతో రూ.2.62 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
మేయర్కు షాక్
తనకు తెలియకుండా టెండర్లు పిలవకూడదు అధికారులకు మేయర్ అజీజ్ లిఖితపూర్వక ఉత్తర్వులు మేయర్ ఏకపక్ష నిర్ణయాలపై హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ మేయర్ ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టు నెల్లూరు, సిటీ: నెల్లూరు కార్పొరేషన్ మేయర్ అజీజ్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కార్పొరేషన్లో పట్టు సాధించేందుకు మేయర్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించగా శనివారం స్టే విధించినట్లు తెలిసింది. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంపై పట్టు సాధించేందుకు అధికార పార్టీలోని రెండు వర్గాలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలపై కన్నెర చేశారు. ఈ క్రమంలో అక్రమ కట్టడాలకు సహకరించార ఆరోపణలతో ఏడుగురు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే మేయర్ అజీజ్ తనకు తెలియకుండా నెల్లూరు కార్పొరేషన్లో మంత్రి జోక్యం చేసుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న మేయర్ అజీజ్ ‘అర్జెంట్ ఆఫీస్ నోట్’ను తయారు చేయించాడు. తనకు తెలియకుండా ఏ పనులు చేయరాదని కార్పొరేషన్లోని అన్ని విభాగాల అధికారులకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మేయర్ తీరుపై కార్పొరేషన్ అ«ధికారులు మండిపడ్డారు. మేయర్, మంత్రుల మధ్య నలుగుతున్న అధికారులు ఓ వైపు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మరోవైపు నగర మేయర్ అజీజ్ కార్పొరేషన్పై తమ పట్టు పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేషన్పై పట్టు కోసం మంత్రి నారాయణ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కార్పొరేషన్ అధికారులకు తాను చెప్పినట్టు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం గ్రహించిన మేయర్ అజీజ్ తాను ఏమీ తక్కువ కాదంటూ తనకు తెలియకుండా ఏ పని చేయరాదని లిఖిత పూర్వకంగా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరో వైపు కార్పొరేషన్లో పట్టు కోసం మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకాందరెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. దీంతో కార్పొరేషన్ అధికారులు ఇరువర్గాల అంతర్గతపోరులో నలిగిపోతున్నారు. ఇప్పటికే ఓ ఉన్నతాధికారి అధికార పార్టీ నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ మేయర్ అధికారులకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేయడంపై నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు పోలుబోయిన అనిల్కుమార్యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆదేశాల మేరకు కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసులుయాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. శనివారం హైకోర్టు మేయర్ ఉత్తర్వులుపై స్టే విధించినట్లు సమాచారం. దేశంలోని ఏ కార్పొరేషన్లోనూ మేయర్ ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేసిన దాఖలాలు లేవు. తనకు తెలియకుండా ఏ పని చేయకూడదని లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమమని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మేయర్ తీరును అన్ని పార్టీలు వ్యతిరేకిస్తుండడం విశేషం. -
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత
నెల్లూరు(అర్బన్): పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కార్పొరేషన్ నుంచి సాయమందిస్తామని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. భక్తవత్సలనగర్లోని వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్, రీసెర్చి సెంటర్ ఆధ్వర్యంలో ఎన్యూఎల్ఎం సహకారంతో మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 100 మంది మహిళలకు ఆదివారం కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు గ్రూపులుగా ఏర్పడితే కార్పొరేషన్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్లలో కొన్ని గదులను ఎలాంటి అడ్వాన్స్ లేకుండా తక్కువ అద్దెకు కేటాయిస్తామని చెప్పారు. ఊరగాయలు, జూట్ బ్యాగులు, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి పరిశ్రమల స్థాపనకు మహిళలకు మెప్మా అండగా ఉంటుందన్నారు. ట్రస్ట్ చైర్మన్ వసంతలక్ష్మి, కార్పొరేటర్లు రజని, రాజానాయుడు, పెంచలయ్య, ప్రశాంత్కుమార్, ప్రసాద్, షంషుద్దీన్, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు శోభారాణి పాల్గొన్నారు. -
కార్పొరేషన్లో ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థలో మేయర్ అబ్దుల్ అజీజ్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెండేళ్ల క్రితం మేయర్గా ఎన్నికైన అజీజ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కార్పొరేషన్లో తనిఖీలు చేసి, అధికారులు, సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించిన పరిస్థితే లేదు. కార్పొరేషన్లోని సగానికి పైగా సిబ్బంది వారం క్రితం కృష్ణా పుష్కరాల విధుల నిమిత్తం హాజరయ్యారు. ఉన్న సిబ్బందిపై అధిక భారం పడింది. ఏ విభాగానికి వెళ్లినా ఖాళీ కుర్చీలు, తాళాలు వేసిన గదులు మాత్రమే మేయర్ కంటపడ్డాయి. సిబ్బంది లేని కార్పొరేషన్లో మేయర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. త్వరలో బయోమెట్రిక్ నగరపాలక సంస్థ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడతామని మేయర్ పేర్కొన్నారు. కార్పొరేషన్లో కాగిత రహిత పాలనను అమలు చేస్తానని చెప్పారు. ఇప్పటికే భవన అనుమతులను ఆన్లైన్లో చేస్తున్నామని చెప్పారు. అధికారులు, సిబ్బంది సమయపాలనను తప్పక పాటించాలని సూచించారు. ఎస్ఈ శ్రీనివాసులు, మేనేజర్ రాజేంద్ర, కార్పొరేటర్లు రాజానాయుడు, నాయకులు షంషుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement