-
భోజనం తినలేకపోతున్నాం
చౌటుప్పల్ : మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండడం లేదని, నాసిరకంగా ఉండడంతో తినలేకపోతున్నామంటూ మండలంలోని తంగడపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం తరగతులను బహిష్కరించారు. ఖాళీ ప్లేట్లతో ఆందోళనకు చేపట్టారు. నాణ్యత లేకపోవడంతో కడుపునిండా తినలేకపోతున్నామని, తిండి విషయంలో నిత్యం ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనంతోపాటు కూరగాయలు, గుడ్లు, సాంబారు కూడా పూర్తి నాణ్యత లోపించి ఉంటుందని వాపోయారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు నచ్చజెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అనంతరం ఈ విషయాన్ని ఎంఈఓకు దృష్టికి తీసుకెళ్లారు. -
ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా
ఆత్మకూరు : భారతీయ జనతా యువమోర్చా ఆత్మకూరుశాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మండల విద్యావనరుల కేంద్రం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆళ్ల మధుసూదన్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కామన్ఫీజు విధానాన్ని అమలుచేయాలన్నారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఉదయగిరి ప్రతాప్, ఉపాధ్యక్షుడు కొల్లి హరినాయుడు, కార్యవర్గసభ్యులు దేవరపాటి మాధవ్, ఎస్డీ ఖాజారంతుల్లా, నాయకులు పూనపాటి రాజేష్, ఓబుల పవన్, బి.మారుతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
జిల్లాలో ‘పడే భారత్.. బడే భారత్’
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు * రూ.2 కోట్ల నిధుల మంజూరు * సర్వశిక్షా అభియాన్ ఏఎంవో సర్వేశ్వరరావు వెల్లడి ఆకివీడు: జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘పడే భారత్-బడే భారత్’ పథకాన్ని అమలు చేయనున్నట్టు సర్వశిక్షఅభియాన్ ఏఎంవో ఈ.సర్వేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎంఈవో కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాల్ని మరింత పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందని చెప్పారు. పథకం అమలు చేసేందుకు జిల్లాకు రూ.2 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. పథకం అమలులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఏడు రోజులపాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్లు నిర్వహిస్తామని చెప్పారు. నెలకు ఒకటి చొప్పున ఎనిమిది కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. టీఎల్ఎం గ్రాంట్ పెంపు తెలుగు, ఇంగ్లిష్ భాషలపై జిల్లా, మండల, కాంప్లెక్స్, స్కూల్ స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తామని ఏఎంవో తెలిపారు. చదవడం, రాయడంతో పాటు లెక్కల్లో నైపుణ్యాలను పెంపొందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి టీచర్ గ్రాంట్ మంజూరు కానుందని చెప్పారు. గతంలో టీఎల్ఎంకు రూ.500 ఇచ్చేవారని రూ.1,000కు పెంచాలని ప్రతిపాదించామన్నారు. వచ్చే ఏడాది నుంచి టీఎల్ఎం గ్రాంట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఏఎంవో పేర్కొన్నారు. 23 వరకు బడిబాట సంకల్పం-బడిబాట కార్యక్రమాన్ని ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్టు ఏఎంవో తెలిపారు. జిల్లాలో ఐదేళ్లు పైబడిన 25 వేల మందిని బడిలో చేర్పించడమే లక్ష్యంతో సాగుతున్నామని ఆయన చెప్పారు. -
ఎంఈవో ఆఫీసులో అవినీతిపై డీఈవో విచారణ
వేములవాడ అర్బన్ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన అవినీతి వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి మంగళవారం విచారణ నిర్వహించారు. అక్కడ పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి కె.శ్రీనివాస్ ముగ్గురు రిటైర్డ్ టీచర్ల పేరిట ఐడీలు సృష్టించి వారి పేరు మీద రూ.17.88 లక్షలను డ్రా చేసుకున్న వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. 2015 ఏప్రిల్ నుంచి 2016 జనవరి వరకు ఈ వ్యవహారం నడిచింది. దీంతో డీఈవో శ్రీనివాసాచారి మంగళవారం వేములవాడలోని ఎంఈవో కార్యాలయానికి వచ్చి విచారణ నిర్వహించారు. రికార్డులను సీజ్ చేశారు. అలాగే, ఈ నిధులను ఎస్బీహెచ్ శాఖలోని రెండు ఖాతాల పేరిట డ్రా చేసుకున్నట్టు గుర్తించడంతో బ్యాంకు అధికారులతో మాట్లాడి వాటిని ఫ్రీజ్ చేయించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని డీఈవో శ్రీనివాసచారి తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఎంఈవో శోభన్రావు, అవినీతికి సూత్రధారి అయిన కె.శ్రీనివాస్, డబ్బులు డ్రా చేసుకోవడానికి సహకరించిన అరుణ్కుమార్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement