-
చెన్నైలో వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణం
చెన్నై: తమిళనాడు రాజధానిలో మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ పరిధిలో 60 ఏళ్లకు పైబడిన వారికి ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు సీఎం జయలలిత గురువారం ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. నెలలో పదిసార్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. -
తగ్గారు.. తగ్గిస్తారు
ప్రయాణికులకు శుభవార్త తగ్గనున్న ఆర్టీసీ బస్ చార్జీలు అధికారులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం : మంత్రి రామలింగారెడ్డి బెంగళూరు : కేఎస్ ఆర్టీసీ బస్సు టికెట్టు చార్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించేది లేదని నిన్నటి వరకూ చెబుతూ వచ్చిన కాంగ్రెస్ సర్కారు నేడు ఒక అడుగు వెనక్కు తగ్గింది. ప్రయాణికులకు మేలు చేకూర్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి బెళగావి లో స్థానిక మీడియాతో బుధవారం మాట్లాడుతూ... డీజిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ ఆర్టీసీ), బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) సంస్థలకు చెందిన బస్సుల్లో టికెట్టు చార్జీలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయిం చిందన్నారు. బీఎంటీసీలో ప్రతి స్టేజుకు గరిష్టంగా రూ.1, కేఎస్ ఆర్టీసీలో గరిష్టంగా రూ.2 టికెట్టు ధరలు తగ్గనున్నాయని తెలిపారు. అయితే అధికారులతో చర్చించి న అనంతం దీనిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఏదిఏమైనా మరో రెండు మూడు రోజుల్లో తగ్గిన టికెట్టు ధరలు అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. డీజిల్ ధరలు తగ్గుతున్న తరుణంలో దేశంలో తమ ప్రభుత్వమే మొదటిసారిగా బస్టికెట్టు ధరలను కూడా తగ్గిస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. -
ఖాళీ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మిస్తాం
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్కు చెందిన ఖాళీ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించనున్నామని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. నాగరభావి రెండవ స్టేజ్లో నూతనంగా నిర్మించదలిచిన బస్స్టేషన్కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ... కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించి అద్దెకు ఇవ్వడం వల్ల ఆయా సంస్థలకు లాభం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల డీజిల్ ఖరీదుకు గతంలో కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోందని రామలింగారెడ్డి పేర్కొన్నారు. బెంగళూరు శివారులో బస్స్టేషన్ నిర్మించడానికి అవసరమైన స్థలం లభించే అవకాశం ఉందన్నారు. అయితే బెంగళూరు నగరంలో బస్స్టేషన్లు నిర్మించడానికి అవసరమైన స్థల సేకరణలో పలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన తెలిపారు. శంకుస్థాపన జరిగిన పది నెలలల్లోపు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని బస్స్టేషన్ను అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. కళాసిపాళ్య వద్ద అత్యాధునిక బస్స్టేషన్ను నిర్మించనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన పనులు మార్చిలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర రవాణాశాఖలో కింది స్థాయి సిబ్బందిపై కొంతమంది అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధుల్లో ఉంటూ బస్ ప్రమాదాలు జరిగినప్పుడు అందుకు కారణమైన డ్రైవర్, కండక్టర్లకు అండగా న్యాయపోరాటం చేయాల్సిన బాధ్యత ఆయా సంస్థలదేనని వ ుంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ సత్యనారాయణ, ఉపమేయర్ ఇందిరా, బీఎంటీసీ డెరైక్టర్ అజుమ్ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు ఎంటీసీ చర్యలు
టీనగర్, న్యూస్లైన్: బస్సుల్లో ఫుట్బోర్డు ప్రయాణం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుండడంతో విద్యార్థులు అధికంగా ప్రయాణించే బస్రూట్లను గుర్తించి పరి శీలన జరిపేందుకు నగర మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంటీసీ) సన్నాహాలు ప్రారంభించింది. అక్టోబర్ 25వ తేదీన కోవలం నుంచి ప్యారిస్ వైపు వస్తున్న సిటీ బస్ (19జీ) ఫుట్బోర్డులో ప్రయాణించిన నీలాంగరై విద్యార్థి కన్నన్ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. గతవారం సుంగువారి సత్రం నుంచి తిరువళ్లూరుకు బయలుదేరిన ప్రభుత్వ బస్సు (టీ84ఎ) ఫుట్బోర్డులో ప్రయాణించిన 10వ తరగతి విద్యార్థి అరవింద్ 15 బన్నూరు బస్టాండ్ సమీపంలో జారిపడి మృతి చెందాడు. ఈ నెల తొమ్మిదవ తేదీన పెరంబూరు, మాధవరం హైరోడ్డులో వెళుతున్న సిటీ బస్సు (7జీ) ఫుట్బోర్డులో ప్రయాణించిన కార్తీక్ (16) కింద పడి మృతి చెందాడు. ఫుట్బోర్డు ప్రయాణాలతో అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడడంతో నిర్ణీత బస్సు రూట్లలో పీక్ అవర్స్లో ఎక్కువ బస్సులు నడపాలంటూ ఎంటీసీకీ విజ్ఞప్తులు అందాయి. బస్సు రూట్ల పరిశీలన: విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించే రూట్ల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. బుధవారం ఎంటీసీ అధికారుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో ప్రమాదాలను నివారించేందుకు ఏఏ రూట్లలో అధిక బస్సులు నడపాలనే విషయపై చర్చలు జరిపారు. దీని గురించి నగర రవాణా సంస్థ అధికారి ఒకరు మాట్లాడుతూ ఎంటీసీ ఆదాయ వనరుల విభాగానికి చెందిన ఆరుగురు సభ్యులతో బృందాలను ఏర్పరచి నగర మంతా పరిశీలన జరిపేందుకు చర్యలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. నిర్ణీత బస్సు రూట్లలో అధిక సంఖ్యలో బస్సులు నడిపేందుకు చర్యలుతీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'జ్యోతిష్యం బలంగా నమ్ముతా.. తెలుగులో నటించడం అదృష్టం భావిస్తున్నా'
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
భారీగా బయటపడ్డ అక్రమ ఆస్తుల చిట్టా
లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామంటున్న గజల్ అలఘ్.. ఎవరీమె?
ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో బిగ్ ట్విస్ట్
గ్లామర్ షో, వరుణ్ ధావన్ బేబీ జాన్ తో కీర్తి సురేష్ ఓకే
గ్లామర్ షో, వరుణ్ ధావన్ బేబీ జాన్ తో కీర్తి సురేష్ ఓకే
T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
నేను గీతాంజలిలా కాదు.. ఒక్కొక్కరి అంతు తేల్చేస్తా
లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
- నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
- వరంగల్లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
- స్టార్లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
- RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
- ‘కంగనా కాలు మోపిన ఆలయాలను శుద్ధి చేయాలి’
Advertisement