-
కుంగుబాటుతో జ్ఞాపకశక్తి సమస్యలు
న్యూయార్క్ : డిప్రెషన్తో బాధపడే రోగులు క్రమంగా జ్ఞాపకశక్తి సమస్యలతో సతమతమవుతారని తాజా అథ్యయనం వెల్లడించింది. కుంగుబాటుకు గురైన వారి మెదడు త్వరగా వయసు మీరడంతో మెమరీ సమస్యలు చుట్టుముడతాయని మియామి యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. తీవ్ర కుంగుబాటుకు లోనైన వారికి చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమవుతుందని, వారి మెదడు కుచించుకుపోయి..వయసు మీరే ప్రక్రియ వేగవంతమవుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని చెప్పారు. కుంగుబాటు అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీయకముందే చికిత్స చేయించుకోవాలని పరిశోధకులు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు, అల్జీమర్స్ తీవ్రంగా పెరుగుతున్నాయని వీటికి కారణాలు, చికిత్సపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. అల్జీమర్స్తో బాధపడే రోగులు కుంగుబాటుతోనూ సతమతమవుతున్నట్టు తాజా అథ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. కుంగుబాటుకు సత్వర చికిత్స తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి సమస్యలు, అల్జీమర్స్ ముప్పు నుంచి బయటపడవచ్చని సూచించారు. మెదడుపై డిప్రెషన్ పెను ప్రభావం చూపకముందే చికిత్సకు ఉపక్రమించాలని చెబుతున్నారు. కుంగుబాటుతో ఇబ్బందిపడుతున్న 1000 మందిపై మియామీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అథ్యయనం నిర్వహించారు. -
ఎక్స్-కిరణాల గుట్టురట్టు!
వాషింగ్టన్: విశ్వవ్యాప్తంగా ప్రసరిస్తున్న ఎక్స్-రే కిరణాలకు మూలాధారం ఒక్కటి కాదని అమెరికా శాస్త్రవేత్తలపరిశోధనలో వెల్లడైంది. సౌర గాలులు, లోక్ హాట్ బబుల్గా పిలిచే శక్తి కేంద్రం నుంచి మాత్రమే ఎక్స్-రే కిరణాలు వెలువడుతున్నాయని గత కొన్ని దశాబ్దాలుగా భావిస్తున్నారు. కానీ, పరిశోధకులకు తెలియని ప్రాంతం నుంచీ ఎక్స్-రే కిరణాలు వెలువడుతున్నాయని, ‘డీఎక్స్ఎల్’ సౌండింగ్ రాకెట్ పంపిన సమాచారాన్ని క్రోడీకరించాక పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా శక్తివంతమైన ఎక్స్-రే కిరణాలు మరేదో ప్రాంతం నుంచి వస్తున్నాయని ధ్రువీకరించారు. పాత సిద్ధాంతంలో మార్పులు చేయాల్సిన అవసరముందని మియామి వర్సిటీ శాస్త్రవేత్త గలేజ్ తెలిపారు. మన సౌరవ్యవస్థ ఆవల విస్తరించి ఉన్న ‘ లోకల్ హాట్ బబుల్’ ప్రాంతం నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాలపై పరిశోధన నిమిత్తం ‘డీఎక్స్ఎల్’ సౌండింగ్ రాకెట్ను 2012లో నాసా ప్రయోగించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement