-
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అమెరికా స్పందన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఉగ్రవాదులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఉగ్రవాదులను హతమార్చేందుకు సరిహద్దులు దాటేందుకు భారత్ వెనుకాబోదని మోదీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ బుధవారం స్పందించారు. ‘ఈ విషయంలో ఇప్పటికే ఒకసారి స్పష్టత ఇచ్చాను. అమెరికా ఈ విషయంలో అస్సలు జోక్యం చేసుకోదు. కానీ భారత్, పాకిస్తాన్ దేశాలు సమరస్యంగా చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్యలు తీసుకోవాలి’ అని మిల్లర్ అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్లోని రిషికేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు భారతదేశంలో చాలా దృఢమైన ప్రభుత్వం ఉంది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వారి ఇళ్ల వద్ద హతమార్చడానికి కూడా వెనకాడబోము’ అని అన్నారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘భారత దేశంలోని శాంతికి భంగం కల్గిస్తే.. ఉగ్రవాదలు పాకిస్తాన్లో ఉన్నా అంతం చేస్తాం’ అని అన్నారు. మరోవైపు రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది.‘భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది’ అని పేర్కొంది. అంతకుముందు.. పాకిస్తాన్లో ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని బ్రిటన్కు చెందిన దీ గార్డియన్ పత్రిక ఓ నివేదిక విడుదల చేసింది. 2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్ పాటిస్తోందని పేర్కొంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్ పత్రిక పేర్కొనటం గమనార్హం. -
శతకాలతో మెరిసిన డు ప్లెసిస్, మిల్లర్
హొబార్ట్: డేవిడ్ మిల్లర్ (108 బంతుల్లో 139; 13 ఫోర్లు, 4 సిక్స్లు), కెప్టెన్ డు ప్లెసిస్ (114 బంతుల్లో 125; 15 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత శతకాలతో చెలరేగారు. దీంతో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 40 పరుగుల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్ను 2–1తో సొంతం చేసుకుంది. ఆసీస్ గడ్డపై 2009 అనంతరం దక్షిణాఫ్రికాకు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మిల్లర్, డుప్లెసిస్ దూకుడుతో 50 ఓవర్లలో 320 పరుగులు చేసింది. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో వీరిద్దరూ నాలుగో వికెట్కు 252 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఏ వికెట్కైనా నమోదైన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. చివరి 15 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఏకంగా 174 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టొయినిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆసీస్ 9 వికెట్లకు 280 పరుగులు చేసి ఓడింది. షాన్ మార్‡్ష (106; 7 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీకి తోడు స్టొయినిస్ (63; 5 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకంతో రాణించాడు. చివర్లో అలెక్స్ క్యారీ (42), మ్యాక్స్వెల్ (35) పోరాడినా లాభం లేకపోయింది. సఫారీ బౌలర్లలో స్టెయిన్, రబడ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
రైతు నెత్తిన కి’రాయి’
ధాన్యం రవాణా సొమ్ము మిల్లర్ల ఖాతాల్లోకి తేమ శాతం ఎక్కువగా చూపి మద్దతు ధరలోనూ కోత భీమవరం : ఓ వైపు పెద్దనోట్ల రద్దు ప్రభావం.. మరోవైపు ఇన్పుట్ సబ్సిడీ, బ్యాంకు రుణాలు అందక అవస్థ పడుతున్న రైతులు ధాన్యం అమ్మకం విషయంలోనూ నిలువునా దోపిడీకి గురవుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేవలం కమీషన్ల కోసమే పనిచేయడం.. అధికారులు పట్టించుకోకపోవడంతో అన్నదాతలు నష్టాల పాలవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించిన రైతులకు అందాల్సిన రవాణా చార్జీ (కిరాయి)లను మిల్లర్లు తన్నుకుపోతున్నారు. మరోవైపు ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నట్టు చూపించి రైతులకు చెల్లించాల్సిన సొమ్ములో కోత విధించి దోపిడీ చేస్తున్నారు. సాగిపోతోంది నిబంధనల ప్రకారం ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి ఆ తరువాత మిల్లర్లకు ఇవ్వాలి. ధాన్యం సొమ్ముతోపాటు బస్తాలను కొనుగోలు కేంద్రానికి తరలించినందుకు గాను రవాణా చార్జీలను ప్రభుత్వమే రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు అప్పగించిందుకు గాను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కమీషన్ చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో రవాణా చార్జీలను ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే రైతులకు చెల్లించి.. అనంతరం ప్రభుత్వం నుంచి వారు పొందేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా భిన్నంగా నడుస్తోంది. కొందరు రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించగా, కొన్నిచోట్ల దళారుల సాయంతో మిల్లర్లే వ్యవసాయ క్షేత్రాల నుంచి నేరుగా ధాన్యం సేకరించారు. ఐకేపీ కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై.. ఆ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలే రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు, అక్కడి నుంచి మిల్లులకు చేరవేసినట్టు రికార్డుల్లో నమోదు చేయిస్తున్నారు. ఆ ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తూ.. ఒక శాతానికి రూ.30 చొప్పున కోత వేస్తున్నారు. ఇలా ప్రతి రైతు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు నష్టపోతున్నారు. ఇలా చేయడం వల్ల ధాన్యం తరుగు రూపంలో రైతులకు నష్టం కలుగుతుండగా, ఆ మేరకు మిల్లర్లు లాభపడుతున్నారు. ఉదాహరణకు రైతు నుంచి 100 బస్తాల ధాన్యాన్ని మిల్లర్ నేరుగా తీసుకెళ్లి.. ఒక శాతం ఎక్కువ తేమ ఉన్నట్టు చూపిస్తే, ఆ ధాన్యం ఆరిన తరువాత సుమారు 50 కేజీల బరువు తగ్గిందనుకుంటే.. దానిని తరుగుగా నమోదు చేస్తారు. నిజానికి 17 శాతం తేమ శాతం ఉంటే ధాన్యం తరుగు ఉండదు. అంటే ఒక శాతం తేమ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తే మిల్లర్కు 50 కేజీల ధాన్యం (అంచనా మాత్రమే) మిగులుతుంది. ఒక శాతం తేమ ఎక్కువ ఉన్నందుకు రైతు క్వింటాల్కు రూ.30 నష్టపోతాడు. మరోవైపు రైతుల నుంచి నేరుగా తాము ధాన్యం కొనుగోలు చేసి బస్తాకు రూ.60 చొప్పున ఎక్కువ ధర చెల్లిస్తున్నట్టు మిల్లర్లు చెబుతున్నప్పటికీ.. తేమ శాతం 17కంటే ఎక్కువ ఉన్నట్టు చూపించి ధరలో కోత వేస్తున్నారు. మరోవైపు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లలకు తరలించినందుకు తమకు రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉందంటూ.. మొత్తం సొమ్మును మిల్లర్లే కాజేస్తున్నారు. దీనివల్ల కొనుగోలు కేంద్రాలకు నేరుగా ధాన్యం తరలించిన రైతులకు రవాణా చార్జీలు అందటం లేదు. ఆ మొత్తాన్ని కూడా మిల్లర్ల ఖాతాలోనే అధికారులు జమ చేస్తున్నారు. జిల్లాలో సార్వా సీజన్లో సుమారు 5.94 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించగా, సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం 161 ఐకేపీ కేంద్రాలు, 96 వ్యవసాయ సహకార పరపతి సంఘాల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు సుమారు 75వేల మంది రైతుల నుంచి సహకార సంఘాలు సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులు, ఐకేపీ కేంద్రాలు సుమారు 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. తేమ పేరుతో రూ.30 వేలు నష్టపోయా నాకు 8 ఎకరాల సొంత భూమి ఉంది. వరి సాగు చేయగా ఎకరాకు 25 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. మొత్తం ధాన్యాన్ని మిల్లుకు తోలాను. తేమ శాతం ఎక్కువగా ఉందని బస్తాకు కేవలం రూ.950 మాత్రమే చెల్లించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చేతికి అందకపోవడం వల్ల దాదాపు రూ.30 వేలు నష్టపోయాను. కాగిత దాననాగేశ్వరరావు, రైతు, రాయకుదురు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement