-
ఓల్డ్ సీటీలో ఎంఐఎం నేతలు అరెస్ట్
-
ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై మజ్లిస్ ఆందోళన
-
దేశాన్ని..రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
చార్మినార్/దూద్బౌలి: ‘‘దేశాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి..ఇదే ప్రస్తుతం మన ముందున్న ప్రధాన కర్తవ్యం.. ఇళ్లకే పరిమితం కాకుండా రోడ్లపైకి రావాలి. మనం తెలిపే వ్యతిరేకతతో కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి’’అంటూ పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. మజ్లిస్ పార్టీ, యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాత్రి పాతబస్తీ ఖిల్వత్ మైదానంలో ‘జస్నే జమూరియత్, ఎతాజాజీ ముషాయిరా’అనే పేరుతో భారీ బహిరంగ సభ జరిగింది. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సభలో పలువురు కవులు, కళాకారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొని తమ వ్యతిరేకతను చాటి చెప్పారు. హైకోర్టు షరతులతో కూడిన అనుమతివ్వడంతో నిర్దేశిత సమయంలోనే సభను ముగించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవెసీ మాట్లాడకుండానే సభ ముగిసిం ది. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు అస్మా జాహేరా, ఇమారత్ మిలియా సరయా అధ్యక్షు డు జాఫర్ పాషా తదితరులతో పాటు సభలో ప్రముఖ కవులు మంజర్ బోపాలీ, రహాత్ ఇందోర్, హుస్సేనీ హైదరీ, అఫ్జల్ మంగ్లూరీ, ఇఖ్రాఖాన్ తదితరులు ఆలపించిన ముషాయిరాలు పలువురిని ఆకట్టుకున్నాయి. హైకోర్టు షరతులతో కూడిన ఉత్తర్వుల మేరకు శనివారం రాత్రి సభ సకాలంలో ముగిసిందని గ్రేటర్ బీజేపీ ఉపాధ్యక్షుడు టి.ఉమామహేంద్ర అన్నారు. -
ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వివిధ డివిజన్లలో ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు, సంతోష్ నగర్లో సీపీఎం కార్యకర్తలపై దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. పాతబస్తీని ఎంఐఎం తన సామ్రాజ్యంగా భావిస్తూ రౌడీయిజం చేస్తోందని మంగళవారం ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే సహించేది లేదని హెచ్చరించారు. దాడులకు పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఓటమి భయంతోనే మజ్లిస్ దాడులు: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ నాయకులపై ఎంఐఎం కార్యకర్తలు దాడులు చేసి హింసకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేశారని మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కౌన్సిల్ నేత షబ్బీర్ అలీని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ నెట్టేయడం, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడం వంటి అరాచకాలకు పాల్పడటం దారుణమని దుయ్యబట్టారు. ఎంఐఎం దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement