-
బాలికపై లైంగికదాడికి యత్నం
సాక్షి, దాచేపల్లి : మండలంలోని పెదగార్లపాడు గ్రామంలో బాలికపై లైంగికదాడి యత్నం జరిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అత్యాచారయత్నంకు పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్తులు భారీ సంఖ్యలో పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తల్లి చనిపోగా, తండ్రి మరో చోట ఉండటంతో 17 సంవత్సరాల వయస్సున్న మైనార్టీ వర్గానికి చెందిన బాలిక తాతయ్య, నాయనమ్మల వద్ద ఉంటోంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో గ్రామానికి చెందిన కర్పూరపు వెంకటేశ్వర్లు కుమారుడు నాగేశ్వరరావు బాలిక ఉంటున్న ఇంట్లో కరెంట్ మెయిన్ స్విచ్ ఆపి ఇంట్లోకి ప్రవేశించాడు. ఎంత సేపటికి కరెంట్ రాకపోవటంతో ఇంట్లో ఉన్న వృద్ధులు, బాలిక నిద్ర లేచారు. పక్కింట్లో కరెంట్ ఉండి వీరి ఇంట్లో లేకపోవటంతో బోర్డు వైపు చూడగా, కరెంట్ మెయిన్ ఆపి ఉన్నట్టు గమనించి తిరిగి వేశారు. దీంతో కరెంట్ సరఫరా అయింది. ఇంట్లో గదిలో పడుకున్న బాలికపై అప్పటివరకు మంచం కింద దాక్కున్న నాగేశ్వరరావు లేచి లైంగిక దాడి చేయబోయాడు. బాలిక కేకలు వేయటంతో తాత, నాయనమ్మలు లేచి నాగేశ్వరరావును బలవంతంగా బయటకు పంపించారు. బయటకు ఈ విషయం చెప్పొద్దంటూ నాగేశ్వరరావు బెది రించాడు. బాలిక, తాత, నాయనమ్మ ముస్లిం పెద్దలకు చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం ముస్లింలతో పాటు మహిళలు భారీగా తరలివచ్చి బాలికతో ఫిర్యాదు ఇప్పించారు. అత్యాచార యత్నం చేసిన నాగేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం నేతలు డిమాండ్ చేశారు. బాలిక ఫిర్యాదుమేరకు నిందితుడు నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రఫీ చెప్పారు. -
ప్రేమించట్లేదని.. విద్యార్థినిపై బ్లేడుతో దాడి
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తన ప్రేమను నిరాకరించిందని తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. ఈ సంఘటన ఏలూరు పాత బస్టాండ్లో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన విజయ్ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమ పేరుతో వేదింపులకు గురిచేస్తున్నాడు. బాలిక అతని ప్రేమను తిరస్కరించడంతో స్నేహితులతో కలిసి ఆమె పై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యార్థిని చేతికి, ముఖానికి గాయాలుకావడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
నగ్నఫొటోలతో బెదిరించి.. బాలికలపై అత్యాచారం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరకులోయ మండలం వెన్నెల పంచాయితీకి చెందిన ముగ్గురు యువకులు అదే గ్రామానికి చెందిన బాలికల నగ్న ఫోటోలు తీసి బెదిరించి అత్యాచారం జరిపారు. ఈ విషయం బాలికలు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అరకులోయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకులపై కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. -
బాలికపై అత్యాచారం
ఆలస్యంగా వెలుగుజూసిన వైనం నిందితుడిపై కేసులు నమోదు వినుకొండ రూరల్(గుంటూరు) : బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి నిందితుడిపై ఫిర్యాదుచేసేందుకు పోలీసుస్టేషన్కు వెళ్లినా సరైన సహకారం అందకపోవడంతో మూడురోజులుగా మానసిక వేదనతో కుంగిపోయింది. స్థానిక మహిళలకు విషయం చెప్పగా వారు ఆమె భుజం తట్టి మేమున్నామంటూ ధైర్యం చెప్పడంతో ఎట్టకేలకు శుక్రవారం నిందితుడిపై కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక బుధవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తుంది. అదే ఇంట్లో గత ఏడు నెలలుగా అద్దెకు ఉంటున్న విశాల్ బాలిక వద్దకు వచ్చి అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనుమానం వచ్చి కూతురు నిద్రిస్తున్న మంచం వైపు తల్లి చూసింది. గమనించిన విశాల్ ఒక్కసారిగా అక్కడి నుంచి పరారయ్యాడు. బాలికకు అధిక రక్తస్రావం కావడంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేర్పించారు. బాలిక తేరుకోవడంతో స్థానికులు వెంకాయమ్మకు మద్దతుగా నిలిచారు. ఏఎస్సై పూర్ణ చంద్రరావు కేసు నమోదు చేసి సెక్షన్ 307 క్లాస్(2), సెక్షన్ 10తో పాటు మరికొన్ని సెక్షన్లతో విశాల్పై కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు
మీకు ప్రశ్నించే హక్కు ఉందా..?
ముక్కోటి దేవతలకు ఆహ్వానం
తిరుపతి గ్రామదేవతకు వేడుకగా భూమన కుటుంబం సారె
చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలు
పాల వ్యాన్ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి
కనిపించని ఏనుగు జాడ
ఘనంగా చిన్నకొట్టాయి ఉత్సవం
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
ముగ్గురూ ఆడపిల్లలైనా..
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
- బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
- Kishori Lal Sharma: ఆమె నాకు పోటీయే కాదు!
- Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!
- 9 సీట్లలో గెలుపు ఖాయం
- అంచనాలకు మించి..
Advertisement