-
రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం
అహ్మదాబాద్: ఆగి ఉన్న వాహనాన్ని మినీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో 10 మంది చనిపోగా మరో 13 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘోర ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖేడా జిల్లా కపడ్వంజ్ తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 23 మంది సురేంద్రనగర్ జిల్లా చోటిలాలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారి వాహనం శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో బగోదర సమీపంలో రాజ్కోట్–అహ్మదాబాద్ హైవేపై రోడ్డు పక్క ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 13 మంది గాయపడినట్లు ఎస్పీ అమిత్ వాసవ తెలిపారు. ఘోర ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. -
టాటా ఏస్ ఎలక్ట్రిక్ డెలివరీలు షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఏస్ ఎలక్ట్రిక్ మినీ ట్రక్ డెలివరీలు ప్రారంభించింది. ధర ఎక్స్షోరూంలో రూ.9.99 లక్షల నుంచి మొదలు. ముందుగా 10 నగరాల్లో డెలివరీలను చేపట్టినట్టు కంపెనీ ప్రకటించింది. ఢిల్లీ, పుణే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వీటిలో ఉన్నాయని వెల్లడించింది. ఈవీజెన్ పవర్ట్రైయిన్తో టాటా నుంచి తొలిసారిగా ఇది రూపుదిద్దుకుంది. 130 ఎన్ఎం గరిష్ట టార్క్తో 27 కిలోవాట్ పవర్ మోటార్ ఏర్పాటు ఉంది. ఒకసారి చార్జింగ్తో 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2022 మే నెలలో ఏస్ ఎలక్ట్రిక్ను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఆ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్బాస్కెట్, సిటీలింక్, డీవోటీ, లెట్స్ట్రాన్స్పోర్ట్, మూవింగ్, యేలో ఈవీ తదితర కంపెనీలతో మొత్తం 39,000 యూనిట్ల ఎలక్ట్రిక్ ఏస్ సరఫరాకు ఒప్పందం కుదిరింది. కాగా, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్లలోనూ ఇది లభిస్తుంది. ఇప్పటి వరకు భారత్లో 20 లక్షల పైచిలుకు ఏస్ వాహనాలు రోడ్డెక్కాయి. -
ప్రజా పంపిణీలోనూ యువతకు ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన మొబైల్ మినీ వ్యాన్తో తనకు చక్కటి ఉపాధి లభించిందని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జంపాన కృష్ణచైతన్య గర్వంగా చెబుతున్నాడు. రూ.5,81,190 విలువైన మినీ వ్యాన్, వేయింగ్ మెషిన్కు తన వాటాగా కేవలం 10 శాతం మాత్రమే తాను చెల్లించానని తెలిపాడు. మిగిలిన 90 శాతాన్ని ప్రభుత్వమే సబ్సిడీ కింద బ్యాంకుకు వాయిదాల్లో చెల్లిస్తోందన్నాడు. వ్యాన్తో తనకు నెలకు రూ.18 వేలు వేతనం కూడా వస్తోందని సంతోషం వ్యక్తం చేశాడు. పేద ప్రజలకు ఇళ్ల వద్దే రేషన్ బియ్యం అందించే కార్యక్రమంలో భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందంటున్నాడు.. శ్రీకాకుళం జిల్లా ఆత్మకూరుకు చెందిన పులిచర్ల ఈళ్లయ్య. ప్రభుత్వం మొబైల్ మినీ ట్రక్కులను సబ్సిడీపై అందిస్తుండటంతో గతేడాది దరఖాస్తు చేసుకున్నానని వివరించాడు. ప్రతి నెలా 1న రూ.18 వేలు వేతనం పొందుతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో మొబైల్ మినీ ట్రక్కుల ద్వారా ఉపాధి పొందుతున్న ఏ ఒక్క యువకుడిని పలకరించినా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రక్రియ సత్ఫలితాలనిస్తోందని అర్థమవుతోంది. దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దే రేషన్ అందించే పద్ధతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఫిబ్రవరి 1తో ఏడాది పూర్తయ్యింది. ఇతర రాష్ట్రాలు సైతం ఆసక్తి కనబరుస్తున్న ఈ కొత్త ఒరవడిలోనూ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడం మరో విశేషం. రాష్ట్రంలోని ప్రజలకు నేరుగా వారి ఇళ్ల వద్దే రేషన్ సరుకులు అందించేలా ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి 1న 9,260 మొబైల్ వాహనాలను అందించింది. వాటి ద్వారా రోజుకు కనీసం 90 కార్డుదారులకు తగ్గకుండా వారి ఇళ్లకే వెళ్లి రేషన్ సరుకులు అందించేలా చర్యలు చేపట్టింది. 90 శాతం సబ్సిడీ.. ప్రతి నెలా వేతనం ప్రభుత్వం పౌరసరఫరాల పంపిణీ సంస్థ ద్వారా అందించిన ఈ వాహనాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ మొత్తాన్ని సమకూర్చింది. రేషన్ సరఫరా కోసం అందించిన నాలుగు చక్రాల మొబైల్ మినీ ట్రక్కు (ఒక్కొక్క వాహనం) రూ.5,72,539, బరువు తూచే యంత్రం రూ.8,651 మొత్తం ధర రూ.5,81,190. ఈ మొత్తంలో పది శాతాన్ని లబ్ధిదారుడు చెల్లించాడు. మిగిలిన 90 శాతంలో 60 శాతం ప్రభుత్వ సబ్సిడీ, మరో 30 శాతం లబ్ధిదారులకు వాయిదాల పద్ధతిలో రుణం ఇచ్చిన బ్యాంకులకు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. అయితే లబ్ధిదారుడు తొలుత చెల్లించిన 10 శాతం మినహా మొత్తం 90 శాతాన్ని ప్రభుత్వమే చెల్లించేలా గతేడాది జూలైలో నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని ఆయా కార్పొరేషన్ల ద్వారా 72 వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చే సింది. దీంతో ట్రక్కులు నిర్వహిస్తున్న యువతకు మరింత భరోసా లభించింది. అంతేకాకుండా ప్రతి నెలా వారికి వేతనం కూడా అందుతోంది. -
సబ్సిడీపై 5,600 మినీ ట్రక్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీలకు 3,800 మినీ ట్రక్కులు, ఈబీసీలకు 1,800 మినీ ట్రక్కులు.. మొత్తం 5,600 మినీ ట్రక్కులను సబ్సిడీపై ప్రభుత్వం అందజేయనుంది. వెనుకబడిన తరగతులు (బీసీ), ఆర్థికంగా వెనుకబడిన వారి (ఈబీసీ) అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ)లను మంజూరు చేసింది. బీసీలు, ఈబీసీల సంక్షేమం, స్వయం ఉపాధి పథకం మార్గదర్శకాలను సోమవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము జారీ చేశారు. మొత్తం యూనిట్ (మినీ ట్రక్కు) వ్యయంలో 10 శాతం లబ్ధిదారుడు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 90 శాతాన్ని ఎంపిక చేసిన బ్యాంకు నుంచి రుణంగా అందిస్తారు. 90 శాతం అప్పులో లబ్ధిదారుడు 60 శాతం సబ్సిడీగా పోనూ మిగిలిన 30 శాతాన్ని 72 నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లించాలి. కాగా, ఇప్పటి వరకు లబ్ధిదారుడికి ఇస్తున్న 30 శాతం సబ్సిడీని 60 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లబ్ధిదారుడిపై ఆర్థిక భారం తగ్గుతుంది. లబ్ధిదారుడికి సబ్సిడీగా ఇచ్చిన 60 శాతాన్ని రాష్ట్ర ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి సంస్థ ద్వారా బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. -
వంద శాతం రుణంతో మహీంద్రా సుప్రో ప్రాఫిట్ ట్రక్స్
Mahindra Supro Profit Truck హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా సుప్రో ప్రాఫిట్ ట్రక్ శ్రేణిని ప్రవేశపెట్టింది. ధర ముంబై ఎక్స్ షోరూంలో మినీ రూ.5.4 లక్షల నుంచి, మ్యాక్సీ రూ.6.22 లక్షల నుంచి ప్రారంభం. డీజిల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. సుప్రో ప్లాట్ఫాంపై ఇవి రూపొందాయి. కొనుగోలుదార్లు అయిదేళ్ల కాలపరిమితితో 100 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. ‘సామర్థ్యం, ఇంజినీరింగ్ కారణంగా కస్టమర్లు ఇష్టపడే చిన్న వాణిజ్య వాహనంగా సుప్రోకు ప్రాధాన్యత ఉంది. వినియోగదార్ల లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని నూతన శ్రేణిని అందుబాటులోకి తెచ్చాం’ అని కంపెనీ ఆటోమోటివ్ విభాగం సీఈవో విజయ్ నక్రా తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement