-
సబ్ స్టేషన్లకు రూ.110 కోట్లు
♦ ఇకపై లో ఓల్టేజీ సమస్య పూర్తిగా తీరుతుంది ♦ ఇప్పటికే రైతులకు 9గంటలు విద్యుత్ ఇస్తున్నాం ♦ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి చేవెళ్ల రూరల్: జిల్లాలో 50 విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు రూ.110 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి అన్నారు. గురువారం మంత్రి మహేందర్రెడ్డి చేవెళ్ల మండలం ముడిమ్యాలలో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం, రేగడిఘనాపూర్లో కొత్తగా నిర్మించే 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నిరంతర కరెంట్, రైతులకు 9 గంటల సరఫరాను అందిస్తున్నామని చెప్పారు. దీని వల్ల జిల్లాలోని లక్షా 10వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 50 యూనిట్లలోపు విద్యుత్ వాడిన ఎస్సీ, ఎస్టీలకు చార్జీల మాఫీ చేశామని మంత్రి చెప్పారు. జిల్లాలోని తూర్పు డివిజన్లో 9 సబ్స్టేషన్లకు రూ.22కోట్లు, ఉత్తర డివిజన్లో 14 సబ్స్టేషన్లకు రూ.53కోట్లు, పశ్చిమ డివిజన్లో రూ.17 సబ్స్టేషన్లో రూ.34 కోట్లు కేటాయించామన్నారు. ఇంకా 37 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో 8 సబ్స్టేషన్లకు గాను రూ.17 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుతో వినియోగదారులకు లో ఓల్టేజీ సమస్య ఉండదన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రజలు బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి పనిచేస్తేనే ఆ కల నేరవేరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి, విద్యుత్ ఎస్ఈ శ్రీరామలు, డీఈ దుర్గారావు, ఏఈ అశోక్రావు, సర్పంచులు కోరే సువర్ణ, తిప్పని రాంరెడ్డి, ఎంపీసీటీ సభ్యులు బుర్ల సుమలత, శ్రీలత, ఎంపీపీ ఎం.బాల్రాజ్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పి. వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
'రూ.50 కోట్లతో వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధి'
-తాండూర్, వికారాబాద్, శంకర్పల్లి మార్కెట్లకు జాతీయస్థాయి గుర్తింపు -ధారూరు మార్కెట్ అభివృద్ధికి రూ. 2 కోట్లు -రాష్ట్ర రవాణశాఖ మంత్రి పి. మహేందర్రెడ్డి ధారూరు : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు రూ. 50 కోట్లు కేటాయించామని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పి. మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం ధారూరు మండల కేంద్రంలోని స్టార్ పంక్షన్హాలులో జరిగిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో కొత్తగా కోట్పల్లి, బషిరాబాద్, కులకచర్ల, మహేశ్వరం వ్యవసాయ మార్కెట్లను మంజూరు చేసినట్లు మహేందర్ రెడ్డి వివరించారు. కొత్త మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు రూ. 2 కోట్ల చొప్పున కేటాయించామని, ధారూరు మార్కెట్కు కూడ రూ. 2 కోట్లు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. జిల్లాలోని తాండూర్, వికారాబాద్, శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్లు జాతీయ స్థాయి మార్కెట్లుగా ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 44 వ్యవసాయ మార్కెట్లు జాతీయ స్థాయి మార్కెట్లుగా ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. జిల్లాలోని 1146 చెరువులకు రూ. 385 కోట్లు మంజూరు చేశామని అన్నారు. అలాగే బీజాపూర్-హైదరాబాద్ రహదారి విస్తరణ పనులకు రూ. 300 నుంచి రూ. 400 కోట్లు మంజూరు అవుతేన్నాయని అన్నారు. అలాగే తాండూర్-వికారాబాద్ వయా ధారూరు మీదుగా ఉన్న డబుల్ లైన్ రోడ్డును ఫ ఓర్లైన్స్ రోడ్డుగా మార్చడానికి రూ. 40 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుగా చేసి జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ధారూరు మండలానికి ఎస్సీ, ఎస్టీలకు గురుకుల పాఠశాలలు మంజూరు చేయిస్తామని మంత్రి హామి ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు అంశం తన పరిధిలో లేదని డిప్యూటి సీఎంను కలసి కళాశాల మంజూరు కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
♦ కొత్వాల్గూడలో ‘మన తెలంగాణ మన వ్యవసాయం’ ♦ ప్రారంభంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి శంషాబాద్ : రైతు సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్రెడ్డి అ న్నారు. కొత్వాల్గూడ గ్రామంలో ‘మన తెలంగాణ మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు విడతలుగా రైతుల రుణమాఫీని అమలుపర్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ‘మన తెలంగాన మన వ్యవసాయం’ ద్వారా రైతులకు అందించే సూచనలు, సలహాలను సద్వినియోగం చేసుకుని, అధిక పంట దిగుబడులను సాధించాలని ఆయన సూచిం చారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న పం డ్లు, పూలు మన దగ్గరే పండించుకుని, రైతులు మరింత అభివృద్ధి సాధించాలని ఆయన అభిలషించారు. ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులతో రైతుల జీవితాలు మెరుగుపడే రోజులు రానున్నాయన్నారు. వ్యవసాయశాఖ అందించే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ సూచిం చారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లకు సంబంధించిన వారు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు సతీష్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రావణ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సురేష్గౌడ్, కొత్వాల్గూడ సర్పంచ్ గుర్రంపల్లి ప్రసన్న, ఉప సర్పంచ్ పత్తి నర్సింగ్రావు, శంషాబాద్ పీఏసీఎస్ చైర్మన్ కొలను మహేందర్రెడ్డి వ్యవసాయ అధికారులు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
‘చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు’
తెలంగాణ సర్కారు చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండల కేంద్రంలో మిషన్ కాకతీయ కింద రూ.66 లక్షలతో మంజురైన ఊర చెరువు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం సాగునీటి రంగఅభివృద్ధికి ఊతమిస్తోందని అన్నారు. పూడిక తీతతో చెరువులు పుష్కలంగా నిండి ఏడాదికి రెండు పంటలు పండే అవకాశం ఉందని తెలిపారు. మండలంలోని 39 చెరువులకు రూ.17కోట్లు, తాండూరు- తోర్మామిడి రోడ్డు పనులకు రూ.27 కోట్ల నిధులు, తాండూరు రింగ్ రోడ్డు సర్వేకు రూ.80 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. -
హామీలు నెరవేర్చితీరుతాం
ఇబ్రహీంపట్నం: పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని..ఇందులో రాజీపడే ప్రసక్తి లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి వెల్లడించారు. మండల పరిధిలోని శేరిగూడలో రూ.70లక్షల వ్యయంతో నిర్మిం చిన ఉప్పరిగూడ పీఏసీఎస్ భవనాన్ని గురువారం ఆయన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలకు నెరవేర్చి తీరుతామని అన్నారు. జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యికోట్ల రుణమాఫీని ప్రకటించిందని, లక్ష పైచి లుకు రైతులకు రుణమాఫీ పథకం వర్తింపచేస్తున్నామని పేర్కొన్నారు. మొదటి విడత రుణమాఫీ కింద రూ.253 కోట్లమేర అందజేసినట్లు చెప్పారు. వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసేదిశగా గ్రామానికో చెరువును వినియోగంలోకి తెస్తామన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ.220 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ పరపతి సంఘాలు వాణిజ్య బ్యాంక్లకు దీటుగా ఎదగాలని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పండ్ల తోటలు, పూల తోటల పెంపకంపై ప్రోత్సాహకాలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీసీఓ రాందాస్, ఎంపీపీ కొత్త అశోక్గౌడ్, నగరపంచాయతీ చైర్మన్ కంబాలపల్లి భరత్కుమార్, జెడ్పీటీసీ సభ్యులు పొట్టి ఐలయ్య, కర్నాటి రమేష్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, వైస్ చైర్మన్ ఈర్ల వెంకట్రెడ్డి, ఉప్పరిగూడ సర్పంచ్ పోరెడ్డి సుమతి అర్జున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం ఫొటో లేదని రగడ... అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం ఫొటో లేకపోవడంపై టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సీఎం ఫొటోను ఫ్లెక్సీలో ఎందుకు ముద్రించలేదంటూ సీఈఓ గణేశ్ను నిలదీశారు. అంతటితో ఆగకుండా సీఎం ఫొటో లేని ఫ్లెక్సీని తొల గించాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసులు జోక్యంతో గొడవ సద్దుమణిగింది. తోబుట్టువు మరణించినా విధుల్లోకి.. ఉప్పరిగూడ పీఏసీఎస్ నూతన భవన ప్రారంభ కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. పీఏసీఎస్ సీఈఓ గణేశ్ తోబుట్టువు మైసమ్మ గురువారం ఉదయం మరణించింది. అంత్యక్రియలు కూడా కాలేదు. ఇదే రోజు సహకార సంఘం భవనం ప్రారంభం ఉండడంతో బాధను దిగమింగుకుని ఆయన విధులకు హాజరయ్యారు. అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement