-
ఫిజిక్స్ కాస్త కఠినం
ప్రశాంతంగా ఎంసెట్ పరీక్ష ► ఇంజనీరింగ్లో సరైన జవాబుల్లేని మూడు ప్రశ్నలు ► నిమిషం నిబంధనతో తిప్పలు ► ఇంజనీరింగ్లో 93.43 శాతం.. అగ్రికల్చర్, ఫార్మసీలో 92.97 శాతం హాజరు ► నేడు ప్రాథమిక కీ.. 18 వరకు అభ్యంతరాల స్వీకరణ ► 22న ఎంసెట్ ర్యాంకులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం నిర్వహించిన ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఇంజనీరింగ్ విభాగంలో 93.43 శాతం మంది.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 92.97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలో భౌతికశాస్త్రం (ఫిజిక్స్) ప్రశ్నలు కాస్త కఠినంగా వచ్చాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఎంసెట్ ప్రశ్నపత్రం సెట్ కోడ్ను ఉదయం 6 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. 246 కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభమైంది. 1,41,190 మంది విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. 1,31,910 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక 154 కేంద్రాల్లో మధాహ్నం 2:30కు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష ప్రారంభమైంది. దీనికి 79,061 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. 73,501 మంది పరీక్ష రాశారు. కాగా.. ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ని శనివారం విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ యాదయ్య తెలిపారు. వాటిపై ఈనెల 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి.. 22వ తేదీన ర్యాంకులను ప్రకటిస్తామని వెల్లడించారు. సులభంగానే ప్రశ్నపత్రం.. ఫిజిక్స్ ప్రశ్నలు కొంత కఠినంగా వచ్చినా.. మొత్తంగా గతేడాదితో పోల్చితే సులభంగానే ప్రశ్నలు వచ్చాయని సబ్జెక్టు నిపుణులు ఎంఎన్ రావు వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని మరో సబ్జెక్టు నిపుణులు మూర్తి తెలిపారు. సెట్ ‘ఎ’కోడ్ ప్రశ్నపత్రంలోని 87, 98, 110 ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన జవాబులు లేవని వివరించారు. దీంతో కొంతమంది విద్యార్థులు కొద్దిపాటి గందరగోళానికి గురయ్యారని చెప్పారు. సిలబస్లోని అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు వచ్చాయన్నారు. గతేడాది ఎంసెట్లో ఎక్కువ సమయం తీసుకునే సుదీర్ఘ ప్రశ్నలు 15 వరకు ఇవ్వగా.. ఈసారి అలాంటివి నాలుగైదు మాత్రమే ఉన్నాయని వివరించారు. ఇటీవల జరిగిన ఏపీ ఎంసెట్తో పోల్చినా.. రసాయన శాస్త్రం, గణితంలో 50 నుంచి 60 వరకు ప్రశ్నలు సులభంగా ఉన్నాయన్నారు. గణితంలో అత్యధికంగా 80 మార్కులు పొందగలుగుతారని, సాధారణ విద్యార్థి కూడా 40 నుంచి 50 మార్కులు పొందగలరని చెప్పారు. కన్నీళ్లు పెట్టించిన ‘నిమిషం’నిబంధన ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్న నిబంధన విద్యార్థులకు శాపంగా మారింది. పరీక్ష రాసేందుకు ఉరుకులు, పరుగుల మీద బయలుదేరినా.. పలు సమస్యల కారణంగా కొందరు విద్యార్థులు రెండు, మూడు నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కారణంగా పలు చోట్ల అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్నారు. కానీ ఇలా ఆలస్యంగా వచ్చిన వారెవరినీ అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దాంతో విద్యార్థులు కంటతడిపెట్టారు. పరీక్ష రాయనివ్వాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. అయినా అనుమతించకపోవడంతో ఆవేదనతో వెనుదిరిగారు. మరోవైపు పరీక్ష కేంద్రాల బయట కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ముందుగానే గేట్లు మూసివేత! హైదరాబాద్లోని నారాయణగూడలో ఉన్న కేశవ మెమోరియల్ కళాశాల పరీక్షా కేంద్రం ప్రధాన గేటును ఉదయం 9.52 గంటలకే మూసివేయడంతో ఇద్దరు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. హిమాయత్నగర్కు చెందిన మాధవి, సఫీలు 9.54 నిమిషాలకే కేశవ మెమోరియల్ పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. గేటుకు తాళాలు వేసి ఉండడం, సెక్యురిటీ లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఇద్దరినీ గేటు పైనుంచి ఎక్కించి లోపలికి పంపారు. కానీ వారు హాల్టికెట్ నంబర్తో పరీక్షాహాల్ను సరిచూసుకుని వెళ్లే సరికి 10.03 గంటలు కావడంతో పరీక్షాహాల్లోకి రానివ్వలేదు. ఎంతగా ప్రాధేయపడినా అనుమతించకపోవడంతో కన్నీటితో వెనుదిరిగారు. -
వన్ మినిట్ ఎఫెక్ట్ కష్టాల పరీక్ష
నగరంలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు తొలిరోజే విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ‘ఒక్క నిమిషం’ నిబంధన వారి ఏడాది విద్యా సంవత్సరాన్ని తల్లకిందులు చేసింది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయినవారిని నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపేశారు. బాధిత విద్యార్థులు మూడు జిల్లాలో 5,934 మంది ఉన్నారు. తమను మోసం చేసిన శ్రీవాసవీ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థులు సెక్రటేరియట్ను, ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. సిటీబ్యూరో: పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్.. నిమిషం నిబంధన.. ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్...వెరసి ఇంటర్ ప్రధమ సంవత్సర విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ట్రాఫిక్ రద్దీని ఛేదించుకుని పరీక్ష కేంద్రానికి చేరకుంటే.. ఒక్క నిమిషంతో ప్రవేశ గడువు ముగిసిందని చెప్పి వెనక్కి పంపారు. దీంతో కొంత మంది విద్యా ర్థులు పరీక్ష రాయలేక పోగా, వాహన తనిఖీల పేరుతో బుధవారం నగరంలోని రహదారులపై ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ మరికొంత మంది గైర్హాజరీకి కారణమైంది. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ఉదయం 8 గంటలకే తల్లిదండ్రులు తమ పిల్లలతో వివిధ వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు బయలు దేరారు. ఒకేసమయంలో పెద్దెత్తున రోడ్డుపైకి వాహనాలు రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనికితోడు తనికీల పేరుతో హెల్మిట్లేని, లైసెన్సలను వెంట తెచ్చుకోలేని వారిని మార్గ మధ్యలో నిలిపివేయడం వల్ల వల్ల వారి పిల్లలు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పోయారు. ఫలితంగా హైదరాబాద్ జిల్లాలో 2,450 మంది, రంగారెడ్డి జిల్లాలో 2,099 మంది, మేడ్చల్ జిల్లాలో 1,385 మంది పరీక్ష రాయలేక పోయారు. ఇదిలా ఉంటే గురువారం ఉదయం 9 గంటలకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు నిర్ధేశిత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు మరోసారి స్పష్టం చేశారు. శాపంగా మారిన ‘నిమిషం’ నిబంధన దిల్సుఖ్నగర్ పరిధిలో 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థిని 15 నిమిషాలు ఆలస్యం కావడంతో సదరు విద్యార్థినిని లోపలికి అనుమ తించలేదు. దీంతో ఆమె నిరాశతో వెనుతిరిగింది. మన్సూరాబాద్లోని నారాయణ పరీక్షా కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో ముగ్గురు విద్యార్ధులు పరీక్షా రాయలేకపోయారు. నల్లకుంట శంకరమఠం రోడ్డులోని ఓ సెంటర్లో పరీక్ష రాజేందుకు ముగ్గురు విద్యార్థులు రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. అయినప్పటికీ సెంటర్ ఇంచార్జీలు విద్యార్థులను మందలించి పరీక్ష రాసేందుకు అనుమతించారు. కొన్ని సెంటర్ల వద్ద ఉదయం 8.45 గంటల తర్వాత పరీక్షా హాల్లోనికి అనుమతించేది లేదని నోటీసు బోర్డు పెట్టడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ఎగ్జామ్ ప్యా డ్లు, బ్యాగులు అనుమతించక పోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. రెండోరోజూ విద్యార్థుల ఆందోళన వనస్థలిపురం శ్రీవాసవి జూనియర్ కాలేజీ యాజమాన్యం నిర్వాకం వల్ల హాల్టికెట్లు రాక పరీక్ష రాయలేకపోయిన 246 మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రెండో రోజూ కూడా కళాశాల ముందు ఆందోళనకు దిగారు. ఫీజులు తీసుకుని హాల్టికెట్లు ఇవ్వని కళాశాల నిర్వాహకులను శిక్షించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. కళాశాల వద్ద ఆందోళన చేస్తే లాభం లేదని, ఇంటర్ బోర్డు వద్ద గానీ, విద్యాశాఖ మంత్రి వద్ద గానీ సమస్యను పరిష్కరించుకోవాలని పలువురు సూచించడంతో పోలీసులు ఏర్పాటు చేసిన వాహనంలో విద్యార్థులు విద్యాశాఖ మంత్రిని కలిసేందుకు ఆయన నివాసానికి తరలివెళ్లారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుకా మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల నిర్వాహకులపై వనస్థలిపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా వాసవి జూనియర్ కళాశాల విద్యార్థులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. దాదాపు మూడు గంటల పాటు సచివాలయం వద్ద నిరసన తెలిపినా ఎవ్వరూ స్పందించకపోగా పోలీసులు అరెస్టు చేయడంతో విద్యార్థులు బాధను తట్టుకోలేక విలపించారు. ఇది ప్రభుత్వ వైఫల్యం: సుధీర్రెడ్డి ఏడాది కాలంగా ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండా కళాశాల నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. వేలాది రూపాయలు ఫీజులు కట్టించుకుని హాల్టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం ఉడాయించిందని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారని ఆవేద్య వ్యక్తం చేశారు. వాసవీ కాలేజ్కు అనుమతి లేదు వనస్థలిపురంలోని వాసవీ కాలేజ్కు అనుమతులు లేవు. కళాశాల దరఖాస్తు చేసుకుంటేనే బోర్డు అనుమతి ఇస్తుంది. అసలు కళాశాల యాజమాన్యం దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు సమర్పించి ఉంటే.. తనిఖీలు చేయాలని మాకు ఆదేశాలు వచ్చేవి. ఇదేదీ జరగలేదు. విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సదరు కళాశాల నిర్వాకంపై గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. అయితే సదరు యాజమాన్యం రెండేళ్ల కిందట మరో పేరుతో కళాశాల స్థాపించి తాజా ఘటన తరహాలోనే విద్యార్థులను మోసగించినట్లు తెలిసింది. – మహమూద్ అలీ, డీఐఈఓ, రంగారెడ్డి జిల్లా
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement