-
బండను ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు
దంతాలపల్లి (డోర్నకల్): ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు అదుపు తప్పి బండను ఢీకొనడంతో ముందు చక్రం ఊడింది. దీంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. దంతాలపల్లిలోని సెయింట్ మేరీస్ హైస్కూల్ బస్సు రోజువారీగా గురువారం సుమారు 45 మంది విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరింది. బొడ్లాడ గ్రామ శివారులో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పెద్ద బండను ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు చక్రం ఊడి దెబ్బతిన్నది. డ్రైవర్ ప్రవీణ్, క్లీనర్తో సహా నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బస్సులో నుంచి విద్యార్థులను కిందికి దింపారు. దుబ్బతండాకు చెందిన విద్యార్థి రాంచరణ్ భుజానికి బలంగా దెబ్బ తగలడంతో చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. -
హత విధీ.. ఇదేమి వారధి
► చెక్క వంతెనతో చిక్కులు ► అదుపు తప్పితే నదిలో పడాల్సిందే ► వారం రోజుల క్రితం నదిలో పడిన మహిళలు ► సమీపంలోని రైతులు రక్షించడంతో తప్పిన ప్రమాదం ► పట్టించుకోని పాలకులు, అధికారులు రాంబిల్లి(యలమంచిలి): మండలంలోని మూలజంప గ్రామంలో సుమారు 2 వేల మంది ఉంటున్నా రు. వీరిలో అధికశాతం మంది వ్యవసాయదారులే. పశువుల పాకల వద్దకు, పంటపొలాలకు వెళ్లాలంటే నదిని దాటాల్సిందే. దీంతో ఏటా గ్రామస్తులు చందా లు వేసుకొని తాటి చెక్కలతో వంతెన నిర్మించుకుంటారు. ప్రమాదమని తెలిసినా మరో మార్గం లేక ఈ చెక్క వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్యతో సతమతమవుతున్నా పట్టించుకునే నాధుడే లేకుండాపోయాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు పాలకులు, అధికారుల దృష్టికి సమస్యను తీసుకొచ్చినా పట్టిం చుకోలేదంటున్నారు. చెరకు క్రషర్లు శారద నది ఆవల ఉండడంతో రాత్రిళ్లూ ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగి స్తుంటారు.ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఈ చెక్కలపై రాకపోకలు సాగించేటప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం చెక్క విరిగి పోయి 10 మంది మహిళలు నది లో పడిపోయారు. అప్పట్లో తక్కువగా నీరు ఉండటంతో పాటు అక్కడే ఉన్న రైతు వి.రాముతోపాటు మరికొందరు స్పందించి వెంటనే నదిలోకి దిగి మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. మహిళలు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇటీవల ఒక తెప్పను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిని నిర్వహించే వారు లేకపోవడంతో ఒడ్డున వృథాగా పడి ఉంది. -
చీటీల వ్యాపారి అదృశ్యం!
పెళ్లకూరు : నలభై ఏళ్లుగా చిటీల వ్యాపారం చేస్తూ చుట్టూ పక్కల ప్రాంతాల వారితో నమ్మకంగా ఉన్న పెళ్లకూరుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబం అదృశ్యంపై లబ్ధిదారుల ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో సొంత ఇల్లు, కొద్దిపాటి వ్యవసాయ భూములు ఉండడం, అందరితో సత్సంబంధాలు ఉండటంతో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు, వివిధ వ్యాపారులు, ఉద్యోగులు సైతం ఆయన వద్ద చీటీలు వేస్తూ లావాదేవీలు కొనసాగిస్తుండేవారు. ఈ క్రమంలో సుమారు రూ.2 కోట్లు వరకు చీటీల మొత్తాన్ని చేజిక్కించుకుని కుటుం బమంతా కలిసి ఉడాయించినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యు లు ఎవరూ ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో పలు ప్రాంతాలకు చెందిన ఖాతాదారులు రెండు రోజులుగా వ్యా పారి ఇంటి వద్దకు వచ్చి చుట్టు పక్కల వారిని విచారించి ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్లాన్తోనే అతను కుటుంబ సభ్యులతో పరారైనట్లు పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
హమ్మయ్య... తప్పిన గండం
విజయనగరం కలెక్టరేట్ /కంటోన్మెంట్, న్యూస్లైన్: పై-లీన్ ప్రభావం జిల్లాపై పెద్దగా లేకపోవడంతో జిల్లా అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల హెచ్చరికల నేప థ్యం, సముద్రం పోటెత్తి అలలు విరుచుకుపడుతూ తీరానికి దూసుకురావడంతో తీరప్రాం త ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రం గా ఉంటుందని, అందులో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ కావడం, వాతావరణంలో క్రమేపీ వచ్చిన మార్పులతో రెండు రోజుల పాటు ఏం జరుగుతుందో ఏమోనని వణికిపోయిన జిల్లా వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. అయితే భయపడినంతంగా పై-లీన్ ప్రభావం చూపకపోవడంతో ఊరట చెందారు. శనివారం రాత్రి జిల్లా ప్రత్యేక అధికారి జిల్లా అధికారులతో సమావేశమై పై-లీన్ ప్రభావం, తుఫాన్ వల్ల జరిగిన నష్టం పై సమీక్షించారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఉద్ధృతంగా గాలులు వీచాయి. శనివారం ఉదయం సముద్రంలో అలజడి పెరిగింది. కెరటాలు పెద్ద ఎత్తున పైకి లేస్తూ మత్స్యకార గ్రామాల్లోకి దూసుకువచ్చాయి. దీంతో కొన్ని గ్రామాల ప్రజలు ఇళ్లను విడిచి పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. అధికారులు ఎంత చెప్పినా చాలా మంది మత్స్యకారులు ఇళ్లను విడిచి వేరే చోటికి వెళ్లేందుకు అంగీకరించలేదు. జిల్లా యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ ఎప్పుడు ఎటువంటి అవాంఛనీయ వార్తలు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన జిల్లా యంత్రాంగంలో... ప్రజల్లో నెలకొంది. భారీ ఈదురుగాలులు... చెదురుమదురు వర్షాలు మినహా అంతా ప్రశాంతంగా ఉంది. తీర ప్రాంతంలో ఉన్న పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో కాస్త ఉద్రిక్తత నెలకొంది. పూసపాటిరేగ మండలంలోని పతివాడ బర్రిపేట, తిప్పలవలస, కోనాడ, చింతపల్లి గ్రామాలలో సముద్రం సుమారు 40 అడుగులు ముందుకు రావడంతో పాటు ఒడ్డును చేర్చిన పడవలులోకి నీరు చేరడంతో మత్య్సకారులు పరుగులు తీశారు. భోగాపురం మండలం తీరప్రాంతంలో ఉన్న ముక్కాం గ్రామంలో సముద్రపు అలలు తీరప్రాంతంలో ఉన్న ఇళ్లను తాకాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే అప్రమత్తమైన జిల్లా అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ చాలా వరకు స్థానికులు అక్కడే ఉండి పరిస్థితిని గమనించారు. పై-లీన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కురుపాంలో రోడ్డుపై భారీ చెట్టు నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే నెల్లిమర్ల, చీపురుపల్లి, పార్వతీపురం మండలాల్లో చెట్లు నేలకు ఒరిగాయి. పార్వతీపురం మండలం కోరి గ్రామంలో చెట్టు కూలి ట్రాన్స్ఫార్మర్పై పడడంతో పది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయనగరంలో పట్టణంలో బలంగా వీచిన ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. ప్రధానంగా బాబామెట్ట ప్రాంతలోని కాటవీధి వద్ద పట్టణంలోని అధిక ప్రాంతాలకు విద్యుత్ సరఫారా చేసే 11కెవి లైన్ విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. దీంతో మొత్తం ఆరు ట్రాన్సఫార్మర్ల పరిధిలో ఉదయం 11 గంటల నుంచి సరఫరా నిలిచిపోయింది. మండలంలోని వేణుగోపాలపురంలో రెండు విద్యుత్ స్తంభాలు ఒరిగిపోగా... ఇందిరానగర్, గాజులరేగ, డెంకాడలకు విద్యుత్ సరఫరా అయ్యే ప్రధాన విద్యుత్ లైన్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఏజెన్సీప్రాంతంలో ఉన్న కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, సాలూరు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ముక్కాంలో తీరప్రాంత ఇళ్లను తాకిన అలలు.. తుఫాన్ ప్రభావంతో భోగాపురం మండలం తీరప్రాంతంలో ఉన్న ముక్కాం గ్రామంలో సముద్రం అలలు తీరప్రాంతంలో ఉన్న ఇళ్లను తాకడంతో మత్స్యకారులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కన్నా శనివారం సముద్రం మరింత ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం నాడు తీరం 50 అడుగుల దూరంలో ఉన్న ఒడ్డును తాకిన కెరటాలు శనివారం ఏకంగా 70 అడుగుల దూరంలో తీరానికి ఆనుకుని ఉన్న ఇళ్లని సైతం తాకాయి. ఈ సంఘటనలో మత్స్యకార కుటుంబాల మరుగుదొడ్లు నేలమట్టమయ్యాయి. మామూలుగా తీర ప్రాంతం గట్టున లంగరు వేసి ఉంచే పడవలను ఏకంగా గ్రామంలోకి తరలించారు. పునరావాస కేంద్రాలకు 15,670 మంది తరలింపు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుందన్న వాతావరణ శాఖ అధికారులు ముందస్తు ప్రకటనతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 15670 మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విజయనగరం డివిజన్లోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా.. పార్వతీపురం డివిజన్లో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, సాలూరు, జియ్యమ్మవలస మండలాల్లో 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పునరావాస కేంద్రాలకు రావటానికి మత్స్య కారులు నిరాకరించారు. మా ఆస్తులు నష్టపోయి మీరు పెట్టే పులిహోరా మెతుకులకు మేము రామంటూ ఎదురు తిరిగారు. దీంతో విధిలేని పరిస్థితిలో అధికారులు రాత్రి వరకూ బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. గంగమ్మా శాంతించు అంటూ సముద్రం వైపు దండం పెడుతూ కేంద్రాల వద్దకు వచ్చారు. తరలి వచ్చిన కేంద్ర బలగాలు... పై-లీన్ బీభత్సం సృష్టిస్తున్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు కేంద్ర బలగాలు తరలివచ్చాయి. 40 మంది జాతీయ విపత్తుల బృందంతో పాటూ సహాయక చర్యల కోసం 250 మంది ఆర్మీ జవాన్లు వచ్చారు. వీరిని ఏడు మండలాలకు అధికారులు సర్దుబాటు చేశారు. అలాగే 30 మంది గజ ఈతగాళ్లతో పాటూ 50 మంది అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. అంతేకాకుండా 200 మంది వరకూ పోలీసులు సైతం తీర ప్రాంతాల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకాధికారులతో పాటూ సహాయక బృందాలు ఆయా ప్రాంతాల్లోనే కలియ దిరిగాయి. అవసరమైన వాటర్ ప్యాకెట్లను సైతం అందుబాటులో ఉంచారు. పౌరసరఫరాల శాఖ నిత్యావసర సరుకులతో పాటూ కిరోసిన్ సరఫరా చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement