-
మహీంద్రా చేతికి స్ప్రేయర్ల తయారీ కంపెనీ.. నెక్స్ట్ ప్లాన్ అదేనా?
న్యూఢిల్లీ: స్ప్రేయర్ల తయారీ కంపెనీ మిత్రా ఆగ్రో ఎక్విప్మెంట్స్లో వాటాను 100 శాతానికి పెంచుకున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారం ప్రకటించింది. ఇప్పటి వరకు మహీంద్రాకు ఈ కంపెనీలో 47.33 శాతం వాటా ఉంది. ఓమ్నివోర్ పూర్తి వాటాను మహీంద్రా చేజిక్కించుకుంది. తాజా వాటాలను ఎంతకు దక్కించుకున్నదీ కంపెనీ వెల్లడించలేదు. వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల వ్యాపారంలో అయిదేళ్లలో 10 రెట్లు వృద్ధి చెందాలన్నది మహీంద్రా లక్ష్యం. వాటా కొనుగోలు సంస్థ వృద్ధికి దోహదం చేయడంతోపాటు పెరుగుతున్న ఉద్యాన పంటల రంగంలో విస్తరణకు ఆస్కారం ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా ఫామ్ ఎక్విప్మెంట్ విభాగం ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా తెలిపారు. (ఇదీ చదవండి: భారత్లో 2023 టయోట ఇన్నోవా క్రిస్టా లాంచ్ - ధర ఎంతో తెలుసా?) పండ్ల తోటల్లో వాడే స్ప్రేయర్ల తయారీలో ఉన్న మిత్రా ఆగ్రో 2012లో ప్రారంభమయింది. ఇందులో 200 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2017 - 2018తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ మూడింతల ఆదాయాన్ని ఆర్జించింది. ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. నూతన ఉత్పత్తుల తయారీతోపాటు భారత్ సహా విదేశీ మార్కెట్లలో విస్తరణకు యోచిస్తోంది. -
ఖరీఫ్ ఉత్పత్తి లక్ష్యం 12 లక్షల మెట్రిక్ టన్నులు
కొయ్యలగూడెం, న్యూస్లైన్ : రానున్న ఖరీఫ్ సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి లక్ష్యం గా పెట్టుకున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వి.సత్యనారాయణ తెలిపారు. పరింపూడిలోని కొయ్యలగూడెం మండల వ్యవసాయూధికారి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ లక్ష్యం గతేడా ది కంటే నాలుగున్నర మెట్రిక్ టన్నులు అదనంగా చెప్పుకొచ్చారు. దీని కోసం లక్షా ఇరవై వేల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. అదే విధంగా 8,500 మట్టి నమూనాల సేకరణలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 25 శాతం పూర్తి చేసినట్లు చెప్పారు. జిల్లాలో రూ.6 కోట్ల 20 లక్షలతో 106 రైతుమిత్ర గ్రూప్లకు సబ్సిడీపై వ్యవసాయ యం త్ర పరికరాలు అందజేయనున్నామని, ఇప్పటికే రూ.5.38 కోట్ల విలువైన సామాగ్రిని అందించామన్నారు. 33 బ్యాంక్ల ద్వారా నీలం తుఫాన్ నష్టపరిహారం రూ.2 కోట్ల 73 లక్షలకు గానూ రూ.35 లక్షలు రైతులకు అందించాల్సి ఉందని, మిగిలిన సొమ్మును రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్కు కావాల్సిన ఎరువులను సిద్ధం చేశామని, వ్యవసాయ సొసైటీలు, ప్రైవేట్ డీలర్లకు రెండు రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో 2,200 మంది ఆదర్శ రైతులకు గానూ ప్రస్తుతం 1,550 మంది ఉన్నారని విలేకరుల అడిగిన ఓ ప్రశ్నకు జేడీ సమాధానమిచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement