-
రైతుబంధు చెక్కులు ఇప్పించాలి
ఖానాపూర్ : కడెం మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన తమ భూములను టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి చెర నుంచి కాపాడాలని గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ఆదివారం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సంబందిత నాయకుడు ఇదివరకు తమ భూములు పెద్ద సంఖ్యలో కబ్జాకు పాల్పడ్డాడని, సాగులో ఒక్కొక్కరికి ఐదెకరాలకు పైగా ఉన్నప్పటికీ ఒక్కో ఎకరంతో పట్టాలు వచ్చాయని అన్నారు. కబ్జాపోను మిగిలిన ఒక్కో ఎకరం భూమికి ప్రభుత్వం రైతుబంధు ద్వారా చెక్కులు ఇస్తే వాటిని కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. గ్రామ శివారులో గల జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం బోర్నపెల్లిలో ఉన్న తమ భూములకు ప్రభుత్వం నుంచి రైతుబంధు ద్వారా వచ్చిన చెక్కులను ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ విషయమై ఎంతటివారైనా సరే తాను సంబందిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెడ్మ గంగు, తోడసం గంగు, వెడ్మ లింగు, వెడ్మ దేవేందర్, ఆత్రం గంగు, లింబారావ్, బాదిరావ్, లింగు, మోహన్, జుగాదిరావ్, శ్రీను, జ్యోతిరాం, మారుతి, ఆనంద్, బుచ్చవ్వ, తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
► ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ ►మైనార్టీ గురుకులాల ప్రవేశాల కార్యక్రమానికి హాజరు ► లక్కీడిప్ ద్వారా విద్యార్థుల ఎంపిక ఖానాపూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ అన్నారు. ఏఎంకే ఫంక్షన్ హాల్లో బుధవారం మండల కేంద్రంలోని మైనార్టీ గురుకులంలో విద్యార్థుల ప్రవేశాల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రవేశాల కోసం చేసుకున్న దరఖాస్తులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థుల ఎంపికను లక్కీడిప్ ద్వారా నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం పిల్లలకు ప్రభుత్వం తెలంగాణలో 71 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసిందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవని కితాబిచ్చారు. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. స్థానిక గురుకులంలో 5, 6, 7 తరగతుల్లో ప్రవేశానికి 120 మందికి అవకాశం ఉందని తెలిపారు. ప్రవేశం లభించని విద్యార్థుల తల్లిదండ్రులు అధైర్య పడవద్దని, ప్రభుత్వానికి సమస్యను వివరించి మరిన్ని సీట్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. లక్కీడిప్ ద్వారా ఎంపికైన మొదటి నలుగురు విద్యార్థులు ముషిర్, అస్లాం, షాహిద్ ఒజామా, రెహన్ . కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు నేరెళ్ల సత్యనారాయణ, సక్కారాం శ్రీనివాస్, అంకం రాజేందర్, కేహెచ్ ఖాన్, జహీరొద్దీన్, ఎంఈవో రాం చందర్, ప్రిన్సిపల్ బియాబాని తదితరులున్నారు. ఎమ్మెల్యేకు సన్మానం.. అనంతరం శిశు సంక్షేమ శాఖ అసెంబ్లీ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యేను ముస్లిం మహిళలు సన్మానించారు. మైనార్టీ పాఠశాల ఏర్పాటుకు కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
Advertisement