-
ఎమ్యెల్యే బాబూమోహన్కు నిరసన సెగ
రేగోడ్(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు కార్యక్రమంలో అందోల్ ఎమ్యెల్యే పి.బాబూమోహన్కు నిరసన సెగ తగిలింది. కారును అడ్డుకుని బాబూమోహన్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సుమారు అరగంట పాటు ఎమ్యెల్యే తన కారులోనే ఉండిపోయారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని సిందోల్ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రైతుబంధు కార్యక్రమంలో భాగంగా సిందోల్ గ్రామంలో ఆదివారం రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అందోల్ ఎమ్యెల్యే పి.బాబూమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకోగానే గ్రామానికి చెందిన పలువురు యువకులు, గ్రామస్తులు ఎమ్యెల్యే కారును అడ్డుకున్నారు. కారుముందు ఉండి బాబూమోహన్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఐదేళ్లుగా రోడ్డును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నిరసన కారుల తోపులాటలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యంతో ఎమ్యెల్యే కారు చెక్కుల పంపిణీ కార్యక్రమం వద్దకు కదిలింది. ఎవడ్రా ఫొటోలు తీసేది.. నిరసన కారులు పక్కకు వెళ్లిన అనంతరం కారులో నుంచి కిందకి దిగుతున్న తనను విలేఖరులు ఫొటోలు తీస్తుండటాన్ని గమనించిన బాబూమోహన్కు ఎవడ్రా ఫొటోలు తీసేదంటూ విలేఖరులపై ఆగ్రహంతో ఊగిపోయారు. మేము విలేఖరులం.. మీ వార్తలు కవర్ చేయడానికే వచ్చాం. మాకు స్వేచ్ఛ ఉంది.. వద్దంటే వెళ్లిపోతామంటూ బాబూమోహన్తో విలేఖరులు తెలిపారు. -
‘అందోలు’కు రూ.80 కోట్లు
అందోలు-ఎర్రారం వరకు బైపాస్రోడ్డు మోడల్స్కూల్ టెండర్లు పూర్తి అందోలు ఎమ్మెల్యే పి.బాబూమోహాన్ జోగిపేట: అందోలు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం ఇటీవల రూ.80 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పీ.బాబూమోహన్ పేర్కొన్నారు. గురువారం అందోలు గెస్ట్హౌస్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ఎస్సీ కాలనీలల్లో సీసీ రోడ్ల కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఏడు మండలాల్లోని పాఠశాలలో టాయ్లెట్ల నిర్మాణం, పైప్లైన్ల ఏర్పాటు, డ్రింకింగ్ వాటర్ కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కోటి, జిల్లా మంత్రి ద్వారా రూ. 2 కోట్లు, విద్యాశాఖ మంత్రి ద్వారా రూ.2కోట్లు మంజూరు చేస్తున్నారన్నారు, పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. రూ.13 కోట్లతో నిర్మిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలల నూతన భవనాలు శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. బుదేరాలో రూ.12 కోట్లతో డిగ్రీ కళాశాల నిర్మాణం, రాయికోడ్లో రూ. 13 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్, బుదేరాలో రోడ్లు భవనాల శాఖ గెస్ట్హౌస్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అందోలు పెద్ద చెరువు వద్ద రూ.4.50 కోట్లతో మినీ ట్యాంకు బండ్ నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జోగిపేట-నాందేడ్ అకోలా రహదారి ఫోర్లైన్ రోడ్లుగా విస్తరించేందుకు గాను ఎలాంటి అడ్డంకులు రాకుండా అల్మాయిపేట వద్ద నుంచి బైపాస్రోడ్డు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. ఆత్మకమిటీ చైర్మన్ లక్ష్మికాంతరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు కే.రమేశ్, మాజీ ఉపాధ్యాక్షుడు లింగాగౌడ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు డీబీ నాగభూషణం, కౌన్సిలర్లు శ్రీకాంత్, లక్ష్మణ్, టేక్మాల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు యూసూఫ్ అలీ, నాయకులు రవీంద్రగౌడ్, గోపాల్, సీహెచ్.వెంకటేశం, చేనేత సొసైటీ చైర్మన్ వర్కల అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే బాబుమోహన్పై ఆగ్రహం
రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపకపోవడంపై ఆగ్రహం ఉవ్వెత్తున నిరసనగ సెగ.. ఎమ్యెల్యే దిష్టిబొమ్మకు శవయాత్ర విద్యార్థులతో ర్యాలీ, మానవహారం రేగోడ్: ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డ్రాప్ట్లో రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలిపారు. తాజాగా సోమవారం వెలువడిన డ్రాప్ట్ నోటిఫికేషన్లో రేగోడ్ మండలాన్ని మెదక్ జిల్లాలోనే ఉంచినట్లు సర్కారు అధికారికంగా ప్రకటించింది. అందోల్ ఎమ్యెల్యే బాబూమోహన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాత్రికిరాత్రి సంగారెడ్డి నుంచి తప్పించి మెదక్ జిల్లాలో చేర్చినందుకు మండలంలో మంగళవారం నిరసన సెగ ఉవ్వెత్తున ఎగిసి పడింది. అఖిలపక్షం నేతలు, యువజన సంఘాలు, ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దుకాణాలను బంద్ చేయించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్రోస్ ఇక్కడి ప్రజల ఆకాంక్షను.. ప్రజాభిష్టాన్ని గౌరవించి రేగోడ్ను సంగారెడ్డి జిల్లాలో కలిపితే.. బాబూమోహన్ మాత్రం రేగోడ్ మండాలన్ని మెదక్ జిల్లాలో చేర్చారని మండిపడుతూ బాబూమోహన్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. డప్పులతో ఊరేగించి బస్టాండ్లో బాబూమోహన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అఖిలపక్షం నేతలు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మున్నూరు కిషన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతాప్ రమేశ్జ్యోషి, వట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.దిగంబర్రావు, దేవునూర్ సర్పంచ్ (మాజీ జెడ్పీటీసీ) జానయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అనీల్కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు పూర్ణచందర్ విలేకరులతో మాట్లాడారు. మండలానికి మంచి చేయకపోయినా పరవాలేదు.. కానీ చెడుమాత్రం చేయొద్దని కోరారు. 23 రోజుల దీక్షల ఫలితం.. కలెక్టర్ కృషి కారణంగా ముందుగా రేగోడ్ మండలం సంగారెడ్డి జిల్లాలో చేర్చారని చెప్పారు. ఆ ప్రకటనతో ప్రజలంతా సంబురపడుతున్న సమయంలో ఎమ్యెల్యే రాత్రికిరాత్రి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సంగారెడ్డి జిల్లాలో ఉన్న రేగోడ్ మండలాన్ని మెదక్ జిల్లాలో చేర్చారని ధ్వజమెత్తారు. నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్రెడ్డి ప్రజాభీష్టం మేరకు నారాయణఖేడ్ను సంగారెడ్డి జిల్లాలో కలుపుతూ ఖేడ్ను రెవెన్యూ కేంద్రంగా చేసుకోవడంలో సఫలీకృతుడయ్యాడని చెప్పారు. ఇక్కడి ప్రజలంతా సంగారెడ్డి జిల్లాలో ఉంచాలని, 7 కిలో మీటర్ల దూరంలోని ఖేడ్ రెవెన్యూ డివిజన్లోనే ఉంటామని ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసి, రేగోడ్లో దీక్షలు చేసినా బాబూమోహన్ మాత్రం ప్రజాభీష్టానికి విరుద్ధంగా 60 కిలో మీటర్ల దూరంలోని మెదక్ జిల్లా, రెవెన్యూ డివిజన్లో చేర్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఉపాధికి వెన్నుముకలా ఉన్న సంగారెడ్డి జిల్లా నుంచి తప్పించి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని మెదక్ జిల్లాలో రేగోడ్ను ఉంచడం దారుణమన్నారు. సంగారెడ్డి జిల్లాలో మండలాన్ని చేర్చగానే కొందరు టీఆర్ఎస్ నాయకులు బాబూమోహన్కు కృతజ్ఞతలు తెలిపారాని.. ఇపుడు మెదక్లో ఉండటంపై ప్రజలకు ఏ సమాధానం చెప్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్యెల్యే తీరును టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వ్యతిరేకించారని, మిగతా నాయకులు ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ప్రజలతో ఓట్లు వేయించుకున్న ఎమ్యెల్యే, టీఆర్ఎస్ మండల నాయకులు వారి ఆకాంక్షýను గౌరవించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం చేతగాకపోతే పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలుపుతూ, ఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, మాజీ ఎంపీ మాణిక్రెడ్డి సహకరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని.. న్యాయపోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. కార్యక్రమంలో కొండాపురం సర్పంచ్ గంజి సంగమేశ్వర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాధాకిషన్, ఉప సర్పంచ్లు నర్సింహులు, తూర్పు మాణయ్య, మైనార్టీ మండల నాయకుడు చోటుబాయ్, వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు మహబూబ్, ఉన్నత పాఠశాల చైర్మన్ అక్బర్, మాజీ సర్పంచ్ పండరి, నాయకులు నారాయణ, పూల్యానాయక్, రామాగౌడ్, జయరావు, పీర్యానాయక్, రాములు, జి.శంకరప్ప, రాజుసాగర్, జ్ణాణేశ్వర్, సుధాకర్, కషి, రాములు, కల్లేటి శ్రీధర్గుప్తా పాల్గొన్నారు. -
బాబూమోహన్ ఆకస్మిక తనిఖీలు
- ప్రిన్సిపాల్పై ఎమ్మెల్యే ఆగ్రహం - సస్పెండ్ చేయాలంటూ అధికారులకు ఆదేశం పుల్కల్ : పిల్లలకు పురుగుల అన్నం పెట్టి చంపుతారా..మీకు జీతాలు ఇవ్వడంలేదా.. మీ పిల్లలను ఇలాగే చూసుకుంటారా.. అంటూ అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ సింగూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై మండిపడ్డారు.మిషన్ కలాం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ స్పీకర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని హాస్టళ్లలో రాత్రి బస చేశారు. అందులో భాగంగానే అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ సింగూర్ గురుకుల పాఠశాలలో బసచేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ నిర్వహణపై మండిపడ్డారు. అసలు హాస్టల్లో పిల్లలు ఇలాగే ఉంటారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాలల కన్వీనర్ కొండల్రావును హాస్టల్ వద్దకు పిలిపించి వాస్తవ పరిస్థితిని వివరించారు. -
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఖబడ్దార్..!
- విలేకరులకు బాబూమోహన్ అనుచరుల హెచ్చరిక - రూ. 50వేలు ఇచ్చినట్లు నేను చెప్పలేదు - కాంట్రాక్టర్ రవీందర్గౌడ్ సంగారెడ్డి మున్సిపాలిటీ: అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్పై వ్యతిరేక కథనాలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టేక్మాల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు యూసుఫ్, అల్లాదుర్గం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు భిక్షపతి విలేకరులను హెచ్చరించారు. కొందరు పనిగట్టుకొని ఎమ్మెల్యేపై అసత్య కథనాలు రాస్తున్నారని, ఇకపై అలాంటివార్తలు వస్తే సహించేది లేదన్నారు. ఇటీవల జేఎన్టీయూలో విద్యార్ధులకు, మెస్ కాంట్రాక్టర్ మధ్య వివాదం జరిగి, నెలకు రూ. 50 వేలు ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్ ఇస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాన్ని ఖండించేందుకు మెస్ కాంట్రాక్టర్ రవీందర్గౌడ్ గురువారం సంగారెడ్డిలోని ఐబీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవీందర్గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తారా.. అంటూ మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే ఆదేశాల మేరకే మెస్ కాంట్రాక్టు కోసం టెండర్ వేశానని ఇందులో ఎమ్మెల్యేకు మామూళ్లు ఇస్తున్న వచ్చిన ఆరోపణలు నిరాధారమన్నారు. నిబంధనల ప్రకారమే మెస్ కాంట్రాక్టు తీసుకున్నానన్నాన్నారు. టెండర్ సమయంలో ఐదుగురు దరఖాస్తులు తీసికెళ్లినా ఎవరూ వేయలేదని, దీంతో ఎమ్మెల్యే తనను వేయమని కోరితే టెండర్ వేశానన్నారు. తాను ఎమ్మెల్యేకు నెలకు రూ.50 వేలు ఇస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను అన్నట్లు నిరూపిస్తే జేఎన్టీయూ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement