-
గుత్తిలో ఎమ్మెల్యేకు చుక్కెదురు
– ఎమ్మెల్యేను చుట్టుముట్టిన జెండా కాలనీవాసులు – కమిషనర్, చైర్ పర్సన్లపై ఎమ్మెల్యే ఆగ్రహం గుత్తి : రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జితేందర్ గౌడ్కు కాలనీవాసుల నుంచి చుక్కెదురైంది. పట్టణంలోని జెండావీధిలో నాగరాజు స్టోర్ వద్ద మంగళవారం చంద్రన్న రంజాన్ తోఫా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. రంజాన్ తోఫాను ముస్లింలకు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమం ముగుస్తున్న సమయంలో ఒక్కసారిగా జెండా వీధి కాలనీవాసులు స్టేజి వద్దకు దూసుకెళ్లారు. రంజాన్ తోఫా సంగతి పక్కన బెట్టండి ముందు కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. ఎమ్మెల్యే నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా వినలేదు. గత 15 రోజులుగా కాలనీకి నీళ్లు వదలలేదన్నారు. ఈ రోజు మీరు వస్తున్నారనే కారణంతో హడావుడిగా నీళ్లు వదిలారన్నారని ఆగ్రహించారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీం సాబ్, చైర్ పర్సన్ తులశమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్య ఉందని తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మీకు చేత కాకపోతే నాకు చెప్పండి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అప్పటికీ జనాలు శాంతించకపోయే సరికి చేసేది లేక కోపంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి
– గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ గుంతకల్లుటౌన్ : ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో రాణించి జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ సూచించారు. స్థానిక ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో గురువారం ఎస్కేయూ అంతర కళాశాలల గ్రూప్–బీ టోర్నమెంట్ను అట్టహాసంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ బి.జెస్సీ ఎస్కేయూ టోర్నీ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారులు, ఎన్సీసీ కేడెట్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జ్ఞానేశ్వర్ అధ్యక్షతన జరిగిన నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రియో ఒలంపిక్స్లో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేసిన సింధూ, సాక్షి మాలిక్లను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్ పోటీలు ఉత్సాహ భరితంగా సాగాయి. జిల్లాలోని 18 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల నుంచి∙400 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీపీడీ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్తాక్ , ఎస్కేయూ పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు జబీవుల్లా, టీడీపీ నాయకులు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR
ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
Mothersday 2024 ‘బంగారం నువ్వమ్మా’! టాలీవుడ్ అమ్మల్నిచూశారా?
నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..
అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement