-
పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. ఫిదా అవుతున్న ప్రతిపక్ష నేతలు
ఛండీగఢ్: పంజాబ్లో అధికారం చేపట్టిన ఆప్ ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకొని వార్తల్లో నిలిచింది. సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కీలక ప్రకటనలు చేస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తాజాగా మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచారు. అయితే, ఇక నుంచి మాజీ ఎమ్మెల్యేలకు కేవలం ఒక్క టర్మ్కు మాత్రమే పెన్షన్ ఇవ్వనున్నట్లు సీఎం మాన్ శనివారం ఓ వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. పంజాబ్లో ఓ ఎమ్మెల్యే ఒక్క సారి గెలిచినా లేదా రెండు, మూడు, నాలుగు, అయిదుసార్లు గెలిచినా వారికి ఒకే ఒక్క టర్మ్లో మాత్రమే పెన్షన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా చాలా మంది ఎమ్మెల్యేలు లక్షల్లో పెన్షన్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కొందరు ఎమ్మెల్యేలు 3.50 లక్షలు- 5.25 లక్షల వరకు పెన్షన్ తీసుకుంటున్నారని.. ఇది ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి పంజాబ్లో నెలకు 75వేల పెన్షన్ ఇస్తున్నారు. అనంతరం అదే వ్యక్తి మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. పెన్షన్ డబ్బుకు అదనంగా మరో 66 శాతాన్ని అందజేస్తున్నారు. దీంతో అలా ఎన్ని సార్లు గెలిస్తే.. అన్ని సార్లు అమౌంట్ కలుపుతూ ఉంటారు. ఇది ప్రభుత్వ ఖజానాకు భారం అవుతోందని మాన్ తెలిపారు. కాగా, పంజాబ్లో ప్రస్తుతం 250 మంది ఎమ్మెల్యేలు పెన్షన్ తీసుకుంటున్నారు. మరోవైపు.. పంజాబ్లో 11 సార్లు శిరోమణి అకాళీదల్ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్సింగ్ బాదల్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. తనకు వచ్చే పెన్షన్ను సామాజిక కార్యక్రమాలకు, బాలికల విద్యకు వాడుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేళ ఆయన పెన్షన్ తీసుకుంటే సుమార్ రూ. 5 లక్షలపైనే డబ్బులు వచ్చేవి. ఇక, భగవంత్ మాన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు సైతం స్వాగతించారు. కాంగ్రెస్ సుఖ్పాల్ సింగ్ ఖైరా.. సీఎం నిర్ణయానికి మద్దతిస్తున్నట్టు తెలిపారు. Today, we have taken another big decision. The pension formula for Punjab's MLAs will be changed. MLAs will now be eligible for only one pension. Thousands of crores of rupees which were being spent on MLA pensions will now be used to benefit the people of Punjab. pic.twitter.com/AdeAmAnR7E — Bhagwant Mann (@BhagwantMann) March 25, 2022 -
మాజీ ఎమ్మెల్యేల పింఛన్ ఇకనుంచి రూ. 40 వేలు
మాజీ ఎమ్మెల్యేలకు శుభవార్త. వీరికిస్తున్న పింఛన్ను రూ. 25 వేల నుంచి రూ. 40 వేలకు పెంచాలని విధానసభ వర్షాకాల ముగింపు సమావేశం రోజున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు మాజీ పార్లమెంట్ సభ్యుల కంటే ఎక్కువ పింఛన్ లభించనుంది. ఈ నిర్ణయంవల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా అదనంగా రూ.30 కోట్ల భారం పడనుంది. ఇటీవల ముగిసిన వర్షాకాల విధానసభ సమావేశాల్లో మొత్తం 13 బిల్లులు ఆమోదం పొందాయి. వీటిలో మాజీ ఎమ్మెల్యేల పింఛన్ పెంపు బిల్లు ఆఖరు రోజున చర్చకు వచ్చింది. అయితే ఎటువంటి చర్చలు జరపకుండానే ఆమోదం లభించింది. పెరిగిన నిత్యావసర సరకుల ధరతో పోలిస్తే మాజీలకు చెల్లించే పింఛన్ మొత్తం సరిపోవడం లేదు. దీంతో ఆయా కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారింది. సంసారాన్ని నెట్టుకురావడమే కష్టతరంగా మారింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలాఉండగా మాజీ ఎంపీలకు నెలకు రూ.20 వేల పింఛన్ వస్తుండగా, ఐదు సంవత్సరాలు పూర్తయిన మాజీ ఎమ్మెల్యేలకు ఇకనుంచి నెలకు రూ.25 వేలు పింఛన్ కింద లభించనుంది. ఒకసారికంటే ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా పనిచేస్తే పెన్షన్లో ప్రతి సంవత్సరం రూ. రెండు వేల చొప్పున అదనంగా లభిస్తుంది. దివంగత ఎమ్మెల్యేల వారసులు లేదా వారి బంధువులకు కూడా పింఛన్ లభిస్తుంది. కాగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు చెల్లిస్తున్న పింఛన్ మొత్తం ఎక్కువేనని ప్రభుత్వ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా తమకు పింఛన్ మొత్తం పెంచాలంటూ 2011 నుంచి మాజీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే గత ఏడాది రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వాయిదావేసింది. ఎట్టకేలకు ఇటీవల జరిగిన విధానసభ వర్షాకాల సమావేశంలో ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో మాజీల పంటపండింది. అయితే 2011 నుంచి పెంపు పెన్షన్ చెల్లించాలని బృహత్తర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నిర్ణయానికి గత గురువారమే ఆమోదం తెలిపినప్పటికీ ఆర్థిక శాఖ మాత్రం వ్యతిరేంచింది. అయితే అత్యధిక శాతం ఎమ్మెల్యేలు మద్దతు పలకడంతో ఈ ప్రతిపాదనకు మంజూరు లభించినట్లు తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
- పవన్ కల్యాణ్కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
Advertisement