-
తెలుగుదేశం పార్టీలో డబ్బు ఉంటేనే సీట్లు
-
వాడుకొని వదిలేయడం బాబుకు అలవాటే!
ఆక్ పాక్ కరివేపాక్ ఫిలాసఫీని అలానే కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి కోలుకోలేని షాకిచ్చారాయన. నంద్యాల నియోజక వర్గం భూమా అఖిలప్రియ- భూమా బ్రహ్మానందరెడ్డిలో ఒకరికి ఇస్తానన్నట్లు చెబుతూ వచ్చిన చంద్రబాబు చివరకు ఎన్.ఎం.డి.ఫరూక్ను నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం పార్టీకోసం కష్టపడితే ఇపుడు తమని పక్కన పెట్టి మోసం చేశారని భూమా బ్రహ్మానంద రెడ్డి లోలోనే కుత కుత లాడిపోతున్నారు. అవసరానికి వాడుకోవడం ఆ తర్వాత వదిలేయడం చంద్రబాబు నాయుడికి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య. కర్నూలు జిల్లాలో 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గం నుండి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. ఎన్నికల తర్వాత కొంత కాలానికి ఆయన్ను రక రకాలుగా ప్రలోభాలు పెట్టి వేధించి టిడిపిలో చేరేలా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు ఆయన కూతురు భూమా అఖిల ప్రియ కూడా టిడిపిలో చేరారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున ఆళ్లగడ్డ నియోజక వర్గం నుంచి గెలిచిన అఖిల ప్రియ చంద్రబాబు ప్రలోభాలతో టిడిపిలో చేరారు. 2017లో భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో నంద్యాలకు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు. కాకపోతే 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. అయినా టిడిపినే అంటిపెట్టుకుని ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ నంద్యాల నుండి తానే పోటీ చేయాలని బ్రహ్మానందరెడ్డి ఆశపడుతూ వచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం జిల్లాలో భూమా కుటుంబం నుండి ఒకరికే టికెట్ ఇస్తామని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే భూమా అఖిల ప్రియ చేత నంద్యాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. బ్రహ్మానందరెడ్డి-అఖిల ప్రియ మధ్య రచ్చ రాజేసి ఇద్దరి మధ్య పోటీ పెట్టిన చంద్రబాబు నాయుడు ఇపుడు హఠాత్తుగా మాజీ ఎమ్మెల్యే ఎన్. ఎం.డి. ఫరూక్ ను నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఫరూక్ కు టికెట్ కేటాయించినట్లే అంటున్నారు పార్టీ నేతలు. అయిదేళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతం కోసం తాను పార్టీలోనే ఉంటే ఇపుడు తనను పక్కన పెట్టడం ఏం న్యాయమని బ్రహ్మానంద రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరోసారి వెన్నుపోటుకు తెగబడ్డారని బ్రహ్మానంద రెడ్డి తన అనుచరులతో చెప్పుకుని బాధ పడుతున్నారట. ఫరూక్ కు టికెట్ ఇస్తే మాత్రం ఆయన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని బ్రహ్మానందరెడ్డి తన కోటరీ సభ్యులతో అంటోన్నట్లు ప్రచారం జరుగుతోంది . మొత్తానికి వచ్చే ఎన్నికల్లోనూ నంద్యాల నియోజక వర్గం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఖాతాలోనే పడుతుందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వర్గాలతో పాటు టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. -
దళిత అధికారిని కొట్టిన వ్యక్తికి టికెట్టా?
జైపూర్/జోథ్పూర్: దళితుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ, దళిత ఇంజినీరింగ్ అధికారిపై దాడికి పాల్పడిన వ్యక్తికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమెలా ఇస్తారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మలింగకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా రాజస్తాన్ రాజకీయ చరిత్రలో బీజేపీ చీకటి అధ్యాయం లిఖించినట్లయిందని సీఎం అశోక్ గెహ్లోత్ విమర్శించారు. బారి అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్కు చెందిన గిరిరాజ్ సింగ్ మలింగ విద్యుత్ శాఖ ఇంజినీరింగ్ అధికారిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించింది. ఆ తర్వాత మలింగ బీజేపీలో చేరడం, ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగడం జరిగిపోయాయి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సీఎం గెహ్లోత్ శనివారం జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధిత అధికారి హర్షాధిపతి వాల్మీకిని పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘మలింగ చేసిన పనిని చూసి అతడిని మేం దూరంగా పెట్టాం. అతడికి టిక్కెట్టివ్వకుంటే ఏమవుతుంది? ఏ పార్టీ కూడా అలాంటి వారికి చోటివ్వరాదు. మరోవైపు, పేదల కోసం ఎంతో చేశామని బీజేపీ చెప్పుకుంటోంది. తనది పేదల పక్షమని ప్రధాని మోదీ స్వయంగా అంటున్నారు. వాస్తవం మాత్రం వేరుగా ఉంది. ఇతరులపై దాడులకు పాల్పడే వారికి మోదీ, అమిత్ షా అవకాశమిస్తున్నారు. మలింగకు బీజేపీ టిక్కెటివ్వడం సిగ్గుచేటు. దీనిని ఖండిస్తున్నాను’అని పేర్కొన్నారు. అనంతరం గెహ్లోత్ మాట్లాడుతూ..‘దళిత అధికారిపై దాడిని బీజేపీ ఖండించింది. కానీ, అందుకు కారకుడైన వ్యక్తిని అక్కున చేర్చుకుని, టిక్కెట్టిచ్చింది. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఈ ఘటన రుజువు చేసింది. బీజేపీ వైఖరేంటో అర్థమవుతుంది. అది దళిత వ్యతిరేకి. దీనితో రాజస్తాన్ రాజకీయ చరిత్రలో బీజేపీ చీకటి అధ్యాయం లిఖించింది’అని పేర్కొన్నారు. అంతకు సుమారు రెండు గంటలకు ముందు ప్రధాని మోదీ భరత్పూర్లో జరిగిన ర్యాలీలో రాజస్తాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలు, దళితులపై దాడులు పెరిగిపోయాయంటూ చేసిన ఆరోపణలపై వారు పైవిధంగా స్పందించారు. గత ఏడాది మార్చిలో ధోల్పూర్ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే మలింగ, అతడి మద్దతుదారులు చేసిన దాడిలో వాల్మీకి, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి వాల్మీకి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం ఎమ్మెల్యే మలింగ పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. -
జనగామ బీఆర్ఎస్ లో టికెట్ జగడానికి తెరపడినట్లేనా..?
-
బీజేపీలో బిగ్ ట్విస్ట్.. తన తండ్రికి టికెట్ ఇవ్వొదన్న కూతురు..
జైపూర్: ఈ ఏడాది చివరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్లోని బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన తండ్రికి టికెట్ ఇవ్వొదంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూతురు నిరసనలు తెలిపింది. దీంతో, అక్కడ పొలిటికల్ వాతావరణం హాట్ టాపిక్గా మారింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు ముందే బీజేపీలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే అయిన తన తండ్రికి పార్టీ టిక్కెట్ ఇవ్వద్దంటూ ఆయన కుమార్తెనే అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చింది. ఒకవేళ టిక్కెట్ ఇస్తే తన తండ్రిపై రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపి, ఇతర టిక్కెట్ ఆశావహులతో కలిసి ఓడిస్తానని హెచ్చరించడం రాజస్థాన్ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జయరామ్ జాటవ్ కూతురు మీనా జాటవ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తన తండ్రికి టిక్కెట్ ఇవ్వవద్దని కోరారు. దీంతో, వీరి వ్యవహారం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. తన ఆస్తులను కొట్టేసేందుకు స్వయానా తన తండ్రే కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తి సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. అంతేకాకుండా తన కొడుకును కూడా చంపించాలని చూస్తున్నాడని మీనా జాటవ్ ఆరోపించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ సహా బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు రాజస్థాన్లో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు కోరారు. ఇక, కాంగ్రెస్ నేతలు కూడా రాజస్థాన్లో పర్యటిస్తున్నారు. అక్కడ గెలుపే లక్ష్యంగా హస్తం నేతలు ప్లాన్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: గగన్యాన్లో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement