-
శీనన్న మాటంటే మాటే
పలువురు జాతీయ నాయకుల వద్ద తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని రెండు గంటల పాటు వివరిస్తే... ఓపిగ్గా విన్న వారు ఇంత అన్యాయాన్ని ఎలా భరిస్తున్నారని అడిగారని తెలిపారు. ఉద్యోగులు,విద్యార్థులు,ప్రజా సంఘాలు,రాజకీయ జేఏసీ, కార్మికులు, మహిళలు, ప్రజల పోరాటలతో పాటు ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలితంగానే తెలంగాణపై సోనియా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదయోగ్యం అయ్యేంత వరకు మనమంతా ఓర్పుతో ఉండాలని డీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంలో నిజామాబాద్లోనే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలపడం సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలోని మైనింగ్,మినరల్,సింగరేణి వంటి గనులు అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళిక ద్వారా నీటి వనరులను పెంచుకుని బీడు భూములను సాగులోకి తీసుకువస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారస్వామి పాత్రను పోషిస్తే, తాను వినాయకుడిగా జీవించానని.. కథను డీఎస్ సభికులకు వినిపించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటైన వైద్యకళాశాలకు తెలంగాణ పేరు పెట్టేవిధంగా ప్రతిపాదనలు చేసినట్లు డీఎస్ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీని సమష్టి కృషితో సాధించుకున్నామన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఆయన సభలో జోహార్లు అర్పించారు. సభికులతో ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేయించారు. డీఎస్ను రాజకీయ, ఉద్యోగ, కుల సంఘాలు, విద్యార్థి, కార్మిక, న్యాయవాద, డాక్టరు జేఏసీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. సభకు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షత వహించగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్, పీసీసీ కార్యదర్శి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సతీష్పవార్, అరుణతార, మాజీ మేయర్ సంజయ్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, సురేందర్, రత్నకర్, రాజేంద్రప్రసాద్లు పాల్గ్గొన్నారు. మంత్రి, విప్ గైర్హాజరు.... తెలంగాణ ఏర్పాటు ప్రకటన తరువాత మొదటి సారిగా నిజామాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగసభకు మంత్రి పి.సుదర్శన్రెడ్డి,ఎమ్మెల్సీ షబ్బీర్అలీ, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డిలు దూరంగా ఉన్నారు. మంత్రి సుదర్శన్రెడ్డి అనుచరవర్గంలోని డీసీసీ అధ్యక్షుడు తాహెర్బిన్ మినహా మిగితా అందరూ గైర్హాజరయ్యారు. మూడు రోజుల కిందట మంత్రి సుదర్శన్రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అనుచరవర్గాలు కూడా దూరంగా ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఫ్లెక్సీల ఏర్పాటులోనూ ఈ వ్యత్యాసం కనిపించింది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్లో మూడు స్తంభాలాటగా కొనసాగుతోంది. మంత్రి సుదర్శన్రెడ్డి, డీఎస్ అనుచరులు రెండు వర్గాలుగా చీలిపోయి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని పంచుకుంటుండగా, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్అలీ, విప్ అనిల్ మూడవ వర్గంగా వ్యవహరిస్తున్నారు. సమయం, సందర్భాలను బట్టి మూడవ వర్గంగా వ్యవహరిస్తున్న నాయకులు, వారి అనుచరులు అటు డీఎస్తోనూ, ఇటూ పీఎస్తోనూ సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న విభేదాలు కార్యకర్తలను తీవ్ర ైనైరాశ్యానికి గురిచేస్తున్నాయి. -
ఇచ్చింది సోనియా.. తెచ్చింది కాంగ్రెస్
తూప్రాన్, న్యూస్లైన్: తెలంగాణ ప్రాంతంలో ఉన్న సీమాంధ్రులంతా తెలంగాణవాదులేననీ, వారిని సెటిలర్స్ అనడం భావ్యం కాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. బుధవారం తూప్రాన్లో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డీఎస్ మాట్లాడారు. తెలంగాణ తెచ్చేది...ఇచ్చేది తామేననీ ఎన్నోసార్లు చెప్పామని, ఇచ్చినమాటకు కట్టుబడే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. అందువల్లే ఆ నినాదాన్ని ఇపుడు ‘‘ఇచ్చింది సోనియాగాంధీ, తెచ్చింది కాంగ్రెస్’’గా మార్చుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనన్నారు. తనతో పాటు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలంతా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానానికి విన్నవించారని ఆయన తెలిపారు. అందువల్లే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖత తెలిపారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుల సంఘాలు, వివిధ వర్గాలకు చెందిన వారు దశాబ్ధాలుగా ఉద్యమాలు చేస్తూ వస్తున్నారనీ, వారిలాగే వివిధ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సైతం ఉద్యమాలు చేపట్టారని డీఎస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే సీమాంధ్రుల మనస్సు నొప్పించకుండా తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారికి రాజధాని ఏర్పాటు అయ్యేవరకు సహకరిద్దామని పిలుపునిచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అంశాన్ని అడ్డం పెట్టుకుని లాభపడాలని చూశాయనీ, కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనతో వారి ఆటలకు చెక్ పడిందన్నారు. గజ్వేల్, పటాన్చెరు ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, నందీశ్వర్గౌడ్లు తెలంగాణ సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని కొనియాడారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ మహిపాల్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు విజయభాస్కర్రెడ్డి, మహేందర్రెడ్డి, నర్సింహ్మారెడ్డి, బాబుల్రెడ్డి, భాగవన్రెడ్డి, వీర్కుమార్గౌడ్, చక్రవర్తి, రవీందర్గుప్త, అలీం, పెంటాగౌడ్, నరేందర్రెడ్డి, కమ్మరి సత్యనారాయణ, వెంకటస్వామి, వెంకట్రెడ్డి, దీపక్రెడ్డి, రఘునాథరావు, అనంతం, మాల్లారెడ్డి, సిద్దిరాంలుగౌడ్, సామల అశోక్, ఉమార్, నాగరాజుగౌడ్, అనిల్, లక్ష్మణ్ పాల్గొన్నారు. అంతకుముందు పోతరాజుపల్లి చౌరస్తా నుంచి తూప్రాన్ వరకు సాగిన విజయోత్సవ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement