-
కొత్త కొత్వాల్ మహేందర్రెడ్డి
జూన్ 2న బాధ్యతలు స్వీకరించే అవకాశం 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రాజధానికి కొత్త పోలీస్ కమిషనర్గా ఎం.మహేందర్రెడ్డి పేరు ఖరారైంది. జూన్ 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటలకే మహేందర్రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేందర్రెడ్డిని కొత్వాల్గా నియమించే అంశంలో ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడికి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఆయన నియామకానికి మార్గం సుగమమైనట్లు తెలిసింది. ప్రస్తుత నగర పోలీసు కమిషనర్ అనురాగ్శర్మ తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ఎంపిక కావడంతో ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలను కాపాడే సమర్ధవంతులైన ఐపీఎస్ అధికారి ఎవరనే విషయంలో పలుమార్లు ఉన్నతస్థాయిలో అధికారులు తర్జనభర్జన పడ్డారు. అయితే చివరకు మహేందర్రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలిసింది. అయితే ఎం.రవీందర్ బంద్కు మద్దతు తెలిపారు. బంద్లో తామూ పాల్గొంటున్నట్లు తెలంగాణా విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బంద్కు మద్దతు.. అఫ్జల్గంజ్: తెలంగాణ బంద్కు సంపూర్ణమద్దతునిస్తున్నట్లు తెలంగాణ మజ్దూర్యూనియన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్.బి.రెడ్డి, తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎస్ నాగరాజు, తెలంగాణ వ్విశ్వవిద్యాలయాల ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ సర్వీసులు గురువారం యథాతథంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులసూచన మేరకు ఆయా రూట్లలో బస్సులు నడుపుతామని గ్రేటర్ జోన్ ఈడీ కోటేశ్వరరావు స్పష్టం చేశారు. జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయి. నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లు షెడ్యూలు ప్రకారమే నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రజాసంబంధాల అధికారి సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. -
అంపశయ్యపై కాంగ్రెస్
సాక్షి, ఒంగోలు: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్కరుగా వీడిపోతున్న క్రమంలో.. ఆ పార్టీ తరఫున జెండా పట్టుకునే వారే కరువయ్యారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రాతినిధ్యం నామమాత్రమే.. పార్టీ సీనియర్లే పక్కకు తప్పుకుంటుండటంతో కేడర్ సైతం కాడి నేలకేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు జిల్లాకొస్తున్నారు. బస్సుయాత్ర పేరిట ఒంగోలులో సోమవారం పర్యటించనున్నారు. సీమాంధ్ర సారథిగా పార్టీ తరఫున మాజీమంత్రి ఎన్.రఘువీరారెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి ఈ యాత్ర చేయనున్నారు. వారికి స్వాగతం పలికి కండువా కప్పేందుకు జిల్లాలో కార్యకర్తలు కరువయ్యార ని ఇప్పటికే అధిష్టానం గుర్తించింది. ఈమేరకు చుట్టుపక్కల జిల్లాల కేడర్ కూడా ఇక్కడకొచ్చి ఇంకా పార్టీలో మిగిలిన అరాకొరా కార్యకర్తలతో సమావేశమవుతోంది. రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ను వీడి జిల్లా నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్లోకి చేరుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేసి నెగ్గలేమనే భయం కేడర్లో నెలకొన్న నేపథ్యంలో... కాంగ్రెస్ పెద్దలు బస్సుయాత్ర పెట్టడం ద్వారా ఒనగూరే ప్రయోజనమేమీ లేదంటున్నాయి రాజకీయ వర్గాలు. పరువా..? పరాభవమా..? సీమాంధ్ర పీసీసీ బాధ్యతలు స్వీకరించిన మాజీమంత్రి ఎన్.రఘువీరారెడ్డితో పాటు కేంద్రమంత్రి చిరంజీవి తదితర నేతలు జిల్లాకొచ్చి ఇక్కడి కార్యకర్తల్లో ధైర్యం నూరిపోస్తారని డీసీసీ చెబుతున్న మాటలపై జిల్లా శ్రేణులెవరూ పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి .. ఇతర పార్టీల ఆహ్వానం కోసం ఎదురుచూస్తూ అభిప్రాయ సేకరణల్లో ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేసి, ప్రత్యామ్నాయ రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నిస్తుండగా, ఆయన తర్వాత జిల్లా పార్టీని భుజాలకెత్తుకున్న ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జడా బాలనాగేంద్ర సైతం కిరణ్పార్టీ కండువా వేసుకున్నారు. గిద్దలూరు, మార్కాపురం, పర్చూరు, ఒంగోలు, కొండపి, చీరాల, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు దాదాపు మూతపడ్డాయి. మాజీమంత్రి, కందుకూరు ఎమ్మెల్యే ఎం.మహీధర్రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఆలోచిస్తూ నియోజకవర్గాన్ని వదిలి హైదరాబాద్కే పరిమితమవగా, ఇప్పటికే పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికల్లో తాను పోటీచేయనని ప్రకటించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ రేపోమాపో మరోపార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కనిగిరి ఎమ్మెల్యే, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి సైతం అవకాశాలుంటే..వలసకు సిద్ధంగా ఉన్నట్లు అనుచరవర్గాల సమాచారం. ఇక పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్బాబు, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ అయినాబత్తిని ఘనశ్యామ్, మరో నేత మంత్రి శ్రీనివాస్ కూడా కాంగ్రెస్కు అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఇటీవల మద్దిపాడు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మారం వెంకారెడ్డి కూడా కాంగ్రెస్ను కాదని .. వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ కార్యాలయం ముఖం చూడడం లేదు. అధిష్టాన పెద్దలు జిల్లాకొస్తున్న నేపథ్యంలో వారికి స్వాగతం పలికి పరువు కాపాడాలని ద్వితీయశ్రేణి నేతల్ని ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి ఫోన్లు చేసి బతిమాలుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. కేంద్రమంత్రులపై జిల్లా జనం భగ్గు.. రాష్ట్ర విభజన బిల్లులో కీలకపాత్ర పోషించి.. సొంత నియోజకవర్గాల్లో తలెత్తుకుని క్యాడర్ ముందు తిరగలేక.. అధిష్టానం పెద్దలతో పాటు జిల్లాకొస్తున్న కేంద్రమంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి పేరెత్తితేనే జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు. ఇటీవల పనబాక లక్ష్మి పలుచోట్ల సమావేశాలు నిర్వహించగా, కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. జిల్లాలోని కాంగ్రెస్ సంప్రదాయ ఓటుబ్యాంకు ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ను ప్రత్యామ్నాయ శక్తిగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ అంపశయ్యపై ఉందన్న చేదు నిజాన్ని విని అధిష్టాన పెద్దలు ఏవిధంగా జీర్ణించుకుంటారో వేచిచూడాల్సిందే.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
T20 WC 2024: టీ20 వరల్డ్కప్లో అత్యంత చెత్త రికార్డు..
Paris Olympics: ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకున్న అమిత్
జీవితమంటే ఏంటో తెలిసొచ్చింది.. సుశాంత్ సింగ్ వల్లే.. : నటి
జీర్ణాశయాన్ని బాధించే.. ఈ సమస్యలోంచి బయటపడాలంటే?
ప్లీజ్.. నన్ను కొట్టొద్దు.. వేడుకున్న కేజీఎఫ్ నటి
డబ్బులు పంచనందుకే ఎన్నికల్లో ఓడిపోయా: తెలంగాణ గవర్నర్
ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే?
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. సాంగ్స్తో జోష్ నింపిన కేటీ పెర్రీ (ఫోటోలు)
టీమిండియాతోనూ ఇలాగే ఆడతాం: యూఎస్ఏ కెప్టెన్
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆ కేఫ్ విందు..!
Advertisement