-
మొబైల్ ల్యాబ్స్తో కరోనా పరీక్షలు..
సాక్షి, హైదరాబాద్: కరోనా వైద్య పరీక్షల కోసం మొబైల్ ల్యాబ్స్ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేసింది. ఇప్పటికే వీటివల్ల కేరళలో మంచి ఫలితాలు వచ్చాయని తెలి పింది. అయితే ఈ తరహా ప్రతిపాదన ప్రభు త్వం వద్ద లేదని, సంచార వైద్య పరీక్షల ల్యాబ్స్ ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కరోనా తీవ్రత దృష్ట్యా సంచార వైద్య పరీక్షల ల్యాబ్ల ఏర్పాటు అవసరం ఎంతగానో ఉం దని పేర్కొంది. ఈ నెల 29లోగా ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని, విచారణను ఈ నెల 30న జరుపుతామని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైద్య సంబంధిత ప్రజాహిత వ్యాజ్యాలను గురువారం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. డాక్టర్ నుంచి బాయ్ వరకు పీపీఈ కిట్లు ‘జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల వివరా లను వార్డుల వారీగా ప్రకటించాలి. ఆ వివరాలను స్థానిక కాలనీ అసోసియేషన్లకు అంద జేయాలి. రోజూ కరోనా బులెటిన్ మీడియాకు తెలపడంతోపాటు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. జిల్లాల్లో కరోనా ఆస్పత్రు లుగా గుర్తించిన వాటి గురించి ప్రభుత్వం విçస్తృత ప్రచారం చేయాలి. గాంధీకే కరోనా వైద్య సేవలు పరిమితం కాలేదని ప్రజలకు తెలియజేయాలి. కేరళలో అమలు చేస్తున్న ఆర్టీ–పీసీఆర్ పరీక్షలను వైద్య సిబ్బంది చేసేందుకు ఉన్న అడ్డంకు లేమిటో చెప్పాలి. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ అమలుకు ఉన్న ఇబ్బందులు ఏమిటో తెలియ జేయాలి. వైద్యం చేసే డాక్టర్ నుంచి వార్డు బాయ్ వరకు అందరికీ పీపీఈ కిట్లు ఇవ్వాలి. గాంధీలో తరహాలోనే జిల్లాల్లోనూ డాక్టర్లు, ఇతర సిబ్బందిని షిఫ్టు విధానంలో సగం మంది సర్వీసులనే వాడుకోవాలి. పది రోజుల్లో 50 వేల పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యాన్ని సాధించేలా చర్యలుండాలి. ఇందుకు యాంటి జెన్ టెస్టింగ్ కిట్స్ను వినియోగించాలి. పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారికీ నిర్ధారణ పరీక్షలు చేయాలన్న ఐసీఎంఆర్ నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే రోగి, వెంట వచ్చే సహాయకులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి...’ అని ధర్మాసనం ఆదేశించింది. జీహెచ్ఎంసీలో లక్ష్యానికి అనుగుణంగా టెస్టులేవీ? తొలుత అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 16 నుంచి జీహెచ్ఎంసీలో పది రోజుల్లో 50 వేల పరీక్షలను చేయడం ప్రారంభించామన్నారు. దీనిపై హైకోర్టు కల్పించుకుని, సగటున రోజుకు లక్ష్యం 5 వేలు అయితే ఈ నెల 16, 17 తేదీల్లో 1,873, 1,096 పరీక్షలను మాత్రమే చేశారని, లక్ష్యానికి అనుగుణంగా పరీక్షలు చేయాలని సూచించింది. నిమ్స్ అటానమస్ కావడం వల్లే అక్కడ కరోనా వైద్య సేవలు చేయడం లేదని ఏజీ చెప్పారు. ఇటు విచారణకు వీడియో కాన్ఫరెన్స్లో ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు హాజరయ్యారు. కరోనా వైద్యం చేసే 46 ఆస్పత్రుల్లో వైద్యసేవల్లో ఉన్న అందరికీ పీపీఈ కిట్లను ఇచ్చామని శ్రీనివాసరావు చెప్పారు. పీపీఈ కిట్లు 1.57 లక్షలుంటే 1.23 లక్షలను వినియోగించామని చెప్పారు. ఎన్–95 మాస్క్లు 2.59 లక్షలు వినియోగించగా ఇంకా 85 వేలకు పైగా ఉన్నాయని, త్రీలేయర్ మాస్క్లు 4.59 లక్షలు, 3 లక్షల సర్జికల్ గ్లౌజులు, 1.47 లక్షల టెస్టింగ్ గ్లౌజ్లు, 26 వేల శానిటైజర్లున్నాయన్నారు. ఇటు గాంధీ ఆస్పత్రి వద్ద 274 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారని, గాంధీలో 441 మంది కరోనా బాధితులు వైద్యం పొందుతున్నారని రాజారావు చెప్పారు. 50 శాతం వైద్యులే విధుల్లో ఉంటారని, వైద్యం చేస్తున్న కారణంగా వారి కుటుంబసభ్యుల జాగ్రత్తల నిమిత్తం వారికి బయట వేరే వసతి ఏర్పాట్లు చేశామన్నారు. -
నల్లమలలో మొబైల్ ల్యాబ్
అచ్చంపేట : మారుమూల ప్రాంత పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో పది పడకల అస్పత్రిని 30 పడకలుగా ఆప్గ్రేడ్ చేసే పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నల్లమలలో సంచార పాతోలాజికల్ లేబరేటరీ (మొబైల్ వ్యాన్)ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ట్రామా, కేన్సర్ డిటెక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అచ్చంపేటలో వంద పడకల ఆస్పత్రి రూపుదిద్దుకుంటోందన్నారు. -
కోనసీమకు ఆక్వా మొబైల్ ల్యాబ్
అమలాపురం రూరల్:తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా ఆక్వా సాగు జరిగే కోనసీమలో త్వరలో ఆక్వా మెుబైల్ ల్యాబ్ను ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర మత్య్సశాఖ కమిషనర్ రామ్శంకర్నాయక్ చెప్పారు. అమలాపురం క్షత్రియ కల్యాణమండపంలో బుధవారం జరిగిన జిల్లాస్థాయి ఆక్వా సదస్సులో అమలాపురంలో ఆక్వా ల్యాబ్ ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కమిషనర్ను కోరారు. ల్యాబ్ ఏర్పాటుకు ఎన్నో నిధులు, శాస్త్రవేత్తలు అవసరమని, ప్రస్తుతం తాత్కాలికంగా ఓ మెుబైల్ ల్యాబ్ను ఏర్పాటు చేసి 104 మాదిరిగా అన్ని గ్రామాలకు ల్యాబ్ సౌకర్యాలు అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సంచార ల్యాబ్ ఉదయం నుంచి రాత్రి వరకూ గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. రొయ్యలు, చేపలు, పీతల పెంపకందారులు సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆక్వా సాగుకు వరికి మాదిరిగానే సాగునీరిచ్చేలా ప్రభుత్వం ఇటీవల క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే వరి సాగుకు వాడగా మిగిలిన నీటినే ఆక్వా సాగుకు ఇస్తారని చెప్పారు. ఉప్పునీరు, మంచినీరు రొయ్యల పెంపకం రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాణ్యమైన విత్తనాలతోపాటు ప్రభుత్వ రాయితీలు అందుతాయన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement