-
మహాస్వప్నతో కాసేపు
కందుకూరు (ప్రకాశం జిల్లా) దరినే ఉన్న లింగసముద్రంలో మహాస్వప్న మకాం అని తెలిసింది. బియ్యీడీ కాలేజీ ప్రాక్టికల్ పరీక్షల ఎగ్జామినర్గా కందుకూరు వెళ్లే అవకాశం వచ్చింది. ఆ నెపాన మాలకొండ వెళ్లి లక్ష్మీనరసింహస్వామితోనూ, లింగసముద్రం వెళ్లి మహాస్వప్నతోనూ పరిచయం కలిగించుకున్నాను. లింగసముద్రం మొదట్లోనే ఒక టీకొట్టు కనబడింది. ‘‘మహాస్వప్న గారుండేది ఎక్కడా?’’ అని అడిగాను. ఆ పేరు నోరు తిరగలేదు ఆయనకు. ‘‘మఆ... సపనా... ఏం జేస్తుంటా’’డని ఆరా అడిగాడు. ‘‘ఆయన పెద్దకవి’’ అని సమాధానమిచ్చాను. ‘‘అట్టజెప్పు, కవిగారా? రోజూ యీడేగా టీ తాగేది, కాసేపట్లో వొత్తాడు. యీడే ఉండండి.’’ చెక్కబెంచీ మీద కూలబడ్డాను. నిమిషం గడిచిందో లేదో సన్నగా, సుమారుపాటు ఎత్తుతో, పళ్లు రెండు మూడు ఊడిపోయినా ముఖం కళగా ఉన్న, ఊగుతూ నడుస్తున్న ఒకాయన వచ్చి నా పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. రెండు, మూడు నిమిషాలు గడిచాక, మహాస్వప్నతో నాకు పరిచయం లేదన్న సంగతి, టీకొట్టు మనిషి అర్థం చేసుకున్నట్టు ఉన్నాడు. ‘అడుగో నువ్వడిగిన కవిగారు, మాట్టాడకుండా కూచున్నావే?’ అని హుషారు చేశాడు. అప్పుడు సుమారు రెండు గంటలపాటు ఆయనతో మాట్లాడిన పిచ్చాపాటి ఇది. అన్నీ ఆయన మాటలే. ఇది జరిగింది 8.11.2008 నాడు. ‘‘దిగంబర కవిత్వానికి ముందే చాలా కవిత్వం రాశాను. అచ్చు పడింది తక్కువ. చించెయ్యలేదుగానీ పారేసింది, ఎక్కడ పెట్టానో మరిచిపోయింది ఎక్కువ. మహాస్వప్న పేరుతో కాకుండా చాలాపేర్లతో రాశాను. నగ్నముని ‘సహస్ర నామధేయుడు’ అని హాస్యంగా అంటూండేవాడు. దిగంబర సాహిత్యం మూడు సంకలనాలు బయటపడ్డ తరువాత మా మధ్య సైద్ధాంతిక విభేదాలు బయటపడ్డాయి. విడిపోయాం. అయినా నాకు ఎవరితో వ్యక్తిగత వైరుధ్యం లేదు. భైరవయ్య మొదటినుండీ ఒక బెట్టుగా ఉండేవాడు. దిగంబర కవిత్వం ఆవిష్కరణకు కూడా పెద్ద నిలువుబొట్టు పెట్టుకొని వచ్చాడు. ఏమిటిదీ అంటే అది అదే, ఇది యిదే అన్నాడు. జ్వాలాముఖి అంత పసిబిడ్డ మనస్తత్వం కలిగిన అగ్నిపర్వతాన్ని నేను ఇంకొకరిని చూడలేదు. జ్వాలాముఖి అన్న పేరు అసలుకైతే చెరబండరాజుకు ఇంకా బాగా అతుకుతుంది.హైదరాబాదులో నాలుగేళ్లు నిరుద్యోగిగా గడిపాను. తెలుగు నుండి ఇంగ్లీషులోకి, హిందీలోకి అనువాదాలు చేశాను. చాలా కొద్ది డబ్బు వచ్చేది. దానితోనే గడిపాను. నాకు మూడు భాషలు బాగానే వచ్చు. ఫ్రెంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాను. పురుట్లోనే సంధి కొట్టింది. సంస్కృతం కూడా ట్రై చేశాను. కుదరలేదు. నాకు శ్రీశ్రీ అన్నా, శ్రీశ్రీకి నేనన్నా చాలా అభిమానం. నా పుస్తకం ఒకదానిని అచ్చువేస్తానన్నాడు. నేనే నిరాకరించాను. ‘పుస్తకం రాసేనాటికీ యిప్పటికీ నా అభిరుచులు, భావజాలం మారిపోయాయి. పుస్తకం ప్రచురించే నాటికి పుస్తకంలో కంటెంట్, రచయిత ఐడియాలజీ ఒకటిగా ఉండాలి. లేకపోతే వేయకూడదు అన్నది నా సిద్ధాంతం’ అని చెప్పాను. 1964లో మొదటిసారి, 1977లో రెండవసారి పుట్టపర్తి వెళ్లాను. బాబా దర్శనంతో నాలో మార్పు వచ్చింది. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మనసుకు కాస్త శాంతి చిక్కినట్లు అనిపించింది. అయితే అన్యాయం పట్లా, అసమానతల పట్లా, సమాజంలో ఒకరినొకరు చేసుకునే మోసాల పట్ల నా భావాలు దిగంబర కవిత్వం నాడు ఎలా ఉన్నాయో యిప్పటికీ అలానే ఉన్నాయి. 1977లో బాబాను దర్శించుకున్న తరువాత నాకు స్వప్న దర్శనం(యిదీ ‘మహాస్వప్న’ పేరుకి అర్థం అనుకున్నాను.) కలిగింది. బాబా ఇక నేను పుట్టపర్తి రానవసరం లేదన్నారు. నీకు ఒక మార్గం చూపాను, ఆ మార్గం వెంట వెళ్లడమే నీ కర్తవ్యం, ఇక బాబా దర్శనం ఎందుకు నీకు? అని సందేశమిచ్చారు. ఆ మాట పాటించి పుట్టపర్తి వెళ్లలేదు. 1964 తరువాత నా భావాలలో ఎంతో మార్పు వచ్చింది. నా భావాల పట్ల నాకే ఎన్నో సందేహాలు కలిగాయి. కొన్ని మార్చుకున్నాను. కొన్ని సమాధానాల కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. ముఖ్యంగా ‘మావో’ ఆలోచనాధోరణిపై వచ్చిన అనుమానాలు నివృత్తి కాకపోగా ‘‘అనవసర అపోహలు వద్దు’’, ‘‘వాటిని ప్రశ్నించడమే తప్పు’’ అనే విధమైన సమాధానాలు వచ్చాయి. అప్పుడే ఆధ్యాత్మిక ధోరణి ఏర్పడింది. అంతా మేజిక్, అన్నాచురల్లో జీవిస్తున్నాం అనే భావన ఏర్పడింది. సత్యం(?) కనుక్కోవాలనే తపన నన్ను అంతర్ముఖుడిని చేసింది. నా పరిచితులు అందరికీ నా ధోరణి అర్థం కాలేదు. నేను ఆ దశలో వారికి సరిగా చెప్పలేకపోయాను. ఇప్పటికీ దినపత్రికల్లో కవితలు, పద్యాలు, భక్తి వ్యాసాలు విరివిగా రాస్తున్నాను. అన్నీ మారుపేర్లతోనే. ఇప్పటి సాహిత్యం పట్ల నాకు పెద్ద అవగాహన లేదు. చదవటం లేదు కాబట్టి. నాలుగైదు పత్రికలు మాత్రం చదువుతాను. కథ కనిపిస్తే మాత్రం శ్రద్ధగా చదువుతాను. కవిత్వం కంటే కథ మన ప్రాంతంలో బాగా పరిణతి చెందింది. ఏది దొరికితే అది చదువుతుంటాను. దానిలో మంచి ఏదన్నావుంటే గ్రహించటానికి ప్రయత్నిస్తాను.’’ మహాస్వప్న ఆ రెండు గంటల్లో చెప్పిన విషయాలను ఒక వారం తర్వాత నాకు గుర్తున్నవి రాసుకున్నాను. ఆ ముక్కలే ఇవి. మా సంభాషణలో కుటుంబ విషయాలు ప్రస్తావనకు రాలేదు. మేనల్లుడి వద్ద ఉంటున్నానని చెప్పారు. మా మధ్య ఒక ఏడాదిపాటు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచి, నెమ్మదిగా నీరసపడ్డాయి. 2008 తర్వాత రెండుసార్లు లింగసముద్రం వెళ్లాను. మహాస్వప్న ఊళ్లోనే ఉన్నప్పటికీ నాకున్న సమయంలో ఆయన జాడ తీయలేకపోయాను. మోదుగుల రవికృష్ణ వివిఐఎ–వివిఐటి, నంబూరు -
నవతరం సంపాదకోపాధ్యాయుడు
నేడు ఉపాధ్యాయదినోత్సవం తెలుగులో మొదటి అకారాది నిఘంటువు ‘ఆంధ్రదీపిక’(1806), మొదటి చరిత్ర సంచిక ‘రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక’(1921), మొదటి పదచిత్రాల సమాహారం ‘విశాలాంధ్రము’(1940), మొదటి పాఠశాల స్మతులు ‘మా బడి’(1950) పుస్తకాలను రవికష్ణ సంపాదకుడిగా పునఃప్రచురించి అందుబాటులోకి తెచ్చాడు. ఒకప్పటి మల్లంపల్లి సోమశేఖరశర్మ, నేలటూరి వెంకటరమణయ్య, సురవరం ప్రతాపరెడ్డి, శేషాద్రిరమణ కవుల వంటి వారిలాగా సాహిత్యాన్నీ, చరిత్రనూ ద్వయానుసంధానంగా భావించి పరిశోధనను కొనసాగించినవారు అరుదైపోయారు. అట్లాంటి పెద్దల పరంపరలో కొనసాగుతున్న నవతరం సంపాదకుడు మోదుగుల రవికష్ణ. అతడికి ప్రాచీన చారిత్రకాంశాల పట్ల వల్లమాలిన మక్కువ. భాషా సాహిత్యాలంటే వెలకట్టలేని అభిమానం. అదే ఆయన్ని ఎన్నో విలువైన పుస్తకాలకు సంపాదకత్వం వహించేలా పురిగొల్పింది. గుంటూరులోని ఆర్వీఆర్ బి.యిడి. కళాశాలలో తెలుగు లెక్చరర్గా అన్ ఎయిడెడ్ పోస్టులో పనిచేసే వ్యక్తి తనకొచ్చే అల్పమైన జీతంతో సంసారాన్ని నెట్టుకురావడమే కష్టమైన పని. అలాంటిది సాహిత్యమూ, తత్సంబంధమూ అయిన 40 పుస్తకాలకు సంపాదకత్వం వహించి, మూడు పుస్తకాలు స్వయంగా రచించి ప్రచురించాడంటే ఆశ్చర్యకరంగా వుంటుంది! విశాఖపట్టణం తాలుకాలో రామప్పంతులు పప్పులేని పులగం లేనట్లు గుంటూరు మండలంలో రవికష్ణ ప్రమేయంలేని తెలుగు సాహిత్య కార్యక్రమాలు ఉండవు. అలాగని కేవలం గుంటూరులోనే కాదు, ఉభయ తెలుగురాష్ట్రాల్లోని అనేక మంది సాహిత్యకారులతోనూ, సంగీతజ్ఞులతోనూ, చరిత్రకారులతోనూ, నాట్యకారులతోనూ రవికష్ణది గాఢమైన పరిచయం! ‘మమ్మీ డాడీ వద్దురా ! అమ్మా నాన్నా ముద్దురా’, ‘తెలుగు భాష తల్లి వంటిది. పరాయిభాష ప్రియురాలు వంటిది’ లాంటి సజనాత్మకమైన నినాదాలతో బజారున పడి భాషాసేవ విరివిగా చేస్తున్నామనుకొని మురిసిపోయే తెలుగు ప్రేమికులు బలిసిన రోజులివి. ఒక భాషను కాపాడుకోవాలంటే, ఆ భాష మాట్లాడే ప్రజల జాతీయతనూ, రాజకీయ, ఆర్థిక, సాంస్కతిక చరిత్రనూ విపులంగా అధ్యయనం చేయాలనేది రవికష్ణ దష్టి. భాషకూ, ఆయా చరిత్రలకూ అవినాభావ సంబంధం ఉంటుందనేది అతను నమ్మిన సత్యం. మల్లంపల్లి సోమశేఖరశర్మ చరిత్ర వ్యాసాలు ‘బౌద్ధయుగము’, ‘చారిత్రక వ్యాసమంజరి’, శ్రీ రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక, శ్రీకష్ణదేవరాయల పట్టాభిషేక పంచశతాబ్ది ఉత్సవ ప్రత్యేక సంచిక వంటి పుస్తకాల ప్రచురణ ద్వారా తెలుగు ప్రజల సాంస్కతిక రాజకీయ చరిత్రలను రవికష్ణ మనకు పరిచయం చేస్తాడు. ఇక్కడొక సంగతి చెప్పాలి. రవికష్ణకు రాయలంటే పిచ్చి అనదగినంతటి అభిమానం. అందుకే, ‘పంచశతాబ్ది’ సందర్భంగానే 42 మంది దిగ్ధంతులు రాసిన వ్యాసాలతో మరో పుస్తకం ‘వనమాల’ తెచ్చాడు. ‘రాయవాచ’కాన్ని ఎన్నో విలువైన వివరణలతో మళ్లీ ముద్రించి రాయల వంశానికి చెందిన 18వ తరం శ్రీకష్ణదేవరాయలు చేత ఆవిష్కరింపజేశాడు. మనకు సినిమాల వల్ల అలవాటైన రాయలు కాకుండా, అసలు రాయలరూపం ఎలావుండేదో తేల్చడానికి దాదాపు 18 శిల్పచిత్రాలు సేకరించి రాయని గిరిధర్గౌడ్ చేత రాయల రూపాన్ని చిత్రింపజేశాడు. ఇక, నాట్యంపై వెలువరించిన ప్రత్యేక సంచిక మహామంజీర నాదం నాట్యకళ పట్ల అతని అభిరుచిని తెలుపుతుంది. ‘విఠ్ఠల కీర్తనలు అన్నమయ్యవా’ అనే మకుటంతో స్వయంగా రాసిన వ్యాసాల సంపుటి అతనిలోని పరిశీలనాసక్తిని, పరిశోధన శక్తిని వెల్లడి చేస్తుంది. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు స్వీయ చరిత్ర ‘నా యెఱుక’, చెల్లపిళ్ల వెంకటశాస్త్రి స్వీయచరిత్ర భాగం ‘కాశీయాత్ర’, ‘దేశభక్త’ కొండ వెంకటప్పయ్య స్వీయచరిత్ర వంటి గ్రంథాలకు రవికష్ణ సంపాదకత్వం ఎంతో నిండుతనాన్ని తెచ్చింది. ఈ విషయంలో, బొమ్మిడాల శ్రీకష్ణమూర్తి ఫౌండేషన్ రవికష్ణకు ప్రోత్సాహం అందిస్తోంది. సంపాదకుడంటే సంపూర్ణ మనుషుడు, చింపాంజీ కన్న నయము అని శ్రీశ్రీ సంపాదకులను యెద్దేవా చేశాడు. రవికష్ణను చూస్తే ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకొనేవాడు. తాను సంపాదకత్వం వహించదలచిన పుస్తకం గతంలో ప్రచురించబడి ఉంటే రవికష్ణ ముందుగా ఆ పాత ప్రతిని శ్రద్ధగా చదువుతాడు. పాతగ్రంథంలోని అక్షర స్ఖాలిత్యాలను, పదవిభజనను సరిచేస్తాడు. తర్వాత ఆ గ్రంథంలో ఇప్పటి పాఠకులకు అర్థం కావనుకొన్న విషయాలను జాబితా చేసి వాటికి వివరణలు తయారు చేస్తాడు. వాటిని కొత్తగ్రంథంలో ఫుట్నోట్సుగా యిస్తాడు. ఆ గ్రంథంలో ఉదహరించబడిన ప్రాంతాలను వీలైనంతవరకు సందర్శించి అక్కడి విశేషాలను గ్రహిస్తాడు. ఆయా విశేషాలను ఛాయా చిత్రాలతో సహా పుస్తకంలో సందర్భానుసారం ఉటంకిస్తాడు. తాను సంపాదకత్వం వహించిన పుస్తకానికి సమగ్రతను సాధించి కొత్త రూపు తెస్తాడు. పాత గ్రంథాన్ని, కొత్త ప్రచురణను పరిశీలిస్తే రవికష్ణ కషి బాగా అర్థమవుతుంది. ఇక, ప్రచురించేది కొత్త పుస్తకమైతే తాను చెప్పదలచుకున్న విషయాన్ని సమగ్రంగా పరిశోధించి న భూతో అన్నట్టు ప్రచురిస్తాడు. బెంగళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర అందుకు ఉదాహరణ. అలాగే కొండ వెంకటప్పయ్య స్వీయ చరిత్రలో పిండారీలను గురించి చెప్పిన ఫుట్నోట్సు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారు, బకింగ్హామ్ కాలువద్వారా ఉన్న ప్రయాణ సౌకర్యాల గురించి ఇచ్చిన ఫుట్నోట్సు సంపాదకుడి ప్రతిభను మచ్చుకి వెల్లడిస్తాయి. లెక్చరర్గా రవికష్ణ పిల్లల చదువుల పట్ల విశేష శ్రద్ధ కనపరుస్తాడు. పాఠ్యాంశాలతోపాటుగా తత్సంబంధమైన యితర అంశాలను కూడా జోడించి పాఠాన్ని ఆసక్తికరంగా వినేట్టు చేస్తాడు. స్నేహితుల దగ్గరినుంచి వాళ్లకు అక్కరలేని పుస్తకాలేవైనా ఉంటే పట్టుకెళ్లి తాను క్లాసులో పెట్టే చిన్న చిన్న పరీక్షల్లో నెగ్గిన వారికి బహుమతిగా యిస్తాడు. పిల్లలను విహార యాత్రలకు తీసుకుపోయి ఆయా ప్రాంతాలను గురించి వివరంగా పరిచయం చేస్తాడు. వాటిని గురించి పిల్లల చేత వ్యాసాలు, కవితలు రాయిస్తాడు. వాటిని మళ్లీ పుస్తకరూపంలో ప్రచురిస్తాడు. అలా వచ్చినవే ‘హంపీస్మతులు’, ‘అదిగో భద్రాద్రి’, ‘ఓరుగల్లు శిథిలాలు’ పుస్తకాలు. అంతెందుకు, మెథడాలజీ బోధించే ఈ పంతులుగారు 15 మంది బయాలజీ, సోషల్ విద్యార్థులను సైతం తెలుగు పట్ల ఆకర్షితులయ్యేలా చేసి, వారితో తెలుగు ఎమ్మేలు చేయించి, వారిని తెలుగు టీచర్లుగా స్థిరపడేలా ప్రేరణ ఇవ్వగలిగాడు. ‘నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్’ అంటాడు గిరీశం. అది నిజమో కాదో తెలియదు కానీ రవికష్ణతో మాట్లాడటం మాత్రం నిజంగా ఒక ఎడ్యుకేషన్. సాహిత్యం, చరిత్ర, సినిమా, నాట్యం, సంగీతం, పదకవిత్వం, నిఘంటువులు, సాహితీమూర్తులు మొదలైన విషయాలు ప్రస్తావన కొచ్చినప్పుడు అతనిలో మహోత్సాహం కన్పిస్తుంది. తనకు తెలిసిన అనేక విషయాలను చతురోక్తులతో దట్టించి వినే వాళ్లను మంత్రముగ్ధుల్ని చేస్తాడు. అతన్ని తెలిసిన వాళ్ళు అతని పలుకుల్నీ, ఉత్సాహాన్నీ, అపారమైన జ్ఞాపకశక్తినీ, అపరిమితమైన సాహితీకషినీ మరిచిపోలేరు. రచయిత: పిన్నమనేని మత్యుంజయరావు 7794004466
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement