-
రోహిత్ శర్మ కెప్టెన్సీపై దిగ్గజ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
కెప్టెన్గా అరంగేట్రం టెస్ట్లోనే అద్భుత విజయాన్ని అందుకున్న రోహిత్ శర్మపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్తోనే రోహిత్ ఆకట్టుకున్నాడని, అతను బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయని, ఇందుకు రోహిత్కు 10కి 9.5 రేటింగ్ పాయింట్లు ఇస్తానని సన్నీ తెలిపాడు. రోహిత్ చాకచక్యంగా ఫీల్డింగ్ సెట్ చేయడంతో టీమిండియా ఆటగాళ్లు ఎక్కువగా కదలాల్సిన అవసరం రాలేదని, ఈ విషయంలో రోహిత్ తన ఐపీఎల్ అనుభవాన్నంతా ఉపయోగించాడని కితాబునిచ్చాడు. బౌలింగ్లో జడేజాను సరైన సమయంలో వాడుకున్నాడని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా రోహిత్ కెప్టెన్సీ కారణంగానే టీమిండియా మూడు రోజుల్లోనే మ్యాచ్ను ముగించిందని కొనియాడాడు. రోహిత్ సొంత నిర్ణయాలు తీసుకుని జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని ప్రశంసించాడు. రోహిత్కు సీనియర్లు బాగా సహకరించారని, ఇది టీమిండియాకు శుభపరిణామమని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా ఆల్రౌండ్ ప్రదర్శన (175 నాటౌట్, 9 వికెట్లు)తో టీమిండియాకు మరపురాని విజయాన్నందించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 574-8 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా, శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 174, రెండో ఇన్నింగ్స్లో 178 పరుగులకు చాపచుట్టేసింది. అబ్బురపోయే ప్రదర్శనతో అదరగొట్టిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ పింక్ బాల్తో డే అండ్ నైట్ ఫార్మాట్లో జరగనుంది. చదవండి: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్పై విమర్శలు! -
రెండో రోజు ముగిసిన ఆట.. మెరిసిన జడ్డూ
-
IND VS SL 1st Test: ఒత్తిడిలో విరాట్..? ప్రాక్టీస్ సెషన్స్లో ఆరుసార్లు క్లీన్ బౌల్డ్..!
మొహాలీ వేదికగా శ్రీలంకతో రేపటి (మార్చి 4) నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్ట్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్లో 100వ టెస్ట్ కానుందన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది. కరోనా ఆంక్షల కారణంగా తొలుత ప్రేక్షకులను అనుమతించేది లేదని ప్రకటించిన బీసీసీఐ, కోహ్లి అభిమానుల ఒత్తిళ్లకు దిగొచ్చింది. మైదానంలోని 50 శాతం ప్రేక్షకులను అనుమతిచ్చేందుకు ఒప్పుకుంది. ఇప్పటికే ఈ టెస్ట్కి సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇదిలా ఉంటే, కెరీర్లో మైలురాయి టెస్ట్కి ముందు పరుగుల యంత్రం కోహ్లి ఒత్తిడికి గురవుతున్నాడని తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందే మొహాలీ చేరుకున్న అతను... నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్స్లో కోహ్లి.. నెట్స్లో ఏకంగా ఆరుసార్లు బౌల్డ్ అయ్యాడని సమాచారం. తన కెరీర్లో చిరకాలం గుర్తండిపోయే టెస్ట్లో సరిగ్గా పెర్ఫార్మ్ చేస్తానా లేదా అన్న ఆందోళనలో కోహ్లి ఉన్నట్లు తెలుస్తోంది. పైగా అతను సెంచరీ బాది దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుండటంతో ఈ మ్యాచ్లోనైనా కోహ్లి ఆ మార్కును అందుకోవాలని అతని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ అంచనాలే కోహ్లి ఒత్తిడికి కారణమని తెలుస్తోంది. కాగా, రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా మొహాలి వేదికగా రేపటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్తో రోహిత్ తొలిసారి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుండగా.. కోహ్లి కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. చదవండి: అంతా కోహ్లినే చేశాడు.. హిట్మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
అంతా కోహ్లినే చేశాడు.. హిట్మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Credit Goes To Virat Kohli For Indias Test Success Says Rohit Sharma: భారత్-శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లిను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్లో 100వ టెస్ట్ ఆడనున్న కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ.. టెస్ట్ల్లో టీమిండియా ఈ పరిస్ధితికి కోహ్లినే కారణమంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. కోహ్లి టెస్ట్ సారధ్య బాధ్యతలు చేపట్టే నాటికి టీమిండియా ఏడో ర్యాంకులో ఉందని, అలాంటి జట్టును కోహ్లి వరుసగా ఐదేళ్లు టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్లో నిలిపాడని కొనియాడాడు. టెస్ట్ క్రికెట్లో కోహ్లి ఓ స్పెషల్ ప్లేయర్ అని, అలాంటి ఆటగాడి వందో టెస్ట్ను అంతకంటే స్పెషల్గా చేయాలని అనుకుంటున్నామని అన్నాడు. టెస్ట్ కెప్టెన్గా కోహ్లి చిరస్మరణీయ విజయాలు సాధించాడని, 2018లో అతని సారధ్యంలో ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ విజయం చాలా ప్రత్యేకమని తెలిపాడు. 2013లో దక్షిణాఫ్రికాలోని బౌన్సీ పిచ్పై కోహ్లి చేసిన క్లాసీ టెస్ట్ సెంచరీలను (ఒకే ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు) నాతో పాటు ప్రతి క్రికెట్ అభిమాని చిరకాలం గుర్తించుకుంటాడని పేర్కొన్నాడు. అలాగే పెర్త్లో కోహ్లి ఇన్నింగ్స్ వేరే లెవెల్ అని కొనియాడాడు. టీమిండియా సాధించిన విజయాలు, సాధించబోయే విజయాల్లో కోహ్లికి కచ్ఛితంగా క్రెడిట్ దక్కుతుందని చెప్పుకొచ్చాడు. తొలి టెస్ట్ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన రోహిత్.. కోహ్లిపై ఇలా ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా మొహాలి వేదికగా శ్రీలంకతో రేపటి(మార్చి 4) నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్తో రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుండగా.. కోహ్లి కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. చదవండి: 'వంద టెస్టులు ఆడతానని ఊహించలేదు' -
Ganguly: కోహ్లి వందో టెస్ట్లో సెంచరీ కొట్టాలి.. ఆ మ్యాచ్ చూసేందుకు నేను కూడా వస్తా..!
గతేడాది టీ20 ప్రపంచకప్ అనంతరం గంగూలీ-కోహ్లిల మధ్య కెప్టెన్సీ విషయంలో మొదలైన వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. ఈనెల 4 నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్ట్ కోహ్లి కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ కాగా, ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తాను కూడా హాజరవుతానని గంగూలీ స్వయంగా ప్రకటించాడు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన గంగూలీ.. బ్రిటిష్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. కోహ్లితో విభేదాల గురించి మీడియా ప్రశ్నించగా.. దాదా వాటిని కొట్టిపారేశాడు. వంద టెస్ట్ మ్యాచ్లు ఆడటం ప్రస్తుత తరంలో అంత సులువు కాదని, భారత క్రికెట్లో అతి తక్కువ మంది మాత్రమే ఈ ఫీట్ను సాధించారని పేర్కొన్నాడు. 100 టెస్ట్ల మైలురాయిని అందుకోవాలంటే సదరు వ్యక్తి గొప్ప ప్లేయర్ అయి ఉండాలని, కోహ్లి ఆ కోవలోకే వస్తాడని పరుగుల యంత్రాన్ని ఆకాశానికెత్తాడు. గత కొంతకాలంగా కోహ్లి ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, మొహాలీ టెస్ట్లో కోహ్లి శతక దాహాన్ని తప్పక తీర్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2014 ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా కోహ్లి ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డాడని, ఆ తర్వాత కొద్ది రోజులకే గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడని గుర్తు చేశాడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా 2002-2005 మధ్య గడ్డుకాలం ఎదుర్కున్నాడని,ఆ తర్వాత అతను కూడా తిరిగి పుంజుకున్నాడని, గొప్ప ఆటగాళ్ల కెరీర్లో ఇవన్నీ సహజమేనని చెప్పుకొచ్చాడు. కాగా, కోహ్లి వందో టెస్ట్ను ప్రత్యక్షంగా మైదానంలో వీక్షించేందుకు తొలుత ప్రేక్షకులను అనుమతించని బీసీసీఐ.. ఆ తర్వాత అభిమానుల నిరసనలతో దిగొచ్చింది. స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులకు అనుమతివ్వాలని నిర్ణయించింది. చదవండి: IND VS SL 1st Test: కోహ్లి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు దిగొచ్చిన బీసీసీఐ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement