-
39 ఏళ్ల జైలు.. 80 లక్షల జరిమానా
సెక్యూరిటీ గార్డును చంపిన కేరళ బిజినెస్ మ్యాన్కు శిక్ష త్రిస్సూర్: తన ఇంటి సెక్యూరిటీ గార్డును కిరాతంగా చంపిన కేసుతో పాటు ఇతర కేసుల్లో కేరళ బీడీ వ్యాపార దిగ్గజం మహ్మద్ నిషామ్కు 39 ఏళ్ల శిక్ష పడింది. రూ. 80.30 లక్షల జరిమానా కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గురువామిక్కడి ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కేపీ సుధీర్ ఈ శిక్ష విధించారు. హత్యకేసులో జీవితఖైదుతో పాటు ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఇతర కేసుల్లో 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపారు. . రూ. 5 వేల కోట్ల సంపద కలిగిన నిషామ్ను.. తీర్పు తర్వాత కన్నూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, నిషామ్కు మరణ దండన విధించాలని, చనిపోయిన గార్డు చంద్రబోస్ (51) కుటుంబానికి రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలన్న ప్రాసిక్యూషన్ వాదనను జడ్జి తోసిపుచ్చారు. జరిమానా నుంచి రూ. 50 లక్షలు చంద్రబోస్ భార్య జమంతికి ఇవ్వాలని తీర్పిచ్చారు. సాక్షిగా ఉండి ప్రతికూలంగా సాక్ష్యమిచ్చిన నిషామ్ భార్య అమల్పై విచారణ చేపట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రాసిక్యూషన్కు కోర్టు ఆదేశించింది. తాగిన మైకంలో.. గతేడాది జనవరి 29న తెల్లవారుజామున తాగిన మైకంలో ఇంటికి వచ్చిన నిషామ్.. తన ఇంటి గేట్ను తొందరగా తీయలేదన్న కోపంతో గార్డుపైకి పైశాచికంగా తన లగ్జరీ కారుపోనిచ్చి చంపడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడ్డ గార్డును ఆస్పత్రిలో చేర్చగా ఫిబ్రవరిలో చనిపోయాడు. 2013లో తన తొమ్మిదేళ్ల కుమారుడుతో ఫెరారీ కారు డ్రైవ్ చేయించి వీడియోను యూట్యూబ్లో పెట్టడంతో మీడియాలో నిషామ్ కనిపించాడు. తర్వా తర్వాత ఒక మహిళా ఎస్సైనీ గాయపర్చాడు. కుటుంబ సభ్యుల అసంతృప్తి.. నిషామ్కు పడిన శిక్షపై చంద్రబోస్ భార్య, తల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిషామ్ ఇంట్లో ఉన్నా, జైల్లో ఉన్నా తేడా ఉండదని, ఆవే సుఖాలు అనుభవిస్తాడని భార్య చెప్పింది. నిషామ్కు మరణ శిక్ష పడుతుందని భావించామని తల్లి తెలిపింది. జమంతికి కేరళ ప్రభుత్వం టైపిస్టుగా ఉద్యోగం కల్పించింది. -
'బీడీ కింగ్'ను దోషిగా తేల్చిన కోర్టు
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన త్రిశూర్ హమ్మర్ కేసులో పారిశ్రామికవేత్త మహ్మద్ నిషామ్ ను కోర్టు దోషిగో తేల్చింది. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారకుడయ్యాడని న్యాయస్థానం నిర్ధారించింది. జైలు శిక్ష తర్వాత ఖరారు చేయనుంది. 'బీడీ కింగ్'గా ప్రఖ్యాతి గాంచిన నిషామ్ ఏడాది క్రితం తన హమ్మర్ కారులో వెళుతూ చంద్రబోస్ అనే సెక్యూరిటీ గార్డును ఢీకొట్టాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు వారాల తర్వాత చంద్రబోస్ మృతి చెందాడు. దీంతో గతేడాది జనవరిలో నిషామ్ ను అరెస్ట్ చేశారు. రిమాండ్ లో ఉన్నప్పుడు మహ్మద్ నిషామ్ ఐదుగురు పోలీసుల సస్పెన్షన్ కు కారణమయ్యాడు. అతడిని స్టార్ హోటల్లో భోజనం చేసేందుకు అనుమతిచ్చిన విషయం వెలుగు చూడడంతో ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement