-
తమిళనాడు మంత్రికి కరోనా పాజిటివ్
చెన్నై: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ మహమ్మారి సామాన్య ప్రజానీకం నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ వైరస్ బారిన పడగా తాజాగా తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పీ అన్బళగన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మద్రాస్ ఇన్స్టిటూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామాటాలజీ వెల్లడించింది. (తమిళనాడులో లాక్డౌన్..జూలై 31 వరకు) కరోనాకు సంబంధించిన లక్షణాలు ముందుగా మంత్రికి లేవని వైద్యులు తెలిపారు. ఆయనకు సిటీ స్కాన్ పరీక్ష చేసినప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించలేదనన్నారు. అయితే ముందు జాగ్రత్తగా మంత్రి అన్బళగన్ను పర్యవేక్షణలో ఉంచామని పేర్కొన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా మంత్రికి సంబంధించిన రెండో శాంపిల్ ద్వారా కరోనా పాజిటివ్గా తేలినట్లు వైద్యులు తెలిపారు. ఆయన జూన్ 29 నుంచి స్వల్ప దగ్గుతో ఆస్పత్రికి వస్తే చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం మంత్రి పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యక్తిగత సహాయకుడు దామోదరన్ కరోనా వైరస్తో మృతి చెందిన విషయం తెలిసిందే. (కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేష్) -
మళ్లీ మాణిక్యాలరావుకే
జెండా వందనం ఈ‘సారీ’ సుజాతకు దూరం ఆమె వర్గీయుల డీలా దళితులకు అవకాశం కల్పిం చకపోవడంపై నిట్టూర్పులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా కేంద్రంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జెండా వందనం చేసే హ్యాట్రిక్ ఛాన్స్ కూడా దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకే దక్కింది. ఇప్పటివరకూ రెండుసార్లు మంత్రి మాణిక్యాలరావుకు ప్రొటోకాల్ బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వం.. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ మధ్య నెలకొన్న విభేదాల దృష్ట్యా ఈసారైనా టీడీపీకి చెందిన దళిత మహిళా మంత్రి పీతల సుజాతకు ఆ అవకాశం కల్పిస్తుందని భావించారు. అందుకు భిన్నంగా మాణిక్యాలరావుకే జెండా వందనం బాధ్యతను అప్పగిం చడం ద్వారా బీజేపీపై ఉన్న ప్రేమను టీడీపీ మరోసారి వెల్లడించినటై్టంది. ఈ నిర్ణయంపై గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సుజాత వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కోస్తా జిల్లాల్లో ఏకైక దళిత మహిళా మంత్రిగా చంద్రబాబు కేబినెట్లో కొనసాగుతున్న ఆమెను పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పనితీరులో మొదటి స్థానంలో నిలిచినా ప్రొటోకాల్లో చివరి స్థానంలో ఉంచడం ద్వారా పార్టీలో దళితులకు ప్రాధాన్యత లేదన్న విషయాన్ని చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేసినట్టయ్యింది. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ నుంచి ఇద్దరు మాత్రమే మంత్రులు ఉన్నారు. ఒకరు తాడేపల్లిగూడెంకు చెందిన పైడికొండల మాణిక్యాలరావు కాగా, మరొకరు కృష్ణాజిల్లా కైకలూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్. కృష్ణా జిల్లాలో కామినేని శ్రీనివాస్ను పక్కనపెట్టి టీడీపీకి చెందిన జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు జెండా వందనం చేసే అవకాశం ఇస్తూ వస్తున్న చంద్రబాబు ఈ జిల్లాకు వచ్చేసరికి దళిత వర్గానికి చెందిన సుజాతను తప్పించి మాణిక్యాలరావుకు అవకాశం ఇస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement