-
23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్లో...?
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఆసక్తికర గణాంకాలు విడుదలయ్యాయి. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ గణాంకాల సంస్థ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కార్మికుల నెలవారీ సగటు జీతాలను తెలియజేస్తూ ఓ జాబితా విడుదల చేసింది. ఇదీ చదవండి: కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో కార్మికులు అందుకుంటున్న సగటు నెల జీతం రూ.లక్షపైనే ఉంది. స్విట్జర్ల్యాండ్లో అత్యధికంగా 6,096 డాలర్లు (రూ4,98,567) నెలవారీ వేతనం అందుకుంటున్నారు. కార్మికులు అత్యధిక జీతాలు అందుకుంటున్న మొదటి పది దేశాల్లో స్విట్జర్లాండ్ (రూ.4,98,567), లక్సంబర్గ్ (రూ.4,10,156), సింగపూర్ (రూ.4,08,030), యూఎస్ఏ (రూ.3,47,181), ఐస్లాండ్ (రూ.3,27,716), ఖతార్ (రూ.3,25,671), డెన్మార్క్ (రూ.2,89,358), యూఏఈ (రూ.2,86,087), నెదర్లాండ్స్ (రూ.2,85,756), ఆస్ట్రేలియా (రూ.2,77,332) ఉన్నాయి. 65వ స్థానంలో భారత్ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన జాబితాలో భారత్ 65వ స్థానంలో నిలించింది. దేశంలో వివిధ రంగాల్లో కార్మికులు అందుకుంటున్న నెలవారీ సగటు వేతనం రూ.50వేల కంటే తక్కువే. దేశంలో కార్మికులు నెలకు సగటున 573 డాలర్లు అంటే రూ.46,861 అందుకుంటున్నట్లు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ఇక టర్కీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, కొలంబియా, బంగ్లాదేశ్ , వెనుజులా, నైజీరియా, ఈజిప్ట్, పాకిస్తాన్ దేశాలు ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! Average monthly net salary: 1. Switzerland 🇨🇭: $6,096 2. Luxembourg 🇱🇺: $5,015 3. Singapore 🇸🇬: $4,989 4. USA 🇺🇸: $4,245 5. Iceland 🇮🇸: $4,007 6. Qatar 🇶🇦: $3,982 7. Denmark 🇩🇰: $3,538 8. UAE 🇦🇪: $3,498 9. Netherlands 🇳🇱: $3,494 10. Australia 🇦🇺: $3,391 . 11. Norway 🇳🇴: $3,289… — World of Statistics (@stats_feed) April 30, 2023 -
సంస్కరణల సైరన్ ఎప్పుడు!
వరుణ్ గాంధీ ఇప్పుడు పనిచేస్తున్నవారిలో 93 శాతం క్యాజువల్ వర్కర్లు, 66 శాతం నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా లిఖిత పూర్వక కాంట్రాక్టు పత్రాలు ఎరుగరు. అలాగే తాము వేతనంతో కూడిన సెలవు తీసుకుంటున్నట్టు నివేదించిన కార్మికులు 27.7 శాతం మాత్రమే. సామాజిక భద్రత, అందుకు సంబంధించిన చైతన్యం కలిగిన కార్మికులు కూడా దేశంలో చాలా తక్కువ. నిజానికి వేతనజీవులలో 41.1 శాతం, కాంట్రాక్ట్ కార్మికులలో 76.7 శాతం ఆ సౌకర్యానికి అర్హత లేనివారే. భారత ఆర్థిక వ్యవస్థనీ, ప్రభుత్వ పాలనా రంగాన్నీ తరచూ ఇక్కడి విశాల మైదానాలు అధిగమిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. నిరంతరం పనిచేసే కర్మాగారాలలో అయితేనేమి, కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే పనిచేసే కర్మాగారాలలో అయితేనేమి; 1931 నాటికి దాదాపు 40 లక్షల మంది వాటిలో ఉద్యోగులుగా ఉండేవారు. 1980 దశకానికి కార్మిక సంఘాలలో చీలికల వల్ల, పారిశ్రామిక వివాదాల వల్ల- కార్మిక సంఘాలదే పైచేయి అయింది. అయితే ఇటీవల కార్మికశక్తి క్రమబద్ధీకరణ వృద్ధి వ్యతిరేక భావనకు చేరుకుంది. కానీ ఇప్పుడు కార్మిక వ్యవస్థకు సంబంధించి తరచూ జరుగుతున్న సంస్కరణలు మెరుగ్గా ఉన్నాయని అనిపిస్తుంది. జన విస్ఫోటనం ప్రపంచ కార్మికశక్తిలో దాదాపు 25 శాతం భార తదేశానిదే. 2025 నాటికి, 29 ఏళ్ల సగటు వయసు కలిగి, పనిచేయడానికి సిద్ధంగా ఉండే 30 కోట్ల మంది యువకులతో భారత జనాభా శక్తిమంతం కాబోతున్నది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం కార్మికశక్తి 49 కోట్లని అంచనా వేశారు. ఇది దేశ జనాభాలో దాదాపు 40 శాతం. అయితే వీరిలో కాయగూరల బండితో జీవనం గడిపే చిరువ్యాపారి మొదలు, వజ్రాల వ్యాపారి వరకు 93 శాతం అసంఘటిత రంగాలలోనే ఉన్నారు. కాబట్టి 2020 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోతున్న యువశక్తి లోటును భారత్ తీర్చబోతున్నది. ఆ సంవత్సరానికి ఐదుకోట్ల అరవై లక్షల యువ కార్మికుల లోటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉంటుందని అంచనా. కాని భారత్లో ఆ సంవత్సరానికే నాలుగు కోట్ల డెబ్బయ్ లక్షల యువకార్మికులు అదనంగా ఉంటారు. అయినా ఇది అందరికీ అందివచ్చే అవకాశం కాదు. ఎందుకంటే గడచిన దశాబ్దంలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (ఒక నిర్ణీతకాలంలో పెట్టుబడి పెరుగుదల రేటు) 0.5 శాతానికి వేగాన్ని తగ్గించుకుంది. కాబట్టి భారత కార్మికశక్తిలో ఉద్యోగార్హతను పెంపొందించడమే నేడు భారత మౌలిక విధానం ముందు ఉన్న పెద్ద సవాలు. వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర రంగాలకు శ్రామికశక్తిని బదలాయించడం (12 కోట్ల నిపుణులైన కార్మికుల అవసరాన్ని గుర్తిస్తూ) అత్యవసరం. ఈ క్రమంలోనే ఉద్యోగావకాశాలు పెంచడం, సామాజిక భద్రత అనే అంశాలు కూడా పరిగణనలోనికి తీసుకోవలసినవే. తక్కువ జీతాలు, పరిమిత భద్రత గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఇప్పటికీ సగటు దినసరి వేతనాలు చాలా తక్కువగానే ఉన్నాయి. సెప్టెంబర్ 2014 నాటి గణాంకాలను పరిశీలిస్తే అరక కూలి రోజుకు పురుషునికి రూ. 267.70, స్త్రీకి రూ. 187.17 చెల్లించినట్టు అర్థమవుతుంది. ఎలక్ట్రీషియన్లు రూ.367.16, నిర్మాణ రంగంలో పనిచేసే వారు రూ. 274.06 వంతున (సగటున) తీసుకుంటున్నారు. వ్యవసాయేతర రంగంలో పనిచేసే కార్మికులు మొత్తంగా సగటున రూ. 237. 20 వేతనానికి నోచుకుంటున్నారు. వడోదరలో కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న కార్మికునికి జౌళి పరిశ్రమ రూ. 6,488.09 చెల్లిస్తున్నది. అదే కోల్కతాలో రూ. 7,558. 52; చెన్నైలో రూ. 9,769.20 కొత్త కార్మికుడు ఆశించవచ్చు. వినియోగ ద్రవ్యో ల్బణమే ఈ తగ్గుదలకు కారణం. వినియోగదారుల ధరల సూచీలో రెట్టిం పయ్యే అంకెలు (2004లో 332, 2014లో 764) వ్యవసాయ, పారిశ్రామిక రంగాల కార్మికులను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మళ్లీ పరిశ్రమ లలో పనిచేసే కార్మికులలో మహిళల కష్టాలు వేరు. 1961 నాటి ప్రసూతి ప్రయోజన చట్టం, గర్భిణులకు ఇచ్చే క్రమబద్ధ వేతనాల ప్రయోజనం కూడా చాలా పరిమితంగానే ఉపయోగపడుతున్నాయి. 2012 సంవత్సరం వివరాలు చూస్తే, 84,956 కర్మాగారాలలో పనిచేసే మహిళలలో కేవలం 2,441 మంది మాత్రమే ఈ ప్రయోజనాలకు నోచుకున్నారు. భారతదేశంలో ఉన్న లక్షలాది కర్మాగారాలలో 3,289 చోట్ల మాత్రమే శిశు సంరక్షణ కేంద్రాలు (క్రెష్) ఏర్పాటు చేశారు. ఇలాంటివి గుజరాత్ మొత్తం మీద 58 మాత్రమే ఉండగా, అత్యధికంగా తమిళనాడులో 2,389 పనిచేస్తున్నాయి. సామాజిక భద్రతకు సంబంధించిన లోటు కూడా కార్మికశక్తికి పెద్ద లోపంగా పరిణమించింది. రైల్వే కార్మికులు 1,082, గని కార్మికులు 32 ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ఇందులో ఎక్కువ తీవ్రమైనవే కావడం విశేషం. రైల్వేలో రూ. 2.6 లక్షలు, గనులలో రూ.9 లక్షలు నష్టపరిహారంగా ఇస్తున్నారు. ఇప్పుడు పనిచేస్తున్నవారిలో 93 శాతం క్యాజువల్ వర్కర్లు, 66 శాతం నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా లిఖిత పూర్వక కాంట్రాక్టు పత్రాలు ఎరుగరు. అలాగే తాము వేతనంతో కూడిన సెలవు తీసుకుం టున్నట్టు నివేదించిన కార్మికులు 27.7 శాతం మాత్రమే. సామాజిక భద్రత, అందుకు సంబంధించిన చైతన్యం కలిగిన కార్మికులు కూడా దేశంలో చాలా తక్కువ. నిజానికి వేతనజీవులలో 41.1 శాతం, కాంట్రాక్ట్ కార్మికులలో 76.7 శాతం ఆ సౌకర్యానికి అర్హత లేనివారే. ఇంకా చెప్పాలంటే, 12 శాతం కార్మికులకు ఇలాంటి సౌకర్యం ఒకటి ఉందన్న సంగతి కూడా తెలియదు. తక్కువ ఉత్పాదకత, పనికిరాని తనిఖీ నిబంధనలు, చట్రాల కారణంగా వ్యాపార సంస్థల ఆవిర్భావానికి ఆటంకాలు వచ్చి కార్మికులకు అవకాశాలు తక్కువ కావడం, ఇందుకు సిద్ధపడడం కూడా తగ్గుతోంది. 2012లో భారత కార్మికశాఖ కోటీ నలభై లక్షల దుకాణాలను, వాణిజ్య సంస్థలను తనిఖీ చేసింది. 89,520 ప్రాసిక్యూషన్లు ఆరంభించింది. 9.3 కోట్ల ఐఎన్ఆర్ను వసూలు చేసింది. ముఖ్యంగా చండీగఢ్లో 56,103 వాణిజ్య సంస్థలు ఉండగా వాటిలో 26,841 సంస్థలను ప్రాసిక్యూట్ చేసిన ప్పటికీ వాటి నుంచి వసూలు చేసినది రూ. 40.4 లక్షలు మాత్రమే. వందకు మించిన కార్మికులు ఉంటే, ఆ పరిశ్రమకు లేదా సంస్థకు పారిశ్రామిక ఉద్యోగ (స్టాండింగ్ ఆర్డర్స్)చట్టం (1946) వర్తించి తీరుతుంది. వాటిలో కార్మికుల నియామకాలను, తొలగింపులు, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం, సెలవులు వంటి అంశాలను పర్యవేక్షించేది ఈ చట్టమే. అయితే 2014 సంవత్సరం జనవరి-సెప్టెంబర్ మధ్య పారిశ్రామిక వివాదాల కారణంగా 105 చోట్ల పని నిలిపివేసినట్టు నమోదయింది. దీనితో 3,60,535 మంది కార్మికులు, 17,88,613 పని దినాలను నష్టపోయినట్టు తేలింది. ఫలితాన్ని ఇచ్చే విధానం కావాలి దేశంలో కార్మికచట్టాలు ఎప్పుడూ పారిశ్రామికాభివృద్ధితోనూ, ఒడిదుడుకులు లేకుండా నడిచే వాణిజ్యంతో విభేదించే విధంగా ఉంటుంది. ఫలితాన్ని అందించే విధానమే మన కార్మిక రంగ సంస్కరణలలో విధిగా ఉండాలి. ఒడిదుడుకులు లేకుండా సాగే వాణిజ్యంతోను, వాణిజ్యాన్ని నిర్వహిం చడంలో నిర్వాహకులకు దోహదపడే విధంగాను ఆ సంస్కరణలు ఉంటే, మనకున్న మానవనరులను ఉత్పాదకత సంపద సృష్టిలో ఉపయోగించుకునే వీలు ఉంటుంది. కార్మికుల, చిన్న, మధ్యతరగతి వాణిజ్య సంస్థల క్షేమానికి ఉపయోగపడే రీతిలో ఉద్యోగ కల్పన విధానాన్ని రూపొందించుకోవాలి. కార్మిక చట్టాన్ని హేతుబద్ధం చేయడం కూడా అత్యవసరం. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస వేతనాలను నిర్ధారించడం ఇందులో తొలి మెట్టు. కనీస వేతన నిర్ధారణ సంఘాలను క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తూ, వార్షికంగా ఆ వేతనాలను సవరించడం అవసరం. కనీస వేతనాల నిబంధన లను ఉల్లంఘించకుండా చూడడం మరొకటి. అప్రంటీస్ షిప్ చట్టం మారాలి జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చెబుతున్నదానిని బట్టి వ్యవసా యేతర రంగాలలో పన్నెండు కోట్ల మంది నిపుణులు మన ఆర్థిక వ్యవస్థకు అవసరమవుతారు. ఈ నేపథ్యంలో అప్రెంటిస్షిప్ చట్టానికి మార్పులను స్వాగతించాలి. నైపుణ్యాన్ని పెంచుకునే కాలాన్ని అనవసరంగా సాగదీసే పద్ధతి లేకుండా జాగ్రత్త పడడం అత్యవసరం. మహిళలకు కూడా చట్టం తేవాలి. ఇందిరా క్రాంతి పథం, అంగన్వాడీ మహిళలు ఇప్పటికీ ఇలాంటి చట్టాల పరిధిలోకి రావడం లేదు. సమీకృత శిశు అభివృద్ధి సేవల వ్యవస్థకు చెందిన కార్మికులు ఇప్పటికీ పదవీ విరమణానంతర ప్రయోజనాలకు నోచుకోవడం లేదు. పథకాల కోసం నియమించిన కార్మికులను కూడా రెగ్యులర్ ఉద్యోగులుగానే పరిగణించాలి. వారికి కూడా సామాజిక భద్రత పరిధిలో మంచి వేతనాలు, ప్రయోజనాలు కల్పించాలి. ఇన్స్పెక్టర్ల వైఖరి వల్ల గడచిన మూడు దశాబ్దాలలో రిజిస్టరైన కర్మాగారాలలో తనిఖీలు (1986లో 63 శాతం, 2011లో 18 శాతం) పడిపోయాయి. ఏడు కోట్ల డెబ్బయ్ లక్షల వాణిజ్య వ్యవస్థలలో కనీస వేతనాల చట్టం (1948) అమలు తీరును పర్యవేక్షిస్తున్న ఇన్స్పెక్టర్లు కేవలం 3,171 మంది. అంటే 2,428 సంస్థలకు ఒక ఇన్స్పెక్టర్ వంతున ఈ బాధ్యత నిర్వహిస్తున్నారన్నమాట. కర్మాగారాలకు వెళ్లడానికి నిర్ణీత సమయాలను ఎంపిక చేసుకుని, తనిఖీ వ్యవస్థను కేంద్రీకృతం చేయడం వల్ల ప్రతిభావంతంగా ఉంటుంది. 1981 నాటి ఐఎల్ఓ ఇన్స్పెక్టర్ల సమావేశంతో ప్రమేయం లేకుండా కార్మిక వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. నిబంధనలను ఉల్లంఘించినవారి మీద విధించే జరిమానాను కనీసం రూ. 1,000కి పెంచాలి. ఉద్యోగాల నుంచి కార్మికులను తొలగించడం సామాజికంగా వారికి ఎప్పుడూ గడ్డు అనుభవంగానే మిగులుతూ ఉంటుంది. ప్రస్తుత మన కార్మిక విధానం కార్మికుల సంఖ్యను వందకు పరిమితం చేస్తూ, కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకోవడానికి తక్కువ అవకాశం కల్పిస్తున్నది. వీరికి ఎలాంటి ఉద్యోగ, సామాజిక భద్రత లేదు. కానీ ఈ అసంబద్ధ చట్టాన్ని పునర్ నిర్మించాలి. సామాజిక భద్రతను కల్పిస్తూ, పనితో అనుసంధానించిన వేతనాలు ఇస్తూ ఎక్కువ మంది కార్మికులను సంస్థలలో నియమించుకునే అవకాశం పారిశ్రామికవేత్తలకు కల్పించేటట్టు ఆ చట్టాన్ని రూపొందించాలి. లేఆఫ్లను సరళం చేయడం, ఇందుకు చాలినంత సమయంతో నోటీసు ఇచ్చే అవకాశం ఇవ్వాలి. పట్టణీకరణ క్రమంలో తన వాణిజ్యం, కార్మికులు ఇద్దరి ఎదుగుదలకు అవసరమైన విధానం భారత్కు కావాలి. సామాజిక భద్రత, కార్మిక చట్టాలలో సరళతల మీద ఇది ఆధారపడి ఉంది. (వ్యాసకర్త ఎంపీ, కేంద్రమంత్రి మేనకా గాంధీ కుమారుడు) -
పండగ పూట పస్తే
010 పద్దున జీతాలు అందజేయాలి.. ఎయిడెడ్ సిబ్బంది జీతాలపై నియంత్రణ ఎత్తివేయాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగనే 010 పద్దు ప్రకారం ప్రతి నెలా జీతాలు వచ్చేలా చూడాలి. హెల్త్కార్డులు, మెడికల్ రీయింబర్స్మెంట్పై స్పష్టత నివ్వాలి. జీతాలు సరిగా రాక ఎయిడెడ్ సిబ్బంది కుటుంబాలు కష్టాలకు గురవుతున్నారు. పండగ వేళల్లో సైతం జీతాలు రాకపోవడం బాధాకరం. - కె.శ్రీనివాసరావు, ప్రైవేటు ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ గిల్డ్ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు(విద్య) : జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. నాలుగు నెలలుగా జీతాల్లేక పండగ పూట పస్తు పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నెలనెలా జీతాలు వస్తేనే అంతంత మాత్రంగా సాగే జీవితాలు జీతాలు లేక అల్లాడిపోతున్నాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితులు ఆశించిన స్థాయిలో మెరుగుపడడం లేదు. జిల్లాలో 84 ఎయిడెడ్ ప్రాథమిక, 18 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఐదు ఓరియంటల్ స్కూల్స్, ఒక హిందీ విద్యాలయం ఉన్నాయి. సుమారు 500 మందికిపైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలిమెంటరీ పాఠశాలలు, ఓరియంటల్ స్కూల్స్, హిందీ విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి జీతాలు అందలేదు. ఉన్నత పాఠశాలలకు డిసెంబర్ నుంచి జీతాలు రాలేదు. ప్రభుత్వం అనాలోచితంగా బడ్జెట్ను విడుదల చేయడతోనే ఈ పరిస్థితి దాపురించింది. ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాలలకు నాలుగు క్వార్టర్లకు కలిపి రూ.5,59,58,500 విడుదల చేశారు. ఈ మొత్తం అక్టోబర్ నెలవరకే ఎలిమెంటరీ స్కూల్ సిబ్బంది జీతాలకు సరిపోయింది. ఒక నిర్ధిష్టమైన మొత్తాన్ని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి ఇదో ఉదాహరణ. జనవరి వరకు జీతాలు, డీఏ అరియర్స్ ఇచ్చేందుకు *6కోట్ల 2లక్షలు విడుదల చేయాల్సి ఉంది. హైస్కూల్లో డిసెంబర్ నుంచి జీతాలు, డీఏ అరియర్స్ ఇచ్చేందుకు *2,49,80,231లు విడుదల చేయాలి. ఓరియంటల్ సిబ్బందికి జీతాలు *65,90,662లు, దర్గామిట్టలోని బ్లెయిండ్ స్కూల్కు *1,86,500లు మంజూరుచే యాల్సి ఉంది. ఈ విషయమై విద్యాశాఖ కార్యాలయ సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిడెడ్ పాఠశాలలకు జీతాలు ఇచ్చేందుకు నిర్ధిష్టమైన విధానాన్ని పాటించకపోవడం విమర్శలకు కారణమౌతోంది. సరైన పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలకు బిల్లులు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎయిడెడ్ టీచర్లకు, బోధనేతర సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు రూ.100 కోట్లు మంజూరుకావాల్సి ఉందని అంచనా. బాబు ‘సంక్రాంతి చంద్రన్న కానుక’ పై చూపే శ్రద్ధ తమపై చూపడంలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సవతి ప్రేమ... ఎయిడెడ్పాఠశాలల పట్ల ప్రభుత్వం చూపుతున్న సవతి ప్రేమ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వ, జెడ్పీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం అందించే లబ్ధి వీరికి చేరదు. జీతాలపై నియంత్రణ ఉండడంతో వీరికి నెలనెలా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు, హెల్త్కార్డులు, మెడికల్ రీయింబర్స్మెంట్ అందజేస్తూ జీవోలు విడుదలయ్యాయి. అయితే ఎయిడెడ్ సిబ్బందికి ఇంతవరకు వరకు జీఓలు అందలేదు. రిటైర్డ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేదు. ఉపాధ్యాయ సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకంగా, ఎయిడెడ్ ఉద్యోగులకు ఒక రకం గా లబ్ధి అందడంపై చాలాకాలంగా ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నాసమస్యలు తీరే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 57 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ జూన్లో టీడీపీ ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. కానీ ఎయిడెడ్ సిబ్బందికి ఆ జీఓ విడుదల కాలేదు. దీంతో జూన్లో రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు అటు పింఛన్, ఇటు జీతం రాక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఉద్యోగాల్లో కొనసాగాలనే ఉత్తర్వులు కూడా అందకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
Mothers Day 2024: ఐవీఎఫ్ అద్భుతాలెన్నో...70 ఏళ్ల వయసులోనూ గర్భధారణ
మీ ఓటు దేనికి?
డిసైడ్ చేసేది.. ఆమే!
భారతదేశపు మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్
KKR vs MI: కేకేఆర్తో ముంబై పోరు.. తుది జట్లు ఇవే
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
వరస ఫ్లాప్స్.. కానీ కొత్త మూవీతో విజయ్ దేవరకొండ రిస్క్!?
సోమవారం సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: టీఎస్ సీఈవో
తప్పక చదవండి
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
- డిసైడ్ చేసేది.. ఆమే!
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement