-
నవ వధువుపై గ్యాంగ్రేప్
కురుక్షేత్ర: ఓ నవవధువుకు మత్తుమందు ఇచ్చిన అత్తారింటివారు.. ఆమెపై ఓ తాంత్రికుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ‘మీ కుమార్తె మానసికస్థితి సరిగ్గా లేదు’ అంటూ అమ్మాయి తండ్రికి సమాచారం అందించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన హరియాణాలోని యమునానగర్ జిల్లాలో చోటుచేసుకుంది. యమునానగర్ పట్టణంలో ఉంటున్న ఓ యువకుడికి కురుక్షేత్రకు చెందిన యువతితో ఈ నెల 12న వివాహమైంది. ఆమె అత్తారింటిలో అడుగుపెట్టగానే ఓ తాంత్రికుడిని కుటుంబ సభ్యులు రప్పించారు. అనంతరం యువతిచేత ఓ ద్రవాన్ని తాగించారు. ఆమె స్పృహ కోల్పోగానే భర్త అన్నయ్యతో పాటు ఆడపడుచు భర్త అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత 3 రోజుల పాటు ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించిన తాంత్రికుడు.. కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమె దుస్తులను తగలబెట్టారు. తనపై జరిగిన దారుణాన్ని కుమార్తె తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ఈ కుట్రలో పెళ్లికుమారుడి తల్లి, చెల్లెలు కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో తొలుత జీరో ఎఫ్ఐఆర్(బదిలీ చేయగలిగే ఎఫ్ఐఆర్)ను నమోదుచేసిన కురుక్షేత్ర పోలీసులు.. యమునానగర్ పోలీస్స్టేషన్కు దాన్ని బదిలీచేశారు. -
దుష్ప్రభావాల్లేని ‘నొప్పి’ మాత్రలు
బెర్లిన్: నొప్పినివారణ మాత్రల తయారీలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఎటువంటి ప్రమాదకర దుష్ప్రభావాలు లేకుండా సమర్థవంతంగా పనిచేసే నొప్పి నివారణ మాత్రల తయారీకి కొత్త పద్ధతిని జర్మనీ శాస్త్రవేత్తలు రూపొందించారు. బెర్లిన్ లోని చారెట్ మెడిసిన్ వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ నూతన పద్ధతిలో జంతువులకు మార్ఫిన్ లాంటి మత్తుమందును ఇచ్చినప్పుడు వాటిలోని దెబ్బతిన్న కణాలపై ఇది సమర్థవంతంగా పనిచేసిందని తెలిపారు. అదే సమయంలో ఇతర ఆరోగ్యకర కణజాలంపై ఎలాంటి దుష్ప్రభావం చూపలేదని వెల్లడించారు. ఓపియోడ్ నొప్పి నివారణ మాత్రలను సర్జరీలు, నరాలు దెబ్బతిన్నప్పుడు, కీళ్లనొప్పులు, కేన్సర్ వంటి సందర్భాల్లో ఉపయోగిస్తారని, దీని వల్ల నిద్రమత్తు, వికారం, మలబద్ధకం, శ్వాస నిలిచిపోవడం లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. -
భార్య.. తల్లి.. ఓ వ్యక్తి
గ్యాంగ్గా ఏర్పాటు ‘మత్తుమందు’ దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు పరారీలో తల్లి, భార్య సొత్తు స్వాధీనం చేసున్న పోలీసులు కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ అశోక్కుమార్గౌడ్ మేడ్చల్: ఇంట్లో అద్దెకు దిగి యజమాని కుటుంబీకులకు మత్తు మందు ఇచ్చి దోపిడీలకు పాల్పడే గ్యాంగ్లో ఇద్దరు సభ్యులను మేడ్చల్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పేట్బషీరాబాద్ ఏసీపీ అశోక్కుమార్గౌడ్ మేడ్చల్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్ల డించారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సత్తన్నపల్లి మండలం బృగుబండ గ్రామానికి చెందిన గుంజి వెంకటేష్ అలియాస్ శ్రీను (25)తన భార్య దివ్య(22), తల్లి తిరుపతమ్మ(65) తదితరులు నల్లగొండ జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందిన దేవునూరి బాలయ్య(45)తో కలిసి ఓ గ్యాంగ్గా ఏర్పాటు చేసుకున్నాడు. బాలయ్య వీరికి అద్దెకు గదులు చూస్తుండేవాడు. అందులో వెంకటేష్ కుటుంబీకులతో కలిసి దిగేవాడు. ఇంటి యజమాని, కుటుంబీకులకు అన్నం, కూర, కల్లు తదితర వాటిల్లో ఏదో ఒకదాంట్లో మత్తు పదార్థాలు కలిపి వారు అపస్మారకస్థితిలోకి వెళ్లగానే ఇంట్లోని సొత్తును అపహరించుకుపోయేవారు. ఈక్రమంలో గత నెల మండలంలోని పూడూర్ గ్రామానికి చెందిన తోకల రాము ఇంట్లో అద్దెకు దిగారు. 27వ తేదీన ఇంట్లో ఉన్న యజమాని రాములమ్మ, ఆమె కోడలు నీరజకు కాకరకాయ కూరలో మత్తు మందు కలిపి ఇచ్చారు. వారు అది తిన్న తర్వాత అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఇంట్లో ఉన్న 9 తులాల బంగారు నగలను దోచుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో పోలీసులు బుధవారం ఉదయం శామీర్పేట్ మండలం మజీద్పూర్ వద్ద వెంకటేష్, బాలయ్యను అరెస్ట్ చేయగా తిరుపతమ్మ, దివ్య పరారీలో ఉన్నారు. మెదక్ జిల్లా జిన్నారం మండలం గుమ్మడిదల లో ఇదేవిధంగా వీరు ఇంటి యజమానికి కల్లులో మత్తుమందు కలిపి ఇచ్చి ఓ బంగారు మంగళసూత్రంతోపాటు ఓ బైక్ను అపహరించారు. ఈ చోరీ గత నెల 17న చేశారని ఏసీపీ వివరించారు. అయితే, వెంకటేష్పై సత్తన్నపల్లి పోలీస్ స్టేషన్లో హత్య కేసు ఉందని తెలిపారు. కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ పవన్ కుమార్ బృందాన్ని ఈసందర్భంగా ఏసీపీ అశోక్కుమార్గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో పోలీసులు 9 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. -
ఎనిమిదేళ్ల నుంచి ఆమెపై అత్యాచారం...
పహడీషరీఫ్: ఎనిమిదేళ్లుగా ఓ వివాహితను బలవంతంగా లోబర్చుకుంటున్నాడో కీచకుడు. కీచకుని చెరలో బంధీలా తనంతో మనోవేదనకు గురైన మహిళ.. ఈ విషయం బయటకు చెబితే తన భర్తను చంపేస్తానని బెదిరించడంతో నోరు విప్పలేదు. చివరికి కీచకుడి వ్యవహారం తన భర్తకు తెలియడంతో అసలు విషయాన్ని రోదిస్తూ చెప్పింది. ఈ సంఘటన పహడీషరీఫ్ పోలీస్ష్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రకుంట జమ్జమ్ కాలనీకి చెందిన 28 ఏళ్ల గృహిణీని సాదత్నగర్కు చెందిన అహ్మద్ జాసిన్ లతీఫ్ ఖాన్ (26) ఎనిమిదేళ్ల క్రితం మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నీ భర్తను చంపుతానంటూ బెదిరించాడు. అప్పటి నుంచి లతీఫ్ ఖాన్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే జల్పల్లిలో ఒక గది తీసుకొని ఏడాది పాటు ఆమెతో ఉన్నాడు. ఇటీవల ఈ విషయం భర్తకు తెలియడంతో పహడీషరీఫ్ పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సోమవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా నిందితుడు పలుమార్లు తన వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. -
హౌరా-చెన్నై ఎక్స్ప్రెస్లో దొంగల హల్చల్
శ్రీకాకుళం: హౌరా-చెన్నై ఎక్స్ప్రెస్లోని ఏసీ ఫస్ట్క్లాస్ బోగీలో గురువారం దొంగలు హల్చల్ సృష్టించారు. రైల్లో ప్రయాణిస్తున్న శ్రీకిషన్ సింగ్, రాజ్ కుమారి దంపతులకు మత్తుమందు ఇచ్చి బంగారు నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. దాంతో తోటి ప్రయాణికులు పలాస రైల్వేస్టేషన్లో రైల్వేసిబ్బందికి బాధితులను అప్పగించారు. దంపతులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement