-
కన్నీటి గాథ: అనాథలుగా ఆడబిడ్డలు
సాక్షి, మోటకొండూర్(నల్గొండ): మండలంలోని కొండాపురం గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి డిగ్రీ చదువుతున్న ఆడబిడ్డలు అనాథలుగా మారారు. దీంతో ఆ అమ్మాయిల భవిష్యత్ ప్రశ్నాకార్థంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే ఆత్మకూరు(ఎం) మండలంలోని శీలంబాయి గ్రామానికి చెందిన కందడి సబిత– శ్రీనివాస్రెడ్డి దంపతుల్లో శ్రీనివాస్రెడ్డి 12ఏళ్ల కిందట మృతిచెందాడు. దీంతో సబిత(39) 2006 నుంచి తన పుట్టిన ఇల్లు అయిన మోటకొండూరు మండలం కొండాపురంలోనే ఆశ వర్కర్గా విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తుంది. ఆమెకు డిగ్రీ చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి కూతరు రేఖ డిగ్రీ తృతియ సంవత్సరం, హారిక ప్రథమ సంవత్సరం చుదువుతున్నారు. కరోనా సమయంలో గ్రామంలోని ప్రజలకు సబిత విశేష సేవలందించి అందరి మన్ననలు పొందింది. చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం) నాలుగు నెలల కిందట ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో చికిత్స చేయించుకునేందుకు అప్పటినుంచి ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఉన్న డబ్బు అంతా ఖర్చు చేశారు. అప్పులు కూడా తీసుకుని వైద్యం చేయించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఈనెల 17న మృతిచెందింది. దీంతో ఆ ఆడబిడ్డలు అనాథలుగా మారారు. వీరకి కనీసం గ్రామంలో ఇల్లు, వ్యవసాయ భూమి ఏమీ లేదు. ఆ ఆడబిడ్డలను చూసుకునేందుకు కేవలం 70 ఏళ్ల పైబడ్డ అమ్మమ్మ మాత్రమే ఉంది. ఆ పిల్లల చదువు, పోషణ ఎలారా భగవంతుడా అంటూ అమ్మమ్మ ఎడుస్తూ ఉంటే ఆ గ్రామస్తుల హృదయాలు బరువెక్కాయి. ఆ అమ్మమ్మకు కూడా ఇద్దరు కూతుళ్లే, మగ బిడ్డలు ఎవరూ లేరు. రోడ్డున పడ్డ ఆ ఆడబిడ్డల భవిషత్య దృష్టిలో ఉంచుకుని దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు') -
నాన్నా.. ఇక రావా..? మమ్మల్ని ఎవరు చూస్తారు?
మోటకొండూర్: ‘నాన్నా.. ఇక రావా.. మమ్మల్ని ఎవరు చూస్తారు.. మేం ఎక్కడ ఉండాలి’అంటూ ఆ ముగ్గురు చిన్నారులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు(9) తండ్రికి తలకొరివి పెట్టి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆరు నెలల క్రితం తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులు.. ఇప్పుడు తండ్రి మృతితో అనాథలుగా మిగిలారు. తల్లిదండ్రులను తలచుకొని, ఇద్దరు చెల్లెల్ని గుండెలకు హత్తుకొని గుండెలవిసేలా ఏడ్చింది. ఉండేందుకు సొంత ఇల్లు కూడాలేదు. ఈ దయనీయమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కదిరేణిగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కదిరేణిగూడెం గ్రామానికి చెందిన నల్లమాస అశోక్ (38), య మున భార్యాభర్తలు. అశోక్ గీత కార్మికుడు. వీరికి రేణు (9), సుప్రియ(7), జోస్నవి (5) సంతానం. రేణు 3వ తర గతి, సుప్రియ 2వ తరగతి చదువుతున్నారు. తండ్రి కులవృత్తే ఈ కుటుంబానికి జీవనాధారం. ఈ క్రమంలో యము న ఆరునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అశోక్ 20 రోజుల క్రితం తాటిచెట్టుపై నుంచి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధ వారం చనిపోయాడు. కనీసం వీరికి ఉండటానికి ఇల్లు కూడా లేదని, పిల్లలను ఎలా సాకాలో తెలియడంలేదని అశోక్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తమకు వయసు మీదపడటంతో ముగ్గురు మనవరాళ్ల పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: అయ్యో పాపం; పచ్చని కుటుంబంలో ‘కరోనా’ కల్లోలం -
పోలీస్ పహారాలో మోటకొండూర్
యాదగిరిగుట్ట : ప్రతిపాదిత మోటకొండూర్ను మండలంగా ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్ట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రెండు రోజులుగా ప్రజాప్రతినిధులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలను శనివార ం అర్ధరాత్రి దాటిన తర్వాత దీక్షలను పోలీసులు భగ్నం చేసి, ఆందోళనకారులను సంస్థనారాయణపురం పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో మోటకొండూర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆదివారం వరంగల్ జిల్లా వెళ్తున్న సీఎం కేసీఆర్ను అడ్డుకుంటారని ముందస్తుగా మాచారంతో వంగపల్లి నుంచి బాహుపేట వరకు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామంలోని నాయకులను అదుపులోకి తీసుకొని ఠాణాలకు తరలించారు. గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. జాతీయ రహదారిపైకి ఎవరూ వెళ్లకుండా జాగ్రతలు తీసుకున్నారు. జాతీయ రహదారిపై ధర్నా... అక్రమ అరెస్టులను నిరసిస్తూ వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై మోటకొండూర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. వెంటనే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
జాతీయ రహదారిపై రాస్తారోకో
యాదగిరిగుట్ట: మండలాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పాటవుతున్న మోటకొండూర్ మండలంలో తమ గ్రామాలను కలుపవద్దంటూ చొల్లేరు, మహబూబ్పేట గ్రామస్తులు, శివారు గ్రామాలను కలపాలని కోరుతూ మోటకొండూర్ గ్రామస్తులు గురువారం పోటాపోటీగా వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకోలు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్లో స్పీకర్ మధుసూధనచారి చిక్కుకున్నారు. చొల్లేరును మోటకొండూర్ మండలంలో కలిపితే పరిపాలనపరంగా ఇబ్బందులు వస్తాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ యాదగిరిగుట్టకు వెళ్లే మేము నూతనంగా ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు. రవాణా సౌకర్యం, బ్యాంక్ సౌకర్యాలు ఎక్కువగా యాదగిరిగుట్టలోనే ఉన్నాయని, ఇవన్ని ఉండాలంటే గుట్ట మండలంలోనే కొనసాగించాలని అధికారులను కోరుతూ నినాదాలు చేశారు. బలవంతంగా మోటకొండూర్లో కలపాలని చూస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శివారు గ్రామాలు కలపాల్సిందే... మోటకొండూర్ మండలాన్ని తలలేని మొండెంగా తయారు చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు యత్నిస్తున్నారన్నారని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసే మండలాలు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్నాయని మండిపడ్డారు. నూతన మండలం అభివృద్ధి కావాలంటే శివారు గ్రామాలైన చొల్లేరు, మహబూబ్పేట, చిన్నకందుకూర్, ముస్త్యాలపల్లి, చీమలకొండూర్ గ్రామాలను కలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి చొల్లేరు, మహబూబ్పేట గ్రామాలను కలపకుండా యత్నిస్తున్నారని అఖిలపక్షం నాయకులు, గ్రామస్తులు ఆరోపించారు. ట్రాఫిక్ జాం... జాతీయ రహదారిపై మహబూబ్పేట, చొల్లేరు, మోటకొండూర్ గ్రామాల ప్రజలు వేర్వేరుగా «రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. చొల్లేరు, మహబూబ్పేట గ్రామస్తులు నిరసన తెలుపుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి వరంగల్కు వెళ్తున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనచారి చిక్కుకుపోయారు. దీంతో ఎస్కార్టు సిబ్బంది నిరసన కారులను సమదాయించి వెళ్లారు. ఎస్ఐ రాజశేఖర్రెడ్డి, ట్రైనీ ఎస్ఐ విజయకృష్ణలు పోలీస్ సిబ్బందితో వాహనాలను నియంత్రించారు. -
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
యాదగిరిగుట్ట: ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కలిపి మోటకొండూర్ మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం మోటకొండూర్ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరు, మహబూబ్పేట, చిన్నకందుకూర్, భువనగిరి మండలంలోని ముస్త్యాలపల్లి, చీమలకొండూర్ను కాకుండా దూరంగా ఉన్న ఆత్మకూర్ (ఎం) మండలంలోని గ్రామాలను కలిపి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. మోటకొండూర్ మండల కేంద్రం కాకుండా కొందరు అడ్డుపడుతున్నారని, అలాంటి వైఖరి సరికాదన్నారు. అంతకుముందు మోటకొండూర్ గ్రామంలో ధర్నా నిర్వహించి అక్కడి నుంచి యాదగిరిగుట్టకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, యువజన విభాగం, రాజకీయ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement