-
విధి ఆడిన వింతనాటకం
సాక్షి, చెన్నై : విధి ఆడిన నాటకంలో ఇద్దరు బాలురు అనాథలయ్యారు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి హఠాన్మరణం ఓ వైపు, తల్లిని వెంటాడుతున్న కేన్సర్ మహమ్మారి మరో వైపు వెరసి పుస్తకాలను పక్కనపెట్టి ముక్కుపచ్చలారని పసి వయస్సులోనే కూలీలుగా మారారు. జన్మనిచ్చిన తల్లిని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం. చివరకు తల్లి తనువు చాలించడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు కూడా చేయించలేని ఆర్థిక దుస్థితితో తల్లడిల్లారు. బంధువులు, ఆప్తులు ముఖంచాటేయడంతో గత్యంతరం లేక ఆ ఇద్దరు భిక్షాటనకు దిగారు. తల్లి అంత్యక్రియలకు సాయం చేయండంటూ కన్నీటి పర్యంతంతో అభ్యర్థించారు. చివరకు మంచి హృదయాలు స్పందించడంతో తల్లికి ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు. గురువారం దిండుగల్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారకర ఘటన వివరాలు... దిండుగల్ జిల్లా ఎరియోడు సమీపంలోని మేట్టుపట్టికి చెందిన కాళియప్పన్ , విజయ దంపతులకు మోహన్ (14), వేల్ మురుగన్(13) అనే ఇద్దరు కుమారులు, కాళీశ్వరి కుమార్తె ఉన్నారు. బంధువులు, ఆప్తులతో ఆనందకరంగా సాగిన ఈ కుటుంబంలో తొమ్మిదేళ్ల క్రితం విషాదకర çఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో హఠాత్తుగా కాళియప్పన్ మరణించడంతో కుటుంబ భారం విజయకు బరువైంది. కుటుంబ పెద్ద దూరమైనా, ఆప్తులు ముఖం చాటేసినా, రెక్కల కష్టంతో పిల్లల్ని చదివించాలని తపన పడింది. తన స్తోమత మేరకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినా, కాల క్రమేనా విధి ఆడిన నాటకం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. పుస్తకాలు చేతబట్టాల్సిన కుమారుల్ని కూలి పనికి, రక్తం పంచుకుని పుట్టిన కుమార్తె అనాథ ఆశ్రమానికి పరిమితం చేయాల్సిన పరిస్థితి విజయకు ఏర్పడింది. కేన్సర్ మహమ్మారి : విజయను కేన్సర్ మహమ్మారి తాకింది. బ్రెస్ట్ కేన్సర్తో తల్లి బాధ పడుతుండడంతో ఆ ఇద్దరు బాలుర కష్టాలు మరింత జఠిలమయ్యాయి. ఇద్దరు మగ పిల్లలు ఎలాగైనా బతక గలరని భావించిన విజయ, తన కుమార్తెను మాత్రం రక్షించాలని ఆ దేవుడ్ని వేడుకుంది. ఇందుకు తగ్గట్టు ఒట్టన్ చత్రంలోని ఓ ఆశ్రమ వర్గాలు కాళీశ్వరి ఆలనాపాలన చూసుకునేందుకు సిద్ధమయ్యారు. క్రమంగా కేన్సర్ తీవ్రత పెరగడంతో ఆస్పత్రికి వెళ్ల లేనంతగా , మంచానికే పరిమితం అయ్యే స్థాయికి విజయ పరిస్థితి చేరింది. తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్ల లేని పరిస్థితుల్లో బంధువులు, ఆప్తుల్ని కలిసి వేడుకున్నారు. వారిలో మాన వత్వం కొరవడింది. ఇక, చేసేది లేక ఇరుగు పొరుగున ఉన్న మానవతావాదుల సాయంతో దిండుగల్ ఆస్పత్రిలో చేర్పించారు. అమ్మకు వెన్నంటి ఉంటూ ఆ ఇద్దరు పిల్లలు సాయం అందించారు. వైద్యులు సైతం విజయకు వైద్య పరీక్షలు అందించారు. అయితే, ఫలితం శూన్యం. భిక్షాటనతో : చేతిలో చిల్లి గవ్వకూడా లేకుండా, సర్కారు వారి వైద్యంతో కాలం నెట్టుకు వచ్చిన ఆ ఇద్దరు పిల్లల్లో గురువారం ఉదయం పిడుగు పడ్డట్టు పరిస్థితి మారింది. విజయ ఇక, లేదన్న సమాచారంతో కన్నీటి పర్యంతం అయ్యారు. ఆస్పత్రిలోని వార్డులో మంచం మీద విగతజీవిగా పడి ఉన్న తల్లి మృతదేహం వద్ద బోరున విలపించారు. వీరి వేదనను చూసిన పక్కనే మరో మంచం మీదున్న మరో రోగి కుటుంబీకులు, ఆ పిల్లల బంధువులకు సమాచారం అందించారు. కనీసం ఆ ఇద్దరు పిల్లల్ని ఓదార్చేందుకు సైతం బంధువులు, ఆప్తులు రాలేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని స్థితిలో తమ తల్లికి ఎలా అంత్యక్రియలు చేయగలమన్న వేదనతో ఆ మంచం వద్దే కన్నీటి పర్యంతంతో నిలుచుండి పోయారు. చివరకు ఆ ఇద్దరు తమ తల్లికి అంత్యక్రియలు జరిపించేందుకు సహకరించాలని ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగుల కుటుంబీకుల వద్ద చేతులు చాపక తప్పలేదు. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ భిక్షాటనకు దిగారు. మానవతావాదులు, అనేక మంది రోగులు తమ వద్ద ఉన్న తలా పదో, ఇరవయ్యే ఇచ్చి సాయం అందించే పనిలో పడ్డారు. ఈ ఇద్దరు పిల్లలు బిక్షాటన చేస్తుండడాన్ని అక్కడి సిబ్బంది గుర్తించారు. తాము సైతం అంటూ సాయం అందించడమే కాదు, ఆస్పత్రి అధికారి మాలతి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ఆమె అంత్యక్రియలకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆ తదుపరి స్పత్రి వర్గాలు మృతదేహాన్ని దిండుగల్ ప్రభుత్వ ఎలక్ట్రిక్ శ్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేశారు. తల్లిని, తండ్రిని కోల్పోయి, చెల్లిని ఆశ్రమంలో వదలి పెట్టిన ఈ ఇద్దరు బాలురు అనాథలుగా గమ్యం ఎటో అన్న ట్టు ఆస్పత్రి ఆవరణలో కూర్చుని ఉండడం మనస్సున్న హృదయాల్ని కలచివేసింది. -
సహారా చీఫ్ కు నాలుగు వారాల పెరోల్
తల్లి అంత్యక్రియల్లో పాల్గొనే వెసులుబాటు న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ తల్లి ఛహాబీ రాయ్ (95) శుక్రవారం ఉదయం లక్నోలో మృతిచెందారు. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ... సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయనకు నాలుగువారాల పెరోల్ మంజూరు చేసింది. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్ సంస్థలు రెండు రూ.25,000 కోట్లు వసూలు చేయడం... వడ్డీతో సహా ఈ మొత్తం రూ.35,000 కోట్లు దాటిన వైనం, తిరిగి చెల్లించడంలో వైఫల్యం, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన 2014 మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. ఆయన బెయిల్కు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల అమల్లో సహారా విఫలమవుతోంది. ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చుకోవడంలో వైఫల్యం అవుతుండడంతో ఇటీవలే ఈ బాధ్యతలనూ సుప్రీంకోర్టు సెబీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో తల్లి తుదిశ్వాస విడవడంతో, ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీలుకల్పిస్తూ... రాయ్కి పెరోల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రాయ్ న్యాయవాది కపిల్ సిబల్ ఒక పిటిషన్ను దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దావే, జస్టిస్ ఏకే శిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను ఆమోదించింది. రాయ్తోపాటు జైలులో ఉన్న సహారా డెరైక్టర్ అశోక్ రాయ్ చౌదరికి కూడా సుప్రీం పెరోల్ మంజూరు చేసింది. కాగా ఈ నాలుగువారాలూ రాయ్ పోలీస్ ప్రొటెక్టివ్ కస్డడీలో ఉంటారని పెరోల్ మంజూరు సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. అంతక్రితం పారిపోవడానికి తన క్లెయింట్ ప్రయత్నం చేయడంటూ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. -
హిందూపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువుతో పాటు తల్లి మృతి చెందింది. దాంతో బాలింత బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆమె బంధువులు ఆరోపించారు. తల్లి బిడ్డల మృతదేహాలతో వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి... మృతుల బంధువులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement