-
తెలంగాణ పోలీస్ దేశంలోనే ఫస్ట్
మోత్కూరు (తుంగతుర్తి) : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం స్థానిక సుమంగళి çఫంక్షన్హాల్లోఏర్పాటు చేసిన మోత్కూరు, అడ్డగూడూర్ మండలాల సామూహిక సీసీ టీవీ కెమెరాను డీసీపీ రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. తనకోటా నిధులు రూ.7.50 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారని మరిన్ని కెమెరాల ఏర్పాటుకు మోత్కూరుకు రూ.3 లక్షలు , అడ్డగూడూర్కు రూ.5లక్షలు కేటాయిం చనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. డీసీపీ కె.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటులో జిల్లా రాష్ట్రం లోనే ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసీపీ శ్రీరామోజు, రమేష్, రామన్నపేట సీఐ ఎన్. శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేంద్రనాథ్, ఎంపీపీ ఓర్సులక్ష్మి, జెడ్పీటీసీ వలక్ష్మీ, స్థానిక సర్పంచ్ పిచ్చయ్య, సింగిల్విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ జయశ్రీ, ప్రమీళ, శ్రీను, ఎస్ఐలు యాదగిరి, శివనాగప్రసాద్ తదితరులు ఉన్నారు. గీత కార్మికులకు ఎక్స్గ్రేషియో చెక్కుల పంపిణీ మోత్కూరు, అడ్డగూడూర్ మండలాల పరిధిలోని 16 మంది కల్లుగీత కార్మికులకు రూ. 4.86 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కులను ఎమ్మెల్యే గాదరికిషోర్కుమార్, ఎక్సైజ్ సూపరిండెంటెంట్ కృష్ణప్రియ పంపిణీ చేశారు. -
అర్ధ సంచారజాతులుగా గుర్తించాలి
మోత్కూరు : గొల్ల, కురుమలను అర్థసంచార జాతులుగా గుర్తించాలని గొల్ల, కురుమల ఐక్య కార్యాచరణ రాష్ట్ర కమ్డిఠీ కన్వీనర్ బెల్లి కృష్ణయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మోత్కూరులోని రహదారి బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ పదవుల్లో జనాభా ప్రాతిపదికన కచితమైన వాటా ఇవ్వాలని, ప్రమాదవశాత్తు చనిపోయినవారికి రూ. 6 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. పాల ఉప్పత్తి మరియు, విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో గొల్ల, కురుమలకు 90 శాతం భాగస్వామ్యం కల్పించాలన్నారు. చెరువు, పొరంబోకు, జంగ్లాత్, చెరువుశిఖం భూముల్లో గొర్రెలు మేపుకోవడానికి కనీసం 10 ఎకరాలు పట్టా ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఉన్ని పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేయాలని, ఉన్ని ఉత్పత్తులపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో గొల్ల, కురుమల జేఏసీ జిల్లా కన్వీనర్ గుండెబోయిన అయోధ్య యాదవ్, మండల కన్వీనర్లు పురుగుల వెంకన్న, ఎలేందర్, ఎంపీటీసీ జంగ శ్రీను, నాయకులు పురుగుల మల్లయ్య, లెంకల వేణు, అవిశెట్టి సుధాకర్, వెంకటనర్సయ్య, మేడబోయిన నరేష్, జంగ నర్సయ్య తదితరులు ఉన్నారు. -
మహిళ దారుణ హత్య
మోత్కూరు ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన మోత్కూరు మండలం పాటిమట్లలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన పసునూరి సావి త్రమ్మ(46) ఒంటరిగా చిరుదుకాణం నడుపుకుంటూ జీవనం సాగి స్తోంది. వివాహం జరిగిన కొద్దిరోజులకే విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. దినపత్రికల కట్టలను చూసి.. సావిత్రమ్మ చిరుదుకాణంతో పాటు వివిధ దినపత్రికల ఏజెన్సీ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తోంది. బుధవారం పొద్దుపోయినా దినపత్రికల బండిల్స్ ఇంటి ఆ వరణలోనే ఉండడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడ గా హత్యోదంతం విషయం వెలుగులోకి వచ్చింది. ఒంటిమీది ఆభరణాలు మాయం రక్తపు మడుగులో ఉన్న సావిత్రమ్మ మృతదేహాన్ని ఇరుగుపొరుగు వారు చూసి సమాచారం ఇవ్వడంతో గ్రా మస్తులంతా గుమిగూడారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ మె ఒంటిపై ఉన్న పుస్తెలతాడు, చెవి కమ్మలు కనిపిం చలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను ప్లాస్టిక్ వైరు తో ఉరివేసి చంపి ఆభరణాలు ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. గొంతుకు ఉరివేయడంతో ముక్కులో నుంచి రక్తస్రావం అయినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గ్రామస్తుల సమాచారం మేరకు రామన్నపేట ఇన్చార్జ్ సీఐ కె.శివరాంరెడ్డి తన సిబ్బందితో ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యోదంతానికి గల కారణాలను స్థా నికులను అడిగి తెలుసుకున్నారు. క్లూస్టీంతో ఘ టన స్థలంలో ఆధారాలు సేకరించారు. డాగ్స్క్వాడ్తో తని ఖీలు నిర్వహించగా గ్రామమంతా తిరిగి చివరకు సావి త్రమ్మ ఇంటిముందుకు వచ్చి ఆగిపోయాయి. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు పసునూరి రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పురేందర్బట్ తెలిపారు. తెలిసిన వారి పనేనా..? సావిత్రమ్మను తెలిసిన వారే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటిరిగా నివసిస్తున్న సావిత్రమ్మ దుకాణం, పేపర్ ఏజెన్సీ నిర్వహిస్తూ బాగానే కూడబెట్టిందని గ్రామంలో ప్రచారం ఉంది. గతంలోనూ ఆమె ఇంట్లోకి మూడు సార్లు దుండగులు ప్రవేశించి చోరీకి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సావిత్రమ్మ ఇంట్లో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించగా సావిత్రమ్మ గుర్తుపట్టి కేకలు వేసింది. ఈ విషయం పెద్ద మనుషులలో పంచాయితీ పెట్టగా ఆ వ్యక్తిని మందలించి వదిలేశారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆనేపథ్యంలోనే చోరీకి యత్నించడంతో సావిత్రమ్మ ప్రతిఘటించడంతోనే హత్య చేసి ఆభరణాలతో ఉడాయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి -
బాలుడి కిడ్నాప్ కలకలం
మోత్కూరు : ఓ బాలుడి కిడ్నాప్ వదంతం కలకలం రేపింది. కిడ్నాపైన బాలుడు మోత్కూరులో తప్పించుకున్నాడని ప్రచారం కావడంతో టీవీచానల్స్లో బ్రేకింగ్న్యూస్లు మార్మోగాయి. స్పందించిన జిల్లా ఎస్పీ అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించి బాలుడి కిడ్నాప్ సంఘటనపై పోలీసులను అప్రమత్తం చేశారు. చివరికి కిడ్నాపైన బాలుడే అసత్య ప్రచారం చేశాడని తేలడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలిలా.. నార్కట్పెల్లి మండలం గోపాలయపెల్లి గ్రామానికి చెందిన అంకిరెడ్డి సువర్ణ-సైదులు దంపతుల కుమారుడు అజయ్ నార్కట్పెల్లిలోని శాంతినికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు పండ్లతోటలను కౌలుకు తీసుకొని ఆయా గ్రామాల్లో నివాసం ఏర్పాటుచేసుకొని జీవిస్తున్నారు. ప్రస్తుతం అమ్మనబోలులో నివాసముంటున్నారు. నిత్యం అమ్మనబోల్ నుంచి నార్కట్పెల్లి పాఠశాలకు స్కూల్బస్లో వచ్చివెళ్తుండే వాడు. రోజులాగే బుధవారం స్కూల్వ్యాన్లో ఉదయాన్నే పాఠశాలకు వె ళ్లాడు. అయితే హోంవర్క్ చేయలేదెందుకని టీచర్లు అడగడంతో కడుపునొస్తుందని, ఆరోగ్యం బాలేదని చెప్పడంతో మందులు ఇచ్చారు. కాసేపటి తర్వాత నోడ్స్ కొనుక్కుంటానని చెప్పి పాఠశాల నుంచి దుకాణానికి వచ్చినట్టు నటించి అక్కడి నుంచి మోత్కూరులో ఉన్న బాలుడి బంధువుల దగ్గరికి వెళ్లాడు. తనను కిడ్నాప్ చేశారని, వారినుంచి తప్పించుకొని మీ దగ్గరికి వచ్చానని చెప్పడంతో వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలుడిని ఎస్ఐ పురేందర్భట్ తన సిబ్బందితో వచ్చి స్టేషన్కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనను కొంతమంది వ్యక్తులు తుఫాన్ వాహనంలో నార్కట్పెల్లిలో కిడ్నాప్చేశారని, మోత్కూరు వద్ద వాహనం నిలిపిఉండగా అక్కడ తప్పించుకొని బంధువుల వద్దకు చేరానని చెప్పాడు. అప్పటి కే జిల్లా వ్యాప్తంగా బాలుడి కిడ్నాప్ వార్త నిజమేనని ఎలక్ట్రానిక్ చానల్స్లో స్క్రోలింగ్ రావడంతో పోలీసులు అప్రమత్తమై కిడ్నాప్గ్యాంక్ పై మొదట ఆరాదీశారు. బాలుడి చెప్పే విషయాలు ఒకదానికికొకటి పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి ఫోన్చేసి అసలు విషయం రాబట్టారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని హోంవర్క్పై ప్రశ్నించడంతో చదవలేక భయపడి అక్కడ నుంచి మోత్కూరుకు వెళ్లాడని తెలుసుకున్నారు. ఇంకేముంది కాస్త భయపెట్టి గట్టిగా అడగడంతో చెప్పింది తప్పుడుమాటలని, నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఊరికే చెప్పానని చెప్పాడు. అనంతరం తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి సీఐ బాలగంగిరెడ్డి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. విద్యార్థికి ఇష్టమైన స్కూల్లో చేర్పించి చక్కగా చదివించాలని సూచిం చారు. అనంతరం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. -
హైదరాబాద్ను సినిమా రాజధాని చేయాలి
ప్రముఖ సినీ నటుడు సుమన్ మోత్కూరు: హైదరాబాద్ మహానగరాన్ని ఫిలిమ్ ఇండస్ట్రీ రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రముఖ సినీ హీరో సుమన్ అన్నారు. శుక్రవారం మోత్కూరులోని సంతోష్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సినిమా షూటింగ్లకు హైదరాబాద్ అన్నిరకాలుగా అనుకూలమైన ప్రాంతమన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం రెండు వేల ఎకరాలు కేటాయిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. తాను సినీ పరిశ్రమలో 37 ఏళ్లుగా సుమారు 350 సినిమాల్లో నటించినట్టు చెప్పారు. దేవుడి పాత్రలు పోషించడంలో ఎన్టీఆర్ తరువాత స్థానం తనకు దక్కిందన్నారు. తెలంగాణలో మంచి కళాకారులు ఉన్నారని, ప్రతిభావంతులైన కళాకారులను తాను ప్రోత్సహిస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ‘జై తెలంగాణ’ అన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో తానొక్కడినేనని గుర్తుచేశారు. ఒకే రకమైన రిజర్వేషన్లు కల్పించాలి కులాల రిజర్వేషన్లు రాష్ట్రానికో విధంగా ఉండడం సరికాదని ప్రముఖ సినీ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారైనందున ఈ సమయంలోనే జాతీయ స్థాయిలో సమాన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. తనకు సమయం దొరికినప్పుడల్లా బీసీ, గౌడ సామాజిక వర్గాల కోసం పనిచేస్తున్నానని తెలిపారు. రైతులకు ప్రత్యేక బీమా పాలసీ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడే క్రమంలో అమరులయ్యే పోలీసులు, జవాన్ కుటుంబాలకు భారీ పరిహారం ఇవ్వాలన్నారు. అన్ని రకాల ప్రయోజనాలతో కలుపుకొని కోటి రూపాయల వరకు పరిహారం అందిస్తే బాగుంటుందన్నారు. తన తల్లిదండ్రుల స్ఫూర్తితో పేద ప్రజలకు విద్యాపరంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు గనగాని మల్లేశ్గౌడ్, గుండ్లపెల్లి రజింత్, ప్రవీణ్, మల్లేశ్, చౌగోని సత్యం, గునగంటి సత్యనారాయణ, దబ్బెటి సోంబాబు, గీత సొసైటీ అధ్యక్షుడు బుర్ర యాదయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్ర శ్రీనివాస్గౌడ్, నాయకులు దబ్బటి రమేష్, సోమ రాములు, మొరిగాల వెంకన్న, కారిపోతుల వెంకన్న, బీసు యాదగిరి, రాజయ్య పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement